రాష్ట్రంలో ఇకపై ప్రాంతీయ పార్టీలదే రాజ్యం కానుందా?

Publish Date:Feb 23, 2014

Advertisement

 

మొన్న కాంగ్రెస్ నేత జేసీ దివాకర్ రెడ్డి సోనియా గాంధీని విమర్శిస్తూ ఇకపై మన రాష్ట్రంలో కూడా తమిళనాడు లాగే ప్రాంతీయ పార్టీలే రాజ్యం చేస్తాయని జోస్యం చెప్పారు. ఆయన చెప్పిన జోస్యం నూటికి నూరుపాళ్ళు నిజమయ్యే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలయినప్పటికీ కాంగ్రెస్, బీజేపీలు రెండూ చేతులు కలిపి రాష్ట్ర విభజన చేయడంతో సీమాంధ్ర ప్రజలకి వాటిపై నమ్మకం పోయింది. కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర విభజనకు పూనుకొందని, ప్రజాభిప్రాయానికి, ఏమాత్రం విలువీయకుండా అత్యంత నిరంకుశంగా అన్ని ప్రజాస్వామిక విధానాలను తుంగలో త్రొక్కి మరీ రాష్ట్రాన్ని విభజిస్తోందని విరుచుకు పడిన బీజేపీ మళ్ళీ అదే పార్టీ ప్రతిపాదించిన రాష్ట్ర విభజన బిల్లుకి మద్దతు పలకడంతో రెండు పార్టీలపై సీమాంధ్ర ప్రజలకు నమ్మకం పోయింది. అందువలన డిల్లీలో కూర్చొని రాజకీయాలు చేసే ఇటువంటి జాతీయపార్టీలకి ఓటు వేసి నెత్తిన పెట్టుకోవడం కంటే, తమ అవసరాలకు అనుగుణంగా స్పందించే ప్రాంతీయ పార్టీలే మేలనే భావన ఆంధ్ర ప్రజలకు కలగడం సహజమే. అందువల్ల రానున్నఎన్నికలలో సీమాంధ్ర ప్రజలు ప్రాంతీయ పార్టీలయినా తెదేపా, వైకాపాలవైపే మొగ్గు చూపుతారు తప్ప తమను మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీలను మళ్ళీ నెత్తిన పెట్టుకోవాలని భావించరని ఖచ్చితంగా చెప్పవచ్చును. బహుశః అదే అభిప్రాయం జేసీ మాటలలో వ్యక్తం అయిందని భావించవచ్చును.

 

ఇక కాంగ్రెస్ పార్టీయే తెలంగాణా ఏర్పాటు చేసినప్పటికీ తెరాస విలీనం లేదా పొత్తులకు అంగీకరించకపోయినట్లయితే, అక్కడా తనంతట తాను గెలిచే అవకాశం లేకపోవడంతో, 125 సం.ల తన ఘనచరిత్రను కూడా పక్కనబెట్టి “విలీనం కాకపోతే పోయే, కనీసం పొత్తులకయినా అంగీకరించు మహాప్రభో!” అని కేసీఆర్ కాళ్ళ మీద పడుతున్న కాంగ్రెస్ పార్టీని చూస్తుంటే జాలి కలుగుతుంది.

 

కాంగ్రెస్ పేరుకి జాతీయపార్టీ అయినా జరిగిన ప్రతీ ఎన్నికలలో ప్రాంతీయ పార్టీల చేతిలో పరాజయం చవి చూస్తూ కేవలం ఒక ఐదారు రాష్ట్రాలకే పరిమితమయిన ఒక పెద్ద ప్రాంతీయ పార్టీగా మారిపోయింది. అందుకే అది గత పదేళ్లుగా యూపీఏ కూటమిని ఏర్పాటు చేసుకొని తనవంటి అనేక చిన్నా చితకా ప్రాంతీయ పార్టీలను కూడగట్టుకొని రాజ్యం ఏలుతోంది. కాంగ్రెస్ పార్టీ గత పదేళ్లుగా ప్రాంతీయ పార్టీలపైనే ఆధారపడి ప్రభుత్వం నెట్టుకొస్తున్నప్పటికీ, నేటికీ జాతీయ పార్టీననే అతిశయం ఒలకబోస్తోంది. ఆ అతిశయం మరీ ఎక్కువవడం వలననే ప్రజాభిప్రాయాన్ని కాలరాసి ఇంత నిరంకుశంగా రాష్ట్ర విభజన చేసింది. నానాటికి కుచించుకుపోతున్న తన పార్టీ పరిస్థితిని గ్రహించి కాంగ్రెస్ అధిష్టానం మేల్కొనకపోగా, తెలివి తక్కువగానో లేక అతితెలివికిపోయో దక్షిణాదిన కంచుకోట వంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేజేతులా బ్రద్దలు కొట్టుకొంది. ఇంతవరకు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రాంతీయ పార్టీలపై ఆధారపడుతున్నకాంగ్రెస్ పార్టీ, ఇకపై ఆంధ్ర, తెలంగాణలలో కూడా  స్వంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని దుస్థితికి దిగజారడమే కాకుండా ప్రాంతీయ పార్టీలకు తోకపార్టీగా మారబోతోంది.

 

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.