తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్

Publish Date:Dec 8, 2013

Advertisement

 

ఈరోజు వెలువడుతున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి చెంప పెట్టువంటివని చెప్పక తప్పదు. గత పదేళ్ళకాలంలో వరుస పెట్టి వెలుగు చూస్తున్నకుంభకోణాలతో తన ప్రతిష్ట మసకబారుతున్న సంగతి గ్రహించి వెంటనే దిద్దుబాటు చర్యలకు పూనుకొనే బదులు, వాటిని కప్పి పుచ్చుకొంటూ ప్రతిపక్షాలపై ఎదురు దాడిచేయడంతో కాంగ్రెస్ పట్ల ప్రజలలో క్రమంగా చులకన భావం పెరుగుతూ వచ్చింది. అదికాక పెరిగిన ధరలు. అత్యాచారాలు, అరాచక వ్యవస్థ, ఉగ్రవాద దాడులు తదితర అనేక అంశాలు కాంగ్రెస్ ఓటమికి కారణమయ్యాయి.

 

సరిగ్గా అదును చూసి బీజేపీ తన ప్రధాని అభ్యర్ధిగా నరేంద్ర మోడీని ప్రకటించి, ఆయనకి పార్టీ సారధ్య బాధ్యతలు అప్పగించడంతో కాంగ్రెస్ ఓటమి పూర్తిగా ఖయమయిపోయింది. ఒకవేళ బీజేపీ మోడీకి బాధ్యతలు అప్పగించడానికి ఇంకా సంకోచిస్తూ ఉండి ఉంటే, బహుశః కాంగ్రెస్ విజయావకాశాలు గణనీయంగా పెరిగి ఉండేవి. బీజేపీ ఇదే ఊపును, ఐఖ్యతను వచ్చే సాధారణ ఎన్నికల వరకు కొనసాగించగలిగితే, అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి పరాజయం తప్పక పోవచ్చును.

 

ఈసారి ఎన్నికలలో రాష్ట్రాల వారిగా గెలుపోటములకు గల కారణాలు పరిశీలిస్తే, యావత్ దేశాన్ని కుదిపేసిన రెండు ముఖ్యమయిన సంఘటనలు డిల్లీలో కాంగ్రెస్ పరాజయానికి కారణమయ్యాయని చెప్పవచ్చును. మొదటిది డిల్లీలో అన్నాహజారే నేతృత్వంలో జనలోక్ పాల్ బిల్లుకోసం జరిగిన ఉద్యమం, రెండవది నిర్భయ ఉదంతం. నేటికీ జన లోక్ పాల్ బిల్లు పార్లమెంటు ఆమోదానికి నోచుకోలేదు. నిర్భయ కేసులో నిందితులకు కటిన శిక్షలు పడలేదు. ఈ రెండూ కూడా డిల్లీ ప్రజలకు కాంగ్రెస్ పట్ల విముఖతను పెంచాయి. అంతే గాక పెరిగిన ఉల్లి ధరలు డిల్లీ ప్రజలను కంట తడిపెట్టిస్తే ప్రభుత్వం ఎటువంటి దిద్దుబాటు చర్యలకు పూనుకోలేదు. అందుకే ఇప్పడు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బోరుమని విలపించేలా బుద్ధి చెప్పారు.

 

రాజస్తాన్ లో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం గత ఐదేళ్ళలో ప్రజలను ఆకట్టుకోలేక పోయింది. రిజర్వేషన్ల కోసం గుజ్జర్ల చేసిన పోరాటాల పట్ల కాంగ్రెస్ ప్రదర్శించిన నిర్లక్ష్య ధోరణి, అధిక ధరలు, కుల సమీకరణాలు కాంగ్రెస్ ఓటమికి కారణమయ్యాయి. అదికాక ప్రజలలో అధికారపార్టీ పట్ల సహజంగా ఏర్పడే వ్యతిరేఖత కూడా ఓటమికి కారణమని చెప్పవచ్చును.

 

బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి ప్రజలలో మంచి పేరే ఉంది. ఆయన బడుగు బలహీన వర్గాలకోసం చెప్పటిన అనేక పధకాలు, వ్యవసాయ అభివృద్ధి పట్ల కనబరచిన ప్రత్యేక శ్రద్ధ ఆయన విజయానికి దోహదపడ్డాయి. అయితే మౌలిక సదుపాయాల కల్పనలో ఆయన పూర్తి శ్రద్ధ కనబరచకపోవడం వలన రాష్ట్రంలో పెద్దగా అభివృద్ధి జరిగినట్లు కనబడదు.అయినప్పటికీ ప్రభుత్వం చెప్పటిన సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరుతుండటం వలన ప్రజలు మళ్ళీ బీజేపీకే పట్టం కట్టారు.

 

ఛత్తీస్ ఘర్ రాష్ట్రం కూడా బీజీపీ పరిపాలనలోనే ఉంది. కానీ అక్కడ నక్సల్స్ ప్రభావం చాలా విపరీతంగా ఉండటంతో తరచూ వారి దాడులలో అనేక మంది ప్రజలు, పోలీసులు, చివరికి రాజకీయ నాయకులు కూడా మరణించారు. నక్సల్స్ ని సమర్ధంగా అణచివేయలేక పోవడం వలన వారి ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాలలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. నక్సల్స్ అణచివేతలో ప్రభుత్వ వైఫల్యం, ఆశించినంతగా అభివృద్ధి జరగకపోవడం వలన అక్కడ బీజేపీకి కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇవ్వగలుగుతోంది. కానీ తాజాగా విడుదలయిన ఫలితాలలో మళ్ళీ బీజేపీ బలం పుంజు కొని 37 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ (34)ని వెనక్కి నెట్టి ఆదిక్యతలోకి వచ్చింది.

 

రేపు వెలువడనున్న మిజోరం ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటాయని సర్వే ఫలితాలు తెలుపుతున్నాయి.

 

దేశంలో కీలకమయిన నాలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ ఘోర పరాజయం పొందడంతో ప్రాంతీయ పార్టీ స్థితికి చేరుకొన్న కాంగ్రెస్ పార్టీకి పతనం ఆరంభమయిందని భావించవచ్చును. వచ్చేసాధారణ ఎన్నికల తరువాత కేంద్రంలో ఎలాగయినా అధికారం సంపాదించాలనే దురాశతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనకు పూనుకొని దక్షిణాదిన తనకు కంచుకోట వంటి రాష్ట్రాన్ని చేజేతులా తన రాజకీయ ప్రత్యర్ధుల చేతికి అప్పగించి మరో ఘోర తప్పిదం చేసింది. అందువల్ల ఈ తప్పులకు, పొరపాట్లకు కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలలో ప్రాయశ్చితం చేసుకోక తప్పదు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.