జగన్ కాంగ్రెస్ హస్తం అందుకొంటాడా లేదా?

Publish Date:Jan 23, 2013

Advertisement

 

ఇంతకాలం జగన్ మోహన్ రెడ్డిని అవినీతిపరుడంటూ జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీ సిగ్గు బిడియం, నీతి నియమం అన్నీకూడా పక్కన పెట్టేసి ఇప్పుడు అదే జగన్ తో చేతులు కలుపుదామని తహతహలాడిపోతోంది. అయితే, జైల్లో మగ్గిపోతున్నపటికీ జగన్ వైపు నుండి ఇంతవరకు సానుకూలంగా స్పందన రాలేదు. ఇంతకీ జగన్ కాంగ్రెస్ ‘హస్తం’ అందుకొంటాడా లేక బెయిలు కోసం చంద్రుని కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తూనే ఉండిపోతాడా? అని ఆలోచిస్తే కొన్ని ఆసక్తికరమయిన అంశాలు కనబడతాయి.

 

తనని జైల్లోవేసి దుర్బర జీవితాన్నిరుచి చూపించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేయందించినంత మాత్రాన్నఅందుకొనడానికి జగన్ మోహన్ రెడ్డి ఆసక్తి చూపకపోవచ్చును. ఎందుకంటే, ఇప్పటికే అతను 8 నెలలుగా ఏ విచారణ ఎదుర్కోకుండా రిమాండ్ ఖైదీగా జైల్లో ఉంటున్నాడు. ఒక పక్క, తనకు ప్రభుత్వం సహకరించట్లేదని సిబిఐ స్వయంగా కోర్టుకు చెపుతుంటే, మరో వైపు జగన్ తరపు లాయర్లు సిబిఐకు సహకరించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కోరుండే జాప్యం చేస్తున్నందున తమ క్లయింటు జగన్ మోహన్ రెడ్డికి తీరని అన్యాయం జరుగుతోందని కోర్టుకి స్పష్టం చేస్తూ అతని బెయిలు కోరుతున్నారు. అందువల్ల, ఈ రోజు కాకపోయినా రేపయిన తనకి కోర్టే స్వయంగా బెయిలు మంజూరు చేస్తుందని గట్టి నమ్మకంతో ఉన్న జగన్, ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ సాయం తీసుకొని దానికి ప్రయోజనం చేకూర్చడం ఎందుకని ఆలోచిస్తూ ఉండవచ్చును.

 

కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడంవల్ల, ఇంతకాలం చేసిన పోరాటం వృధా అవడమే కాకుండా, ప్రజల ముందు విస్వసనీయతగురించి పెద్ద పెద్ద మాటలు చెప్పిన తమ పార్టీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి ప్రజల ముందుకు వెళ్ళినట్లయితే తమ ‘విస్వసతనీయత’ కి కళంకం అంటుకొంటుందని ఆయన భావిస్తూ కాంగ్రెస్ కి దూరంగా ఉండిఉండవచ్చును.

 

ఇక, రాష్ట్ర రాజకీయాలలో తన ప్రాభల్యాన్ని సరిగ్గానే అంచనా వేసిన కాంగ్రెస్ పార్టీకి తన అవసరం ఉంది తప్ప తనకి ఆ పార్టీ అవసరం లేదని జగన్ గుర్తించడం మరో కారణం కావచ్చును. తనతో చేతులు కలిపితే, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో మళ్ళీ అధికారం కైవసం చేసుకొని లాభ పడుతుంటే, కేసుల నుండి బయట పడటం తప్ప తనకి కొత్తగా ఒరిగేదేమీ ఉండదని జగన్ మోహన్ రెడ్డి భావించడం వల్ల కాంగ్రెస్ సంకేతాలకు సానుకూలంగా స్పందించట్లేదని అనుకోవచ్చును. అందువల్ల కొంత కాలం వేచి చూసి పరిస్థితులను బట్టి ఎన్నికల పొత్తుల గురించి స్పందించడం మేలని జగన్ భావిస్తుండవచ్చును.

 

ఇక కాంగ్రెస్ వైపు నుంచి ఆలోచిస్తే, ఎన్నికలకి ఇంకా చాలా సమయమే ఉంది కనుక, ఇప్పటికిప్పుడు జగన్ మోహన్ రెడ్డి తో తొందరపడి చేతులు కలుపకపోయినా నష్టం లేదు. గానీ, సూచన ప్రాయంగా ఇప్పటి నుండే అతనితో పొత్తుల గురించి మాట్లాడుతుంటే ప్రజలు కూడా ఎన్నికల సమయానికి మానసికంగా వారి ఎన్నికల పొత్తులని అంగీకరించే స్థాయికి వస్తారని ఆలోచనతోనే కాంగ్రెస్ ఈ ప్రస్తావన తెస్తోందని భావించవచ్చును. ప్రజలతో బాటు, జగన్ మోహన్ రెడ్డి అతని పార్టీ కూడా అందుకు మానసికంగా సిద్దపడేలా చేయడం కూడా కాంగ్రెస్ ఉద్దేశం కావచ్చును.

 

మరి కొంత కాలం అతనికి బెయిలు రాకుండా అడ్డుపడుతూ జైల్లోనే మగ్గనిచ్చి అతని ఆత్మవిశ్వాసం పూర్తిగా అడుగంటిపోయేవరకు ఆగి, ఇక అతనంతట అతనే ‘ప్రాహీ..ప్రాహీమాం..’ అంటూ తన కాళ్ళమీద పడేలా చేసుకోగలిగితే, అప్పుడు అతనితో తనకి నచ్చినట్లు ఆడుకోవచ్చుననే కాంగ్రెస్ ఆలోచన చేస్తుండవచ్చును. ప్రస్తుతం కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు రెండూ కూడా వేచి చూసే ధోరణితో ఉన్నాయని చెప్పవచ్చును.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.