LATEST NEWS
ప్రధాని నరేంద్ర మోడీ తన కేబినెట్ పునర్వ్యవస్థీకరణ విషయంలో సీరియస్ గా కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే బీజేపీ అధిష్ఠానం ఇటీవలే పార్టీ నూతన జాతీయ కార్యవర్గాన్ని  ప్రకటించింది. అలాగే ఇప్పుడు దేశ వ్యాప్తంగా భర్తీ చేయాల్సిన ఉన్న ఐదు రాష్ట్రాల గవర్నర్ లను భర్తీ చేయాలని కేంద్రం యోచిస్తున్నది. ఈ ఐదు గవర్నర్ పదవులలో రెండింటిని ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు కేటాయించాలని మోడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ రెండింటిలోనూ ఒకటి ఎన్డీయేలో కీలక భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీకి కేటాయించాలని మోడీ నిర్ణయించినట్లు ఢిల్లీ వర్గాల భోగట్టా. ఈ సమాచారాన్ని ఆయన ఇప్పటికే చంద్రబాబుకు అందించారని అంటున్నారు.   ఇప్పటికే టీడీపీ తరఫున సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కిన సంగతి తెలిసిందే. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలతో పాటు  రాజకీయ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయనకు ఆ అవకాశం కల్పించారు. ఇప్పుడు 5 రాష్ట్రాల భర్తీలో మరో 2 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించాలని కేంద్రం డిసైడ్ అవ్వడంతో, రెండో గవర్నర్ పదవి కూడా టీడీపీ ఖాతాలోకి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో తెలుగుదేశం తరఫున మరో గవర్నర్ పదవికి ఎవరు ఎంపికౌతారన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. కాగా గవర్నర్ రేసులో ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో  సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ యనమలరామృష్ణుడు, అలాగే మరో మాజీ స్పీకర్ ప్రతిభా భారతి, అలాగే సీనియర్ నాయకుడు కేఈ క్రిష్ణమూర్తిలు ఉన్నారు. వీరిలో యనమల, కేఈ బీసీ వర్గానికి చెందిన వారు కాగా, ప్రతిభా భారతి ఎస్సీసామాజిక వర్గానికి చెందిన నేత. ఈ ముగ్గురూ కూడా ఆరంభం నుంచీ తెలుగుదేశం పార్టీకి విధేయంగా ఉండి కీలక బాధ్యతలలో సేవలందించిన వారే. వీరి ముగ్గురిలో చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారన్న ఆసక్తి, ఉత్కంఠా సర్వత్రా నెలకొని ఉంది.   Another Governer post for TDP,  NDA Governor Appointments, Yanamala Ramakrishnudu, Pratibha Bharati, KE Krishnamurthy, Chandrababu Naidu, TeluguOne
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,  వైసీపీ అధినేత  వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హైదరాబాద్ పర్యటన తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో   ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ఆ సందర్భంగా  ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానిక నేతలు ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు   హాట్ టాపిక్‌గా మారాయి. వైఎస్ జగన్ ఏదో బీఆర్ఎస్ నాయకుడా అన్నట్లుగా ఆ కటౌట్లు, పోస్టర్లు, బ్యానర్లు ఉన్నాయి.  ఈ ఫ్లెక్సీల్లో  జగన్ తో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ల ఫోటోలు కూడా ఉన్నాయి బేగంపేట, పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్డు, ఖైరతాబాద్ తదితర కీలక కూడళ్లలో ఇవి దర్శనమిస్తున్నాయి. గతంలో వైసీపీ, బీఆర్ఎస్  మధ్య ఉన్న రాజకీయ సంబంధాలు, ఇరు రాష్ట్రాల ముఖ్య నేతల మధ్య ఉన్న సాన్నిహిత్యం నేపథ్యం దృష్ట్యా ఇప్పుడీ పోస్టర్లు, ఫ్లెక్సీలు ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా, పొలిటికల్ చర్చకు తెరలేపాయి.  జగన్ పర్యటనలూ ర్యాలీలలో కేటీఆర్, కేసీఆర్ ఫొటోలు.. తెలంగాణలో వైసీపీ, బీఆర్ఎస్ ల పొత్తకు సంకేతాలా అన్న చర్చకు తెరలేచింది. తెలంగాణలో త్వరలో స్థానిక ఎన్నికలు ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్, వైసీపీల మధ్య పొలిటికల్ అలయెన్స్ ఏదైనా కుదిరిందా? