Publish Date:Oct 22, 2019
మావోయిస్ట్ లతో సంభందాలు ఉన్న నలభై ఐదు మంది పై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. వారిలో పది మంది మావోయిస్టు పార్టీకి చెందిన వారు కాగా, మరో ముప్పై ఐదు మందికి పన్నెండు సంఘాలతో అనుబంధం ఉంది. ఈ సంఘాలకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని వారికి ఆయుధాలు సమకూరుస్తున్నారని పోలీసులు చెప్తున్నారు. ఉపాధి చట్టం కింద కేసు నమోదైన వారిలో ఇటీవల గద్వాల పోలీసులు అరెస్టు చేసిన తెలంగాణ ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణ తెలంగాణ విద్యార్థి వేదిక అధ్యక్షుడు మద్దిలేటి ఉన్నారు. మావోయిస్టు పార్టీ సానుభూతిపరులుగా పేర్కొంటూ ఐత అనిల్ కుమార్, దాసరపు సురేష్ ను భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా పోలీసులు ఆదివారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
ఆ సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టును ఒక పత్రిక సంపాదించింది. అందులో ఉప కేసు నమోదైన నలభై ఐదు మంది వ్యక్తులు పన్నెండు సంస్థల వివరాలున్నాయి. వివరాల్లో తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ పౌర హక్కుల సంఘం, తెలంగాణ విద్యార్థి వేదిక, తుడుం దెబ్బ, చైతన్య మహిళా సంఘం, తెలంగాణ విద్యార్థి సంఘం, ప్రజాస్వామ్య విద్యార్థి వేదిక, తెలంగాణ యూత్ ఫోరం, పార్టియాటిక్ డెమోక్రటిక్ మూమెంట్, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక, రాజకీయ ఖైదీల విడుదల కమిటీ, తెలంగాణ రైతాంగ సమితి ఉన్నాయి. ఇవన్నీ మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘాలని పేర్కొన్నారు. ఆయా సంఘాల నేతలు యూనివర్సిటీలు, కాలేజీల్లో తిరుగుతూ విద్యార్థులను మావోయిజం వైపు ఆకర్షిస్తున్నారని మావోయిస్టులకు నిధులను సేకరించడం ఆయుధాలనూ సాంకేతిక పరికరాలను విప్లవ సాహిత్యాన్ని మందుపాత్రలను సమకూర్చడం వీరి ప్రధాన వీధులని రిమాండ్ రిపోర్టులో చర్ల పోలీసులు వెల్లడించారు.ఈ మావోయిస్టు చర్యలపై వెంటనే ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే రాష్ట్రం తీవ్ర నష్టానికి గురి అవుతుందని స్పష్టమవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/communist-party-of-india-25-90402.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.