ఆయన సీమాంధ్ర పక్షపాతిట! నిజమేనా

Publish Date:Oct 23, 2013

Advertisement

 

‘రాష్ట్ర విభజన జరిగితే కేవలం సీమాంధ్ర ప్రాంత ప్రజలే కాక తెలంగాణా ప్రజలు కూడా తీవ్ర నీటి సమస్యలు ఎదుర్కొంటారు, గనుకనే ప్రజలందరి సంక్షేమం కోరి రాష్ట్రం విడిపోకూడదని చెపుతున్నాను’ అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వాదిస్తున్నసంగతి అందరికీ తెలిసిందే. అయితే యావత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించాల్సిన ఆయన కేవలం సీమాంద్రా ప్రాంతానికే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని తెరాస నేతలతో బాటు ఆయన స్వంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక్కడ రెండు అంశాలు గమనించాల్సి ఉంది. ఒకటి ముఖ్యమంత్రి తెలంగాణాతో సహా యావత్ రాష్ట్ర ప్రజలకి నీటి సమస్యలు రాకూడదని కోరుకొంటున్నారు. రెండవది ఆయన సీమాంధ్ర ప్రాంత పక్షపాతి. ఈ రెండు విషయాలు నిర్ద్వందంగా ఋజువు అయినట్లే అనుకోవచ్చును.

 

ఇక విషయంలోకి వస్తే, ఆయన ఒకవైపు యావత్ ప్రజల సంక్షేమం కోరుకొంటున్నానని చెపుతూనే మరో వైపు నెల్లూరు జిల్లాలో గల కండలేరు ప్రాజెక్టు నుండి తను ప్రాతినిధ్యం వహిస్తున్నచిత్తూరు జిల్లాలో పీలేరు నియోజకవర్గానికి త్రాగునీరు తరలించేందుకు రూ.7390 కోట్లు మంజూరు చేసారు. అది కూడా ఆయన త్వరలో తన పదవికి రాజీనామా చేసి కొత్త రాజకీయ పార్టీ పెడతారని జోరుగా ఊహాగానాలు చెలరేగుతున్న ఈ సమయంలో (అక్టోబర్ 4న) జీవో సంతకం చేయడం విశేషం.

 

కండలేరు ప్రాజెక్టుపై నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలు త్రాగు,సాగు నీరుకోసం ఆధారపడి ఉన్నాయి. వీటితో బాటు తెలుగు గంగ పధకం ద్వారా చెన్నైనగరానికి 15 టీయంసీ (యఫ్టీ) నీళ్ళు ఇవ్వవలసి ఉండగా నీళ్ళు లేని కారణంగా కేవలం 5 టీయంసీ (యఫ్టీ)లను మాత్రమే అందించ గలుగుతున్నాము. మూడు జిల్లాలతో బాటు చెన్నై నగరం కూడా కండలేరు ప్రాజెక్టుపైనే ఆధారాపడి ఉన్నాయి. అయినప్పటికీ వాటికి తీవ్ర నీటి ఎద్దడి తప్పడం లేదు.

 

ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కండలేరు నుండి తన స్వంత జిల్లా చిత్తూరుకి నీరు తరలించుకుపోవడం చాలా అనైతికమవుతుంది. ఇప్పటికే తీవ్ర నీటి ఎద్దడితో బాధలుపడుతున్నఈ మూడు జిల్లాల ప్రజలు, ఈ ప్రాజెక్టు దెబ్బకి పంటల సంగతి దేవుడెరుగు కనీసం తాగునీరుకి కూడా నోచుకోకపోవచ్చును. మూడేళ్ళలో పూర్తిచేయాలనే లక్ష్యంతో మొదటి దశ పనులు ఆరంభించడానికి ముఖ్యమంత్రి అక్టోబర్ 4న అనుమతి కూడా మంజూరు చేసారు. ఈ ప్రాజెక్టులో మొదటి దశ పనుల కోసం రూ.5990 కోట్లు కేటాయింపబడ్డాయి.

 

ప్రజలందరి సంక్షేమం కోరుతున్నాని చెప్పుకొనే ముఖ్యమంత్రి తన స్వంత జిల్లాకి, నియోజక వర్గానికే ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తున్నారు? కేవలం సీమాంద్రాకే ముఖ్యమంత్రి అనిపించుకొన్న ఆయన ఇప్పుడు తన పరిధిని మరికొంత కుచించుకొని కేవలం చిత్తూరుకే ముఖ్యమంత్రిగా వ్యవహరించడం ఎంతవరకు సబబు? ఆయన కేవలం తన జిల్లాను మాత్రమే దృష్టిలో ఉంచుకొని మూడు జిల్లాలకు ఈవిధంగా అన్యాయం చేస్తే, ఆ మూడు జిల్లాల ప్రజలకు ఆయన ఏమని సమాధానం చెపుతారు?

 

ఇప్పటికే నీళ్ళు లేక అల్లాడుతున్న కందలేరుపై మరో కొత్త ప్రాజెక్టుకి అన్నివేళ కోట్ల రూపాయలతో మరో కొత్త ప్రాజెక్టు ఇంత హడావుడిగా ఎందుకు ఆమోదించవలసి వచ్చింది? ఒకవేళ ఆయన తన రాజకీయ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొనే ఈ నిర్ణయం తీసుకొన్నపటికీ, దీనివల్ల ఆయన ఆశించిన ప్రయోజనము నెరవేరుతుందా? ఇంత కాలం ముఖ్యమంత్రిగా అధికారం వెలగబెట్టి ఇకనేడో రేపో దిగిపోయే సమయంలో ఇటువంటి వివాదస్పద నిర్ణయాలు తీసుకొన్నంత మాత్రాన్నవాటిని ఆ తరువాత వచ్చే ప్రభుత్వాలు ఆమోదించే అవకాశం ఉంటుందా?

 

ప్రజాప్రతినిధులుగా ఎన్నికయి అధికారం చేప్పటిన వారు, ప్రభుత్వానికి, ప్రజల సొమ్ముకి ధర్మకర్తల వలే వ్యవహరించాలి తప్ప అధికారం చేతిలో ఉంది గనుక దానిని దుర్వినియోగం చేస్తే, వారు కొత్తపార్టీలు పెట్టుకొని వచ్చినపటికీ కూడా అటువంటి వారికి ప్రజలు తప్పకుండా శలవు ప్రకటిస్తారు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.