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  ఎందుకంటే తెలంగాణ స్థానిక పోరులో  ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీఆర్ఎస్ పట్టు నిలుపుకోవాలంటే.. అందుకు జనసేన రంగంలో ఉండటం ఒక విధంగా జనసేన పోటీ బీఆర్ఎస్  విజయావకాశాలకు గండి కొట్టే అవకాశాలున్నాయన్న అభిప్రాయం పరిశీలకులలో వ్యక్తం అవుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఏపీకి చెందిన వారు జనసేన వైపు మొగ్గు చూపుతారనీ, అలా జరగకుండా అడ్డుకోవాలంటే..జగన్ సహకారం అవసరమనీ బీఆర్ఎస్ భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ కూడా అందుకు సుముఖంగానే ఉండటంతో రానున్న రోజులలో వైసీపీ, బీఆర్ఎస్ పోత్తుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడినా ఆశ్వర్యం లేదని అంటున్నారు.  YS Jagan Hyderabad Visit, BRS YSRCP Flexis Begumpet, Jagan Jalavihar Wedding Visit, Telangana Politics Updates, KCR KTR YS Jagan Cutouts
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ, ఐఏఎస్ వ్యవస్థలోనూ అత్యంత ప్రభావమంతమైన అధికారిగా గుర్తింపు పొందిన 1994 బ్యాచ్ ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ జగన్ హయాంలో వ్యవహరించిన తీరు కారణంగా ప్రతిష్ఠను మసకబార్చుకున్నారు. చివరికి స్వచ్ఛంద విరమణ తీసుకున్నారు. జగన్ హయాంలో తన పరిధులను మరిచి వ్యవహరించిన ఆయన తీరా వైసీపీ 2024 ఎన్నికల్లో పరాజయాన్ని మూటగట్టుకు అధికారం కోల్పోయిన తరువాత.. తప్పులను గ్రహించి.. ఆ తప్పులకు శిక్ష తప్పదన్న భయంతో వీఆర్ఎస్ తీసుకున్నారు.   సెప్టెంబర్ 30, 2024న ఆయన ఇలా రాజీనామా చేయగానే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అలా  ఆమోదించేసింది. అప్పుడు గానీ ఆయనకు తాను చేసినది తొందరపాటు చర్య అని గ్రహింపునకు రాలేదు. రాజీనామాను వెనక్కు తీసుకుని తిరిగి సర్వీసులో చేరుదామని ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో చేసేదేమీ లేక ఆయన తన స్వరాష్ట్రమైన యూపీకి చేరుకున్నారు. ఇప్పుడు తాజాగా ఆయన కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు.    ఏపీలో   2019 నుండి 2021 వరకు ప్రవీణ్ ప్రకాష్  అప్పటి ముఖ్యమంత్రి జగన్ కు ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ సమయంలో ఆయన ముఖ్యమంత్రి సీఎంవోలో  క్రియాశీల  అధికారిగా, ప్రభుత్వ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించిన  మోస్ట్ పవర్ ఫుల్ బ్యూరోక్రాట్‌గా పేరొందారు. జగన్‌ హయంలో ఆయన ఓ సమర్ధుడైన ఐఏఎస్ అధికారిగా కంటే జగన్‌కు, వైసీపీ నమ్మకస్తుడైన ఓ పొలిటికల్ అసిస్టెంట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.  ఆయన పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులతో వ్యవహరించిన తీరుతో తీవ్ర విమర్శల పాలయ్యారు.   ఆ తరువాత వారికి క్షమాపణ చెప్పారు. ఇలా ఒకటనేంటి ఆయన తన చర్యలతో చేష్టలతో బోలెడంత అపఖ్యాతి మూటగట్టుకున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో  వైసీపీ ప్రభుత్వం దిగిపోయి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రవీణ్ ప్రకాష్ కు ఎటువంటి పోస్టింగ్ ఇవ్వలేదు. దాదాపు మూడు నెలలు వేచి చూసి ప్రవీణ్ ప్రకాష్ చేసిన రాజీనామాను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆమోదించింది.  అటువంటి ప్రవీణ్ ప్రకాష్ తాజాగా కాంగ్రెస్ గూటికి చేరి ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగుపెట్టారు.   Praveen Prakash join Congress, Ex IAS Praveen Prakash, Andhra Pradesh IAS VRS, UP Congress Politics, contravarsies, Ap Politics  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైపీపీ అధినేత ప్రెస్ మీట్ అనగానే వైసీపీ నేతలు, శ్రేణుల గుండెల్లో గుబులు మొదలౌతుంది. అదే సమయంలో ఆయన ప్రత్యర్థులకు, నెటిజనులకు, మీమర్లకు పండుగ వస్తున్నదన్నంత ఆనందం మొదలౌతుంది. జగన్.. పర్యటనలు, ప్రకటనలు, మీడియా సమావేశాలు ఎప్పుడూ రాజకీయ సంచలనమే. ఆయన ఏం మాట్లాడినా నెటిజనులకు, విమర్శకులకు, ప్రత్యర్థులకు ఎప్పుడూ అడ్డంగా దొరికి పోతుంటారు. వాస్తవ దోషాలు, తప్పులు, తడబాటు ఇవే జగన్ రెడ్డి ప్రసంగాలనూ, ప్రెస్ మీట్లనూ ప్రత్యేకంగా నిలుపుతాయి.     తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీపీఎస్సీ, డీఎస్సీ రెండూ ఒకటేనంటూ చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతలను తలలుపట్టుకునేలా చేస్తే.. ఆయన ప్రత్యర్థులు, నెటిజనులు, మీమర్లు పండుగ చేసుకున్నారు. కనీసమైన ప్రాథమిక పరిజ్ణానం లేని వ్యక్తా ఐదేళ్ల పాటు ఏపీ ముఖ్యమంత్రిగా పని చేసింది అంటూ నెట్టింట జగన్ తెగ ట్రోలింగ్ కు గురయ్యారు.  డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి మధ్య ఉన్న  తేడా తెలియని వ్యక్తికి రాజకీయాలెందుకు? అంటూ  తెలుగుదేశం  కూటమి నేతలు, నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు.   గతంలో వైసీపీ సోషల్ మీడియా, మీడియా లోకేష్ ఆహార్యం, ఆహారం, భాష ఇలా ప్రతి విషయంలోనూ ట్రోల్ చేసేది. బాడీ షేమింగ్ కు కూడా వెనుకాడేది కాదు. అయితే లోకేష్ తనను తాను మేకోవర్ చేసుకోవడానికి ఆ ట్రోలింగ్ ను ఉపయోగించుకున్నారు. ఇప్పుడు వైసీపీయులకు లోకేష్ విషయంలో పన్నెత్తి మాట్లాడే అవకాశం కూడా దొరకడం లేదు. అందుకు భిన్నంగా వైసీపీ అధినేత జగన్ తన ప్రెస్ మీట్లలో అడ్డంగా దొరికిపోతూ విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. దీంతో వైపీపీయులు జగన్ ప్రెస్ మీట్లకు దూరంగా ఉంటే మేలని అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ప్రెస్ మీట్ లనేమిటి అసలు బయటకు రాకుండా సైలంట్ గా ఉంటే పార్టీకి మేలు జరుగుతుందనీ,  అలా కాకుండా ఆయన బయటకు వచ్చి మాట్లాడితే ఉన్న కొద్ది పాటి ప్రతిష్ఠ కూడా మంటగలిసేలా ఉందన్న భయం వైసీపీయుల్లో వ్యక్తమతోంది.   YS Jagan pressmeets worrying YCp, YSRCP Politics, Jagan Press Meet Controversies, AP Politics News, Jagan Mohan Reddy Speeches
తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) అధినేతత్రి కల్వకుంట్ల కవిత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ను అనుసరిస్తున్నారు. ఎన్నికల బరిలో దిగిన తొలి ప్రయత్నంలోనే  ఘన విజయం సాధించి సీఎం పీఠాన్ని అధిరోహించిన టీవీకే అధినేత విజయ్ అడుగు జాడల్లో నడుస్తూ కవిత కూడా తెలంగాణ రక్షణ సేనను గెలుపు బాటలో నడిపించి తెలంగాణ సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నారు.  ఇందుకోసం ఆమె తాజాగా తమిళనాడు సీఎం విజయ్ కి   సన్నిహితుడు,  ఆయన వ్యక్తిగత జ్యోతిష్యుడు అయిన  రికీ రాధన్ పండిట్ వెట్రివేట్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ వచ్చిన ఆయన  కవితతో భేటీ అయ్యారు.  తమిళనాడు రాజకీయాల్లో రిక్కీ రాధన్ పండిట్ పాత్ర   కీలకమైనదిగా భావిస్తారు. ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ ప్రతికూలంగా వ్యాఖ్యానించినప్పటికీ, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ  విజయం సాధించి ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని రికీ రాధన్  జోస్యం చెప్పారు. ఆయన చెప్పినట్లే విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో రిక్కీ రాధన్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. విజయ్ తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాధన్‌ను ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా కూడా నియమించారు. అయితే ప్రతిపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ఆ నియామకాన్ని ఉపసంహరించుకున్నారనుకోండి అది వేరే విషయం. అయితే విజయ్ రాజకీయ నిర్ణయాల్లో రాధన్ పండిట్ సలహాలు ఇప్పటికీ కీలక పాత్ర పోషిస్తున్నాయని అంటారు.  ఇటువంటి రాధన్ పండిట్ చెన్నై నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి కవితతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.   