తెలుగు ప్రజలతో చెలగాట మాడుతున్న కాంగ్రెస్, బీజేపీలు

Publish Date:Feb 20, 2014

Advertisement

 

ఎన్నికల తరువాత కేంద్రంలో అధికారం దక్కించుకోవడమే పరమావధిగా కాంగ్రెస్, బీజేపీలు సున్నితమయిన రాష్ట్ర విభజన వ్యవహారంపై వికృత రాజకీయ క్రీడ ఆడుతున్నాయి. ఆ రెండు పార్టీలు ఈ మొత్తం వ్యవహారంలో తమకే పూర్తి రాజకీయ లబ్ది కలగాలనే కోణంలోనే ఆలోచిస్తూ ఎత్తులు పైఎత్తులు వేస్తూ రాష్ట్ర విభజనకు సహకరించుకొంటూనే, ఒకదానిపై మరొకటి కత్తులు దూసుకొంటున్నాయి. ఒకవైపు రాష్ట్ర విభజన చేసి తెలంగాణాలో తమ పార్టీలకి ప్రయోజనం కలిగేలా జాగ్రత్తపడుతూనే, మరో వైపు తామే సీమాంధ్ర ప్రజల మేలు కోసం (ఎక్కువ) పరితపించిపోతున్నట్లు ఆయా పార్టీల నేతలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు.

 

కాంగ్రెస్ అధిష్టానానికి చెక్కభజన చేస్తున్న కేంద్రమంత్రులు జేడీ.శీలం వంటివారు తాము గట్టిగా పట్టుబట్టడం వలననే సీమాంధ్రకు స్వతంత్ర ప్రతిపత్తి, ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చేందుకు సోనియా, రాహుల్ గాంధీలు చాల దయతో అంగీకరించారని, అందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నామని చెప్పడం చూస్తుంటే, వారిరువురు రాష్ట్రవిభజన చేస్తున్నపటికీ, వారు దయతో ప్యాకేజీలు విదిలించినందుకు సీమాంధ్ర ప్రజలు కూడా ఎంతయినా ఋణపడి ఉండాలన్నట్లు సూచిస్తున్నట్లుంది. అంతేకాక కేవలం తాము, తమ అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ మాత్రమే సీమాంధ్రకోసం పరితపించిపోతున్నట్లుగా మాట్లాడుతూ, తమ కాంగ్రెస్ పార్టీయే రాష్ట్ర విభజన చేసిన విషయాన్ని మరుగునపరిచే ప్రయత్నం కూడా చేస్తున్నారు. పనిలోపనిగా తాము కోరిన ప్యాకేజీలనే బీజేపీ కాపీ కొట్టి, అది తమ ప్రతాపమే అన్నట్లు మాట్లాడుతోందని ఎద్దేవా చేసారు.

 

ఇక బీజేపీ నేతలు కూడా వారికి తీసిపోనట్లు తాము కాంగ్రెస్ అధిష్టానం మెడలువంచి సీమాంధ్రకు స్వతంత్ర ప్రతిపత్తి, ప్రత్యేక ప్యాకేజీలు ఇప్పించేందుకు ఒప్పించామని, అందువల్ల ఈ ‘టోటల్ ఖ్యాతి’ మొత్తం తమకే పూర్తిగా చెందాలని బిగ్గరగా వాదిస్తోంది.

 

ఈవిధంగా కాంగ్రెస్, బీజేపీలు రెండూ రాష్ట్ర విభజన చేసేందుకు ఒకదానికొకటి పరస్పరం సహకరించుకొంటూ అటు తెలంగాణాలో తమ తమ పార్టీ ప్రయోజనాలు కాపాడుకొనే ప్రయత్నం చేస్తూనే, మరోవైపు రెండూ కూడా సీమాంధ్రపై కపట ప్రేమ ఒలకబోస్తున్నాయి. అయితే రెండు ప్రాంతాలలో ప్రజలను ఆకట్టుకోవాలనే ప్రయత్నంలో అవి ఆడుతున్నఈ నాటకాలను చూసి రెండు ప్రాంతాలలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా వాటిని అసహ్యించుకొంటున్నారనే సంగతి అవి గ్రహించలేకపోవడం విచిత్రం. సున్నితమయిన ఈ అంశంతో కోట్లాది తెలుగు ప్రజల భావోద్వేగాలు ముడిపడిన సంగతిని ఏ మాత్రం పట్టించుకోకుండా రెండు పార్టీలు ఆడుతున్న నాటకాలతో అవి ఆశిస్తున్నట్లు ఏమాత్రం రాజకీయలబ్ది కలుగకపోగా సరిగ్గా అదే అంశంతో ఘోరంగా దెబ్బ తినే ప్రమాదం ఉందని గ్రహించలేకపోవడం మరీ విచిత్రం.

By
en-us Political News

  
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.