అంతర్జాతీయ క్రికెట్ సంస్థ ఐసిసి ప్రతీ నెలా ప్రకటించే ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకి భారత్ మహిళా క్రికెట్ స్టార్లు హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధనా, పురుషుల జట్టు నుంచి స్పిన్నర్ అక్షర్ పటేల్ పేర్లు నామినేషన్లో ఉన్నాయి.
భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్, వైస్ కెప్టెన్ స్మృతి మంధనా పేర్లు అధికారుల దృష్టిలోకి రావడం ఇదే మొదటిసారి. ఇటీవల ఇంగ్లండ్తో ముగిసిన వన్డే, టీ-20 సిరీస్ల్లో వారిద్దరూ అద్భుతంగా ఆడారు. కౌర్ మూడు ఓడిఐల్లో అత్యధికంగా 221పరుగులు చేయడంలో గొప్పబ్యాటింగ్ నైపు ణ్యం ప్రదర్శించి అందరి మన్ననలు అందుకుంది. 1999 తర్వాత భారత్ మహిళల జట్టు ఇంగ్లండ్లో ఆ జట్టును ఓడించడంలో ఆమె అసమాన ప్రతిభ ప్రదర్శించి 143 పరుగులు చేయడమే కాకుండా సిరీస్ గెలిచి చరిత్రసృష్టించింది. సెప్టంబర్లో ఇంగ్లండ్తో తలపడిన సిరీస్లో కెప్టెన్ తో సమానంగా ఉన్నత స్థాయి బ్యాటింగ్ నైపుణ్యం ప్రదర్శించిన స్టార్ బ్యాటర్ మంధన. గతేడాది ఆమె ఐసిసి రేచల్ హేహో ఫ్లింట్ ట్రోఫీని అందుకున్న భారత్ స్టార్. వైట్బాల్ టీ20 సిరీస్లో డెర్బీలో 79 పరుగులు చేసి జట్టును ఆదుకుం ది, అలాగే క్యాంటర్బరీలో జరిగిన వన్డేలో అత్యధికంగా 91 పరుగులు చేసి జట్టు విజయానికి ఎంతో సహకరించింది. అమె ఇన్నింగ్స్ను అక్కడి పత్రికలో ఎంతో మెచ్చుకున్నాయి. మంధన సెప్టెం బర్లో ముగిసిన రెండు సిరీస్ల్లోనూ 50 యావరేజ్తో ఉన్నది. ముఖ్యంగా టీ20ల్లో ఆమె స్ట్రయిక్ రేట్ 137 ఉంది. అలాగే, బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానా కూడా ఐసిసి అవార్డు పోటీలో మూడవ స్థానంలో నిలిచింది.
కాగా , అక్షర్ పటేల్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా టీ 20 సిరీస్ల్లో గొప్పగా రాణించాడు. ఐసిసి ప్లేయర్ ఆఫ్ ద మంత్ పురుషుల విభాగంలో భారత్ నుంచి అతని పేరును లెక్కలోకి తీసుకున్నారు. అక్షర్ 11.4 యావ రేజ్తో ఆస్ట్రేలియా సిరీస్లో అద్భుత బౌలింగ్ ప్రదర్శన తో జట్టు విజయానికి తోడ్పడ్డాడు. ఆసీస్ స్టార్ ప్లేయర్ గ్రీన్, పాకిస్తాన్ కీపర్ రిజ్వాన్ ఇద్దరూ కూడా ఐసీసీ అవార్డు పోటీలో ఉన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/harmanpreet-25-144959.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.