కవిత తన కుమారుడితో కలిసి రిక్కీ రాధన్ పండిట్‌ను శాలువాతో సత్కరిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ  వైరల్ అవుతున్నాయి.   తెలంగాణ రక్షణ సేన భవిష్యత్తు, రాబోయే రోజుల్లో కవిత రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతోందనే అంశాలపైనే  కవిత రాధన్ పండిట్ సలహాలు కోరినట్లు తెలుస్తోంది.    తమిళనాడులో విజయ్‌కి తిరుగులేని రాజకీయ విజయం లభిస్తుందని ముందుగానే జోస్యం చెప్పిన  రాధన్ పండిట్ ను కవిత ఆశ్రయించారని అంటున్నారు.  తమిళనాడు సీఎం విజయ్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై కవిత  ఇటీవల  బహిరంగంగానే ప్రశంసలు కురిపించడం, తెలంగాణలో  అమ్మ పాలన  అందిస్తామని ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాధన్ పండిట్ తో కవిత భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.   Kalvakuntla Kavitha follows Tamilnadu CM Vijay, Ricky Radhan Pandit, CM Vijay Astrologer, Kavitha Ricky Radhan Meeting, Telangana Rakshana Samithi, Telangana Politics
ALSO ON TELUGUONE N E W S
హారర్,  సస్పెన్స్  థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే సినీ ప్రియులకు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు నిత్యం కొత్త అనుభూతులను అందిస్తూనే ఉన్నాయి. వణుకు పుట్టించే విజువల్స్, గుండె వేగాన్ని ఒక్కసారిగా పెంచే మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో సాగే చిత్రాలకు ఎప్పుడూ విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అటువంటి ఒక భయంకరమైన హారర్ థ్రిల్లర్ డ్రామా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.  ఈ విలక్షణమైన హారర్ థ్రిల్లర్ చిత్రం పేరు 'ఘబడ్‌కుండ్'. ఒక సుదూర గ్రామంలో దాగి ఉన్న అపారమైన బంగారం, దాని చుట్టూ అల్లుకున్న ఒక భయంకరమైన అదృశ్య శక్తి పురాణ గాథ నేపథ్యంగా ఈ సినిమా కథ నడుస్తుంది. ఆ గ్రామంలో ఉన్న ఒక ప్రాచీన రహస్య బావిలో అపారమైన నిధి దాగి ఉందనే విషయం ఊరి ప్రజలందరికీ తెలుసు. అయితే, ఆ నిధిని దక్కించుకోవడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరికీ ఆ ప్రాంతం ప్రాణాంతకంగా మారుతుంది. ఆ బావిలోని అదృశ్య శక్తి,  దానిని కాపాడే దుష్ట శక్తుల కారణంగా అక్కడ ఊహించని భయంకరమైన అనుభవాలు ఎదురవుతాయి. బావి లోపలి నుండి వినపడే మహిళ అరుపులు ప్రేక్షకులను సైతం తీవ్ర భయానికి గురిచేస్తాయి. ఈ కథలో దిలీప్ అనే ఒక సాధారణ కుటుంబానికి చెందిన యువకుడు అనుకోకుండా ఒక రోజు ఆ భయంకరమైన రహస్య బావి దగ్గరకు చేరుకుంటాడు. అక్కడ ఒక మహిళ ప్రాణభయంతో అరుస్తున్న గొంతు విని ప్రమాదంలో పడినప్పటికీ, ఆశ్చర్యకరంగా అతను ఆ బావి నుండి ప్రాణాలతో సురక్షితంగా బయటపడతాడు. ఈ సంఘటన తర్వాత దిలీప్ జన్మవృత్తాంతానికి, ఆ ప్రాచీన బావి చరిత్రకు మధ్య ఉన్న ఊహించని సంబంధం వెలుగులోకి రావడం ప్రారంభమవుతుంది. దిలీప్ సాధారణ యువకుడు కాదని, ఆ రహస్య నిధికి అతనే నిజమైన వారసుడని వెల్లడైన తర్వాత కథ అనేక మలుపులు తిరుగుతుంది. మరొకవైపు, ఖాంగ్రీ అనే ఒక క్రూరమైన తాంత్రికుడు కూడా ఆ బంగారంపై కన్నేసి, పౌర్ణమి రోజున ఆ బావిలోని నిధిని బయటకు తీయడానికి కుట్ర పన్నుతాడు. ఒక అమాయక అమ్మాయిని బలి ఇవ్వడానికి ఆ తాంత్రికుడు ప్రయత్నించడంతో కథ అత్యంత ఉత్కంఠభరితంగా మారుతుంది. దర్శకుడు ప్రీతమ్ ఎస్. కే. పాటిల్ ఎంతో నైపుణ్యంతో తెరకెక్కించిన ఈ చిత్రంలో కుశాల్ బద్రికే, సందీప్ పాఠక్, దేవ్దత్ నాగే, శశాంక్ షెండే మరియు స్మిత పైగుడే తమ అద్భుతమైన నటనతో మెప్పించారు. 19 జూన్ 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా ప్రముఖ రివ్యూ ప్లాట్‌ఫారమ్ IMDbలో 10 కి గాను 7.5 వంటి సాలిడ్ రేటింగ్‌ను దక్కించుకుంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్న ఈ చిత్రం, ఒంటరిగా చూసేవారికి ఒళ్లు గగుర్పొడిచే అనుభూతిని ఇస్తూ ఓటీటీ ప్రేక్షకులను థ్రిల్ చేస్తోంది.
