ఆమాద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఇంటర్వ్యూ

Publish Date:Dec 9, 2013

Advertisement

 

డిల్లీలో కాంగ్రెస్, బీజేపీలకు ముచ్చెమటలు పట్టించిన ఆమాద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీ వాల్ మొన్న మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన చాలా ఆసక్తికరమయిన విషయాల గురించి మాట్లాడారు.

 

“నిజానికి ఇది మా పార్టీ విజయం కాదు. ఇది పూర్తిగా డిల్లీ ప్రజల విజయమే. ప్రభుత్వ నిర్లక్ష్యానికి, అవినీతికి, అసమర్ధతకు బలయిపోతూ మౌనంగా ఆక్రోశిస్తున్నసామాన్య ప్రజల ఆవేదన, ఆగ్రహంగా మారి అది ఆమాద్మీపార్టీగా రూపం సంతరించుకొంది. ఆమాద్మీయేకదా(సామాన్యుడే కదా) అని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందో వారు నిరూపించారు. మాకు ఆర్.యస్.యస్. అండ ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కాదు కాదు కార్పోరేట్ సంస్థలు అండగా నిలబడ్డాయని బీజేపీ ఆరోపిస్తుంది. కానీ మావెనుక కేవలం సామాన్య ప్రజలే ఎక్కువమంది ఉన్నారు. ఇది వారందరి స్వంత పార్టీ అనే భావన కలిగించడంలో మేము సఫలమయ్యాము గనుకనే ఈ విజయం సాధ్యమయింది."

 

"మా పార్టీ ఏకైక ఎజెండా రాజకీయ, ప్రభుత్వ వ్యవస్థల నుండి అవినీతిని పారద్రోలడమేనని చెప్పినప్పుడు, మీడియాతో సహా అన్ని రాజకీయ పార్టీలు కూడా నవ్వాయి. మా ఎజెండాని వారు అర్ధం చేసుకోలేకపోయినా, నిత్యం ఏదో ఒక రూపాన్నఎదురయ్యే అవినీతికి బాధితులయిన సామాన్య ప్రజలు మాత్రం మా అజెండాను బాగా అర్ధం చేసుకొన్నారు. అందుకే వారు దిగ్గజాల వంటి రాజకీయ నేతలను ఓడించి, తమలోంచి ఉద్భవించిన ఆమాద్మీని గెలిపించుకొన్నారు. ఆ గెలుపు కూడా చాల భారీ మెజార్టీతో ఉండటం గమనిస్తే, ప్రభుత్వం తమ పట్ల కనబరుస్తున్ననిర్లక్ష్యానికి వారిలో ఎంత ఆగ్రహం గూడుకట్టుకొని ఉందో, వారు ప్రస్తుత వ్యవస్తలపై ఎంత అసంతృప్తితో ఉన్నారో అర్ధమవుతుంది."

 

"అయితే ఈ విజయం అంత సునాయాసంగా వచ్చినది కాదని అందరికీ తెలుసు. ఈ దశకు చేరుకొనే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ మాకు అనేక అగ్ని పరీక్షలు పెట్టాయి. మాపై ఆదాయపన్నుశాఖా దాడులు, సీబీఐ విచారణలు, స్టింగ్ ఆపరేషన్లు, మా పార్టీకొచ్చే విదేశీ విరాళాల గురించి అసత్య ప్రచారాలు, వాటిపై మరే ఇతర పార్టీలకి లేని విచారణలు, మా అనుచరులపై దాడులు, హత్యా ప్రయత్నాలు వంటి చాలా అసాధారణ పరీక్షలే ఎదుర్కొన్నాము. కానీ, సామాన్య ప్రజలు మాత్రం మాపై ఎన్నడూ నమ్మకం కోల్పోలేదు. కారణం, ఇది వారి స్వంత పార్టీయేనని భావన వారిలో బలంగా ఉండటం వలననే. అయితే ఈ పరీక్షల వలన మేము కొంత నష్టపోయామని అంగీకరించవలసి ఉంటుంది. ఈ సమస్యలే లేకుంటే మాకు పూర్తి మెజార్టీ వచ్చి ఉండేదని ఖచ్చితంగా చెప్పగలము."

