Publish Date:Apr 27, 2022
దేశంలోనే సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన పార్టీ, స్వాతంత్ర్య సంగ్రామంలో ముందు పీఠిన నిలిచిన పార్టీ..దేశంలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న పార్టీ....దాదాపు 5 దశాబ్దాలు దేశ రాజకీయాలనుశాశించిన పార్టీ.. వందేళ్లకుకు పైబడిన చరిత్ర ఉన్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ పరువు ఒక్క ట్వీట్..ఒకే ఒక్క ట్వీట్తో గంగలో నిండా మునిగింది. ఆ ట్వీట్ చేసినది ఎన్నికల వ్యూహకర్తగా ఇటీవల గుర్తింపు పొందిన పీకేఅనబడే ప్రశాంత్ కిశోర్. ఆయన ట్వీట్ వటవృక్షం లాంటి కాంగ్రెస్ కూకటి వేళ్లను వణికించింది. ఇంతకీ ఆయనా ట్వీట్ లో ఏమన్నారంటే...కాంగ్రెస్ కు నాయకుడు కావాలి అని మాత్రమే. ఆ ఒక్క మాట కాంగ్రెస్శ్రేణుల ఇన్నేళ్ల ధీమానూ కకావికళం చేసింది.
ఆ పార్టీ అధినాయకత్వం ఆత్మ విశ్వాసాన్నే దెబ్బ తీసింది. గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగా ఉంది. ఈ పదేళ్ల కాలంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆపార్టీకి పరాభవమే ఎదురౌతోంది. పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఒక్కటొక్కటిగా చేజారి పోతున్నాయి. ఈ పరిస్థితుల్లో అధికారమే లక్ష్యంగా ఆ పార్టీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను ఆశ్రయించింది.పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి వ్యూహాలు రూపొందించాలని కోరింది. ఈ క్రమంలోనే ప్రశాంత్కిశోర్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో సహా ఆ పార్టీ కోర్ నాయకులతో వరసగా భేటీలు జరిపారు. ఇంత
వరకూ బాగానే ఉంది. కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ వచ్చే ఎన్నికలలో విజయమే లక్ష్యంగా పని చేసేందుకుఏర్పాటు చేసిన సాధికార కమిటీలో భాగమై పని చేయాల్సిందిగా స్వయంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పీకేను ఆహ్వానించారు. ఇక్కడ వరకూ బానే ఉంది...అయితే కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఆహ్వానానికి పీకే స్పందించిన తీరే కాంగ్రెస్ పరువు ప్రతిష్టలను నడి బజార్లో నిలబెట్టేసింది. పార్టీని నవ్వుల పాలు చేసింది. వ్యూహకర్తను పార్టీలోకి ఆహ్వానించే విషయంలో ఆ పార్టీ వ్యూహాత్మక వైఫల్యం పార్టీ అధినేత్రి ప్రతిష్టను పలుచన చేసింది.
ఇంతకీ పీకే...సోనియా ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ...చేసిన ట్వీట్ లో పేర్కొన్న అంశాలే ఆ పార్టీ నాయకత్వాన్ని తలెత్తుకోనీయకుండా చేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి కావలసింది తన లాంటి వ్యూహ కర్తలు కాదనీ, పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసి, పార్టీ శ్రేణులను ఏకతాటిపై నడిపించగలిగిన సమర్థ నాయకత్వం కావాలని పీకే సోనియా గాంధీ ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ చేసిన ట్వీట్ లో పేర్కొన్నారు. పార్టీకి సమర్థ నాయకత్వం లేదనీ సాక్షాత్తూ ఆ పార్టీ అధినేత్రికే ట్వీట్ చేశారు. ఇది రాజకీయంగా కాంగ్రెస్ కు అంత త్వరగా తేరుకోవడానికి వీలులేని పెద్ద ఎదురు దెబ్బగానే రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతే కాకుండా ఇప్పటి వరకూ కాంగ్రెస్ అధినాయకత్వంపై ధిక్కారం కేవలం జీ-23 బృందానికే పరిమితమైంది. ఇక ఇప్పుడు అది మరింతగా విస్తరించే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు.ఒక వైపు సోనియా గాంధీ, పీకే చర్చలు జరుగుతున్న సమయంలోనే పీకేను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నాయకుల నుంచి ప్రకటనలు రావడం, వ్యతిరేక ప్రదర్శనలు వెల్లువెత్తడమే ఇందుకు నిరసనగా వారు చూపుతున్నారు. ఏది ఏమైనా సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ యేతర కూటమి ఏర్పాట్లు, బీజేపీని దీటుగా ఎదుర్కోవాలన్న కాంగ్రెస్ యత్నాలకు ఇది పెద్ద ఎదురు దెబ్బే!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/congress-prestige-drowned-with-only-one-tweet-25-135097.html
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.
సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు.
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు.
నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు.
ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.