రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ కొత్త ఆలోచన?

Publish Date:Feb 5, 2013

Advertisement

 

రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్ చార్జ్ గులాంనబీ ఆజాద్ కేంద్రం నెత్తిన వ్రేలాడిన ‘జనవరి 28’ కత్తిని ‘రోజంటే రోజూ కాదూ...నెలంటే నెలా కాదూ’ అంటూ పాడి అలవోకగా తీసి ప్రక్కన పడేసిన తరువాత, కాంగ్రెస్ పార్టీ గుండెల మీదనుంచి పెద్ద భారం దింపుకొన్నంత సంతోషపడింది. అప్పటి నుండి, ఇక ‘జనవరి 28’ వంటి మాటలు మాట్లాడకుండా, బుద్ధిగా, ప్రశాంతంగా రాష్ట్ర విభజనపై కసరత్తు మొదలు పెట్టింది. ఆ క్రమంలోనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, గవర్నర్ నరసింహన్, మాజీ ముఖ్య మంత్రి రోశయ్యలను డిల్లీ రప్పించుకొని, వారితో సలహా సంప్రదింపులు చేస్తోంది.

 

ఆ విధంగా చేయడంవల్ల ఒకవైపు తెలంగాణా సమస్యకి పరిష్కారం వెతకడమే కాకుండా, రాష్ట్రంలో తమ తెలంగాణా కాంగ్రెస్ నేతలకు భరోసా కూడా ఇవ్వగలుగుతోంది. ఇక తరువాత అంకంలో రాష్ట్రం లో మూడు ప్రాంతాల నాయకులతో చర్చల ప్రక్రియ మొదలుపెట్టి, ఎన్నికల వరకు లాగించగలిగితే, ఇక అప్పుడు తాడో పేడో తేలుస్తూ ఒక నిర్దిష్ట ప్రకటనతో ఎన్నికలలో అనుకూల ఫలితాలు రాబట్టుకోవచ్చును అని కాంగ్రెస్ ఆలోచన అయిఉండవచ్చును.

 

ఈ అంచనా ప్రకారం, మళ్ళీ చర్చల ప్రక్రియ బడ్జెట్ సమావేశాల తరువాత మొదలుపెడితే, వాటితో ములాయం సింగ్ ప్రకటించినట్లు మధ్యంతర ఎన్నికలు వచ్చే సెప్టెంబర్ నెలవరకు లాగించేయవచ్చును. ఇక ఒకసారి ఎన్నికల గంట మ్రోగిన తరువాత, ఏ రాజకీయ నాయకుడికయినా పార్టీ టికెట్ గురించి తప్ప తెలంగాణా గురించి ఆలోచించే ఓపిక ఉండవు. గనుక, అప్పుడు కాంగ్రెస్ ఎటువంటి నిర్ణయం తీసుకొన్నా కూడా తప్పనిసరిగా వారు ఆమోదించడమే గాక, ఆ నిర్ణయాన్ని ప్రజల చేత కూడా ఆమోదింపజేసుకొనే బాధ్యత కూడా సదరు పోటీదారుపైనే ఉంటుంది.

 

ఇక, జాతీయ మీడియా వండివార్చిన తాజా కధనాల ప్రకారం, కేంద్రం తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కన్నా, రాష్ట్రంలో ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణా మూడు ప్రాంతాలకు వేర్వేరు అభివృద్ధి మండళ్ళు ఏర్పాటు చేసి, వాటికి తగినన్ని అధికారాలు, నిధులు సమకూర్చే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. కనీసం 10 నుండి 15 సం.ల కాల వ్యవధిని నిర్ణయించి, ఆలోగా మూడు ప్రాంతాలలో జరిగిన అభివృధి ఆధారంగా, రాష్ట్ర విబజన అవసరమా కాదా అని నిర్ణయం తీసుకోవచ్చునని సమాచారం. అప్పటికీ తెలంగాణావాసుల్లో ప్రత్యేక రాష్ట్రం కావాలనే కోరిక బలంగా ఉంటే అప్పుడే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

 

అయితే, ఈ విషయాన్నీ కాంగ్రెస్ అధిష్టానం ఇంతవరకు సమర్దించలేదు, అలాగని ఖండించలేదు. ఏమి చేసినా దానికి ఏదో ఒక వైపు నుంచి ఊహించని రియాక్షన్ వచ్చే ప్రమాదం ఉంది గనుక, మీడియాని తనకు నచ్చినట్లు ఊహించుకొని వ్రాసుకొనే సౌకర్యాన్నికల్పించింది. డిల్లీ నుండి తిరిగి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి, గవర్నర్ కాంగ్రెస్ అధిష్టానంతో తాము ఏమి మాట్లాడారో చేపుతారని ఊహించడం అడియాసే అవుతుంది.

 

ఇక ఏదయినా క్లూ దొరికితే అది బొత్స సత్యనారాయణ నుండే దొరకాలి. ఆయనని మీడియా నోరు జారేలా చేయగలిగితేనే కాంగ్రెస్ అధిష్టానం మదిలో ఉన్న ఆలోచనలు బయట ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంటుంది. లేకపోతే, అంతవరకూ ఎవరికి తోచిన ఊహాగానాలు, విశ్లేషణలు, భాష్యాలు చెప్పుకొంటూ కాలక్షేపం చేయడమే.


By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.