 

"రాజకీయ, ప్రభుత్వ వ్యవస్థలలో అవినీతిని రూపుమాపాలని అన్నాహజారేతో నేతృత్వంలో మేమందరమూ చాలానే కృషి చేసాము. దానికి వస్తున్న ప్రజాస్పందన చూసి కంగారు పడిన ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు కొన్ని రోజులు హడావుడి చేసారు. కానీ ఉద్యమ వేడి చల్లారగానే వారు కూడా మాట తప్పి ప్రజలను వంచించారు. రెండేళ్ళ తరువాత కూడా నేటికీ జనలోక్ పాల్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందలేదు. ఇందులో సాక్షాత్ ప్రధాని మన్మోహన్ సింగుతో సహా ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో నేతలందరూ భాగాస్వాములవడం చాలా విచారకరం. తామెన్నుకొన్న ప్రభుత్వమే తమను వంచించిందన్న విషయం ప్రజలు మరిచిపోలేదు. కానీ ప్రభుత్వం మరిచిపోయింది. తత్ఫలితమే కాంగ్రెస్ ఓటమికి దారి తీసిందని చెప్పవచ్చును."

 

"ఈరాజకీయ కల్మషాన్ని కడిగేందుకు మనం ఆ రొంపిలో దిగకూడదని మా గురువు గారు అన్నాహజారే అభిప్రాయ పడ్డారు. కేవలం ప్రజా ఉద్యమాల ద్వారానే ప్రభుత్వాలను పనిచేసేలా చేయాలని ఆయన భావించారు. కానీ మన ప్రభుత్వాలు, రాజకీయ వ్యవస్థలు అటువంటి ఉద్యమాలకు బెదరవని, లొంగేవికావని రుజువయిన తరువాతనే మేము ఈ రాజకీయ రొంపిలో దిగి ప్రక్షాళన చేయాలనుకోన్నాము. బురదలో దిగుతున్నప్పుడు, ఆ బురద మాకు కొంత అంటుకోక తప్పదని కూడా తెలుసు. అయితే అందుకు భయపడి ఎవరూ ఈ ప్రక్షాళన కార్యక్రమానికి పూనుకోకపోతే ఏదో ఒకరోజు మనమందరం ఆ బురదలోనే కూరుకుపోయే ప్రమాదం ఉందని భావించి అందుకు పూనుకొన్నాము. అయితే ఈ విషయంలో అన్నాహజారే గారు మాతో ఏకీభవించలేదు. కానీ ఆయన ఆశీర్వాదాలు మాకు ఎప్పుడు కూడా ఉంటాయని ఆశిస్తున్నాము."

 

"ఈ భ్రష్ట రాజకీయాలను తుడిచిపెట్టే ప్రయత్నంలో ఆమాద్మీ పార్టీ పుట్టింది. ఇంతవరకు ఏ పార్టీల అవినీతిని ఎదుర్కోవాలని పోరాడామో, ఇప్పుడు అధికారంలోకి రావడం కోసం మళ్ళీ అవే పార్టీలతో జత కడితే మాకు ఆ పార్టీలకు మధ్య ఇక ఎటువంటి తేడా ఉండబోదు. మా పోరాటానికి, ఉద్యమానికి కూడా అర్ధం ఉండదు. గనుక, మేము కాంగ్రెస్, బీజేపీలకు మద్దతు ఈయము. వాటి నుండి మద్దతు స్వీకరించము కూడా. ప్రతిపక్ష బెంచీలలో కూర్చోనయినా కూర్చొంటాముగానీ ఆ రెండు పార్టీలతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేతులు కలపబోము. ప్రజలు మాకు పూర్తి మెజార్టీ కట్టబెట్టి అధికారం అప్పజేప్పిననాడే మేము ప్రభుత్వ ఏర్పాటు గురించి ఆలోచిస్తాము. అవసరమయితే మళ్ళీ ఎన్నికలు ఎదుర్కోవడానికి కూడా మేము సిద్దమే. ఈ పదేళ్ళ కాంగ్రెస్ హయంలో కొన్ని లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయి. రూ.50-100 కోట్లు ఖర్చుచేసి మళ్ళీ ఎన్నికలు పెట్టుకొని ఒక మంచి ప్రభుత్వాన్నిఏర్పాటు చేసుకోవడంలో తప్పు లేదని మేము భావిస్తున్నాము. శాశ్వితమయిన అవినీతిని భరించడం కంటే ఇదే మేలు కదా!"

 

"సామాన్య ప్రజలు తలచుకొంటే ఏమవుతుందో డిల్లీ ప్రజలు నిరూపించి చూపారు. మరి దేశంలో మిగిలిన రాష్ట్రాలలో ప్రజలు కూడా దీనిని స్పూర్తిగా తీసుకొని పోరాడేందుకు ముందుకు వస్తే, ఇదేవిధమయిన ఫలితాలు వస్తాయి. ప్రజలలో చైతన్యం ఏర్పడిననాడు ఈ ఉద్యమం దశ దిశలా వ్యాపించగలదు," అని కేజ్రీవాల్ అన్నారు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.