LATEST NEWS
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో  తృణమూల్ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాభవం ఇసుమంతైనా తగ్గలేదనీ, ఎన్నికలలో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఆమె ప్రజాదరణ చెక్కు చెదరకుండా నిలిచే ఉందనీ తేలింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ పరాజయం పాలైంది. ఆ ఎన్నికలలో మమతా బెనర్జీ స్వయంగా పరాజయం పాలయ్యారు. అయినా పొలిటికల్ గా ఆమె బలం, పట్టు అలాగే ఉన్నాయి.   తాజాగా పశ్చిమ బెంగాల్ బార్ కౌన్సిల్ ఎన్నికల ఫలితాల్లో తృణమూల్ కాంగ్రెస్   ఘనవిజయాన్ని సాధించడమే ఇందుకు నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మమతా బెనర్జీ రాజకీయ భవిష్యత్తు మరియు టీఎంసీ   బలంపై  అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో.. తాజాగా జరిగిన  బార్ కౌన్సిల్ ఎన్నికల టీఎంసీ విజయం మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ శ్రేణుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని నింపిందనడంలో సందేహం లేదు.   బార్ కౌన్సిల్ ఎన్నికల మొత్తం 23  స్థానాలకు గానూ  తృణమూల్ కాంగ్రెస్  15 స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన ఆధిక్యాన్ని చాటింది. ఈ ఎన్నికల్లో బీజేపీ కేవలం మూడంటే మూడు స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది.   లెఫ్ట్ ఫ్రంట్ 3 స్థానాలు,   కాంగ్రెస్ 2 స్థానాలను గెలుచుకున్నాయి.   బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత టీఎంసీ  ప్రభ  కోల్పోయిందన్న విమర్శలకు బార్ కౌన్సిల్ ఎన్నికల ఫలితాలు ఒక విధంగా చెక్ పెట్టాయని చెప్పాలి.   Mamata Banerjee, TMC victory, West Bengal Bar Council, Bengal politics, Bar Council election results
తెలుగుదేశం సీనియర్ నాయకుడు వర్ల రామయ్య బుధవారం (ఆగస్టు 19) ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఎమ్మెల్సీగా, ఆయన కుమారుడు ఎమ్మెల్యేగా ఏక కాలంలో  చట్టసభలలో ప్రతినిధులుగా ఉన్ననట్లైంది.  రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే పలు  కుటుంబాలు రాజకీయ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆ జాబితాలోకి ఇప్పుడు  వర్ల కుటుంబం  చేరింది.వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమార్ రాజా  పామర్రు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.   వర్ల రామయ్య  తెలుగుదేశంలో  కీలకమైన నాయకుడిగా, విశ్లేషకుడిగా సేవలు అందిస్తున్నారు. గతంలో ఆయన  ఎన్నికలలో పోటీ చేసినప్పటికీ,   విజయాన్ని అందుకోలేకపోయారు. అయినా  పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా నిలబడి, పార్టీ సిద్ధాంతాలను గట్టిగా వినిపించారు.  ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన  వర్ల రామయ్య  సేవలకు గుర్తింపుగా, పార్టీ పట్ల ఆయన చూపిన నిబద్ధతకు ప్రతిఫలంగానూ అధిష్టానం ఆయనను ఎమ్మెల్సీ పదవికి ఎంపిక  చేసింది. ఈ నిర్ణయంతో ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి తగిన గౌరవం లభించిందని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇలా ఒకే కుటుంబం నుంచి ఇద్దరు సభ్యులు ఏకకాలంలో చట్టసభలలో సభ్యులుగా ఉండటం ఇదే ప్రథమం కాదు కానీ, ఇది అరుదుగా జరిగే విషయం.   నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, నాగబాబు,  చింతకాయల అయ్యన్నపాత్రుడు, చింతకాయల విజయ్..  వంటి ఇలా తండ్రీ కొడుకులు ఒకే సమయంలో చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఇప్పుడు వర్ల రామయ్య, వర్ల కుమార్ రాజా వారి సరసన చేరారు.    Varla Ramaiah MLC, Varla Kumar Raja Pamarru MLA, AP Politics,  Father MLC Son MLA,  Andhra Pradesh, TeluguOne
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై టీపీసీసీ క్రమశిక్షణ చర్య తీసుకుంది. ఎల్బీ నగర్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఆయనను  పార్టీ  నుంచి  సస్పెండ్ చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ   ఆదేశాలు జారీ చేసింది. ఎల్బీ నగర్ లో  కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, క్షేత్రస్థాయిలో బలమైన అనుచరవర్గం ఉన్న   సీనియర్ నేతపై సస్పెన్షన్ వేటు కాంగ్రెస్ లో కలకలం సృష్టించింది.  ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలలో విభేదాలు, గ్రూపు తగాదాలు ఇందుకు కారణంగా చెబుతున్నారు. గత కొంత కాలంగా జక్కిడి ప్రభాకర్ రెడ్డి    నియోజకవర్గ స్థాయిలో పార్టీ వ్యవహారాలు, నిర్ణయాల పట్ల  అసంతృప్తిగా ఉన్నారు. ఆ అసంతృప్తిని పలు సందర్భాలలో బాహాటంగానే వ్యక్త పరిచారు. అంతే కాకుండా పార్టీ నిర్ణయాలను గట్టిగా వ్యతిరేకిస్తూ, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా బహిరంగ వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదల నేపథ్యంలో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.   కాగా జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెన్షన్  తో ఎల్బీ నగర్ కాంగ్రెస్ లో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. ప్రభాకర్ రెడ్డి మద్దతుదారులు, అనుచరులు ఆయనపై సస్పెన్షన్ వేటుపై   అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, మరికొందరు నాయకులు  నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.   Jakkidi Prabhakar Reddy, LB Nagar Congress, TPCC Suspension, Telangana Congress,  TPCC Disciplinary Committee
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సాక్షిగా ప్రజాప్రతినిధుల మధ్య రాజకీయ విమర్శలు మరోసారి హద్దులు దాటాయి. మండలి సమావేశాల్లో ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని ఉద్దేశించి తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంత్రిని "ఆంబోతు" అని సంబోధిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఉన్నతమైన చట్టసభలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రిపై ఇలాంటి పదజాలం ఉపయోగించడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. వైసీపీ నేతల నోట దూషణలు, అనుచిత వ్యాఖ్యలకు అంతూ పొంతూ అనేది ఉండదని మరోసారి రుజువైంది. 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాభవానికి, ఆ పార్టీ అధినేత నేడు అసెంబ్లీకి ముఖం చాటేయడానికీ, ఆ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదాకు అవసరమైనన్ని స్థానాలు కూడా దక్కకపోవడానికి ప్రధాన కారణాలలో వైసీపీ నేతల బూతు పురాణం కూడా ఒకటన్నది తెలిసిందే. వైసీపీ నేతల దూషణలు, తిట్లు, బూతుపురాణాలపై ప్రజలు తన ఆగ్రహాన్ని, వ్యతిరేకతను 2024 ఎన్నికలలో తమ ఓటు ద్వారా విస్పష్టంగా తెలియజేశారు. అయినా వైసీపీయులలో ఇసుమంతైనా మార్పు రాలేదనడానికి  తాజాగా శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ నోరు పారేసుకోవడాన్ని పరిశీలకులు   ఉదాహరణగా చూపుతున్నారు.  మండలిలో దువ్వాడ ప్రసంగిస్తూ.. మంత్రి అచ్చెన్నాయుడిని అంబోతు అని సంబోధించారు. ఏకంగా  డిప్యూటీ చైర్మన్ తోనే వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడేనా.. అధ్యక్షా ఆ అంబోతును రమ్మనండి అని వ్యాఖ్యానించారు.   ఒక సీనియర్ మంత్రిని,  ఇలా సంబోధించడం సభామర్యాదకు భంగకరం అనడంలో సందేహం లేదు. అన్నిటికీ మించి మంత్రిని వాడు, ఆంబోతు అని దువ్వాడ శ్రీనివాస్ దూషణ భాషలో మాట్లాడితే డిప్యూటీ చైర్మర్  వారించడం, అభ్యంతరం తెలపడం మాని చిరునవ్వుతో ప్రోత్సహిస్తున్నట్లుగా వ్యవహరించడం మరింత దారుణమని పరిశీలకులు అంటున్నారు.  సభాధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తులు తటస్థంగా వ్యవహరించాలి, అనుచిత వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి, అటువంటి వ్యాఖ్యలు చేసిన సభ్యులను మందలించాలి. హెచ్చరించాలి. కానీ డిప్యూటీ స్పీకర్ అందుకు భిన్నంగా చిరునవ్వులు చిందించడం దారుణం. ఆయన తీరుపై సభ్యులలోనే కాదు.. సామాన్య జనంలో కూడా విస్మయం, ఏహ్యత వ్యక్తమౌతోంది.   Duvvada Srinivas, Atchannaidu, AP Legislative Council, YCP MLC, APpolitics, TeluguOne