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన భావోద్వేగ భక్తిరస చిత్రం 'ఇరుముడి' ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి తొలి ఆట నుంచే విశేష ఆదరణతో బ్లాక్‌బస్టర్ టాక్ వైపు దూసుకెళ్తోంది. బాక్సాఫీస్ వద్ద రవితేజకు సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ చిత్రం పూనకాలు తెప్పిస్తోంది. సినిమా విడుదలైన మొదటి రోజే వీక్షించిన టాలీవుడ్ ప్రముఖ క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రంపై కురిపించిన ప్రశంసల వర్షం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ సినిమాను ఎమోషన్ మరియు డివోషన్ల ప్యూర్ సెలబ్రేషన్ అని అభివర్ణిస్తూ, ఈ తరంలో ప్రతీ ఒక్కరూ తప్పక చూడాల్సిన అత్యంత ప్రత్యేకమైన చిత్రమని సందీప్ రెడ్డి వంగా చాలా స్పష్టంగా స్పష్టం చేశారు. సందీప్ రెడ్డి వంగా తన సమీక్షలో పేర్కొంటూ, మాస్ మహారాజా రవితేజ, చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర మరియు దర్శకుడు శివ నిర్వాణ ముగ్గురూ కలిసి ప్రేక్షకులను ఒక మర్చిపోలేని భావోద్వేగ ప్రయాణంలోకి తీసుకువెళ్లారని ప్రశంసించారు. ఈ సినిమాలోని ఎమోషన్లు మనసులోని అత్యంత లోతైన భావాలను సున్నితంగా తాకుతాయని, థియేటర్లో ఎండ్ క్రెడిట్స్ మరియు రోలింగ్ టైటిల్స్ పడిపోయాక కూడా ఈ అనుభూతి ప్రేక్షకుడి మనసులో నిలిచిపోతుందని అన్నారు. ఆడియన్స్‌ను ఇంతగా వెంటాడే కథనం రూపొందించినందుకు రవితేజ, శివ నిర్వాణలకు సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. సందీప్ రెడ్డి వంగా లాంటి ఇంటెన్స్ విజనరీ డైరెక్టర్ నుంచి 'ఇరుముడి' చిత్రానికి ఈ స్థాయిలో అపూర్వమైన రివ్యూ లభించడం చూసి చిత్ర యూనిట్ ఎంతో ఉత్సాహాన్ని పొందుతోంది. బాక్సాఫీస్ వద్ద సుమారు ₹45 కోట్ల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ సినిమాకి వస్తున్న విశేష స్పందనను చూసి నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ శనివారం నేరుగా రవితేజ మరియు శివ నిర్వాణలను కలిసి ప్రత్యేకంగా అభినందించారు. మాస్, ఎమోషన్, మరియు భక్తి రసాల కలబోతగా వచ్చిన ఈ 'ఇరుముడి' సినిమా ఈ తరం తెలుగు చిత్రసీమలో ఒక సరికొత్త మైలురాయిగా నిలిచిపోతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
టాలీవుడ్ చిత్రసీమ పురోగతిని, వ్యాపార విస్తరణను ప్రోత్సహించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే సరికొత్త ఉత్తర్వులను (GO) అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నూతన సినీ విధానంపై పరిశ్రమ వర్గాలు విశేష సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ (ATFPG) దీనిని ఒక ప్రగతిశీల నిర్ణయంగా అభివర్ణిస్తూ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. నేడు మన తెలుగు చిత్రాలు ఐమాక్స్, డాల్బీ సినిమా, హెచ్‌డీఆర్ వంటి అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాన్-ఇండియా రేంజ్‌లో రూపొందుతున్నాయి. కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ చిత్రాల నిర్మాణ వ్యయాన్ని తిరిగి రాబట్టుకోవడానికి సరైన నమూనా అవసరం. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త పాలసీ ద్వారా అర్హత గల సినిమాలకు టికెట్ ధరల పెంపునకు నిబంధనలతో కూడిన దరఖాస్తు విధానం సులభతరమైంది. అయితే, ఈ జీవో కేవలం టికెట్ ధరల పెంపుతోనే ముగిసిపోలేదు. ప్రతి థియేటర్ లోనూ (మల్టీప్లెక్స్ సహా) కనీసం 25 శాతం సీట్లను నాన్-ప్రీమియం కేటగిరీకి రిజర్వ్ చేయాలని స్పష్టం చేసింది. దీనివల్ల అన్ని వ‌ర్గాల ప్రేక్షకులకూ సినిమాలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా, రోజుకు 5 ప్రదర్శనలకు (5 Shows) ప్రభుత్వం అనుమతించడం పెద్ద సినిమాలకు ఎంతో ఉపకరిస్తుంది. మొదటి కొద్ది రోజుల్లోనే భారీ డిమాండ్ నెరవేరి, ఆ తర్వాత థియేటర్లు ఖాళీ అవుతాయి. దీనివల్ల చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలకు తగినన్ని స్క్రీన్లు దక్కే అవకాశం మెరుగవుతుంది. మరో ముఖ్యమైన విశేషం ఏమిటంటే, నిరంతరం శ్రమించే సినీ కార్మికుల సంక్షేమానికి ఈ కొత్త విధానం పెద్దపీట వేస్తోంది. ఈ నిర్ణయాల వల్ల చిత్రసీమలో పెట్టుబడులు పెరగడమే కాకుండా వేలాది మంది కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భద్రత చేకూరుతుందని నిర్మాతల గిల్డ్ అభిప్రాయపడింది. ఈ కొత్త నిర్ణయం పట్ల టాలీవుడ్ ప్రముఖులు, నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలనాత్మక నిర్ణయంతో మున్ముందు రాబోయే భారీ పాన్-ఇండియా సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్ల సమీకరణాలు మరింత ఊపందుకోనున్నాయి.
