Publish Date:Sep 11, 2025
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం (సెప్టెంబర్12) హస్తిన బయలుదేరి వెళ్లనున్నారు. కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ లో కీలక భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ అధినేతగా ఆయన శుక్రవారం (సెప్టెంబర్ 12) జరగనున్న ఉపరాష్ట్రపతి సీపీ చంద్రశేఖర్ ప్రమాణ స్వీకార కర్యక్రమంలో పాల్గొననున్నాయి. ఇందుకోసమే చంద్రబాబు వెడుతున్నారు. ఉప రాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎన్డీయే కూటమి పార్టీల నేతలే కాకుండా విపక్ష పార్టీలకు చెందిన నేతలూ హాజరౌతారు. రాష్ట్రపతి కార్యాలయంలో జరిగే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తిగా రాజకీయాలకు అతీతం. ఇక విషయానికి వస్తే ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా తెలుగుదేశం కీలకంగా వ్యవహరించింది. ఏపీ ఎన్డీఏ ఎంపీలందర్నీ మంత్రి లోకేష్ సమన్వయం చేశారు. ఇందు కోసం ఆయన స్వయంగా ఢిల్లీకి వెళ్లారు.
ఈ నేపథ్యంలోనే చంద్రబాబునాయుడు ఉపరాష్ఠ్రపతి ప్రమాణస్వకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఢిల్లీ వెడుతున్నారు. అయితే ఈ హస్తన పర్యటన సందర్భంగా చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల హస్తిన వెళ్లి ప్రధాని నరేంద్రమోడీతో దాదాపు ముప్పావుగంట సేపు భేటీ అయ్యారు. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి పలు అంశాలపై మోడీతో చర్చించారు. అయితే ఆ సందర్భంగా నారా లోకేష్ కేంద్ర మంత్రులతో భేటీ కాలేదు. ఇప్పుడు చంద్రబాబు హస్తిన పర్యటనలో కేంద్ర మంత్రులతో భేటీ కావడాన్ని లోకేష్, మోడీ భేటీకి కొనసాగింపుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cnm-delhi-tour-39-205996.html
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.