క్రికెట్ అనగానే చెవులు కోసుకునేవారంతా రేడియో కామెంట్రీ తెగ యిష్టపడేవారు. టీవీ ప్రత్యక్ష ప్రసారా లకు ముందు రేడియోలో హిందీ, ఇంగ్లీషు కామెంటరీకి ఎంతో క్రేజ్ ఉండేది. ముఖ్యంగా ఇంగ్లీషులు డాక్టర్ చక్రవర్తి అనే ఆయన కామెంట్రీ అద్బుతం. ఆయన 1975 వరల్డ్కప్ కామెంట్రీకి దేశంలో క్రికెట్ వీరాభిమానులంతా ఫిదా అయ్యారు.
అంటే హిందీ, ఇంగ్లీషుల్లో వినడానికి ఎగప డటం ఇప్పటికీ ఉంది. టీవీల్లో ప్రత్యక్షప్రసారం వచ్చినప్పటి నుంచి మరింత ఆదరణకు నోచుకున్నారు. కాగా తెలుగు, తమిళం, గుజరాతీ కామెంటరీ, ప్రత్యేక కార్య క్ర మాలు నిర్వహించడం అనేవి ఇపుడు చూస్తున్నాం, వింటున్నాం. కానీ మనదేశంలో భాషలకు మూల మయినదిగా చెప్పుకునే సంస్కృతంలోనూ క్రికెట్ కామెంటరీ చెబితే! 140 కి.మీవేగశ్య బూమ్రా బంతేన గచ్ఛతి, బ్యాటరేన సాస్టాంగ...అంటూ చెబితే వినేవాడికి పిచ్చెక్కుతుంది. పుస్తకాల భాషలో ఈ విధంగా చెబితే వినేవాడికి వాడి భాష మర్చిపోయే అవకాశమూ ఉంటుంది.
కానీ కర్ణాటకాలో ఏకంగా ఒక గ్రామం అంతా సంస్కృతంలోనే మాట్లాడుకుంటారు. రోజూవారీ దినచర్య అదే భాషలో సాగుతుంది. కొంత కాలం క్రితం వారణాసిలో సంస్కృత విశ్వవిద్యాలయంవారు ఒక టోర్నీ నిర్వహించారు. ప్లేయర్లంతా శుబ్భరంగా పంచకట్టుకుని మరీ ఆడారట!
తెలుగులో కామెంట్రీ ఆరంభమయిన కొత్తల్లో అంతా నవ్వుకున్నారు. కానీ ఇపుడు అదే చాలామంది ఇష్టప డుతున్నారు. కానీ సంస్కృతం కష్టమే. అయితే బెంగుళూరులో సరదాకి ఓ పెద్దమనిషి లోకల్ టాలెంట్ని ఉత్సాహపర్చేందుకు ఓ ఆటకి సరదాగా సంస్కృతంలో కామెంటరీ చెప్పారు. సరే అది గల్లీ మ్యాచ్ గనుక వీడియో చూసినవారు, విన్నవారు ఎంతో ఆనందించారు. ఆ వీడియో ఇపుడు వైరల్ అయింది. కారణం ఆయన ఇంగ్లీషులో చెప్పినంత వేగంగా చెప్పడం! అరే ఎంత అద్భుతంగా చెప్పాడో అంటున్నారు నెటిజన్లు!
సరే క్రికెట్ గనుక ఆట చాలామందికి తెలుస్తుంది గనుక ఏదో తంటాలు పడి విన్నా ఆట తెలుస్తుంది. మరీ అదే ఏ ఉత్సవాలకో, మరేదయినా పెద్ద ఫంక్షన్ తాలూకు కామెంటరీనో అయితే !?
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cricket-commentary-in-sanskrit-25-144965.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.