ప్రముఖ నటి శ్రీమతి షావుకారు జానకి గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న నటి శ్రీమతి జానకి గారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 400 చిత్రాల్లో నటించారు. కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు పోషించారు. శ్రీమతి షావుకారు జానకి గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. (పవన్ కళ్యాణ్) ఉప ముఖ్యమంత్రి
తెలుగు సినీ పరిశ్రమ ట్రెండ్‌ను పూర్తిగా తిరగరాసిన సినిమాల్లో 'అర్జున్ రెడ్డి' ఒకటి. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సాధించిన విజయం, సృష్టించిన సంచలనం చిన్నది కాదు. అయితే ఈ క్లాసిక్ బోల్డ్ మూవీ రూపొందడానికి ముందు దర్శకుడికి, చిత్ర బృందానికి ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోదరుడు, అలాగే 'అర్జున్ రెడ్డి' నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సినిమా కథను వివిధ ప్రొడ్యూసర్లకు వినిపించే సమయంలో ఎదురైన సవాళ్లను ఆయన గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా సినిమాలో తీవ్ర నిరాశలో ఉన్న హీరో తన కామ వాంఛను, కోపాన్ని అదుపు చేసుకోవడానికి ప్యాంటులో ఐస్ క్యూబ్స్ వేసుకునే ఒక అత్యంత బోల్డ్ సీన్ ఉంటుంది. కథా చర్చల్లో ఈ పాయింట్ రాగానే చాలామంది నిర్మాతలు తట్టుకోలేకపోయేవారట. వెంటనే నెరేషన్ ఆపేసి, "ఇక మేం ఏమీ వినాల్సిన అవసరం లేదు, కథ ఇక్కడితో ఆపేయండి" అని చెప్పి పంపించేసేవారని ప్రణయ్ వెల్లడించారు. అప్పటివరకు తెలుగు తెరపై ఇలాంటి రా & రియలిస్టిక్ అప్రోచ్ చూడకపోవడంతో రిస్క్ చేయడానికి ఏ ప్రొడ్యూసర్ ముందుకు రాలేదు. కానీ సందీప్ మాత్రం తన విజన్, క్యారెక్టరైజేషన్ పై గట్టి నమ్మకంతో ఉన్నారు. చివరికి బయటి నిర్మాతలు ఎవరూ నమ్మకపోవడంతో, తమ సొంత మామిడి తోటను అమ్మి భద్రాకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. విడుదలైన తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఏ దృశ్యం చూసి నిర్మాతలు వెనకడుగు వేశారో, అదే సీన్స్, బోల్డ్ కంటెంట్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి సందీప్ రెడ్డి వంగాను నేడు భారతీయ చిత్రసీమలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా నిలబెట్టాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రణయ్ రెడ్డి వంగా చేసిన ఈ కామెంట్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు, ఫాన్స్ ఈ పాత జ్ఞాపకాలను రీట్వీట్ చేస్తూ "సందీప్ వంగా విజన్ ముందే ఊహించలేక ఆ నిర్మాతలు గొప్ప అవకాశాన్ని వదులుకున్నారు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 'స్పిరిట్' అనే భారీ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో నిమగ్నమయ్యారు. ఒక చిన్న సినిమాగా మొదలై ఇండియన్ సినిమాలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన అర్జున్ రెడ్డి ప్రయాణం ఎందరో యువ దర్శకులకు ఎప్పటికీ ప్రేరణగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు', 'ఓయ్!' వంటి యూత్‌ఫుల్ బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన చాక్లెట్ బాయ్ సిద్ధార్థ్, విభిన్నమైన పాత్రలతో దక్షిణాదిలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఇటీవల విడుదలైన 'ఆపరేషన్ సఫేద్ సాగర్' వెబ్ సిరీస్‌లో స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహూజా పాత్రలో అద్భుతమైన అభినయంతో మెప్పించిన ఆయన, తాజాగా సమాజం పట్ల ఒక నటుడిగా తనకున్న బాధ్యతలు, సినీ నైతిక విలువలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్రపరిశ్రమలో మహిళలను కేవలం ఒక వస్తువులా చిత్రీకరించే ధోరణిపై, ప్రత్యేకించి ఐటెమ్ పాటల సంస్కృతిపై సిద్ధార్థ్ స్పందిస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "ఒక మహిళ చుట్టూ నలభై మంది మగవారు చేరి ఆమెతో ఎలాగైనా ప్రవర్తించవచ్చనే భావన కలిగించే ఐటెమ్ సాంగ్స్‌లో నేను నా కెరీర్‌లో ఎన్నడూ భాగం కాలేదు, ఇకముందు కూడా చేయను" అంటూ తన నిశ్చిత అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు తేల్చి చెప్పారు. సినిమాల్లో పాత్రల ఎంపికలో తనకు కొన్ని స్పష్టమైన నియమాలు, హద్దులు ఉన్నాయని ఈ సందర్భంగా