కుల్జా...సిం...సిం...

Publish Date:Jan 22, 2013

Advertisement

 

 

కాంగ్రెస్ పార్టీతో అంటకాగుతున్నంత కాలం, కలెక్టరుపైనా చేయిచేసుకొన్నా, పోలీసులను బెదిరించినా తమని దేశంలో ఏకోర్టులూ ఏమి చేయలేవని మిడిసిపడిన ఓవైసీ సోదర ద్వయం, వాపును బలుపనుకొని తమ అండతోనే కాంగ్రెస్ బ్రతుకుతోందని భావిస్తూ ఆ పార్టీకి తలాకులిచ్చేసి బయటకొచ్చి తమ పార్టీని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ప్రత్యమ్నాయంగా రాష్ట్రం మొత్తం విస్తరించుదామని భారీ ప్రణాళిక ప్రకటించారు.

 

అయితే, వారింతవరకు పయనించిన దారి సరి కాదు, ఇప్పుడు పయనించడానికి ఎంచుకొన్న దారీ కూడా సరికాదని కోర్టులు నిరూపించాయి.

 

ఇక అసలు కధలోకి వస్తే, ఓవైసీ సోదర ద్వయంపై 2005వ సం.లో మెదక్ జిల్లా కలెక్టర్ పై చేయిచేసుకొన్న కేసులో పోలీసులు కేసు నమోదు చేయడం, అప్పటి నుండి ఇప్పటివరకు కోర్టు 15 నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే, అధికార ‘హస్తం’ పట్టుకొని తిరుగుతున్న ఆ సోదర ద్వయాన్ని చివరికి నాన్ బెయిలబుల్ వారంటులు కూడా ఏమి చేయలేకపోయాయి. చట్టాలు, న్యాయస్థానాలు అంటే తమకి గౌరవం అని చెప్పే ఓవైసీ సోదర ద్వయం వాటిని ఇంతవరకు కూడా అపహాస్యం చేస్తూనే ఉన్నారు.

 

అయితే, వినాశకాలే విపరీత బుద్ధీ అన్న సామెతను నిజం చేస్తూ, కాంగ్రెసును దిక్కరించి బయటకి రావడం, మళ్ళీ దానితోనే గొడవపడటంతో వారి పాత కేసులన్నీ ఒకటొకటిగా పోలీసులు బయటకి తీసి వారిపై చర్యలకు సిద్దం అవుతున్నారు. మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీని కూడా మిలాద్-ఉన్-నభీ పండుగ తరువాత అరెస్ట్ చేయడానికి యోచిస్తున్నట్లు తెలుసుకొన్నఆయన అతితెలివి ప్రదర్శిస్తూ, తానే స్వయంగా సంగారెడ్డి కోర్టుకు వెళ్లి నిన్నలొంగిపోయారు. అది కోర్టు మీద గౌరవం అనుకొంటే పొరబాటే. పండుగ ముందు ఆయనని అరెస్ట్ చేస్తే ముస్లిం ప్రజలు భావోద్వేగాలకు లోనయి శాంతి భద్రతల సమస్య తల్లెత్తవచ్చునని పోలీసులు ఆలోచించి ఆగితే, 8 సం.లుగా కోర్టు మొహం చూడని అయన పండుగ సమయంలో పోలీసులు తనను అన్యాయంగా జైల్లో పెట్టేరని తన వర్గం ప్రజల నుండి సానుభూతి పొంది పార్టీని వారికి మరింత చేరువగా తీసుకుపోవాలనే దురాలోచనతో కోర్టుకు లొంగిపోయినట్లు కనిపిస్తోంది. రెండు రోజులు జైల్లో ఉంది బెయిలు తీసుకొని బయటకి వచ్చేస్తే తన తలరాతలు మార్చేసుకోవచ్చుననే ఆలోచనతో బోనులోకి ప్రవేశించిన అయన చివరికి అదే బోనులో ఇరుక్కుపోయారు.

 

కోర్టు ఆయనని తీవ్రంగా తప్పుబట్టడమే గాకుండా అయన బెయిలు దరఖాస్తును త్రోసిపుచ్చి వచ్చే నెల 2వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విదిస్తూ జైలుకు పంపింది. ఆలీబాబా కధలో దురాశకు పోయిన ఆలీబాబా తమ్ముడు ‘కుల్జా...సిం...సిం’ అంటూ మంత్రం చదవి ధనరాసులు పోగేసున్న గుహలోకి ప్రవేశించి అంతా మూటకట్టుకోన్నాక, ఆ మంత్రం మరిచిపోవడంతో తిరిగి బయటకి వెళ్ళలేక గుహలోనే చిక్కుకుపోయిన్నట్లే, మన గౌరవనీయులయిన మజ్లిస్ శాసన సభ్యులు అసదుద్దీన్ గారు కూడా అతితెలివి ప్రదర్శించి జైల్లో ఇర్రుకుపోయారిప్పుడు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.