కాంగ్రెస్, బీజేపీ చేతిలో రాష్ట్ర భవిష్యత్

Publish Date:Feb 16, 2014

Advertisement

 

ఈరోజు ఆర్ధిక మంత్రి చిదంబరం లోక్ సభలో తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కేంద్రమంత్రి కావూరి నిన్న మీడియాతో మాట్లాడుతూ, ఈరోజు సీమాంధ్ర కాంగ్రెస్ కేంద్రమంత్రులందరూ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేస్తామని స్పష్టం చేసారు. రాష్ట్ర విభజన బిల్లుని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదింపజేయాలనే కృత నిశ్చయంతో ఉన్నందునో లేక ఆవిధంగా నటిస్తునందునో కాంగ్రెస్ అధిష్టానం వారినందరినీ కూడా సభ నుండి సస్పెండ్ చేసేందుకు కూడా వెనుకాడకపోవచ్చును. రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్ర ప్రజలలో తీవ్ర వ్యతిరేఖత మూటగట్టుకొన్న కాంగ్రెస్ పార్టీ, కధ ఇంతవరకు వచ్చిన తరువాత మిగిలిన సీమాంధ్ర మంత్రులను సస్పెండ్ చేసినంత మాత్రాన్న కొత్తగా వచ్చే నష్టం ఏమీ ఉండబోదు. పైగా ఆవిధంగా చేయడం వలన ఒకవేళ ఏ కారణం చేతనయినా సభలో బిల్లు ఆమోదం పొందలేకపోయినా, దానిని ఆమోదింపజేసేందుకు తన యంపీలను, చివరికి కేంద్రమంత్రులను కూడా సభ నుండి సస్పెండ్ చేసేందుకు కూడా వెనకాడలేదని, కానీ చిత్తశుద్దిలేని బీజేపీ వలననే బిల్లు ఆమోదం పొందలేకపోయిందని తెలంగాణా ప్రజలకు దైర్యంగా చెప్పుకోవచ్చును. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చేస్తూ సభలో రాష్ట్రానికి చెందిన సభ్యులెవరూ లేకుండా చేసి, బిల్లుని ఆమోదించే ఆలోచనని బీజేపీతో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా తప్పు పడుతున్నపటికీ, కాంగ్రెస్ ఈ విషయంలో మొండిగా ముందుకే వెళ్ళే ప్రయత్నం చేస్తుంది.

 

సీమాంధ్రలో తన పార్టీని పణంగా పెట్టయినా సరే తెలంగాణాలో రాజకీయ లబ్ది పొందాలని నిశ్చయించుకొన్న తరువాతనే కాంగ్రెస్ రాష్ట్ర విభజనకు పూనుకొంది. అందువల్ల తెరాసను విలీనం లేదా కనీసం ఎన్నికల పొత్తులకయినా ఒప్పించాలంటే తప్పనిసరిగా ఏదో విధంగా బిల్లుని ఆమోదింపజేయవలసి ఉంటుంది. అలా కుదరకపోతే అందుకోసం తను శక్తి వంచనా లేకుండా కృషి చేశానని కేసీఆర్ ను నమ్మించవలసి ఉంటుంది. అప్పుడే ఆయన కాంగ్రెస్ పార్టీని కనికరిస్తారు. ఒకవేళ ఎన్నికల తరువాత కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ కూటమి కేంద్రంలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తగినన్ని లోక్ సభ స్థానాలు సాధించినట్లయితే, తెరాస మద్దతు ఇస్తుంది. అప్పుడే రాహుల్ గాంధీని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టడం వీలవుతుంది.

 

కాంగ్రెస్ తన ఈ ఆశయాన్ని, లక్ష్యాన్ని ఇన్ని నెలలలో ఎంత తీవ్రంగా ఒత్తిళ్ళు వచ్చినా ఎన్నడూ మరువలేదు, వెనక్కి తగ్గలేదు గనుక ఇప్పుడు కూడా అదే లక్ష్యంగా ముందుకు సాగవచ్చును. ఇక రాష్ట్ర విభజన బిల్లు ఆమోదానికి సభలో సాధారణ మెజార్టీ సరిపోతుందని న్యాయశాఖ తేల్చి చెప్పింది గనుక, మిగిలిన సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులను కూడా సస్పెండ్ చేసి బిల్లుని మూజువాణి ఓటుతో ఆమోదింపజేసే ప్రయత్నం చేయవచ్చును.

 

ఇక ఈ వ్యవహారంలో బీజేపీ తన చేతికి మట్టి అంటకుండా బయటపడాలని భావిస్తే, కర్ర విరగ కుండా పాము చావకుండా అన్నట్లుగా వ్యవహరిస్తూ ఏదో ఒక కుంటి సాకుతో సభ నుండి వాకవుట్ చేసి బిల్లుకి పరోక్షంగా సహకరించవచ్చును. కానీ, చంద్రబాబు ప్రభావంతో తెదేపాతో పొత్తులకే మొగ్గు చూపినట్లయితే బిల్లుపై చర్చకు పట్టుబట్టి కాలయాపన చేసి బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకొనే ప్రయత్నం చేయవచ్చును. ఏమయినప్పటికే, రేపు లేదా ఎల్లుండి లోగా రాష్ట్ర భవిష్యత్ ను, రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే కీలక నిర్ణయం జరుగబోతోందని ఖచ్చితం చెప్పవచ్చును.

By
en-us Political News

  
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.