మా మావోయిస్టులు మంచోళ్ళే: నారాయణ

Publish Date:Jun 28, 2014

Advertisement

 

తెలంగాణా ఉద్యమాల సమయంలో మావోయిష్టుల పట్ల చాల సానుకూలంగా వ్యవహరించిన తెరాస అధ్యక్షుడు కేసీఆర్, ఇప్పుడు అందుకు పూర్తి భిన్నమయిన వైఖరి ప్రదర్శించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. దాదాపు పదిహేను మంది మోస్ట్ వాంటడ్ మావోయిస్టుల పేర్లను ప్రకటించి ఒక్కొక్కరి తలకు చాలా భారీ వెల ప్రకటించారు. ఇక చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ కూడా మావోయిష్టులను ఏరిపారేయడానికి కృత నిశ్చయంతో ఉన్నారు.

 

ఇటీవల కాలంలో ఛత్తీస్ ఘర్, బీహార్, ఒడిషా రాష్ట్రాలలో మావోయిష్టులు మరీ బరితెగించి, పోలీసులతో బాటు అమాయకులయిన ప్రజలను పొట్టనపెట్టుకొన్నారు. చివరికి తమ ప్రతాపం సామాన్య ప్రజలకు ఉపయోగపడే సెల్ టవర్లు, సబ్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లపై కూడా చూపిస్తున్నారు. ఇటీవల బీహార్ రాష్ట్రంలో జరిగిన రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం కూడా మావోయిస్టుల పనే అని కేంద్రం అనుమానిస్తోంది. వారు ఇన్నిఘోరమయిన అకృత్యాలు చేస్తూ, సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంటే, సీపీఐ జాతీయ కార్యవర్గ కమిటీ సభ్యుడైన కె. నారాయణ వారి చర్యలను ఖండించకపోగా, వారిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విదించిన నిషేధం ఎత్తి వేయాలని డిమాండ్ చేసారు.

 

విశాఖపట్నంలో నిన్న నిర్వహించిన ఒక పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యను సామాజిక సమస్యగా చూడకుండా, కేవలం శాంతి భద్రతల సమస్యగా మాత్రమే చూస్తూ, బుల్లెట్ కు బుల్లెట్ అనే పద్దతిలో మావోయిష్టులను క్రూరంగా అణచివేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఇకనయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిష్టులపై నిషేధం ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేసారు. దేశంలో మతతత్వ వాదం, ఉగ్రవాదం కంటే మావోయిష్టులు ప్రమాదకారులు కాదని ఆయన వారిని వెనకేసుకు వచ్చారు. సమాజంలో తీవ్రమయిన ఆర్ధిక అసమానతల కారణంగానే మావోయిష్టులు పుట్టుకొచ్చారని, ప్రభుత్వాలు దానిని పరిష్కరించగలిగినట్లయితే మావోయిష్టుల సమస్య సమసి పోతుందని ఆయన సూచించారు.

 

నారాయణ కమ్యూనిష్టు పార్టీకి చెందినవారు గనుక ఆవిధంగా వాదించడం సహజమే అనుకొన్నప్పటికీ, మావోయిష్టుల కారణంగా నిత్యం ప్రాణాలు కోల్పోతున్న వందలాది అమాయక ప్రజల గురించి కానీ, మావోయిష్టులు సృష్టిస్తున్న అరాచకం గురించి కానీ ప్రస్తావించకపోవడం చూస్తే, ఆయనకు ప్రజల ప్రాణాల కంటే మావోయిష్టుల ప్రాణాలే చాలా ముఖ్యమని భావిస్తున్నారనుకోవలసి ఉంటుంది. అంతేకాక దేశం ఒకవైపు మతతత్వ కలహాలు, ఉగ్రవాదుల దాడులతో సతమతమవుతుంటే, మావోయిష్టుల దుశ్చర్యలు వాటికంటే తీవ్రమయినవేమీ కావని ఆయన చెప్పడం చాలా దారుణం. అవినీతి, అక్రమాల కారణంగా గత 60సం.లలో దేశంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు. అటువంటప్పుడు ప్రజల కష్టార్జితంతో అరకొరగా ఏర్పాటు చేసుకొన్న వ్యవస్థలను కూడా మావోయిష్టులు నాశనం చేస్తుంటే వారి చర్యలను తీవ్రంగా ఖండించకపోగా, వారిపై నిషేధం విదించిన ప్రభుత్వాలదే తప్పనట్లు నారాయణ మాట్లాడటం చాలా దారుణం.

 

ఒకప్పుడు మావోయిష్టులను చంక నెక్కించుకొన్న కేసీఆర్ ఇప్పుడు వారి తలలకు ఎందుకు వెలలు కట్టవలసి వచ్చింది? అంటే తన దాక వస్తే కానీ తెలియదని అర్ధమవుతుంది. సరిగ్గా ఇదే సూత్రం నారాయణకు, మావోయిష్టులను వెనకేసుకు వస్తున్న నారాయణ వంటి ఇతరులకు కూడా వర్తిస్తుంది. తమకు, తమ కుటుంబ సభ్యులకు మావోయిష్టుల వల్ల ఎటువంటి ఆపద కలగనంత వరకు నారాయణ వంటివారు ఈ విధంగానే ఉచిత సలహాలు ఇస్తుంటారు. కానీ ప్రజల ప్రాణాలకు భద్రత కల్పిస్తూ దేశాన్ని అభివృద్ధిపధంలో నడిపించాల్సిన బాధ్యత గల ప్రభుత్వాలు ఏవయినా వారితో ఈవిధంగానే వ్యవహరిస్తుంటాయి. అలా కాకా ఇటువంటి వారి ఉచిత సలహాలు పాటించినట్లయితే దేశం ఒక ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మాదిరిగా తయారవుతుంది.

By
en-us Political News

  
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.