జగన్మోహన్ రెడ్డితో సీ.పీ.యం. ఎన్నికలల దోస్తీ

Publish Date:Mar 8, 2014

Advertisement

 

అవినీతికి వ్యతిరేఖంగా పోరాడుతున్నామని గర్వంగా చెప్పుకొనే సీ.పీ.యం. పార్టీ అనేక అవినీతి కేసులలో ఇరుకొన్న జగన్మోహన్ రెడ్డితో ఎన్నికల పొత్తులకి సిద్దం అవుతోంది. అందుకు ఆ పార్టీ నేతలు కనుగొన్న మంచి సాకు ఏమిటంటే వైకాపా కూడా తమ పార్టీలాగే రాష్ట్ర విభజనకు వ్యతిరేఖంగా పోరాడటమేనని చెపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గతనెల డిల్లీ పర్యటనలోనే ఆ రెండు పార్టీల మధ్య లాంఛనంగా పొత్తులపై ఒక అంగీకారం కుదిరిందని సమాచారం. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగి, ఎన్నికల ప్రకటన కూడా వెలువడినందున ఇక ఆ రెండు పార్టీలు బహుశః నేడో రేపో ఎన్నికల పొత్తుల ప్రకటన చేయవచ్చును. అయితే ఆ రెండు పార్టీలు ఇప్పటికే ఒకదానితో మరొకటి సహకరించుకొంటున్నాయని మొన్న జగన్మోహన్ రెడ్డి ఖమ్మంలో నిర్వహించిన సభకు ఆ రెండు పార్టీలు కలిసి చేసిన భారీ జన సమీకరణం చూస్తేనే అర్ధమవుతుంది. ఇంతవరకు తెదేపాతో అంటకాగిన లెఫ్ట్ పార్టీలు ఒకటి వైకాపాతో మరొకటి(సీపీఐ) తెరాసతో ఈసారి జతకట్టేందుకు సిద్దమవుతున్నాయి.

 

సీ.పీ.యం., వైకాపాలు పొత్తులు పెట్టుకొని రానున్న ఎన్నికలలో ఒకదాని వల్ల మరొకటి ఆంధ్ర, తెలంగాణా మరియు జాతీయ స్థాయిలో కూడా ప్రయోజనం పొందాలని ఆశపడుతున్నాయి. సీమాంధ్రలో బలంగా ఉన్న వైకాపా వల్ల సీ.పీ.యం. లాభపడితే, మళ్ళీ తెలంగాణాలో పాగా వేయాలని భావిస్తున్న వైకాపాకు అక్కడ బలమయిన క్యాడర్ మరియు మంచి పట్టు ఉన్న సీ.పీ.యం.తో దోస్తీ చేసి లాభపడాలని ఆశిస్తోంది.

 

ఈ రెండు పార్టీల మధ్య పొత్తుల లాంచన ప్రకటన కూడా వెలువడితే, కొద్ది రోజుల క్రితం యూపీఏ, ఎన్డీయే కూటములకు ప్రత్యామ్నాయంగా సీ.పీ.యం. చొరవతో ఏర్పాటు చేసిన ‘థర్డ్ ఫ్రంట్’ కూటమిలో వైకాపా కూడా భాగస్వామి అయినట్లే భావించవచ్చును. దేశవ్యాప్తంగా ఉన్న బలమయిన 11 ప్రాంతీయ పార్టీలు కలిసి ఏర్పాటు చేస్తుకొన్న ఈ థర్డ్ ఫ్రంట్ కు వైకాపా కూడా తోడయితే అది మరింత బలపడుతుంది. అయితే, దేశంలో ప్రస్తుతం నరేంద్ర మోడీ గాలి వీస్తున్నందున, థర్డ్ ఫ్రంట్ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయినా బీజేపీ విజయావకాశాలకు గండికొట్టగలదు.

 

ఒకవేళ థర్డ్ ఫ్రంట్ మెజార్టీ సాధించిన్నపటికీ అందులో అరడజను మంది వివిధ పార్టీలకి చెందిన నేతలు ప్రధానమంత్రి రేసులో ఉన్నందున అందరూ గొడవపడినపుడు థర్డ్ ఫ్రంట్ విచ్చినం కావడం తధ్యం. ఒకవేళ ఎన్నికలలో మెజార్టీ సాధించలేక చతికిలపడినా, కాంగ్రెస్ వేసే ఎరలకు ఆశపడి కొన్ని పార్టీలు అటువైపు దూకితే ఫ్రంట్ విచ్చినం కావడం తధ్యం. అందుకే థర్డ్ ఫ్రంట్ కేవలం కాంగ్రెస్ పార్టీ కోసం పుట్టించబడిందని నరేంద్ర మోడీ ఆరోపిస్తున్నారు. కానీ ఒకవేళ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు సరిపోయే మెజార్టీ సాధించలేకపోతే, అప్పుడు బీజేపీ కూడా తప్పనిసరిగా థర్డ్ ఫ్రంట్ వైపే చూడక తప్పదు. కనుక, ఏవిధంగా చూసినా థర్డ్ ఫ్రంటులో చేరడం వలన వైకాపాకు లాభమే తప్ప నష్టం ఉండదు గనుక ఫ్రంటులో చేరడం ఖాయం.

 

అయితే, ఎన్నికల తరువాత యూపీఏ కూటమికి మద్దతు ఇచ్చే షరతుపైనే కాంగ్రెస్ అధిష్టానం జగన్మోహన్ రెడ్డిని జైలు నుండి విడుదల చేసిందని అనేక మంది కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలు గమనిస్తే, ప్రస్తుతానికి ఎన్నికలలో గెలిచేందుకు సీ.పీ.యం. మద్దతు అవసరం కనుక జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీతో ఎన్నికల పొత్తులు కుదుర్చుకొన్నపటికీ, ఎన్నికల తరువాత థర్డ్ ఫ్రంటులో కాంగ్రెస్ అనుకూల పార్టీలయిన సమాజ్ వాదీ వంటి పార్టీలతో కలిసి యూపీఏకే మద్దతు ఇవ్వవచ్చును. బహుశః సీపీయం అప్పుడు తాపీగా పశ్చాతాపపడుతుందేమో!

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.