సమతామూర్తి సాక్షిగా వివక్ష.. చిన‌జీయ‌ర్‌పై విమ‌ర్శ‌..

Publish Date:Feb 14, 2022

Advertisement

నిజమే. శ్రీ రామానుజాచార్యులు ‘సమతా’ మూర్తి, సందేహం లేదు. వెయ్యేళ్ళ క్రితమే ఆయన కుల మత తారతమ్యాలు లేని సమాజ వ్యవస్థ కోసం కలలు కన్నారు. శ్రీ రామానుజులు సమతామూర్తి మాత్రమే కాదు. మనుషులంతా ఒక్కటే అని నమ్మిన మానవతామూర్తి. సమతా మంత్రాన్ని కుల మతాలకు అతీతంగా అందరికీ సమానంగా పంచిన మేరునగ సమోన్నత సమతా శిఖరం శ్రీ రామానుజాచార్యులు.అంతటి మహనీయుని, సహస్రాబ్ది ఉత్సవాలను చిన జీయర్ స్వామి, హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్’లో ఘనంగా నిర్వహించారు. శ్రీరామనగర్‌లో వందెకరాల ప్రాంగణంలో అద్వితీయ రీతిలో సమతామూర్తి విగ్రహాన్ని, ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్మించారు. ఎందరో ప్రముఖులను ఆహ్వానించారు. వేలాదిగా  భక్తులు వేడుకల్లో పాల్గొన్నారు. 

అయితే, 12 రోజులపాటు ఇంత వైభవంగా జరిగిన వేడుకలలో సమతా మూర్తి శ్రీరామానుజుల మూల సూత్రమే మరుగున పడిపోయిందని ఉత్సవాలలో పాల్గొన్న, తిలకించిన భక్తులు అవేదన, ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నారు. శ్రీరామనుజుల వారు మనుషులు అందరినీ సమానంగా చూడాలన్నారు. అనడం కాదు ఆచరించి చూపారు. అందుకే ఆయన సమతామూర్తి అయ్యారు. వెయ్యేళ్ళు అయినా ఇంకా కోట్లాది మందికి ప్రేరణగా నిలిచారు. ఆ ప్రేరణతో ఎందరో చేసిన సమర్పణలతోనే ఆధ్యాత్మిక సమతా కేంద్ర నిర్మాణం జరిగింది.  

అయితే, ఆయన శ్రీ రామానుజుల ఆశయాలను ముందుకు తీసుకు పోతున్నామని చెప్పు కుంటున్న చిన జీయర్ స్వామి, అందరిని సమానంగా చూశారా? పంక్తిలో వలపక్షం చూపారా? అంటే, కొందరిని ఒకలా, ఇంకొందరిని ఇంకోలా చూశారనే మాట చాలా బలంగా వినిపిస్తోంది. స్వామీజీ, అతిధులకు తీర్థ, ప్రసాదాలు ఇచ్చే సమయంలో.. అయిన వారికి  ఆకుల్లో, కానీ వారికి కంచాల్లో అనట్లుగా పక్ష పాతాన్నిమ వివక్షను చూపారని భక్తులు అవేదన వ్యక్తం చేశారు. నిజానికి చిన జీయర్ స్వామి ఎవరినీ ముట్టుకోరని, ఎవరినీ దగ్గరకు కూడా రానీయరనే ఆరోపణ లేదా నింద ఉండనే వుంది. అయితే అందుకు ఆయన కొంత వివరణ కూడా ఇచ్చారు.  ఏవో కారణాలు చెప్పారు. అయినా అదొక మచ్చగానే మిగిలి పోయింది. అదలా ఉంటే, ఇంతటి వేడుకల్లోనూ వివక్ష చూపడం ఏమిటనే, ప్రశ్న ప్రముఖంగా వినవస్తోంది. అందరి విషయంలో ఒకేలా ఉంటే అదో రకం, కానీ, ఒకే వేదిక పై కొందరిని ఒకలా ఇంకొందరిని ఇంకొకలా చూడడం వలన, సమతా మూర్తి సన్నిధిలోనే వారి సందేశానికి అవమానం జరిగిందనే బాధను భక్తులు వ్యక్త పరుస్తున్నారు. 