ఏపీ ఎడ్యుకేషన్ సెక్టార్ లో  మౌలిక వసతుల కల్పన, గ్రంథాలయ వ్యవస్థ బలోపేతం తెలుగుదేశం కూటమి ధ్యేయమని మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు.   రాష్ట్ర వ్యాప్తంగా  37 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు శాశ్వత భవనాల నిర్మాణం, అలాగే రాష్ట్రంలోని  175 అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ  మోడల్  లైబ్రరీల ఏర్పాటుకు నిర్ణయించినట్లు  శసన సభ వేదికగా ప్రకటించారు. అసెంబ్లీ   ప్రశ్నోత్తరాల సమయంలో  సభ్యుల ప్రశ్నలకు సమాధానాలిచ్చిన ఆయన   ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థితిగతులపై  ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అడిగిన ప్రశ్నకు  ఆళ్లగడ్డ కళాశాలలో ప్రస్తుతం 103 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని,  తగిన భూమి కూడా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ప్రత్యేక నిధుల కేటాయింపు ద్వారా ఆ కళాశాలకు నూతన భవన నిర్మాణం, దెబ్బతిన్న కాంపౌండ్ వాల్ పునర్నిర్మాణం చేపడతామన్నారు. బోధన, బోధనేతర సిబ్బంది నియామకంతో పాటు ఎమ్మెల్యే కోటా నిధులు  ఉపయోగించి కంప్యూటర్లు, ల్యాబ్ పరికరాలు, బెంచీలను సమకూర్చుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు సూచించారు.   ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నాణ్యమైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి నారా లోకేష్.. ఒక్కో కళాశాల సకల సౌకర్యాలతో రూపుదిద్దుకోవడానికి  15 కోట్ల రూపాయలు  వ్యయం అవుతుందని, దశలవారీగా నిధులు విడుదల చేస్తూ అన్ని కళాశాలల్లో విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పిస్తామని వివరించారు. నాణ్యమైన విద్యతో పాటు మౌలిక సదుపాయాలు ఉంటేనే విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకోగలరన్నారు.  గ్రంథాలయాల పునరుద్ధరణ అంశంపై  మంత్రి లోకేష్ సవివరంగా చెప్పారు.  కడప గ్రంథాలయ భవన నిర్మాణ పనుల ఆలస్యంపై ఎమ్మెల్యే మాధవీ రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ,   9 నెలల  వ్యవధిలో ఆ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు.  వైసీపీ హయాంలో  గ్రంథాలయ రంగానికి చెందాల్సిన సెస్ నిధులను ఖజానాకు మళ్లించారని, తమ ప్రభుత్వం రాగానే ఆ నిధులను తిరిగి గ్రంథాలయ బోర్డుకు జమ అయ్యేలా చర్యలు చేపట్టామన్న ఆయన.. మంగళగిరిలో కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన మోడల్ లైబ్రరీ  మంచి  ఫలితాలను ఇస్తోందన్నారు. వందలాది మంది అభ్యర్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు రాత్రి వేళల్లో కూడా చదువుకునేందుకు ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు. ఇదే నమూనాను ప్రామాణికంగా తీసుకుని రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మోడల్ గ్రంథాలయాలను నిర్మించాలని నిర్ణయించినట్లు సభా ముఖంగా తెలిపారు.  అమరావతిని విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే క్రమంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో సెంట్రల్ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పుస్తక పఠన అలవాటు పిల్లల్లో సృజనాత్మక ఆలోచనా శక్తిని, విశ్లేషణాత్మక నైపుణ్యాలను పెంపొందిస్తుందన్నారు. నేటి డిజిటల్ యుగంలో ప్రతికూల ప్రభావాలు చూపుతున్న స్మార్ట్‌ఫోన్లు, టాబ్‌లకు పిల్లలను దూరం చేసి, తిరిగి పుస్తకాల వైపు మళ్లించడంలో గ్రంథాలయాలు వంతెనగా పనిచేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.   Nara Lokesh AP Assembly, 37 Government Degree Colleges AP, 175 Constituency Model Libraries AP, Amaravati World Class Central Library, AP Education Infrastructure News
ALSO ON TELUGUONE N E W S
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి పూర్ణ, ప్రస్తుతం తన కెరీర్ రెండో ఇన్నింగ్స్‌లో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఒకప్పుడు కథానాయికగా విభిన్నమైన పాత్రలతో అలరించిన ఆమె, ఇప్పుడు సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సూపర్ స్టార్ల భారీ ప్రాజెక్టులలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. గతంలో మహేష్ బాబు కథానాయకుడిగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ 'గుంటూరు కారం'లో పూర్ణ చేసిన సందడి నెవర్ బిఫోర్ అని చెప్పవచ్చు. ఆ చిత్రంలోని చార్ట్‌బస్టర్ సాంగ్ 'కుర్చీ మడతపెట్టి'లో ఆమె వేసిన ఎనర్జిటిక్ మాస్ మూవ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తక్కువ స్క్రీన్ టైమ్ దక్కినప్పటికీ తన ప్రదర్శనతో సాంగ్‌కు మరింత ఎనర్జీ తీసుకువచ్చారు. ఇప్పుడు అదే జోరును కొనసాగిస్తూ కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ 'జైలర్ 2' చిత్రంలోనూ పూర్ణ తన మార్క్ చూపించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల విడుదలైన 'జైలర్ 2' ఫస్ట్ సింగిల్ ప్రోమోలో పూర్ణ తన డ్యాన్స్ మూవ్స్‌తో విపరీతంగా ఆకట్టుకున్నారు. ఈ ప్రోమో బయటకు వచ్చినప్పటి నుండి సోషల్ మీడియాలో ఆమె ప్రదర్శనపైనే గట్టి చర్చ నడుస్తోంది. ఒకవైపు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మరోవైపు కోలీవుడ్ తలైవర్ రజనీకాంత్.. ఇలా ఇద్దరు అగ్ర కథానాయకుల భారీ ప్రాజెక్టులలో పూర్ణ స్పెషల్ సాంగ్స్ సాధించడం సాధారణ విషయమేమీ కాదు. నిడివి చిన్నదే అయినా, స్క్రీన్ పై కనిపించిన ఆ కొద్ది నిమిషాల్లోనే ప్రేక్షకులలో బలమైన ముద్ర వేసేలా ఆమె ప్లాన్ చేసుకుంటున్న తీరు సినీ వర్గాల్లో ప్రశంసలు అందుకుంటోంది. 'జైలర్ 2' ప్రోమోలో పూర్ణ ఎంట్రీ సీక్వెన్స్‌ను మేకర్స్ ప్రత్యేకంగా హైలైట్ చేయడంతో ఈ పాటపై అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పాటలో ఆమె ఎనర్జీ ఈ ట్రాక్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఫుల్ సాంగ్ విడుదలైన తర్వాత దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలు వెలుగులోకి రానున్నాయి. కేవలం గ్లామరస్ రోల్స్ లేదా లీడ్ క్యారెక్టర్లకే పరిమితం కాకుండా, వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఇంపాక్ట్ క్రియేట్ చేయడమే లక్ష్యంగా పూర్ణ ముందుకు సాగుతున్నారు. స్క్రీన్ టైమ్ కంటే కంటెంట్ అండ్ ఇంపాక్ట్ ముఖ్యమని నిరూపిస్తున్న పూర్ణ రూట్ ఇప్పుడు పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. త్వరలోనే పూర్తి స్థాయి పాట విడుదల కానుండగా, రజనీకాంత్ మాస్ మేనియాతో పాటు పూర్ణ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఊపేస్తుందో వేచి చూడాలి.
