వెంకటరెడ్డికి కాంగ్రెస్ పొగ

Publish Date:Aug 13, 2022

Advertisement

మునుగోడు ఉప ఎన్నిక సాక్షిగా కాంగ్రెస్ పార్టీ కొమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ పొగపెట్టేసిందా? పార్టీ నుంచి బహిష్కరించకుండానే ఆయనను ఏకాకిని చేసేసిందా? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడే కాదు.. స్టార్ క్యాంపెయినర్ కూడా. అయినా మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఆయనకు ఎలాంటి బాధ్యతా అప్పగించలేదు. రాజగోపాలరెడ్డి రాజీనామా చేసిన సమయంలో మునుగోడులో కాంగ్రెస్ ప్రచార సారథ్యం వెంకటరెడ్డిదే అని ఒక ఊరడింపు మాట తప్ప... ఆ తరువాత జరిగిన ఏ విషయంలోనూ, ఏ వ్యవహారంలోనూ వెంకటరెడ్డికి ఎలాంటి బాధ్యతా అప్పగించలేదు. కనీసం సమావేశాలకు కూడా పిలవడం లేదు. మునుగోడు ప్రచార కర్తల జాబితాలో ఆయన పేరు కూడా లేదు. ఎన్నికల సమావేశాలకు పిలవడం అటుంచి కనీసం ప్రచారానికి రమ్మని కూడా అనడం లేదు. ర్యాలీలు, పాదయాత్రలలోనూ ఆయనను దూరంగానే పెడుతున్నారు.

ఒక విధంగా చెప్పాలంటే  కాంగ్రెస్ లో ఉండి కూడా  లేనట్టుగానే ఆయన పరిస్థితి ఉంది. కనీస అవగాహన ఉన్న ఎవరికైనా కాంగ్రెస్ ఆయనకు పొమ్మన లేక పొగపెడుతోందని ఇట్టే అర్ధమైపోతుంది. అలాంటిది కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పార్టీలో తన పరిస్థితి ఏమిటో ఇంకా అర్ధం కాలేదని భావించలేం. కానీ ఆయన ఇంకా పార్టీలోనే ఉన్నారు. ఉండి ఊరుకోవడం లేదు. టీపీసీసీ చీఫ్ పై విమర్శల బాణాలు సంధిస్తున్నారు. వాటిని పార్టీ పట్టించుకోవడం లేదని తెలిసినా ఆయన తన ప్రయత్నం తాను మానడం లేదు. సోదరుడి గొంతుకకు వంత పాడుతున్నట్లు ఆయన తీరు ఉందని పార్టీలోనే చర్చ జరుగుతోంది.

అందుకే ఆయన పార్టీలో ఉన్నా బీజేపీ గూటికి చేరిన ఆయన సోదరుడిలాగే కాంగ్రెస్ చూస్తోంది. దీంతో అనివార్యంగా ఎవరూ పిలవకపోయినా, ఎవరూ ఆహ్వానించకపోయినా... ఆ విషయాన్ని దాచి పెట్టి మునుగోడు ఉప ఎన్నికతో తనకు సంబంధం లేదనీ, తానక్కడకు ప్రచరానికి వెళ్లబోవడం లేదనీ గంభీరంగా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తనపై అనుచిత విమర్శలు చేయిస్తున్నారని ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. తనను విమర్శించిన వారినీ, విమర్శించేలా చేసిన వారిని వదిలిపెట్టనని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.

వాళ్ల విషయం రాష్ట్ర కాంగ్రెస్ తో కాదనీ, ఏకంగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీతోనే తేల్చుకుంటాననీ చెబుతున్నారు. అయితే ఆయన మాటలను కాంగ్రెస్ వర్గీయులే ఎద్దేవా చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన పార్టీలో ఉండీ లేనట్టేనని, ఆయన తీరు పట్ల హైకమాండ్ కూడా విసిగిపోయిందనీ చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనకు సోనియాగాంధీ అప్పాయింట్ మెంట్ కాదుకదా, కనీసం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి అప్పాయింట్ మెంట్ దొరకడం కూడా కష్టమేనంటున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పార్టీ ఎప్పుడో పరిగణనలోనికి తీసుకోవడం మానేసిందని అంటున్నారు. పార్టీ నుంచి కోమటిరెడ్డిని ప్రత్యేకంగా బహిష్కరించడం అంటూ ఉండదనీ, కానీ ఆయనకు కనీస గుర్తింపు కూడా లేని చోట ఉండలేని పరిస్థితి కల్పించడమే పార్టీ వ్యూహంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అన్నీ తెలిసినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీని అడ్డు పెట్టుకుని ఉండటానికి కారణం.. పార్టీలో ఉంటూనే తన సోదరుడికి సాధ్యమైనంత మేలు చేసి ఆ తరువాత కమలం గూటికి చేరాలన్న వ్యూహమేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.  

By
en-us Political News

  
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.