సిద్ధార్థ్ వివరించారు. తాను కేవలం హీరో పాత్రలకే పరిమితం కావాలనుకోవడం లేదని, కథ డిమాండ్ చేస్తే పూర్తిస్థాయి విలన్ రోల్స్ చేయడానికి కూడా సిద్ధమేనని తెలిపారు. అయితే చెడు పాత్రలను గొప్పగా చూపించి, ప్రేక్షకులకు తప్పుడు సందేశం ఇవ్వడం తనకు ఏమాత్రం నచ్చదని చెప్పారు. ఒకవేళ తాను అలాంటి నెగెటివ్ షేడ్స్ లేదా అసభ్యకర సన్నివేశాల్లో కనిపించాల్సి వస్తే, అది పూర్తిస్థాయి క్రూరమైన విలన్ పాత్ర అయినప్పుడే ఒప్పుకుంటానని స్పష్టం చేశారు. ఎందుకంటే అలాంటి కథల్లో చివర్లో ఆ విలన్ ఘోరమైన శిక్షను అనుభవిస్తాడు కాబట్టి అది సరైన సందేశాన్ని ఇస్తుందన్నారు. సమాజంలో చెడు పాత్రలను ఆదర్శంగా చూపే చిత్రాల్లో భాగం కావడం నటుడిగా తన నైతికతకు విరుద్ధమని అభిప్రాయపడ్డారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'బాయ్స్' చిత్రంతో వెండితెరకు పరిచయమై, అనేక కుటుంబ కథా చిత్రాలు, లవ్ స్టోరీలతో లవర్ బాయ్‌గా అలరించిన సిద్ధార్థ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సినిమా రంగంలో కమర్షియల్ విలువల కంటే సామాజిక బాధ్యతకే ప్రాధాన్యమిచ్చే నటులు అరుదుగా ఉంటారని నెటిజన్లు ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బాక్సాఫీస్ ఫలితాలతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు సరికొత్త కథాంశాలను ఎంచుకుంటూ ప్రయోగాలు చేసే సిద్ధార్థ్, తన తదుపరి సినిమాలతో కూడా అదే బాటలో ప్రయాణించనున్నారు. ఒక నటుడిగా ఆయన వ్యక్తపరిచిన ఈ సూటి ఆలోచనలు రాబోయే రోజుల్లో సినీ పరిశ్రమలో కథల ఎంపికపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.
మాస్ మహారాజా రవితేజ, క్లాస్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కిన ఎమోషనల్ డివోషనల్ యాక్షన్ డ్రామా 'ఇరుముడి' ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో రవితేజ యాక్షన్ తో పాటు ఎమోషనల్ సీన్లు ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ సినిమాలో రవితేజ కూతురిగా నటించిన చిన్నారి తన అద్భుతమైన నటనతో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆ చిన్నారే కేరళకు చెందిన చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర. సినిమాలో 'మణికంఠ' అలియాస్ 'మణెమ్మ' పాత్రలో ఆమె చూపించిన ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా రవితేజతో వచ్చే తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ సీన్లలో ఆమె సహజమైన అభినయం ఆడియన్స్‌తో కంటతడి పెట్టిస్తోంది. తొలి తెలుగు చిత్రమే అయినప్పటికీ ఎంతో ఆత్మవిశ్వాసంతో నటించిన ఈ చిన్నారి, తన పాత్రకు సొంతంగా తెలుగులోనే డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇంతటి ప్రాధాన్యత ఉన్న లక్కీ ఆఫర్ ఈ చిన్నారికి ఎలా వచ్చిందనే విషయంపై రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నక్షత్ర ఆసక్తికర విశేషాలను వెల్లడించింది. ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్న నక్షత్రకి సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడం అంటే ఎంతో ఇష్టమట. అలా ఆమె చేసిన కొన్ని రీల్స్ చూసిన దర్శకుడు శివ నిర్వాణ, ఈ కథలోని అమాయకమైన, బలమైన పాత్రకు నక్షత్ర అయితే సరిగ్గా సరిపోతుందని భావించి ఆఫర్ ఇచ్చారని తెలిపింది. మైత్రీ మూవీ మేకర్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలో, మాస్ రాజా రవితేజ వంటి పెద్ద హీరోతో కలిసి నటించడం తన అదృష్టమని నక్షత్ర సంతోషం వ్యక్తం చేసింది. షూటింగ్ సమయంలో రవితేజ, ప్రియా భవానీ శంకర్ తనను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారని, దర్శకుడు శివ నిర్వాణ ప్రోత్సాహంతో ఆడుతూ పాడుతూ తన పాత్రను పూర్తి చేశానని వెల్లడించింది. చిన్న వయసులోనే దక్షిణాది భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలోనూ పలు చిత్రాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న ఈ కేరళ కుట్టి.. పృథ్వీరాజ్ సుకుమారన్, శివరాజ్ కుమార్ వంటి అగ్ర కథానాయకులతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది. స్కూల్ టీచర్లు, తల్లిదండ్రుల సహకారంతో చదువును, నటనను సమన్వయం చేసుకుంటున్నట్లు తెలిపింది. ప్రస్తుతం 'ఇరుముడి' విజయంలో కీలక పాత్ర పోషించిన బేబీ నక్షత్రపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, సినీ ప్రియులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన ఈ చిన్నారికి భవిష్యత్తులో టాలీవుడ్‌లో మరింత మంచి అవకాశాలు వచ్చి వెండితెరపై ముద్ర వేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.   Baby Nakshatra Irumudi Movie, Ravi Teja Irumudi Child Artist, Baby Nakshatra Instagram Reels, Siva Nirvana Irumudi Movie Update, Baby Nakshatra Telugu Dubbing
