కాంగ్రెస్-తెరాసల యుద్ధం కూడా వ్యూహంలో భాగమేనా?

Publish Date:Feb 27, 2014

Advertisement

 

కేసీఆర్ మొన్నసోనియమ్మ కాళ్ళకు మొక్కినంత పనిచేసి, తన కుటుంబ సభ్యులను వెంటేసుకొని ఆమెతో గ్రూప్ ఫోటోలు కూడా దిగి తామంత ఒకే కుటుంబసభ్యులమనట్లు వ్యవహరించారు. కానీ, ఆ మరునాడు నుండే ఆ రెండు పార్టీలు చాలా నాటకీయంగా దూరం కావడం ఆరంభించాయి. కేసీఆర్ డిల్లీ నుండి హైదరాబాద్ తిరిగి వచ్చినపుడు ఆయనకు కనీవినీ ఎరుగని రీతిలో తెరాస ఘనస్వాగతం పలికింది. ఆ ఆర్భాటం చూస్తే కేవలం ఆయన ఒక్కడి వలనే తెలంగాణా ఏర్పడిందనే భావన కలిగించే విధంగా తెరాస దానిని నిర్వహించింది. ‘తెలంగాణా ఇచ్చింది, తెచ్చింది మేమే’ అని గర్వంగా చెప్పుకొన్న టీ-కాంగ్రెస్ నేతలు డిల్లీ నుండి తిరిగి వచ్చినప్పుడు వారివారి అనుచరులు తప్ప మరెవరూ వచ్చి స్వాగతం పలికిన దాఖలాలు లేవు. అంటే రాష్ట్ర విభజన వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానం వ్యూహంలో భాగంగా తెలంగాణా క్రెడిట్ అంతా తెరాస ఖాతాలో జమా అయినట్లే భావించవచ్చును.

 

ఇక నేడో రేపో తెరాస కాంగ్రెస్ పార్టీలో విలీనంఅయిపోతుందని అందరూ భావిస్తున్న తరుణంలో రాష్ట్ర విభజనలో కీలక పాత్ర పోషించిన జైరాం రమేష్ కూడా పనిగట్టుకొని కేసీఆర్ వెనుకే హైదరాబాద్ వచ్చి తరువాత అధ్యాయానికి తెర లేపారు. “తెరాస వంటి ప్రాంతీయ పార్టీలకు అధికారం కట్టబెడితే ఇక తెలంగాణాలో దొరల రాజ్యం ఏర్పడి పరిస్థితులు దారుణంగా మారుతాయని, కాంగ్రెస్ పార్టీ మాత్రమే సమర్ధమయిన పాలన అందించగలదని, జాతీయ దృక్పదం లేని తెరాస వంటి ప్రాంతీయ పార్టీలు సమర్ధంగా పాలన చేయలేక చివరికి డిల్లీలో ఆమాద్మీ ప్రభుత్వం లాగే మూన్నాళ్ళ ముచ్చటగా మారి చేతులేత్తేయవచ్చని” తెరాసపై యుద్ధం ప్రకటించారు.

 

ఆ రెండు పార్టీ అగ్రనేతలు (కుటుంబాలతో సహా) గ్రూప్ ఫోటోలు దిగేంత సహృద్భావ వాతావరణం ఏర్పడి ఉన్నపుడు, కాంగ్రెస్ కే చెందిన మరోనేత దిగ్విజయ్ సింగ్ తెరాస విలీనం ఇక లాంఛనమే అని చెపుతున్న తరుణంలో, రాష్ట్ర విభజన ప్రక్రియ జరుగుతున్న సమయంలో తెలుగు ప్రజలు ఎంత మొత్తుకొన్నా రాష్ట్రానికి రాని జైరాం రమేష్ అకస్మాత్తుగా పనిగట్టుకొని హైదరాబాద్ లో వాలి, రెండు పార్టీల మధ్య సంబంధాలు పెటాకులు అయ్యేలా తెరాసను కవ్వించడం చాలా నాటకీయంగా కనిపిస్తోంది. తమతో విలీనం లేదా పొత్తులు పెట్టుకోబోతున్న పార్టీని ఎవరయినా మంచి చేసుకొనే ప్రయత్నం చేస్తారు తప్ప ఈవిధంగా పనిగట్టుకొని విమర్శలు చేసి రెచ్చగొట్టరని రాజకీయ అజ్ఞానులకయినా తెలుసు.

