ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణలో మరణిస్తే కారుణ నియామకం కింద అతని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తారు. మన దేశంలో ఇది చాలా కాలంగా అమలులో ఉంది. ఇలాంటి ఉద్యోగాల్లో ఎక్కువగా తల్లిదండ్రుల నుంచి కొడుక్కి... కుమారులు లేకపోతే కూతురుకు వస్తుంటాయి. కాని తమిళనాడులో మాత్రం ఓ ప్రభుత్వ ఉద్యోగి అకాల మరణంతో.. కారుణ్య నియామకం కింద వచ్చే ఉద్యోగం కోసం కూతురు, కోడలు పోటీ పడ్డారు. పంచాయితీ ఎటూ తేలకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. ఇరువర్గాల వాదనలు విన్న మద్రాసు హైకోర్టు ఎట్టకేలకు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చింది.
విలేజ్ అస్టిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్న అరుముగం అనే వ్యక్తి.. 2019లో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయన కుమారుడు కూడా గతంలోనే చనిపోయాడు. కూతురు గోమతి భర్త సైతం మృతి చెందగా.. పిల్లలతో సహా ఆమె అరుముగం కుటుంబంతో కలిసి ఉంటోంది. అరుముగం కుమారుడు చనిపోవడంతో.. కోడలు సంగీత జీవనం కూడా కష్టమైపోయింది. దీంతో మామగారి ఉద్యోగాన్ని తనకు ఇప్పించాలని అధికారులను కోరింది. ఇదే సమయంలో తనూ భర్తను కోల్పోయానని కుటుంబ పోషణ భారంగా మారిందని అరుముగం కూతురు కూడా ఈ ఉద్యోగం తనకే కావాలని కోరింది.
అరుముగం ఉద్యోగం కోసం ఒకే కుటుంబంలో వివాదం తలెత్తడంతో అధికారులు ఏమీ చేయలేకపోయారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో గోమతి, సంగీత వేర్వేరుగా మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లను న్యాయమూర్తి జస్టిస్ ఎక్ వైద్యనాథన్ విచారించారు. ఈ విషయంలో ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలని, ఓ ఒప్పందానికి రావాలని సూచించారు. న్యాయమూర్తి సూచనకు ఇద్దరూ అంగీకరించారు.
కోర్టు సూచనతో సంగీతతో ఒప్పందం కుదుర్చుకుంది అరుముగం కూతురు గోమతి. ఉద్యోగం తనకు ఇస్తే.. ప్రతీనెల వేతనంలో 30 శాతం సంగీతకు ఇస్తానని చెప్పింది. అలాగే, ఆమె పిల్లల చదువు కోసం సంవత్సరానికి రూ.20వేలు ఇచ్చేందుకు అంగీకరించింది. ఇద్దరి మధ్య ఆ ఒప్పందాన్ని న్యాయమూర్తి ఆమోదించారు. దీంతో రెండు పిటిషన్లను కొట్టేశారు జస్టిస్ వైద్యనాథన్. ప్రతీనెలా గోమతి వేతనంలో 30 శాతం కట్ చేసి సంగీత బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేయాలని ఆదేశించారు. మూడు నెలల్లో గోమతిని విధుల్లోకి తీసుకోవాలని ధర్మాసనం తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించారు. రెండేళ్లుగా నడుస్తున్న ఈ వివాదం సామరస్యపూర్వకంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/court-key-judgment-over-daughter-and-sister-in-law-fight-for-job-25-116937.html
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.