లెఫ్ట్ పార్టీలు ఏ పార్టీతో అంటుకడతాయో

Publish Date:Oct 13, 2013

Advertisement

 

రాష్ట్ర విభజన నిర్ణయంతో స్వయంగా కాంగ్రెస్ పార్టీతో సహా రాష్ట్రంలో అన్ని పార్టీలు ఏదో ఒక రూపంలో సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నాయి. అయితే లెఫ్ట్ పార్టీలలో సీపీఐ రాష్ట్ర విభజనను సమర్దిస్తుంటే, సీపీఎం వ్యతిరేఖిస్తోంది. గనుక వాటికి ఇంత వరకు రాష్ట్ర విభజన వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురవలేదు. ఇంతవరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగిపోయినా, ఎన్నికలు దగ్గర పడుతున్నందున అవి ఇప్పుడు ఏ పార్టీతో అంటుకట్టాలో తేల్చుకోవలసిన సమయం ఆసన్నమయింది.

 

ఎందుకంటే అవి రాష్ట్రంలో ఇంతవరకు స్వయంగా మనుగడ సాగించిన దాఖలాలు, పరిస్థితులు లేవు ఎన్నడూ లేవు గనుక, ఏదో ఒక పార్టీతో అంటు కట్టక తప్పదు. గతంలో ఆ రెండు తెదేపాతో కలిసిపనిచేసినప్పటికీ, ఇప్పుడు తెదేపా బీజేపీ వైపు అడుగులు వేస్తుండటంతో దానితో పొత్తులకి సంకోచిస్తున్నాయి.

 

ఇక సీపీఐ తెలంగాణాలో తెరాసతో పొత్తు పెట్టుకోవాలనుకొంటే, అది తన బద్ధ శత్రువయిన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలుపబోతోంది, గనుక తెరాసతో చేతులు కలుపలేదు. ఇక మిగిలింది మళ్ళీ తెదేపాయే. కానీ అది కూడా తను తీవ్రంగా వ్యతిరేఖించే బీజేపీతో పొత్తుపెట్టుకొంటే దానితోనూ కలవలేదు. అప్పుడు సీపీఐ ఎవరితో కలుస్తుందనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

 

ఇక సీపీఎం పార్టీకి కూడా ఇంచుమించు ఇదే సమస్య ఎదురవుతుంది. ఇటీవల వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సీపీఎం నేతలను డిల్లీలో కలవడం, ఆ పార్టీతో పొత్తుకి ప్రయత్నిస్తున్నట్లు సూచిస్తోంది. కానీ, జగన్ అటు మోడీని పొగుడుతూ, మరో వైపు యుపీయే ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని సంకేతాలు ఇస్తూ అనుసరిస్తున్న ద్వంద వైఖరి వలన వైకాపాతో ఆ పార్టీకి పొత్తులు సాధ్యం కాకపోవచ్చును. అంతే కాక వైకాపా మతతత్వ మజ్లిస్ పార్టీతో కూడా స్నేహానికి సిద్దమనే సంకేతాలు గతంలోనే పంపింది, గనుక ఆ పార్టీతో పొత్తులు అసలే కుదరక పోవచ్చును. పైగా కేవలం సీమాంద్రాకే పరిమితమయ్యే ఆ పార్టీతో పొత్తులవల్ల సీపీఎంకి పెద్దగా ఒరిగేదేమీ ఉండదు.

 

తెదేపా రెండు ప్రాంతాలలో పోటీ చేస్తుంది గనుక, బీజేపీతో ఆపార్టీ పొత్తులు లేదా మద్దతుకి సిద్దపడినప్పటికీ, లెఫ్ట్ పార్టీలు అంతిమంగా మళ్ళీ తెదేపాకే చేరువ కావచ్చును. ఏమయినప్పటికీ, ఎన్నికలు దగ్గరపడితే గానీ, ఈ రాజకీయ సమీకరణాలు ఒక కొలిక్కి రావు.

By
en-us Political News

  
లోకేష్‌తో పాటు ఇటీవల ప్రకటించిన 252 మందితో కూడిన జాతీయ, రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గం కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసింది. కీలక నేతలందరూ పార్టీ పట్ల తమ విధేయతను ప్రకటిస్తూ బాధ్యతలు స్వీకరించారు.
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.