నిజానికి, గతంలో స్వామీజీ కొన్ని వర్గాల ప్రజల ఆహారపు అలవాట్లకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు వివాదమయ్యాయి. స్వామీజీ కుల వివక్ష చుపుతున్నారనే  ఆరోపణలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు, ఏకంగా మహా వేడుకలో, కడివెడు పాలలో ఒక్క విషం చుక్కలా సమతా మూర్తి సాక్షిగా, స్వయంగా చిన జీయర్ స్వామి అసమానతలు, వివిక్ష చుపారనే ఆరోపణలు వినవలసి రావడం అంతోటి స్వామికి జరిగిన అవమానంగానే భావించవలసి ఉంటుదని భక్తులు అంటున్నారు.
 

By
en-us Political News

  
రోడ్డు ప్రమాదాలలో మరణాల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగ కేంద్రం కొత్త నిబంధన తీసుకురానుంది. ఈ కొత్త నిబంధన ప్రకారం ద్విచక్ర వాహన తయారీ సంస్థలు వాహన కొనుగోలుదారులకు తప్పనిసరిగా రెండు హెల్మెట్లను సరఫరా చేయాల్సి ఉంటుంది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలేశుని దర్శనం కోసం పోటెత్తుతున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అస్సలు తగ్గేదేలే అంటున్నారు.
తిరుపతి జిల్లా రంగంపేట మార్గంలో అక్రమంగా రవాణా చేస్తున్న 24 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితులకు నార్కో టెస్ట్ చేయించాలని సిట్ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పెను సంచలనంగా మారిన మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తనపై సీఐడీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలనిఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ ను హైకోర్టు తిరస్కరించింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది. విశ్వసనీయ సమాచారం మేరకు, మరో రెండు రోజులో,జూన్ 30 న నామినేషన్లు,జూలై 1 న నూతన అధ్యక్షుని ఎన్నికకు బీజేపీ అధిష్టానం ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
సీతక్క ఓ నమ్మకం, కష్టాలో ఆమె ఓ సహాయం, ఆపదలో ఉన్న వారికి ఆమె భరోసా, ప్రజా నాయకురాలిగా అలుపెరుగని పోరాటం, ప్రజాసేవలో అలసిపోని మానవత్వం కలిగిన అరుదైన వ్యక్తిత్వం సితక్క, ఆలాంటి నాయకురాలు కోటికొక్కరుంటారు
భారత గూఢచార సంస్థ రిసెర్చ్‌ అండ్‌ ఎనాలసిస్‌ వింగ్‌ చీఫ్‌గా పంజాబ్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి పరాగ్‌ జైన్‌‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది.
హైదరాబాద్‌‌లో మహా న్యూస్ హెడ్ ఆఫీస్‌పై బీఆర్‌ఎస్ నేతల దాడిని ఏపీ సీఎం చంద్రబాబు ఖండించారు. స్టూడియోపై దాడి చేసి విధ్వంసం సృష్టించడం దారుణమని ఎక్స్ వేదికంగా పేర్కొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రమాణ స్వీకారంచేసి, ఇంచుమించుగా 18నెలలు అయింది. అయితే, ఈ 18 నెలల కాలంలో, రేవంత్ రెడ్డి ఇతర ముఖ్యమంత్రుల్లా అధికార దర్పాన్ని ప్రదర్శించిన సందర్భాలు అంతగా కనిపించవు.
హైదరాబాద్‌లో మహా న్యూస్ ఛానెల్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. మీడియా సంస్థపై భౌతిక దాడులకు పాల్పడటం అత్యంత గర్హనీయమైన చర్య అని ఆయన పేర్కొన్నారు.
పూర్ణ‌చంద్ర‌రావు అనే ఒక వ్య‌క్తితో యాంక‌ర్ స్వేచ్ఛ స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. గ‌తంలో కూడా ఆమె ఒక‌రితో వివాహం అయ్యి త‌ర్వాత విడిపోయారు. ఆమె టీవీనైన్ వంటి ప్ర‌ముఖ న్యూస్ ఛానెళ్ల‌లో ప‌ని చేశారు.
ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేటీఆర్‌పై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ ఆగ్రహించిన బీఆర్ఎస్ కార్యకర్తలు మహా టీవీ ఆఫీస్‌పై దాడి చేశారు. ఆఫీస్ అద్దాలు, కార్లు, స్టూడియోను ధ్వంసం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.