నీరో చక్రవర్తిలా ఎఫ్బీఐ డైరెక్టర్

Publish Date:Dec 18, 2025

Advertisement

అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో గతవారం కాల్పుల ఘటన చోటుచేసుకోగా.. ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. కాల్పులకు తెగబడిన నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి పాడ్‌కాస్ట్‌లో పాల్గొనడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అతడిని రోమ్ నగరం కాలిపోతుంటే ఫిడేల్ వాయిస్తూ కూర్చున్న నీరో చక్రవర్తితో పోలుస్తూ చట్టసభ సభ్యులు, ఎఫ్బీఐ మాజీ ఏజెంట్లు దుమ్మెత్తి పోస్తున్నారు. దేశం జరిగిన ఘోరంపై పోరాడుతుంటే, వ్యక్తిగత బలహీనతలకు ప్రాధాన్యత ఇస్తూ ఎఫ్బీఐ డైరెక్టర్ బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్‌పై గతంలోనూ వనరుల దుర్వినియోగం సహా పలు ఆరోపణలు ఉన్నాయి.   

ఇటీవల బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పుల ఘటన చోటుచేసుకోగా.. నిందితుడి కోసం దేశవ్యాప్తంగా గాలింపు కొనసాగుతోంది. ఈ క్రమంలో కాష్ పటేల్  తన గర్ల్‌ఫ్రెండ్ అలెక్సిస్ విల్కిన్స్‌తో కలిసి ఒక పాడ్‌కాస్ట్‌‌కు కాష్ హాజరుకావడంపై  తీవ్ర చర్చ జరుగుతోంది.  వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ..  అత్యవసర బాధ్యతలను కాష్ పటేల్ విస్మరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాష్ పటేల్, తన ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్‌తో కలిసి కన్జర్వేటివ్ పాడ్‌కాస్టర్ కేటీ మిల్లర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. బ్రౌన్స్ యూనివర్సిటీలో కాల్పులకు పాల్పడిన దుండగుడి కోసం స్థానిక పోలీసులు గాలిస్తున్న సమయంలో ఆయన పాడ్‌కాస్టర్‌లో పాల్గొనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశం తీవ్రమైన నేరంతో పోరాడుతుంటే ఆయనకు విలాసాలకు సమయం దొరికిందా? అని దుమ్మెత్తిపోస్తున్నారు. తన గర్ల్‌ఫ్రెండ్ కోసం గతంలో కూడా పటేల్ ఎఫ్‌బీఐ వనరులను దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి.

విల్కిన్స్ ప్రదర్శనలకు ఎఫ్‌బీఐ విమానంలో వెళ్లడం, ఆమెకు ఎఫ్బీఐ రక్షణ కల్పించడం, మత్తులో ఉన్న ఆమె స్నేహితుడిని   ఇంటికి  తీసుకెళ్లాలని ఏజెంట్లను ఆదేశించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలను అప్పట్లో కాష్ పటేల్ ఖండించినప్పటికీ, బ్రౌన్ షూటింగ్ దర్యాప్తు సమయంలో ప్రియురాలితో చెట్టపట్టాలేసుకుని తిరగడంతో అవి  మళ్లీ తెరపైకి వచ్చాయి. కేటీ మిల్లర్ విడుదల చేసిన టీజర్‌లో పటేల్, విల్కిన్స్ నవ్వుతూ తమ సంబంధం గురించి బహిరంగంగా మాట్లాడుకున్నారు. ఈ క్లిప్ వైరల్ అవ్వడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పాడ్‌కాస్ట్‌లో విల్కిన్స్ తనపై వచ్చిన ‘మొసాద్ హనీపాట్’ ఆరోపణలను ఖండించారు. తాను యూదు, ఇజ్రాయెల్‌కు చెందినదాన్ని కాదని ఆమె స్పష్టం చేశారు. ఈ ఆరోపణలు తన భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని పేర్కొంటూ  లీగల్ కన్సల్టెంట్ సాయంతో ఆమె దావా వేశారు. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ ఈ క్లిప్‌ను రీపోస్ట్ చేస్తూ.. బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పులకు తెగబడిన దుండగుడు ఇంకా స్వేచ్ఛగా తప్పించుకుని తిరుగుతుంటే.. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌కు తన గర్ల్‌ఫ్రెండ్‌తో తిరగడానికి, పాడ్‌కాస్ట్‌లో పాల్గొనడానికి ప్రజలు చెల్లించే పన్నులతో నడిచే ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించడానికి సమయం దొరికిందని విమర్శించారు.

ఎఫ్‌బీఐ మాజీ  ఏజెంట్ కైల్ సెరాఫిన్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ.. మనం ఏ కాలంలో జీవిస్తున్నాం? ఇలాంటి వాళ్లను ఏం చేయాలని ప్రశ్నించారు. కాగా, బ్రౌన్ యూనివర్సిటీ కాల్పుల కేసులో అనుమానితుడి కొత్త ఫోటోలను ఎఫ్‌బీఐ విడుదల చేసింది. దుండగుడిని పట్టుకోవడానికి సమాచారం అందించిన వారికి 50,000 డాలర్లు రివార్డు ప్రకటించింది.

By
en-us Political News

  
తెలంగాణలో చలి తీవ్రత అధికంగా పెరిగింది. అన్ని జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి.
భూ వివాదాల్లో రాజకీయ నాయకుల జోక్యాన్ని ఎంత మాత్రమూ సహించొద్దని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారు.
తెలంగాణ గ్రూపు-3 ఫలితాలను టీజీపీఎస్‌సీ విడుదల చేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక దశకు చేరుకుంది.
అమరావతిలో రెండు రోజుల పాటు సాగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ ముగిసింది.
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు అఖండ విజయం సాధించడంపై సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
వికారాబాద్ జిల్లాలోని తాండూరు పట్టణంలో ఉన్న సాయిపూర్ ప్రాంతంలో మానవత్వాన్ని కలిచివేసిన దారుణ ఘటన చోటు చేసుకుంది.
విధంగా దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ పడిపోవడంతో దేశ రాజధాని నగరంలో ట్రాఫిక్ కు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగమంచుతో పాటు, ఢిల్లీలో వాయు కాలుష్యం కూడా తీవ్రస్థాయికి చేరుకుంది.
ఏపీ నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేష్‌ సోదరులకు విజయవాడ ఎక్సైజ్ కోర్టులో ఊరట దక్కలేదు.
ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి నెలల వయస్సు చిన్నారులను తీసుకువచ్చి ఈ ముఠా విజయవాడ కేంద్రంగా విక్రయాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
బాంబు బెదరింపుతో కోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్త వతావారణం నెలకొంది. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగి కోర్టు లోపలా, వెలుపలా కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. కొర్టులోని ప్రతి గది, కారిడార్, కోర్ట్ హాల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు.
వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా చంద్రబాబు ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.
పౌర విమానయాన రంగంలో సంస్కరణల కోసం రామ్మోహన్ నాయుడు విస్తృతంగా కృషి చేస్తున్నారంటూ ప్రశంసల వర్షం కురిపించారు. రామ్మోహన్ నాయుడు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.