Christopher Nolan’s The Odyssey has officially made box-office history. The epic has crossed $1.34 billion worldwide, overtaking Deadpool & Wolverine to become the highest-grossing R-rated movie of all time. The milestone puts The Odyssey ahead of Deadpool & Wolverine, which finished its theatrical run with around $1.338 billion worldwide in 2024. Nolan’s film has now become the latest R-rated title to break through the billion-dollar mark, following Joker, while Oppenheimer had previously reached $985 million. What makes the achievement more significant is the film’s genre and rating. Unlike the franchise-driven Deadpool & Wolverine, The Odyssey is Christopher Nolan’s ambitious adaptation of Homer’s ancient Greek epic, mounted as a large-scale theatrical event. The film stars Matt Damon, Tom Holland, Anne Hathaway, Robert Pattinson, Zendaya, Lupita Nyong’o and Charlize Theron, with Nolan directing and co-writing the film. The record also marks another major milestone for Nolan at the box office. The Odyssey has now surpassed his previous career-best, The Dark Knight Rises, which grossed about $1.08 billion worldwide. Current box-office projections suggest that the film could continue its run toward the $1.6 billion mark, potentially giving Nolan the biggest commercial success of his career by a considerable margin. Interestingly, The Odyssey has achieved the R-rated record even though Deadpool & Wolverine remains ahead domestically for now. The Marvel film collected roughly $632 million in North America, compared with around $515 million for Nolan’s film, meaning The Odyssey has built its record largely through its international performance. With its $1.34 billion global haul, The Odyssey has gone from being one of 2026’s biggest theatrical bets to becoming a historic box-office success. For Nolan, it is yet another reminder that an original filmmaker-led spectacle can still command enormous audiences worldwide—and this time, with an R rating. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
తుఫాన్ వచ్చే ముందు వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంటుందో, అంతే ప్రశాంతంగా విశ్వనాధ్ అండ్ సన్స్ వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద పెను తుఫాను సృష్టిస్తుంది. సృష్టించడమే కాదు ఫ్యామిలీ సినిమాలు ఈ రోజుల్లో చూడరేమో అనుకునే వాళ్ల కళ్ళు తెరిపించి, అలాంటి వాళ్ళని సైతం రిపీట్ ఆడియెన్స్ గా మార్చేసింది. దీన్ని బట్టి  విశ్వనాధ్ అండ్ సన్స్  సునామి అర్ధం చేసుకోవచ్చు.  తెలుగు ,తమిళ్ తో సహా సాలిడ్ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్లకి పైగా గ్రాస్ ని దాటి 200 కోట్ల క్లబ్ అందుకోవాలని ఆశపడుతోంది. ఆశపడే  హక్కు కూడా తనకి ఉందని ట్రేడ్ సర్కిల్స్ రిపోర్ట్ చెప్తున్నాయి. అయితే  యూఎస్ మార్కెట్ లో  లేటెస్ట్ గా 2 మిలియన్ యూఎస్ డాలర్స్ గ్రాస్ మార్క్ ని దాటేసి అదరగొట్టింది. ఇందులో తెలుగు వెర్షన్ నే అధికంగా ఉండడం విశేషం. ఈ విషయాన్ని యుఎస్ లో రిలీజ్ చేసిన శ్లోకా ఎంటర్ టైన్ మెంట్ అధికారకంగా ప్రకటించింది.      Also Read: తమన్ గొప్ప మనస్సు.. 12 కోట్లతో వృద్ధాశ్రమం నిర్మాణం పెళ్లిపై మంచి అభిప్రాయం లేనినాలుగుపదుల వయసు దాటిన సంజయ్ విశ్వనాథన్ అనే మిలినియర్, తన వంశానికి వారసత్వం కోసం సరోగసి ద్వారా ఒక అబ్బాయిని తెచ్చుకుంటాడు. అందుకు ఫారిన్ కంట్రీ అబ్రాయిడ్ కి చెందిన మ్యాగీ అనే ఇరవైసంవత్సరాల పెళ్లి కానీ అమ్మాయి తన గర్భాన్ని అద్దెకి ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే విశ్వనాధ్ అండ్ సన్స్ .రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా జీవి ప్రకాష్ సంగీతం అందించాడు. నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మాణంలో వెంకీ అట్లూరి తెరకెక్కించాడు. Vishwanath And Sons, Suirya, Mamitha Bhaiju    
మలయాళ చిత్రపరిశ్రమ నుంచి వచ్చే క్రైమ్, సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలకు తెలుగు డిజిటల్ ఆడియన్స్‌లో ఉండే క్రేజ్ ప్రత్యేకమైనది. విభిన్నమైన కథాంశాలతో ఉత్కంత రేపే కంటెంట్‌ను ఇష్టపడే సినీ ప్రియుల కోసం మరొక ఆసక్తికర చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. స్టార్ హీరో కుంచాకో బోబన్ ప్రధాన పాత్రలో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ 'ఉన్మాదం' త్వరలోనే ఓటీటీ ప్రేక్షకులను అలరించబోతోంది. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్న కుంచాకో బోబన్, ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించారు. ఎడిటింగ్ రంగంలో ఎంతో అనుభవం ఉన్న కిరణ్ దాస్ ఈ సినిమాతో దర్శకుడిగా మారి ఈ చిత్రాన్ని మలిచారు. జులై 31న థియేటర్లలో విడుదలైన ఈ సస్పెన్స్ డ్రామా, త్వరలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'సోనీ లివ్' (Sony LIV) లో ప్రసారం కానున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ చిత్రంలో 'జై భీమ్' ఫేమ్ లిజోమోల్ జోస్ కథానాయికగా నటించి తన నటనతో అలరించారు. అలాగే సిద్ధుఖీ, కృష్ణప్రభ, విశాఖ్ నాయర్, సుధీశ్, కొట్టాయం నజీర్ వంటి బలమైన నటీనటుల తారాగణం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ముజీబ్ మజీద్ స్వరాలు సమకూర్చగా, జస్టీన్ వర్గీస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను మరింత పెంచిందని ప్రశంసలు దక్కాయి. సినిమా కథాంశానికి వస్తే.. షెల్లీ అనే పోలీస్ ఆఫీసర్ తన విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తుంటాడు. అయితే అతని అంతరంగంలో ఓ మంచి సినిమా రచయితగా మారాలనే బలమైన ఆకాంక్ష ఉంటుంది. ఈ క్రమంలో ఒక పాత కేసుకు సంబంధించిన ఫైల్ అతని చేతికి చిక్కుతుంది. ఆ కేసులో ఉన్న చిక్కుముడులు, ఊహించని మలుపులు షెల్లీని అమితంగా ఆకట్టుకోవడంతో దాని ఆధారంగానే కథ రాయాలని నిర్ణయించుకుంటాడు. ఆ ఇన్వెస్టిగేషన్ ప్రయాణంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏమిటి అనేదే ఈ చిత్ర ముఖ్యాంశం. కుంచాకో బోబన్ గతంలో నటించిన 'అంజామ్ పతిరా' (Anjaam Pathiraa) వంటి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లు దక్షిణాది అంతటా ఘన విజయాన్ని సాధించాయి. ఆ క్రమంలోనే 'ఉన్మాదం' సినిమాపై కూడా ఓటీటీ ప్రియుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌లను ఆస్వాదించే నెటిజన్లు ఈ సినిమా డిజిటల్ విడుదల కోసం సోషల్ మీడియాలో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. థియేటర్లలో మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించిన ఈ చిత్రం, సోనీ లివ్ ద్వారా డిజిటల్ వీక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
