తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైంది. వెండితెరపై తిరుగులేని చక్రవర్తిగా వెలిగిన దళపతి విజయ్, ఇప్పుడు రాజకీయ పీఠంపై కూడా తన మార్క్ చూపిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్, అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే సంచలన నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ముందుకు సాగుతున్నారు. సాధారణంగా రాజకీయాల్లో ఒక సంప్రదాయం బలంగా కొనసాగుతోంది. ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసి గెలిచినప్పుడు లేదా పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తినప్పుడు.. సీనియర్ నాయకులను బుజ్జగించడానికి ఉప ముఖ్యమంత్రి పదవులను పంచుతుంటారు. గతంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించి రికార్డు సృష్టించారు. ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన, శక్తిమంతమైన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూ డైనమిక్ రోల్ పోషిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ పదవిని, దళపతి విజయ్ మాత్రం పూర్తిగా పక్కన పెట్టేసి అందరికీ షాక్ ఇచ్చారు.
తమిళనాడులో మిత్రపక్షాల మద్దతుతోనే విజయ్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ, ఆయన ఒక్కరికి కూడా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వలేదు. కూటమిలోని భాగస్వామ్య పక్షాల నుంచి డిప్యూటీ సీఎం పదవి కోసం గట్టి ఒత్తిడి వచ్చినప్పటికీ, విజయ్ తన నిర్ణయానికే కట్టుబడ్డారు. మరి మిత్రపక్షాలను ఆయన ఎలా ప్రసన్నం చేసుకున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కూటమి నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపిన విజయ్, వారికి డిప్యూటీ సీఎం పదవులకు బదులుగా కేబినెట్లో కీలకమైన మంత్రిత్వ శాఖలను కేటాయించి పరిస్థితిని చాలా చాకచక్యంగా సర్దుబాటు చేశారు. ఈ వ్యూహాత్మక అడుగు వెనుక దళపతి విజయ్ ఒక బలమైన రాజకీయ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు స్పష్టమవుతోంది. అధికార వికేంద్రీకరణ పేరుతో పాలనలో గందరగోళం ఏర్పడకూడదని, ప్రభుత్వంలో ఎలాంటి రాజకీయ జోక్యాలు లేకుండా నేరుగా తన నియంత్రణలోనే నిర్ణయాలు సాగాలని ఆయన భావిస్తున్నారు.
ఒకే ప్రభుత్వంలో ఎక్కువ మంది పవర్ సెంటర్లు ఉంటే, భవిష్యత్తులో పాలనాపరమైన ఇబ్బందులు వస్తాయని, ముఖ్యంగా కూటమి ప్రభుత్వాల్లో ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయని విజయ్ భావిస్తున్నారు. అందుకే, ఎటువంటి డైవర్షన్స్ లేకుండా ఒక స్థిరమైన, బలమైన, స్పష్టమైన పారదర్శక పాలనను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. తమిళ రాజకీయాల్లో కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజాలు ఒంటిచేత్తో రాష్ట్రాన్ని ఏలిన తరహాలోనే, తాను కూడా పూర్తి అధికారంతో, ఎలాంటి రాజీ పడకుండా ముందుకెళ్లాలని విజయ్ డిసైడ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ లాంటి క్రేజ్ ఉన్న నేత ఏపీలో డిప్యూటీ సీఎంగా సక్సెస్ అవుతున్న తరుణంలో, విజయ్ తీసుకున్న ఈ 'నో డిప్యూటీ సీఎం' పాలసీ తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. ఈ వినూత్న పొలిటికల్ స్ట్రాటజీ విజయ్ ప్రభుత్వానికి ఎంతవరకు స్థిరత్వాన్ని ఇస్తుందో చూడాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cm-vijay-clarify-on-deputy-cm-post-39-221430.html
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్స్టార్ రజనీకాంత్తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ఈ వివాదం కాస్తా ముదరడంతో తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిగానైనా బరిలోకి దిగుతుందని, అవసరమైతే ఏ పోరాటానికైనా తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. తెలంగాణ సెంటిమెంట్ను టచ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో.. పవన్ కళ్యాణ్ ఈ సవాల్ను స్వీకరించడం సంచలనం సృష్టించింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కేవలం 80 స్థానాలకే పరిమితమైన టీఎంసీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అసమ్మతి గళాలు రోడ్డెక్కాయి. పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మెజారిటీ టీఎంసీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. గడిచిన 15 ఏళ్లుగా బెంగాల్ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన దీదీ, ఇప్పుడు సొంత పార్టీపై పట్టు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు.
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది.
రాష్ట్రంలో ఎన్నికల అనంతర పరిణామాలు, జాతీయ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి.
ఆయనను బీజేపీ హైకమాండ్ ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. అప్పటి నుంచీ పార్టీ హైకమాండ్ పై అసంతృప్తితో ఉన్న అన్నామలై సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఉద్దేశంలో ఉన్నారంటూ, గత కొంత కాలంగా వార్తలు వినవస్తున్నాయి.
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బెంగళూరు నగరాభివృద్ధి శాఖ తనకు కేటాయించకపోవడమే ఆయన అసంతృప్తికి కారణమని తెలుస్తోంది. మీడియా ఎదుటే ఆయన తన రాజీనామా లేఖపై సంతకం చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.