 

అదేవిధంగా తాము ఒక జాతీయ పార్టీతో విలీనం లేదా పొత్తులకు సిద్దం అవుతున్నపుడు తెరాస వంటి ప్రాంతీయ పార్టీ కూడా సౌమ్యంగా వ్యవహరిస్తుందని ఎవరయినా భావిస్తారు. కానీ, తెరాస నేత హరీష్ రావు మాట్లాడుతూ “తమ పార్టీని వీడిన అరవింద్ రెడ్డి, విజయశాంతిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం చూస్తే కాంగ్రెస్ నోటితో పిలిచి నొసటితో వెక్కిరిస్తున్నట్లుందని, జైరాం రమేష్ తమ పార్టీపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆయన తమ పార్టీని ఆమాద్మీ పార్టీతో పోల్చడం తెలంగాణా ప్రజలని అవమానించినట్లేనని చాలా ఘాటుగా జవాబిచ్చారు. తమను కలుపుకోవాలనుకొంటున్న కాంగ్రెస్ ఈవిధంగా మాట్లాడటం, వ్యవహరించడం చూస్తే కాంగ్రెస్ పార్టీ అంటేనే అసహ్యం కలుగుతోందని ఆయన తీవ్రంగా విమర్శించారు.

 

ఈవిధంగా కేవలం ఒకటి రెండు రోజులలోనే కాంగ్రెస్-తెరాస నేతలు పరిస్థితిని నాటకీయంగా మార్చివేసి, స్నేహ సుమాలు విరుస్తాయనుకొన్న చోట యుద్దవాతవరణం సృష్టించి మాటలు తూటాలు పేల్చుకోవడం చూస్తే ఆ రెండు పార్టీలు ఉద్దేశ్యపూర్వకంగానే గొడవపడుతున్నట్లు అర్ధమవుతోంది. నిజానికి కాంగ్రెస్ పార్టీతో తెరాస విలీనం లేదా పొత్తులు పెట్టుకోదలుచుకోకపోతే, అదే మాటను చాలా సౌమ్యంగా చెప్పిఉండవచ్చును. కానీ అలా చేస్తే, కేసీఆర్, తెరాసలకు రావలసిన క్రెడిట్ రాదు. అందువల్ల తెలంగాణా ప్రజల ఓట్లు వివిధ పార్టీల మధ్య చీలిపోయే ప్రమాదం ఉంది. అందువలన ఎన్నికలు పూర్తయ్యేవరకు కూడా ప్రజల దృష్టి బీజేపీ వైపు మరలకుండా తమ మీదనే నిలుపుకోనేందుకు కాంగ్రెస్-తెరాసలు ఇకపై బద్ధ శత్రువులులా నటిస్తూ ఒకరిపై మరొకరు కత్తులు దూసుకొంటూ ఉంటుంది.

 

ఇదంతా చూస్తుంటే, మనకు అప్రయత్నంగా కిరణ్ కుమార్ రెడ్డి కూడా గుర్తుకు రాకమానరు. కాంగ్రెస్ అధిష్టానం ఆయనతో కూడా అచ్చు ఇదేవిధంగా నాటకమాడిస్తున్నట్లు అర్ధమవుతుంది. ఈవిధంగా రెండు ప్రాంతాలలో తనకు అనుకూలమయిన పార్టీలు తప్ప మిగిలినవి బ్రతికి బట్టకట్టలేని పరిస్థితి కల్పించి, ఎన్నికల తరువాత తెరాస, వైకాపా, కిరణ్ కాంగ్రెస్ పార్టీల మద్దతు పొండమే కాంగ్రెస్ వ్యూహం, అంతిమ లక్ష్యమని స్పష్టమవుతోంది. అయితే అది ప్రదర్శిస్తున్న ఈ అతి తెలివితేటలే కాంగ్రెస్ పార్టీ కొంపముంచి చివరికి రాహుల్ గాంధీ భవిష్యత్తుని కూడా నాశనం చేయడం తధ్యం.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.