తమన్.. సాంగ్స్ ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొడితే ప్రేక్షకుడు తనకి తెలియకుండానే సీట్ లో నుంచి లేచి పూనకంతో డాన్స్ చేస్తాడు. హీరోకి గాని, ప్రతినాయకుడుకి గాని ఇచ్చే  ఎలివేషన్ అయితే నభూతో నభవిష్యత్. కథ, కథనంకి తగ్గ మూడ్ తో బిజిఎమ్ ఇవ్వడంలో కూడా స్పెషలిస్ట్.    తమన్  రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'సమాజంలో ఆదరణ కరువై అనాథలుగా మారుతున్న వృద్ధుల కోసం ఒక అత్యాధునిక ఓల్డ్ ఏజ్ హోమ్‌  నిర్మిస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ మొత్తం అంచనా వ్యయం 12 కోట్లు. ఇప్పటికే  4 కోట్లు  ఖర్చు చేశాను. సినిమాల ద్వారా వచ్చే రెమ్యునరేషన్‌ మాత్రమే కాకుండా విదేశీ, స్వదేశీ మ్యూజిక్ కాన్సర్ట్స్  ద్వారా వచ్చే ఆదాయాన్ని సంపూర్ణంగా ఈ వృద్ధాశ్రమ నిర్మాణానికే కేటాయిస్తున్నానని చెప్పుకొచ్చాడు. చాలా మంది ఈ మంచి కార్యక్రమానికి విరాళాలు ఇస్తామని ముందుకు వచ్చినప్పటికీ, తమన్  ప్రేమగా తిరస్కరించడం విశేషం. సొంత కష్టార్జితంతోనే ఈ కలల ప్రాజెక్టును పూర్తి చేయాలని  దృఢ సంకల్పంతో ఉన్నారు. కేవలం వృద్ధాశ్రమమే కాకుండా, పేద విద్యార్థుల చదువులకు సహాయం చేయడం, అత్యవసర వైద్య శస్త్రచికిత్సలకు ఆర్థిక సాయం అందించడం వంటి ఎన్నో గుప్తదానాలను తమన్ ఏళ్ల తరబడి చేస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక టీమ్‌ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. రీల్ హీరోగానే కాకుండా రియల్ లైఫ్‌లోనూ తోటివారికి సహాయపడుతూ రియల్ హీరో అనిపించుకుంటున్న తమన్ మానవత్వానికి సినీ ప్రముఖులు మరియు అభిమానుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. Also Read: ఇరుముడి మూవీ ఫస్ట్ రివ్యూ.. మాస్ మహారాజా హిట్ కొట్టబోతున్నాడా! కేవలం తన అద్భుతమైన మ్యూజిక్‌తోనే కాకుండా, తన ఉదార స్వభావంతో కూడా లక్షలాది మంది అభిమానుల హృదయాలని గెలుచుకుంటున్నారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ, ఎన్నో కష్టనష్టాల నడుమ గ్రౌండ్ లెవెల్ నుంచి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగిన ఆయన జీవిత ప్రయాణం అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. అయితే సమాజం నుంచి తాను పొందిన ఆదరాభిమానాలను తిరిగి సమాజానికే అందించాలనే ఆలోచన అనేది నిజంగా అభినందనీయం.  Thaman, Old Age Home, Tollywood
యంగ్ హీరో తేజ సజ్జా నటించిన విజువల్ వండర్ 'మిరాయ్' అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. జపాన్‌లో డే-1 అడ్వాన్స్ బుకింగ్స్‌లో 'బాహుబలి 2' రికార్డులను బ్రేక్ చేస్తూ టాప్-7 స్థానంలో నిలిచింది. 'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకొని రికార్డులు క్రియేట్ చేసిన తేజ సజ్జా, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాడు. జపాన్‌లో డే-1 అడ్వాన్స్ బుకింగ్స్ లో అత్యధిక టికెట్లు అమ్ముడైన టాప్ 10 భారతీయ సినిమాల లిస్ట్‌లో 'మిరాయ్' ఏకంగా 7వ స్థానాన్ని కైవసం చేసుకుంది. విచిత్రం ఏంటంటే.. 'బాహుబలి 2', 'టైగర్ జిందా హై', 'ధురంధర్ 2' వంటి భారీ చిత్రాల డే-1 బుకింగ్ రికార్డులను మిరాయ్ అధిగమించేసింది. RRR, ముత్తు, పుష్ప 2, దేవర, సలార్ వంటి బిగ్ స్టార్స్ ప్రాజెక్ట్స్ తర్వాత.. ఒక యంగ్ హీరో నటించిన సినిమా ఈ స్థాయిలో జపాన్ లో ట్రెండ్ అవ్వడం చూసి ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. ఇంకా రిలీజ్‌కు ముందే ఈ రేంజ్ రెస్పాన్స్ ఉందంటే.. రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు సృష్టించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక బాక్సాఫీస్ నంబర్స్ విషయానికి వస్తే.. 'మిరాయ్' ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.150 కోట్ల గ్రాస్ వసూలు చేసి సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు జపాన్ కలెక్షన్స్ తో ఆ నెంబర్ పెరగనుంది. అసలు జపాన్ ప్రేక్షకులకు ఈ సినిమా ఎందుకు అంతగా కనెక్ట్ అయ్యిందో తెలుసా? కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కాన్సెప్ట్ అలాంటిది. చక్రవర్తి అశోకుడు, అలాగే కళింగ యుద్ధం తర్వాత దాచిన తొమ్మిది పవిత్ర గ్రంథాల వెనుక ఉన్న మిస్టరీ నేపథ్యంతో ఈ కథ నడుస్తుంది. ఆ పవిత్ర గ్రంథాలను కాపాడే 'సూపర్ యోధ'గా తేజ సజ్జా నటిస్తే.. ఆ గ్రంథాల ద్వారా అమరత్వాన్ని పొందాలని చూసే 'బ్లాక్ స్వోర్డ్' రోల్‌లో మంచు మనోజ్ విలన్‌గా పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ హై-వోల్టేజ్ విజువల్ స్పెక్టాకిల్, పవర్ పుల్ మైథలాజికల్ యాక్షన్ కాన్సెప్ట్ జపనీస్ ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకుంటోంది.         Mirai Japan Release, Mirai Movie, Teja Sajja, Manchu Manoj  
కోలీవుడ్ మాస్ యాక్షన్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'మకుటం' డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. థియేటర్లలో తనదైన మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం, ఇప్పుడు బుల్లితెర వీక్షకులను అలరించేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పైకి రాబోతోంది. మాస్, యాక్షన్ తో పాటు విపరీతమైన ఎమోషన్స్ నింపడంలో విశాల్ నైపుణ్యం ప్రత్యేకమైనది. తమిళంతో పాటు తెలుగునాట కూడా ఆయన సినిమాలకు విశేష ఆదరణ లభిస్తుంటుంది. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, సెప్టెంబర్ 4 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు మరో విశేషం ఏమిటంటే.. విశాల్ స్వయంగా ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాకుండా, ఇందులో ఆయన తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసి మెప్పించారు. కథానాయికలుగా అంజలి, దుషారా విజయన్ నటించగా, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. కథ విషయానికి వస్తే.. కృపాకర్ అనే సాదాసీదా ఉద్యోగి తన కుటుంబంతో సంతోషంగా జీవిస్తుంటాడు. సరదాగా విహారయాత్రకు వెళ్లిన సమయంలో అనుకోకుండా ఒక రౌడీ ముఠా అతని కారుపై దాడి చేస్తుంది. ఈ ప్రమాదంలో భార్యాపిల్లలను కోల్పోయిన కృపాకర్, ఆ దుండగులపై ఎలా పగ తీర్చుకున్నాడు? ఆ గ్యాంగ్ వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు? అనే ఆసక్తికర అంశాలతో ఈ రివెంజ్‌ డ్రామా తెరకెక్కింది. విశాల్ కి గతంలో 'పందెం కోడి', 'అభిమన్యుడు', 'మార్క్ ఆంటోని' వంటి విలక్షణమైన యాక్షన్ చిత్రాలతో తెలుగులో మంచి క్రేజ్ లభించింది. అదే తరహాలో 'మకుటం'లో ఆయన చూపించిన వైవిధ్యమైన నటనకు, ముఖ్యంగా తండ్రీ కొడుకుల పాత్రల నడుమ ఉన్న వ్యత్యాసానికి ఆడియన్స్ నుండి మంచి స్పందన లభించింది. ఈ సినిమా డిజిటల్ ఎంట్రీపై సోషల్ మీడియాలో మాస్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్ మిస్సయిన యాక్షన్ లవర్స్ ఈ సినిమా కోసం అమెజాన్ ప్రైమ్‌లో ఎదురుచూస్తున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి థియేటర్లలో అలరించిన ఈ యాక్షన్ డ్రామా, సెప్టెంబర్ 4 నుంచి ఓటీటీ వేదికగా డిజిటల్ ఆడియన్స్‌ను ఏ స్థాయిలో మెప్పిస్తుందో వేచి చూడాలి.
