కాంగ్రెస్ అభ్యంతరాలు బేఖాతర్.. పరిమళ్ నత్వానీ నామినేషన్‌ ఆమోదం!

Publish Date:Jun 10, 2026

Advertisement

జార్ఖండ్ వేదికగా జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రస్తుత  వైసీపీ ఎంపీ  పరిమళ్ నత్వానీ చుట్టూ ఇప్పడు జాతీయ రాజకీయం తిరుగుతోంది. జార్ఖండ్ నుంచి ఎన్డీయే, మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన  పరిమళ్ నత్వానీ నామినేషన్ పై  ప్రత్యర్థి వర్గాల నుంచి  అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఈ నామినేషన్ చెల్లుబాటు అవుతుందా లేదా అన్న ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ సహా

 జార్ఖండ్ ముక్తి మోర్చా  నేతలు పరిమళ్ నత్వానీ నామినేషన్ పై తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నత్వానీ తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం, అలాగే   వివిధ కంపెనీల్లో కలిగి ఆయన డైరెక్టర్‌షిప్‌ల వంటి కీ విషయాలను సరిగ్గా వెల్లడించలేదనీ  కాంగ్రెస్  ఆరోపించింది. ఈ అక్రమాల నేపథ్యంలో ఆయన నామినేషన్‌ను   తిరస్కరించాలని రిటర్నింగ్ అధికారిని డిమాండ్ చేస్తూ విపక్షాలు ఒత్తిడి తెచ్చాయి.

అయితే.. కాంగ్రెస్ కూటమి అభ్యంతరాలను బేఖాతర్ చేస్తూ..   రిటర్నింగ్ అధికారి రంజీత్ కుమార్  1951 నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 36(2) ప్రకారం పరిమళ్ నత్వానీ దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరించడానికి ఎలాంటి సరైన ఆధారాలు లేవని స్పష్టం చేస్తూ పరిమళ్ నత్వానీ నామినేషన్ కు ఆమోదముద్ర వేశారు.  దీనిపై కాంగ్రెస్  తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వ్యవహారాన్ని ఇక్కడితో వదిలిపెట్టే ప్రసక్తే లేదనీ, రిటర్నింగ్ అధికారి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ త్వరలోనే ఈసీఐని  ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని ప్రకటించింది.  

జార్ఖండ్‌లోని మొత్తం 2 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 18న   ఎన్నికలు జరగనున్నాయి. ఈ బరిలో జేఎంఎం తరపున వైద్యనాథ్ రామ్, కాంగ్రెస్ తరపున ప్రణవ్ ఝా బరిలో ఉన్నారు.  నామినేషన్ల ఉపసంహరణకు గురువారం (జూన్ 11)  తుది గడువు.  ప్రస్తుత జార్ఖండ్ అసెంబ్లీలోని సంఖ్యాబలం ప్రకారం  ఇండియా' కూటమికి ఒక రాజ్యసభ సీటు సులభంగా దక్కనుంది. కానీ, రెండో స్థానం కోసం పరిమళ్ నత్వానీ స్వతంత్రుడిగా బరిలో నిలవడంతో పోరు  ఆసక్తికరంగా మారింది.  

By
en-us Political News

  
వేదాంత 5 విడి విడి కంపెనీలుగా మారిన తర్వాత షేర్ హోల్డర్లకు వచ్చే డివిడెండ్ల పరిస్థితి ఏంటి? అల్యూమినియం, జింక్ వ్యాపారాల విభజనతో ఇన్వెస్టర్లకు లాభమా నష్టమా? మార్కెట్ నిపుణుల విశ్లేషణ పూర్తి వివరంగా ఇక్కడ చూడండి.
రాజ్యసభ అభ్యర్థిగా తాను దాఖలు చేసిన నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ.. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌ ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది.
రూపాయి విలువ పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్‌బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్‌ఆర్‌ఐ ఎఫ్‌సీఎన్‌ఆర్ (FCNR-B) డిపాజిట్లపై హెడ్జింగ్ ఖర్చులను ఆర్‌బీఐ భరించనుండటంతో, బ్యాంకులు ఇప్పుడు 6% పైగా భారీ వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఈ సరికొత్త ఆర్థిక వ్యూహం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
దేశంలో రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ డిమాండ్ నేపథ్యంలో ఎన్‌టీపీసీ, అదానీ పవర్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ వంటి ప్రముఖ పవర్ స్టాక్స్‌పై అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ మెక్వారీ సంచలన నివేదికను విడుదల చేసింది. రేటింగ్స్, టార్గెట్ ధరల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
గత ఏడాది కాలంలో 280% పైగా పెరిగిన ఎంటీఏఆర్ టెక్నాలజీస్ (MTAR Tech) షేర్లు హఠాత్తుగా 9% కుప్పకూలాయి. అమెరికా క్లయింట్ బ్లూమ్ ఎనర్జీ మరియు OpenAI డేటా సెంటర్ ప్రాజెక్ట్ నిలిచిపోవడమే దీనికి కారణమా? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత అండర్-19 మహిళల జట్లను బీసీసీఐ ప్రకటించింది. డబ్ల్యూపీఎల్ స్టార్, 16 ఏళ్ల దీయా యాదవ్‌కు వన్డే జట్టులో చోటు దక్కగా, వరల్డ్ కప్ విన్నర్ భవిక అహిరేకు కెప్టెన్సీ పగ్గాలు లభించాయి. పూర్తి స్క్వాడ్, మ్యాచ్ షెడ్యూల్ ఇక్కడ చూడండి.
కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న అమరావతిని కవిత వరద ప్రాంతమంటూ ఎద్దేవా చేయడాన్ని తప్పుపడుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈడీ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాలలో మొత్తం 10 ప్రాంతాల్లో ఈడీ బృందాలు గురువారం ఉదయం నుంచే విస్తృతంగా సోదాలు చేపట్టాయి. రాజ్‌ కేసిరెడ్డికి చెందిన నివాసాలు, కార్యాలయాలే లక్ష్యంగా జరిగిన ఈ సోదాలలో కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఫిఫా వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌లను భారతదేశంలో సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఉచితంగా ఎలా చూడాలో తెలుసుకోండి. డీడీ స్పోర్ట్స్ ఉచిత లైవ్ స్ట్రీమింగ్ షెడ్యూల్ మరియు పూర్తి వివరాలు మీకోసం.
జూన్ 11న దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. హైదరాబాద్‌లో 100 గ్రాముల బంగారంపై ఏకంగా రూ. 75,200 తగ్గింది. అమెరికా డాలర్ బలోపేతం, గ్లోబల్ మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో తాజా 22k, 24k లైవ్ గోల్డ్ రేట్లు ఇక్కడ తెలుసుకోండి.
అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 150 డాలర్లకు చేరే అవకాశం ఉందని రిస్టాడ్ ఎనర్జీ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
శాఖ స్టీల్ ప్లాంట్ లోని ఎస్‌ఎమ్‌ఎస్-1 విభాగంలోని ఆర్గాన్ రిన్సింగ్ స్టేషన్ వద్ద లాడిల్ నుండి ద్రవ ఉక్కు ఒక్కసారిగా లీకైంది. అయితే.. ఈ లీకేజీ జరిగిన సమయంలో అక్కడ కార్మికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.
నేటి డిజిటల్ కాలంలో యూపీఐ స్కామ్‌లు విపరీతంగా పెరుగుతున్నాయి. క్యూఆర్ కోడ్ మరియు స్క్రీన్ షేరింగ్ మోసాల నుండి మీ బ్యాంక్ అకౌంట్‌ను ఎలా కాపాడుకోవాలో, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 వివరాలను ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.