మహాంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్

Publish Date:Jul 13, 2025

Advertisement

 

లష్కర్ బోనాల సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు సీఎంకు తీర్థప్రసాదాలు వేదాశీర్వచనాలిచ్చారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌ ఉన్నారు. రాష్ట్రంలో ప్రజలందరికీ మంచి జరగాలని అమ్మవారిని రేవంత్‌రెడ్డి ప్రార్థించారు. మహాకాళి బోనాల జాతర ఘనంగా సాగుతోంది. ఆలయం వద్ద భక్తులకు ఇబ్బందులు లేకుండా 6 క్యూలైన్లు ఏర్పాటు చేశారు.అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.

నేడు బోనాలు, ఫలహారబండ్ల ఊరేగింపు, 14న రంగం, పోతరాజుల గావు, అంబారీపై అమ్మవారి ఊరేగింపు జరగనుంది.  భక్తుల కోసం ప్రత్యేకంగా రెండు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. శివసత్తులకు ప్రత్యేకంగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఆర్పీరోడ్, బాట షో రూం నుంచి ప్రవేశం కల్పించారు. దేవాలయానికి భక్తులు వెళ్లేందుకు వివిధ మార్గాల్లో పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేశారు. లష్కర్ బోనాల జాతర ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఉజ్జయిని మహంకాళి బోనాలకు పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు.

By
en-us Political News

  
ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీఎస్‌ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల జీవితాల్లో మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్రీ బస్సు పథకానికి శ్రీకారం చుడుతున్నారని ఆయన అన్నారు.
భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడుతున్న ఘటనల నేపథ్యంలో అమర్నాథ్ యాత్రను నిలిపివేశారు. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమచల్ ప్రదేశ్ లలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.
థియేటర్లో సినిమా ప్రదర్శన జరుగుతున్న సమయంలో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రేక్షకులు భయంతో పరుగులు తీసిన సంఘటన బుధవారం కావలిలో జరిగింది. నెల్లూరు జిల్లా కావలిలోని స్రవంతి థియోటర్ లో సినిమా నడుస్తుండగానే ప్రొజెక్టర్ రూంలో ఒక్క సారిగా మంటలుచెలరేగి థియోటర్ మొత్తం వ్యాపించాయి.
కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షీ నటరాజన్ ఈ నెల 31 నుంచి తలపెట్టిన పాదయాత్ర వాయిదాపడింది. ఆగస్టు 5, 6, 7 తేదీలలో కాంగ్రెస్ లో బిజీ షెడ్యూల్ కారణంగా ఈ యాత్ర వాయిదా పడింది.
కడప జిల్లాలో రూ. 78 కోట్లతో చేపట్టనున్న ప్రతిష్టాత్మక గండికోట పర్యాటక ప్రాజెక్టుకు వచ్చే నెల 1న శంకుస్థాపన జరగనుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సాస్కి పథకం చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆగస్టు1వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు.
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. వరద ఉథృతి కొనసాగుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఆ సుందర జలదృశ్యాన్ని తిలకించడానికి పెద్ద సంఖ్యలో పర్యటకులు వస్తున్నారు.
కింద పడ్డా పై చేయి నాదే అన్న నానుడి వినే ఉంటారు ...అచ్చం అలాగే వ్యవహరిస్తున్నరట మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్. మద్యం కుంభకోణం కేసులో పీకల్లోతు కూరుకుపోయిన జగన్ రేపో మాపో విచారణ ఎదుర్కోక తప్పదని ఓ పక్కన లోకం మొత్తం కోడై కూస్తున్నా.. అబ్బే మనకున్న పరపతి ముందు కేసులు పెద్ద లెక్క కాదు అనేలా బిల్డప్ ఇస్తున్నారా అనిపిస్తుంది ప్రస్తుతం ఆయన వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే.
సృష్టి కేసులో త‌వ్వే కొద్దీ న‌మ్మ‌లేని నిజాలు బ‌య‌ట ప‌డుతున్నాయి. డాక్ట‌ర్ న‌మ్ర‌త జ‌గత్ జంత్రీగా క‌నిపిస్తోంది. ఆమె ఇప్ప‌టి వ‌ర‌కూ హైద‌రాబాద్ లో 30 స‌రోగ‌సీ కేసులు హ్యాండిల్ చేయ‌గా.. ఆమె బేబీ సెంట‌ర్ కి స‌రోగ‌సీ విష‌యంలో క‌నీసం ప‌ర్మిష‌న్లు లేవ‌ని తెలుస్తోంది.
జ‌గ‌న్ ప్రెస్ మీట్లకు.. ఈ మ‌ధ్య రాముడు మంచి బాలుడికి మ‌ల్లే వ‌చ్చేస్తున్నారు. భ‌ల్లే భ‌ల్లే క‌బుర్లు చెబుతున్నారు. అంతా బాగుంది. ఆయ‌న క‌బుర్ల‌న్నీ పేప‌ర్లూ, టీవీల్లో వ‌చ్చేస్తాయి. కాద‌న‌డం లేదు. కానీ ఈ బొట్టు పెట్టుకుని మ‌రీ బుద్ధిమంతుడ్లా క‌నిపించ‌డ‌మేంటా? అన్న‌ది ఒక అనుమానం. ప్ర‌శ్న‌. చ‌ర్చ‌. వ‌గైరా వ‌గైరా.
రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో బుధవారం (జులై 30) 8.8 తీవ్రతతో తీవ్ర భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని జపాన్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ కారణంగా జపాన్, అమెరికా, గ్వామ్ వంటి పసిఫిక్ తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు వరుణ్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు.
గొర్రెల స్కాం కేసు దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచింది. హైదరాబాద్‌లో 10 చోట్ల ఈడీ దాడులు కొనసాగుతుండటం హాట్ టాపిక్‌గా మారింది. సికింద్రాబాద్, బోయిన్ పల్లి, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. బీఆర్ఎస్ హయాంలో గొర్రెల పంపిణీలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలపై గతంలో ఏసీబీ కేసు నమోదు చేసింది.
జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన భారీ మద్యం కుంభకోణం కేసులో కీలక వ్యక్తులు వరుసగా అరెస్టౌతున్నారు. ఈ కేసులో సిట్ దర్యాప్తు తాడేపల్లి ప్యాలెస్ పునాదుల వరకూ వెడుతోంది. మిథున్ రెడ్డి అరెస్టు తరువాత జగన్ కు అరెస్టు భయం పెచ్చరిల్లిందని పరిశీలకులు అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.