    మాస్ మహారాజా రవితేజ రేపు ఉదయం ఎనిమిది గంటల ఆట నుంచి ఇరుముడితో వరల్డ్ సెల్యులాయిడ్ పై సందడి చేయనున్నాడు. సాంగ్స్ తో పాటు ప్రచార చిత్రాలు పాజిటివ్ గా ఉండటంతో అభిమానులు, మూవీ లవర్స్, ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఇరుముడి వీక్షించడానికీ థియేటర్స్ దగ్గర బారులు తీరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.      ఈ చిత్రం ఇప్పటికే తన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి  U/A 16+ సర్టిఫికెట్ లభించగా, రన్‌టైమ్  2 గంటల 25 నిమిషాలు. సెన్సార్ సభ్యులు మరియు ఇండస్ట్రీ వర్గాల నుంచి బయటకు వచ్చిన ఫస్ట్ రివ్యూ టాక్ ప్రకారం,  రవితేజ కెరీర్‌లోనే ఒక అద్భుతమైన ఎమోషనల్ అండ్ పవర్ ప్యాక్డ్ కంబ్యాక్ మూవీగా నిలవబోతోంది.  ఈ కథలో రవితేజ "త్రినాథ్" అనే ఆటో డ్రైవర్ పాత్రలో కనిపించనున్నారు. మొదట్లో మద్యానికి విపరీతంగా బానిసైన నెగెటివ్ షేడ్స్ ఉన్న వ్యక్తిగా రవితేజ నటన మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుంది. తన భార్య (ప్రియా భవానీ శంకర్), ముద్దుల కూతురు మణెమ్మ (బేబీ నక్షత్ర)లతో సాధారణ జీవితం గడుపుతున్న క్రమంలో, కూతురి కోరిక మేరకు ఆయన అయ్యప్ప మాల ధరిస్తారు. మద్యానికి బానిసైన ఒక తండ్రి అయ్యప్ప దీక్ష తీసుకున్న తర్వాత అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పులు వచ్చాయి, నిష్టగా మాల ఎలా కొనసాగించాడు అనేది సినిమాకు ప్రధాన హైలైట్‌గా మారనుంది.  అంతేకాకుండా, ఊరిలో ఆడపిల్లలకు ముప్పు తలపెడుతున్న ఒక క్రైమ్ సస్పెన్స్ డ్రామాను దర్శకుడు శివ నిర్వాణ ఈ తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌కు అద్భుతంగా ముడిపెట్టారు. తన కూతురితో పాటు గ్రామంలోని మహిళల రక్షణ కోసం అయ్యప్ప దీక్షలో ఉన్న త్రినాథ్ ఏ విధంగా పోరాడాడు అనే అంశం ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయం.  Also Read: లెజండ్రీ డైరెక్టర్ తో వరుణ్ తేజ్ రొమాంటిక్ మూవీ.. బాక్స్ బద్దలే మాస్ యాక్షన్‌కి  తోడుగా భక్తి రసం, తండ్రీ కూతుళ్ల మధ్యన సాగే ఎమోషనల్ సెంటిమెంట్ డ్రామా ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.  సాంకేతిక విభాగంలో జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, ముఖ్యంగా అయ్యప్ప స్వామి "ఇరుముడి కట్టు" పాటలు మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్  ప్రధాన బలంగా నిలిచాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలకి తోడు, సాయి కుమార్, అజయ్ ఘోష్, స్వసిక నటన సినిమాను తదుపరి స్థాయికి తీసుకెళ్లాయి. మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ మరియు 145 నిమిషాల క్రిస్పీ రన్‌టైమ్‌తో "ఇరుముడి" ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ అభిమానులకు పండగ వాతావరణం తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది. నిన్ను కోరి, మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకుడు. Irumudi, Raviteja, Shiva Nirvana, priya Bhavani Shankar  
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఫౌజి, స్పిరిట్, కల్కి-2.. ఇలా ఆయన లైనప్ లో ఉన్న ప్రతి ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో తాజాగా సోషల్ మీడియాలో, అలాగే కొన్ని బాలీవుడ్ సైట్స్ లో ఒక షాకింగ్ న్యూస్ తెగ వైరల్ అయ్యింది. అదేంటంటే.. 'ఆదిపురుష్' లాంటి డిజాస్టర్ తీసిన డైరెక్టర్ ఓం రౌత్‌తో ప్రభాస్ మరో సినిమా చేయబోతున్నారంటూ వార్తలొచ్చాయి. ఒక మిస్టీరియస్ జంగిల్ జర్నీ నేపధ్యంలో ఓం రౌత్ ఒక కథ చెప్పారని, ఆ లైన్ నచ్చడంతో ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఫైనల్ స్క్రిప్ట్ తో రమ్మని చెప్పారని బాలీవుడ్‌లో గట్టిగా ప్రచారం జరిగింది. నిజానికి ఆదిపురుష్ సినిమా రిలీజ్ తర్వాత ఓం రౌత్ ఏ రేంజ్‌లో ట్రోల్ అయ్యాడో మనందరికీ తెలిసిందే. గ్రాఫిక్స్ నుంచి నటీనటుల లుక్స్ వరకు ప్రతి విషయంలోనూ విమర్శలు ఎదుర్కొన్నారు. అలాంటి దర్శకుడికి ప్రభాస్ మళ్ళీ ఛాన్స్ ఇస్తాడా అని అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే డార్లింగ్ ఫ్యాన్స్ కి రిలీఫ్ ఇచ్చే బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ ప్రచారంపై ప్రభాస్ టీమ్ స్పందించింది. ఓం రౌత్‌తో ప్రభాస్ కొత్త సినిమా అంటూ వస్తున్న వార్తలన్నీ తప్పుడు ప్రచారమేనని, అందులో ఎలాంటి నిజం లేదని ప్రభాస్ టీమ్ స్పష్టం చేసింది.      Prabhas, Om Raut, Adipurush
  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం కొరియన్ కనకరాజు సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఐదు సంవత్సరాల తర్వాత వచ్చిన సోలో విజయం కాబట్టి  కనకరాజు మూడ్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో వరుణ్   మాట్లాడుతు ప్రేక్షకులు ఎంటర్ టైన్ మెంట్ ని కోరుకుంటున్నారనే విషయం బాగా అర్థమైందని చెప్పుకొచ్చాడంటే తన అప్ కమింగ్ సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలతో ఉండబోతున్నాడో తెలుస్తుంది.   వరుణ్ తేజ్ అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే తన సోదరి నీహారిక నిర్మాణ సారధ్యంలో కమిటి కర్రోళ్ళు డైరెక్టర్ తో   'బరి' మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తన లిస్ట్ లో తమిళ చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ట్రెండ్ సృష్టించిన స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కలయికలో ఓ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోబోతుంది. ఇటీవలే "కొరియన్ కనకరాజు" చిత్రంతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకని పూర్తి జోరు మీదున్న వరుణ్ తేజ్, తన తదుపరి సినిమాల విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రొటీన్ మాస్, యాక్షన్ సినిమాల బాటలో వెళ్లకుండా, కథాంశంలో వైవిధ్యం ఉన్న ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఇస్తూ సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే  కార్తీక్ సుబ్బరాజ్‌తో కలిసి ఓ విభిన్నమైన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. సాధారణంగా ప్రేమకథలంటే ఒకే రకమైన మూస ధోరణిలో, రెగ్యులర్ ఎమోషన్స్‌తో సాగుతుంటాయి. కానీ, ఈ సినిమా మాత్రం దానికి నూటికి నూరు శాతం భిన్నంగా ఉండబోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. తన ప్రస్తుత వయస్సుకు, మెచ్యూరిటీకి సరిగ్గా సరిపోయే ఒక పరిణతి చెందిన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కనుందని వరుణ్ తేజ్ స్వయంగా వెల్లడించారు. ఇది రొటీన్ లవ్ స్టోరీలా కాకుండా, ప్రేక్షకులు అస్సలు ఊహించని కొత్త కోణంలో సాగుతుందని, కథనంలో ఉండే వినూత్న ట్విస్టులు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయని ఆయన పేర్కొన్నారు. కార్తీక్ సుబ్బరాజ్ టేకింగ్ స్టైల్ మరియు వరుణ్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే వెండితెరపై ఒక సరికొత్త మ్యాజిక్ క్రియేట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. Also Read: సీనియర్ నటీమణి షావుకారు జానకి తీవ్ర అస్వస్థత.. వెంటిలెటర్ పై చికిత్స పిజ్జా, జిగర్తండ, పేట, మహాత్మా వంటి సూపర్ హిట్ సినిమాలతో తన మార్క్ చూపించిన కార్తీక్ సుబ్బరాజ్, మొదటి నుంచి డిఫరెంట్ మేకింగ్‌తో ప్రసిద్ధి చెందారు. ఇండియన్ సినిమాలో ఎస్‌.