కిరణ్ వాదనలు కూడా నాటకంలో భాగమేనా?

Publish Date:Nov 10, 2013

Advertisement

 

 కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన చేస్తున్నట్లు ప్రకటించిననాటి నుండి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానాన్ని దిక్కరిస్తూ గట్టిగా సమైక్యవాదం వినిపిస్తూ సీమాంధ్ర ప్రజలలో మంచిపేరు సంపాదించుకొంటున్నారు. ఒకే దెబ్బకి రెండు పిట్టలన్నట్లు, ఆయన అధిష్టానాన్ని ధిక్కరిస్తున్న కారణంగా మంచి దైర్యవంతుడని, కొత్త పార్టీ పెట్టగల సమర్ధుడని ప్రజలలో ఒక భావన కలిగిస్తూ, సమైక్యవాదం గట్టిగా వినిపిస్తున్న కారణం చేత అతనే బెస్ట్-సమైక్యవాదని, అందువలన రాష్ట్రాన్ని విభజిస్తున్నకాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాటం చెప్పాలంటే, ఆయన నేతృత్వంలో ఏర్పడే కొత్త పార్టీకే మద్దతు ఇవ్వవలసి ఉంటుందనే భావనని కూడా చాలా సమర్ధంగా ప్రజలలోకి జొప్పించగలిగారు.

 

ఇదంతా బాగానే ఉంది. కానీ, ఇదే సమయంలో ఆయన రాష్ట్ర విభజన ప్రక్రియకు ఎన్నడూ కూడా అడ్డుపడలేదనే సంగతిని గ్రహించవలసి ఉంది. ఆయన మనస్పూర్తిగా రాష్ట్రం విడిపోకూడదని కోరుకొంటూ ఉండవచ్చు గాక! కానీ కేవలం అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి అధిష్టానానికి వ్యతిరేఖంగా మాట్లాడటం తప్ప రాష్ట్రం విడిపోతుంటే ఆపేందుకు ఆయన చేసిన ప్రయత్నమేదీ కనబడలేదు.

 

అందువల్లే రాష్ట్రానికి సంబంధించిన విభజన ప్రక్రియ రాష్ట్రంతో ఎటువంటి సంబంధము, సమ్మతి లేకుండా ఎక్కడో డిల్లీలో చకచకా జరిగిపోతోంది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి వైఖరి వలన కాంగ్రెస్ అధిష్టానం ఈ ప్రక్రియను ఏవిధంగా గట్టెకించాల అనే సందిగ్ధంలో ఉన్నట్లు మీడియా చెపుతోంది తప్ప, కాంగ్రెస్ అధిష్టానంలో ఎవరూ కూడా అటువంటి భయాలు వ్యక్తం చేయలేదు. అంతే గాక సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రే అభ్యంతరం చెపుతున్నారు గనుక రాష్ట్ర విభజన ప్రక్రియను నిలిపివేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఎన్నడూ కూడా భావించలేదు.

 

కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ అధిష్టానం నేతలు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకొంటూ మీడియాకి, తద్వారా ప్రజలకి మంచి కాలక్షేపం కలిగిస్తూ, అందరినీ చాలా తెలివిగా పక్కదారి పట్టిస్తున్నారని చెప్పక తప్పదు.

 

ఒకసారి కిరణ్ పై చాకో, మరోసారి మనిష్ తివారి, ఇంకోసారి షిండే, దిగ్విజయ్ సింగ్ ఒకరి తరువాత మరొకరు వంతులు వేసుకొన్నట్లు మీడియా ముందుకు వచ్చి స్పందిస్తుంటారు. గత మూడు నాలుగు రోజులుగా కిరణ్ కుమార్ రెడ్డి, దిగ్విజయ్ సింగులమధ్య జరుగుతున్న భాగోతం గమనిస్తే అది స్పష్టమవుతుంది.

 

ఇంత రాద్ధాంతం జరుగుతున్నపటికీ తెరవెనుక విభజన ప్రక్రియ మాత్రం సజావుగా సాగిపోతూనే ఉంటుంది. మరో పక్క అందుకు అవసరమయిని ఫైళ్ళు, వివరాలు, సమాచారం అంతటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది. ఈ నేపద్యంలో కేంద్రం రచించిన నాటకంలో భాగంగానే కిరణ్ కుమార్ రెడ్డి తన పాత్ర తను సమర్ధంగా పోషిస్తున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను నమ్మవలసి వస్తోంది.

 

చివరికి ఆయనని నిత్యం విమర్శిస్తూనే మళ్ళీ ఆయనతో సమావేశాలవుతున్న టీ-కాంగ్రెస్ నేతలని కూడా అనుమానించక తప్పదు. అంటే, కాంగ్రెస్ అధిష్టానం తయారు చేసి ఇచ్చిన స్క్రిప్టు ప్రకారమే రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలందరూ ఒకరినొకరు దూషించుకొంటూ, ప్రజలని పక్కదారి పట్టిస్తూ విభజన ప్రక్రియను సజావుగా ముందు తీసుకుపోతున్నారనుకోవలసి ఉంటుంది.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ, క్షేత్రస్థాయిలో పాలనా పరమైన విధానాలు మరియు లబ్ధిదారుల శైలి మారలేదనే తీవ్ర అసంతృప్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
దేశ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి.
దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ ఏపీలో మెగా డీఎస్సీ పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది.
కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత టీఎంసీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మమతా బెనర్జీని ధిక్కరిస్తూ ఒక్కరొక్కరుగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన మోడీ.. ఇప్పడు పాలనలో రికార్డు అంటూ సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. మోడీ పాలనా మైలురాయి కేవలం స్వయం ప్రకటిత అంశం మాత్రమేనన్నారు.
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.