కాంగ్రెస్ వైకాపాల సమైఖ్య చదరంగంలో తెదేపా బలి

Publish Date:Aug 16, 2013

Advertisement

 

రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన తెదేపా, ప్రస్తుతం సీమాంధ్ర ప్రాంతంలో రగులుతున్న ఉద్యమ జ్వాలల నుండి తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడటంతో తప్పని పరిస్థితులో ఆ పార్టీ నేతలు కూడా సమైక్యబాట పట్టవలసి వచ్చింది. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాత్రం తొలుత తమ లేఖకే కట్టుబడి ఉన్నానని ప్రకటించినప్పటికీ, వైకాపా నేతలు ఈ సమైక్య రేసులో ముందుకు దూసుకుపోతుండటంతో, ఇక తమనేతలను కూడా చురుకుగా సమైక్య ఉద్యమాలలో పాల్గొనాలని, ప్రజల అభీష్టం మేరకు ముందుకు సాగవలసిందిగా ఆయన తన నేతలకు స్పష్టమయిన ఆదేశాలిచ్చారు.

 

ఇది ఆ పార్టీకి చెందిన సీమాంధ్ర నేతలకు సమరోత్సాహం కలిగించవచ్చును, కానీ, తెలంగాణా నేతలకు మాత్రం పార్టీ అధ్యక్షుడిపై నమ్మకం కోల్పోయేలా చేయడం ఖాయం. వారికి సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్నఉద్యమాల గురించి, అక్కడ తమ పార్టీని రక్షించుకోవలసిన అవసరం గురించి తెలియకపోదు. కానీ, అదే సమయంలో వారు తమ రాజకీయ భవిష్యత్ గురించి, తెలంగాణాలో పార్టీ పరిస్థితి గురించి కూడా ఆందోళన చెందడం సహజం.

 

సీమాంధ్రలో కాంగ్రెస్, వైకాపాల నుండి తమ పార్టీని రక్షించుకోవడానికి చంద్రబాబు నాయుడు తీసుకొన్నఈ నిర్ణయంవల్ల తెదేపా కూడా తెలంగాణా వ్యతిరేఖమనే భావన వ్యాపిస్తే తమ రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుందని వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే వారెవరూ ఇంతవరకు పార్టీకి వ్యతిరేఖంగా మాట్లాడకపోయినప్పటికీ, మరెంతో కాలం మౌనంగా ఉండకపోవచ్చును. అదే జరిగితే తెదేపా కూడా తన తెలంగాణా నేతలని ఒకరొకరిగా సీమాంధ్ర ఉద్యమానికి బలిచేసుకొనే ప్రమాదం ఉంది. అప్పుడు ఆ పార్టీ కూడా వైకాపాలాగే తెలంగాణాలో తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది.

 

ఇక సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్, వైకాపాలు కొనసాగిస్తున్నసమైక్య రేసులో వెనుకబడిపోకూడదని చంద్రబాబు నాయుడు తన నేతలకి చెప్పడం గమనిస్తే, ఇప్పటికే వారు వెనుకబడిపోయారని ఆయన భావిస్తున్నట్లు అర్ధం అవుతుంది. సీమాంధ్ర ప్రాంతంలో తేదేపాకు నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆయన సరిగ్గానే అంచనా వేసినట్లు కనబడుతోంది.

 

తెలంగాణాను వదులుకొన్న వైకాపా, తన ఉద్యమాలతో సీమంధ్రలో ఇప్పటికే తన రేటింగ్ బాగా పెంచుకొంది. ఇక తెలంగాణా ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో తిరుగులేని ఆధిక్యత పొందుతూనే, సీమంద్రాలో ఆపార్టీ నేతలు చేస్తున్నహడావుడి వలన సీమాంధ్ర ప్రాంతంలో కూడాప్రయోజనం పొందే అవకాశముంది. ఈవిధంగా కాంగ్రెస్, వైకాపాలు తమ తెలంగాణా, సమైక్య ఉద్యమాలతో పూర్తి ప్రయోజనం పొందబోతుంటే, తెదేపా మాత్రం తెలంగాణకు అనుకూలమని చెప్పిఇప్పుడు తద్విరుద్ధంగా ప్రవర్తించడం వల్ల అటు తెలంగాణాలో, అదే కారణంతో సీమాంధ్ర ప్రాంతంలో తెదేపా నష్టపోయే అవకాశం ఉంది.

 

రాష్ట్రవిభజనకు అనుకూలంగా తెదేపా లేఖ ఇవ్వడం వలనే నేడు ఈ పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్, వైకాపాలు సీమాంధ్ర ప్రాంతంలోబాగానే ప్రచారం చేయగలిగాయి. ఆ వ్యతిరేఖ ప్రచారం నుండి బయటపడే ప్రయత్నంలో సమైక్య ఉద్యమంలోచురుకుగా పాల్గొనాలని చంద్రబాబు స్వయంగా తన నేతలకి చెప్పడం వలన ఇప్పుడు తెదేపా తెలంగాణకు వ్యతిరేఖమని కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో ప్రచారం చేసుకొని లబ్దిపొందే ప్రయత్నం చేస్తుంది.

 

తెదేపా సమైక్యఉద్యమాలలో పాల్గొన్నపటికీ తెలంగాణకు అనుకూలమని ఇచ్చిన లేఖ కారణంగా సీమాంధ్ర ప్రజల నమ్మకం పొందలేకపోవడం, సమైక్య ఉద్యమాలలో పాల్గొనడం వలననే తెలంగాణా ప్రజల నమ్మకం కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. బహుశ కాంగ్రెస్, వైకాపాలు ఈ పరిణామాలు ఆశించే ఆడిన ఈ సమైక్య చదరంగంలో తెదేపా నష్టపోయేది తెదేపాయేనని చూచాయగా అర్ధం అవుతోంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.