ఎస్‌. రాజమౌళి, మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ, సుకుమార్, వెట్రిమారన్ వంటి దిగ్గజ దర్శకుల జాబితాలో కార్తీక్ సుబ్బరాజ్ పేరు కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆయన కథ చెప్పే విధానం, పాత్రల చిత్రణ, విజువల్స్ నిలిపే శైలి ఎంతో ప్రత్యేకం. అలాంటి మైండ్ బ్లోయింగ్ మేకర్, వరుణ్ తేజ్ వంటి వైవిధ్యమైన నటుడితో ఓ లవ్ స్టోరీ చేయడం టాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియా వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. Varun Tej, Karthik Subbaraj, Tollywood    
ఒక దేశం స్వేచ్ఛా కాంక్షతో.. పోరాటం చేసి సాధించుకున్న విజయమే స్వాతంత్ర్యం.. భారతదేశం 80 ఏళ్ళ కిందట బ్రిటీష్ వారి బానిసత్వం నుండి విముక్తి కోసం పోరాటం చేసింది,  స్వేచ్ఛను సంపాదించుకుంది.  ఈ సందర్బంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం  జరుపుకుంటారు. 1947లో బ్రిటిష్ వలస పాలన నుండి దేశానికి లభించిన విముక్తికి గుర్తుగా దేశమంతా జరుపుకునే పండుగే  స్వాతంత్ర్య దినోత్సవం. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ధైర్యంగా పోరాడిన లెక్కలేనంత మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు, అవిశ్రాంత కృషికి ఈ రోజు ఒక నివాళి. స్వాతంత్ర పోరాటం ముగిసిన తర్వాత భారతదేశ చరిత్రలో ఒక శకం ముగిసి,  కొత్త శకం ప్రారంభమైందని చెప్పవచ్చు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి చేసిన కృషి,  జరిగిన సంఘటనలు, త్యాగాల గురించి వివరంగా తెలుసుకుంటే.. పోరాటం.. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం దాదాపు రెండు శతాబ్దాల పాటు సాగిన ఒక సుదీర్ఘమైన, కఠిన ప్రయాణం. ఇది 1857 తిరుగుబాటుతో ప్రారంభమైంది.  దీనిని మొదటి స్వాతంత్ర్య యుద్ధం అని కూడా పిలుస్తారు, ఇందులో భారతీయ సైనికులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ సంఘటన జాతీయ చైతన్యాన్ని రగిలించింది, ఇది చివరికి 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావానికి దారితీసింది. 20వ శతాబ్దం ప్రారంభంలో గాంధీజి వంటి ప్రముఖ నాయకులు ఉద్భవించారు. ఆయన సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి ఉద్యమాల ద్వారా అహింసాయుత ప్రతిఘటనను సమర్థించారు. ఈ ఉద్యమాలు బ్రిటిష్ పాలన నుండి సంపూర్ణ స్వాతంత్ర్యం కోరడానికి లక్షలాది మంది భారతీయులను ఉత్తేజపరిచాయి. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీని భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటారు .   ట్రైస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం.. 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి, స్వతంత్ర భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తన చారిత్రాత్మక "ట్రైస్ట్ విత్ డెస్టినీ" (విధితో వాగ్వాదం) ప్రసంగాన్ని అందించారు. సుబాష్ చంద్రబోస్.. ఆజాద్ హింద్ సేన.. సుభాష్ చంద్ర బోస్, భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారు. అహింసా ఉద్యమం వల్ల నెమ్మదిగా ఉన్న పోరాటానికి  నిరాశ చెందిన బోస్, స్వాతంత్ర్యం సాధించడానికి మరింత దూకుడు మార్గాలను అన్వేషించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన జపాన్ సహాయంతో ఆజాద్ హింద్ ఫౌజ్ ని స్థాపించారు. దీన్ని ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటారు. భారతీయ సైనికులు , ప్రవాసులతో కూడిన ఆజాద్ హింద్ సేన, భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాలలో బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడింది. భారతదేశానికి విముక్తి కల్పించడంలో సైన్యం విజయం సాధించనప్పటికీ, బోస్ చేసిన ప్రయత్నాలు చాలా మందికి స్ఫూర్తినిచ్చాయి . భారత స్వాతంత్ర్య ఉద్యమం ప్రపంచాన్ని ఆకర్షించింది. స్వాతంత్ర్యం కోసం బోస్ చేసిన కృషి  వర్ణించలేనిది. గోవా, హైదరాబాద్ విమోచనం.. 1947 స్వాతంత్ర్య దినోత్సవం తర్వాత కూడా కొన్ని ప్రాంతాలు విదేశీ లేదా రాచరిక పాలనలో ఉన్నాయి. పోర్చుగీసు వలస ప్రాంతమైన గోవా, “ఆపరేషన్ విజయ్” అనే సైనిక తిరుగుబాటు తర్వాత 1961లో విముక్తి పొందింది. భారత సాయుధ దళాలు గోవాను భారత యూనియన్‌లో విజయవంతంగా విలీనం చేసి, 451 సంవత్సరాల పోర్చుగీసు పాలనకు ముగింపు పలికాయి. హైదరాబాద్ నిజాం మొదట్లో స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నారు, కానీ చివరికి 1948లో “ఆపరేషన్ పోలో” అనే సైనిక తిరుగుబాటు ద్వారా భారతదేశంలో విలీనం చేయబడింది. ఇది కొత్తగా ఏర్పడిన భారత గణతంత్ర రాజ్యంలో ఆ సంస్థానం యొక్క ఏకీకరణను నిర్ధారించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్.. భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్, విచ్ఛిన్నమైన సంస్థానాలను భారత యూనియన్‌గా ఏకీకృతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. భారతదేశపు మొదటి ఉప ప్రధానమంత్రిగా మరియు హోం మంత్రిగా, ఈ సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యేలా చూడటానికి పటేల్ దౌత్యపరమైన , కొన్నిసార్లు బలప్రయోగ చర్యలను కూడా ఉపయోగించారు. భారతదేశ రాజకీయ ఏకీకరణలో ఆయన చేసిన కృషి, ఆయనకు అపారమైన గౌరవాన్ని , భారత చరిత్రలో ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించిపెట్టింది. బలమైన, ఐక్య భారతదేశానికి పునాది వేయడంలో పటేల్ దార్శనికత, నాయకత్వం కీలక పాత్ర పోషించాయి. దేశానికి ఆయన చేసిన సేవలకు నిదర్శనంగా నిలుస్తూ, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' విగ్రహం ఆయన వారసత్వాన్ని శాశ్వతంగా నిలిపింది.                                  *రూపశ్రీ.  
ఒక దేశం స్వేచ్ఛా కాంక్షతో.. పోరాటం చేసి సాధించుకున్న విజయమే స్వాతంత్ర్యం.. భారతదేశం 80 ఏళ్ళ కిందట బ్రిటీష్ వారి బానిసత్వం నుండి విముక్తి కోసం పోరాటం చేసింది,  స్వేచ్ఛను సంపాదించుకుంది.  ఈ సందర్బంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం  జరుపుకుంటారు. 1947లో బ్రిటిష్ వలస పాలన నుండి దేశానికి లభించిన విముక్తికి గుర్తుగా దేశమంతా జరుపుకునే పండుగే  స్వాతంత్ర్య దినోత్సవం. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ధైర్యంగా పోరాడిన లెక్కలేనంత మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు, అవిశ్రాంత కృషికి ఈ రోజు ఒక నివాళి. స్వాతంత్ర పోరాటం ముగిసిన తర్వాత భారతదేశ చరిత్రలో ఒక శకం ముగిసి,  కొత్త శకం ప్రారంభమైందని చెప్పవచ్చు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి చేసిన కృషి,  జరిగిన సంఘటనలు, త్యాగాల గురించి వివరంగా తెలుసుకుంటే.. పోరాటం.. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం దాదాపు రెండు శతాబ్దాల పాటు సాగిన ఒక సుదీర్ఘమైన, కఠిన ప్రయాణం. ఇది 1857 తిరుగుబాటుతో ప్రారంభమైంది.  దీనిని మొదటి స్వాతంత్ర్య యుద్ధం అని కూడా పిలుస్తారు, ఇందులో భారతీయ సైనికులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ సంఘటన జాతీయ చైతన్యాన్ని రగిలించింది, ఇది చివరికి 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావానికి దారితీసింది. 20వ శతాబ్దం ప్రారంభంలో గాంధీజి వంటి ప్రముఖ నాయకులు ఉద్భవించారు. ఆయన సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి ఉద్యమాల ద్వారా అహింసాయుత ప్రతిఘటనను సమర్థించారు. ఈ ఉద్యమాలు బ్రిటిష్ పాలన నుండి సంపూర్ణ స్వాతంత్ర్యం కోరడానికి లక్షలాది మంది భారతీయులను ఉత్తేజపరిచాయి. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీని భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటారు .   ట్రైస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం.. 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి, స్వతంత్ర భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తన చారిత్రాత్మక "ట్రైస్ట్ విత్ డెస్టినీ" (విధితో వాగ్వాదం) ప్రసంగాన్ని అందించారు. సుబాష్ చంద్రబోస్.. ఆజాద్ హింద్ సేన.. సుభాష్ చంద్ర బోస్, భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారు. అహింసా ఉద్యమం వల్ల నెమ్మదిగా ఉన్న పోరాటానికి  నిరాశ చెందిన బోస్, స్వాతంత్ర్యం సాధించడానికి మరింత దూకుడు మార్గాలను అన్వేషించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన జపాన్ సహాయంతో ఆజాద్ హింద్ ఫౌజ్ ని స్థాపించారు. దీన్ని ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటారు. భారతీయ సైనికులు , ప్రవాసులతో కూడిన ఆజాద్ హింద్ సేన, భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాలలో బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడింది. భారతదేశానికి విముక్తి కల్పించడంలో సైన్యం విజయం సాధించనప్పటికీ, బోస్ చేసిన ప్రయత్నాలు చాలా మందికి స్ఫూర్తినిచ్చాయి . భారత స్వాతంత్ర్య ఉద్యమం ప్రపంచాన్ని ఆకర్షించింది. స్వాతంత్ర్యం కోసం బోస్ చేసిన కృషి  వర్ణించలేనిది. గోవా, హైదరాబాద్ విమోచనం.. 1947 స్వాతంత్ర్య దినోత్సవం తర్వాత కూడా కొన్ని ప్రాంతాలు విదేశీ లేదా రాచరిక పాలనలో ఉన్నాయి. పోర్చుగీసు వలస ప్రాంతమైన గోవా, “ఆపరేషన్ విజయ్” అనే సైనిక తిరుగుబాటు తర్వాత 1961లో విముక్తి పొందింది. భారత సాయుధ దళాలు గోవాను భారత యూనియన్‌లో విజయవంతంగా విలీనం చేసి, 451 సంవత్సరాల పోర్చుగీసు పాలనకు ముగింపు పలికాయి. హైదరాబాద్ నిజాం మొదట్లో స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నారు, కానీ చివరికి 1948లో “ఆపరేషన్ పోలో” అనే సైనిక తిరుగుబాటు ద్వారా భారతదేశంలో విలీనం చేయబడింది. ఇది కొత్తగా ఏర్పడిన భారత గణతంత్ర రాజ్యంలో ఆ సంస్థానం యొక్క ఏకీకరణను నిర్ధారించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్.. భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్, విచ్ఛిన్నమైన సంస్థానాలను భారత యూనియన్‌గా ఏకీకృతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. భారతదేశపు మొదటి ఉప ప్రధానమంత్రిగా మరియు హోం మంత్రిగా, ఈ సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యేలా చూడటానికి పటేల్ దౌత్యపరమైన , కొన్నిసార్లు బలప్రయోగ చర్యలను కూడా ఉపయోగించారు. భారతదేశ రాజకీయ ఏకీకరణలో ఆయన చేసిన కృషి, ఆయనకు అపారమైన గౌరవాన్ని , భారత చరిత్రలో ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించిపెట్టింది. బలమైన, ఐక్య భారతదేశానికి పునాది వేయడంలో పటేల్ దార్శనికత, నాయకత్వం కీలక పాత్ర పోషించాయి. దేశానికి ఆయన చేసిన సేవలకు నిదర్శనంగా నిలుస్తూ, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' విగ్రహం ఆయన వారసత్వాన్ని శాశ్వతంగా నిలిపింది.                                                                                                                                                   *రూపశ్రీ.
మనుషుల నుండి ప్రాణం ఉన్న ప్రతి జీవి ఆహారం తీసుకోవడం పరిపాటి.  తీసుకునే ఆహారం నుండి లభించే శక్తితోనే శరీరం నిలబడుతుంది. ఇక అన్ని ప్రాణులలోకి మనిషి చాలా విభిన్నమైన వాడు. మనుషుల్లో ఒక్కొక్కరికి ఒక్కో విధమైన అలవాట్లు ఉంటాయి.  అంతేకాదు.. ఆహారం తినే విధానంలో కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది.  కొందరు నిదానంగా తింటారు.  మరికొందరు చాలా వేగంగా తింటారు.  అయితే.. వేగంగా తినే వ్యక్తుల వ్యక్తిత్వం గురించి వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చాలా ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నారు. వేగంగా ఆహారం తినే వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. వేగంగా తినడం... మన చుట్టూ చాలామంది ఉంటారు.  కుటుంబ సభ్యులు అయినా,  స్నేహితులు అయినా.. తెలిసిన వారు అయినా.. కలిసి భోజనం చేసేటప్పుడు లేదా ఏదైనా ఆహారం తినేటప్పుడు.. అందరూ కలిసి మొదలు పెడితే.. పక్క వాళ్లు ఇంకా సగం కూడా తినకుండానే మధ్యలోనే తమ ఆహారం పూర్తీ చేసే వారు కొందరు ఉంటారు.  వారు చాలా బిజీ లైఫ్ స్టైల్ కు అలవాటు వడటం వల్ల అలా వేగంగా తినడం అలవాటు అయి ఉంటుందని అందరూ అనుకుంటారు. ఇది నిజమే అయినా ఇలా వేగంగా తినే వారి స్వభావం విభిన్నంగా ఉంటుందని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చెబుతున్నారు. వేగంగా తినే వారిలో ఉండే వ్యక్తిత్వ లక్షణాలు.. వేగంగా తినే వ్యక్తులు ఎక్కువగా ఫినిష్ లైన్ ను చేరుకోవడంపై దృష్టి పెడతారు. అదే మనస్తత్వం జీవితంలోని ఇతర రంగాలలో కనిపిస్తుందట. వారు చేయవలసిన పనుల లిస్ట్ నుండి పనులను మార్క్  చేయడం, సమర్థవంతంగా పనిచేయడం , ఒక పనిలో ఆలస్యం  కాకుండా ఆ తరువాత  సవాలును స్వీకరించడం వంటివి వీరిలో ఉంటాయట.   స్ట్రాంగ్ ప్రాక్టీస్  ఉన్నవారు తరచుగా భోజనంతో సహా రోజువారీ దినచర్యలో వేగాన్ని , సామర్థ్యాన్ని ఇష్టపడతారని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు. తినడాన్ని ఆస్వాదించడం, అనుభూతి చెందడం  కంటే తినడాన్ని కూడా ఒక  పనిగా భావిస్తారని అంటున్నారు.  తినే వేగాన్ని బట్టి వ్యక్తిత్వం లక్షణాలను,  తినే వేగానికి,  వ్యక్తిత్వానికి మధ్య గల సంబంధాలను వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు కనుక్కున్నారు. వేగంగా తినేవారు తరచుగా వేచి ఉండటానికి ఇష్టపడరు. ఇది క్యూలలో నిలబడినా, నెమ్మదిగా మీటింగ్స్  లో ఉన్నా లేదా ఆహారం వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వచ్చినా.. ఇలా అన్ని సందర్బాలలో వారు అన్ని వేగంగానే జరగాలని కోరుకుంటారట.  అన్ని విషయాలలోనూ సహజంగా వేగాన్ని వీరు ఇష్టపడతారట. ఈ ధోరణి భోజన చేయడం వరకు తీసుకువెళుతుందట.  చాలామందిలో తినే స్వభావం మానసిక , పర్యావరణ కారకాల ద్వారా ఏర్పడతాయని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చెబుతున్నారు.   వేగంగా తినే వ్యక్తులలో ఇతర పనులను కూడా వేగంగా పూర్తీ చేసే సామర్థ్యం ఉంటుందట. వర్తమానంతో పూర్తీగా నిమగ్నమవడానికి బదులుగా  తరువాత ఏమి జరుగుతుందో  అనే విషయం పై దృష్టి పెట్టేలా చేస్తుందట.  ఈ కారణంగా వీరికి భవిష్యత్తు గురించి స్పష్టమైన అంచనాలు, ప్రణాళికలు కూడా ఉంటాయట. అలాగని వేగంగా తినడాన్ని సమర్థించడం లేదు. ఎందుకంటే.. వేగంగా తినడం అనేది ఆహారం సరిగా నమలకపోవడం, తినే ఆహారం మీద దృష్టి పెట్టలేకపోవడం,  ఆహారం అతిగా తినడం.. ఇలా చాలా సమస్యలకు కారణం అవుతుంది.                                                                                                                                                   *రూపశ్రీ.  
  మోకాళ్ల నొప్పులు, కీళ్ల సమస్యలు ఒకప్పుడు 60–70 ఏళ్ల వయసులో ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడు 40లలో ఉన్నవారిలో కూడా మోకాళ్ల సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొందరికి చిన్న వయసులోనే Knee Replacement అవసరమయ్యే పరిస్థితి ఎందుకు వస్తోంది? ఈ సమస్యలకు సరైన వ్యాయామం లేకపోవడం, శారీరక శ్రమ తగ్గడం, Vitamin D, Vitamin B12 లోపం వంటి కారణాలు ఎంతవరకు ప్రభావం చూపుతాయి? ఎముకలు, కీళ్లు, మోకాళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వీడియోలో Dr. Anvesh Reddy (MS Ortho) మోకాళ్లు, కీళ్లు, ఎముకల ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను సులభంగా వివరిస్తున్నారు. అలాగే Vitamin D, Vitamin B12 లభించే ఆహారాలు, రోజువారీ జీవితంలో పాటించాల్సిన వ్యాయామాలు, మోకాళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా తెలియజేస్తున్నారు. 40 ఏళ్లలోనే మోకాళ్ల సమస్యలు ఎందుకు వస్తున్నాయి? Vitamin D, B12 లోపం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? ఏ ఆహారాల్లో ఈ విటమిన్లు లభిస్తాయి? మోకాళ్ల ఆరోగ్యం కోసం ఎలాంటి వ్యాయామాలు చేయాలి? వంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి.  గమనిక: మోకాళ్ల నొప్పులు లేదా ఇతర కీళ్ల సమస్యలు ఉంటే స్వయంగా చికిత్స చేసుకోకుండా వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
గుడ్లు పోషకాహారం యొక్క పవర్హౌస్.  ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన విటమిన్లు గుడ్డులో పుష్కలంగా ఉంటాయి. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ రోజుకు ఒక గుడ్డు తినడం చాలామంచిదని చెబుతూ ఉంటారు.  అయితే  రోజూ రెండు ఉడికించిన గుడ్లు తినడం  మంచిదేనా? ఫిట్‌నెస్ ట్రైనింగ్ లో ఉన్నవారు,  పోషకాహార లోపంతో ఉన్నవారు ప్రతిరోజూ గుడ్డు తినాలని చెబుతుంటారు.  రోజుకు రెండు ఉడికించిన గుడ్లు తీసుకుంటే ఏం జరుగుతుంది? ఇది శరీరం పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? వివరంగా తెలుసుకుంటే.. ఎముకలను బలోపేతం చేస్తుంది.. గుడ్లలో విటమిన్ డి , కాల్షియం పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎముక సాంద్రతను మెరుగుపరచడంలో , బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.రోజు రెండు ఉడికించిన గుడ్లు తింటూ ఉంటే ఎముకల బలానికి కావలసినంత కాల్షియం,  విటమిన్-డి పొందవచ్చు. మెదడు ఆరోగ్యానికి.. గుడ్లలో కోలిన్ ఉంటుంది, ఇది మెదడు పనితీరు,  జ్ఞాపకశక్తికి చాలా అవసరం. క్రమం తప్పకుండా రోజు రెండు ఉడికించిన గుడ్లు తింటూ ఉంటే.. అది మెదడు  చురుగ్గా ఉండటానికి,  మెదడు  ఆరోగ్యానికి తోడ్పడుతుంది ,  అలాగే నరాల పనితీరును  కూడా మెరుగ్గా ఉంచుతుంది. కంటి ఆరోగ్యానికి.. గుడ్లలో ల్యూటిన్ , జీక్సాంథిన్ ఉంటాయి. ఇవి వయస్సు సంబంధిత మాక్యులర్ డిజెనరేషన్ నుండి కళ్ళను రక్షించే యాంటీఆక్సిడెంట్లు.  మొత్తం కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యానికి.. గుడ్లలో కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ, సమతుల్య ఆహారంతో పాటు మితంగా గుడ్లు తినడం వల్ల మంచి HDL కొలెస్ట్రాల్ పెరిగి, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ప్రోటీన్ కు మంచిది.. రెండు ఉడికించిన గుడ్లు సుమారు 12 గ్రాముల నాణ్యమైన ప్రోటీన్‌ను అందిస్తాయి. ఇవి కండరాల నిర్మాణం, మరమ్మత్తు , కడుపు నిండిన ఫీలింగ్ ఇవవ్డంలో సహాయపడతాయి. ఫిట్‌నెస్ ప్రియులకు , లీన్ కండరాలను కాపాడుకోవాలనుకునే వారికి ఇది చాలా మంచిది. బరువు నిర్వహణకు.. గుడ్లలో అధిక ప్రోటీన్ , తక్కువ కేలరీలు ఉంటాయి.  దీని కారణంగా ఉడికించిన గుడ్లు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి , శరీరానికి కావలసిన పోషకాలు కూడా మెరుగ్గా అందిస్తాయి. ఇవి అతిగా తినడాన్ని,  వెంటనే ఆకలి కావడాన్ని అరికట్టడానికి , బరువు నిర్వహణకు సహాయపడతాయి.                                                                                                                                                   *రూపశ్రీ.
కాళ్లు, చేతులు తిమ్మిరిగా అనిపించడం, జలదరింపు రావడం చాలామందికి అప్పుడప్పుడు ఎదురయ్యే సమస్య. ఎక్కువసేపు ఒకే పొజిషన్‌లో కూర్చోవడం లేదా నరాలపై ఒత్తిడి పడటం వల్ల తాత్కాలికంగా తిమ్మిర్లు రావచ్చు. అయితే పదేపదే తిమ్మిర్లు రావడం, ఎక్కువసేపు తగ్గకపోవడం లేదా శరీరంలో ఒక వైపు మాత్రమే అకస్మాత్తుగా తిమ్మిరి రావడం మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. చేతులు, కాళ్లలో తిమ్మిర్లు రావడానికి నరాలకు సంబంధించిన సమస్యలు ఒక కారణం కావచ్చు. నరాలు దెబ్బతిన్నప్పుడు తిమ్మిరితో పాటు మంట, జలదరింపు, సూదులు గుచ్చినట్టుగా అనిపించడం, నొప్పి లేదా చేతులు, కాళ్లలో బలహీనత వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. అయితే శరీరంలో ఒక వైపు అకస్మాత్తుగా చేయి లేదా కాలు తిమ్మిరిగా మారడం, బలహీనంగా అనిపించడం వంటి లక్షణాలను మాత్రం ప్రత్యేకంగా గమనించాలి. ముఖ్యంగా వీటితో పాటు ముఖం ఒక వైపు వంగడం, మాట స్పష్టంగా రాకపోవడం, నడవడంలో ఇబ్బంది, అకస్మాత్తుగా తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే అవి బ్రెయిన్ స్ట్రోక్‌కు సంబంధించిన హెచ్చరిక సంకేతాలు కావచ్చు. ఇలాంటి సమయంలో ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే సాధారణంగా వచ్చే తిమ్మిరికి, నరాల దెబ్బతినడం లేదా స్ట్రోక్‌కు సంబంధించిన తిమ్మిరికి తేడా ఏమిటి? ఏ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు? శరీరంలో ఒక వైపు మాత్రమే తిమ్మిరి ఎందుకు వస్తుంది? ఈ విషయాలపై Dr. Anirudh Deshmukh ఈ వీడియోలో సులభంగా వివరిస్తున్నారు. సాధారణ తిమ్మిరి ఎప్పుడు ఆందోళన చెందాల్సిన సమస్యగా మారుతుంది? నరాల సమస్యకు సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి? స్ట్రోక్‌ను సూచించే సంకేతాలు ఏమిటి? వంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. అకస్మాత్తుగా ఒక వైపు తిమ్మిరి, బలహీనత లేదా స్ట్రోక్‌ను సూచించే ఇతర లక్షణాలు కనిపిస్తే స్వయంగా చికిత్స చేసుకోకుండా వెంటనే వైద్య సహాయం పొందండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)