భారతీయ సినీ రంగాన్ని ఏడు దశాబ్దాలకు పైగా తన అసాధారణమైన అభినయంతో ఏలిన మహానటి, పద్మశ్రీ షావుకారు జానకి తుదిశ్వాస విడిచారనే వార్త వినగానే మొత్తం చిత్రసీమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ చేదు వార్త తెలిసి నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. జానకి గారి మరణం పట్ల ఆయన భావోద్వేగంగా స్పందిస్తూ ఒక ప్రత్యేక ప్రకటనను విడుదల చేశారు. "మహానటి షావుకారు జానకిగారు తుదిశ్వాస విడిచారన్న వార్త తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. జానకిగారితో మా నందమూరి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నాన్నగారు (ఎన్టీఆర్) హీరోగా రిలీజైన తొలి చిత్రం 'షావుకారు'తోనే ఆమె 'షావుకారు జానకి'గా సుప్రసిద్ధులయ్యారు. అలా నాన్నగారికి జానకిగారు తొలి హీరోయిన్, అలాగే ఆమె తొలి కథానాయకుడు ఆయన. నాన్నగారితో అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు జానకిగారు. " అని గుర్తుచేసుకున్నారు. అంతేకాదు, నందమూరి కుటుంబానికి చెందిన ఎన్.ఏ.టి. (N.A.T.) బ్యానర్ నిర్మాణంలో వచ్చిన తొలి చిత్రం 'పిచ్చిపుల్లయ్య'లో కూడా జానకి కీలక పాత్ర పోషించారు. ఇక మరో ఆసక్తికరమైన విషయాన్ని బాలయ్య బయటపెట్టారు. "పాండురంగ మహాత్మ్యం నుంచీ యన్.ఏ.టి. బ్యానర్ లోగోలో శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహానికి కుడివైపును జానకిగారు కూర్చుని తెరపై కనిపించడం విశేషం. నేను 'తాతమ్మకల'లో మహానటి భానుమతి మునిమనవడిగా నటిస్తూ పరిచయమయ్యాను. ఆ తరువాత "రామ్ - రహీమ్, వేములవాడ భీమకవి" చిత్రాల్లో షావుకారు జానకిగారితో నటించే అదృష్టం నాకు దక్కింది." అని బాలకృష్ణ అన్నారు. మన దేశంలోనే 75 ఏళ్ల సుదీర్ఘమైన నటనా ప్రస్థానాన్ని చూసిన ఏకైక నటి బహుశా షావుకారు జానకి గారు మాత్రమే అయి ఉంటారని బాలయ్య అభిప్రాయపడ్డారు. అంతటి సుదీర్ఘ నటనా జీవితంలో ఎన్నెన్నో మర్చిపోలేని పాత్రలతో కోట్లాది మంది ప్రజల హృదయాలను మెప్పించారని కొనియాడారు. "ఆ మహానటి మరణం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను" అంటూ నందమూరి బాలకృష్ణ తన హృదయపూర్వక నివాళులర్పించారు.         Sowcar Janaki, Nandamuri Balakrishna, Shavukaru Janaki  
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ ఫాంటసీ డివైన్ కామెడీ డ్రామా ‘మూకుత్తి అమ్మన్ 2’ (తెలుగులో ‘అమ్మోరు తల్లి 2’). బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమవుతున్న ఈ ప్రాజెక్ట్‌పై కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ చిత్రం అప్పుడే డిజిటల్ మార్కెట్‌లో తన సత్తా చాటుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు మైండ్ బ్లాకింగ్ ధరకు అమ్ముడయ్యాయి. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'జియో హాట్‌స్టార్' (JioHotstar) ఈ చిత్రానికి సంబంధించిన అన్ని భాషల ఓటీటీ హక్కులను భారీ మొత్తానికి దక్కించుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలమైన ప్రచారం సాగుతోంది. అమౌంట్ ఎంత అనేది అధికారికంగా వెల్లడించకపోయినా, ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి ఇది రికార్డు స్థాయి బిజినెస్ అని టాక్. 2020లో వచ్చిన 'మూకుత్తి అమ్మన్' (అమ్మోరు తల్లి) బాక్సాఫీస్ వద్ద, ఓటీటీలో ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని సుందర్.సి దర్శకత్వంలో డాక్టర్ ఐసరి కె. గణేష్ తమ వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సీక్వెల్‌ను దాదాపు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో నయనతార మరోసారి అమ్మవారిగా పవర్‌ఫుల్ అండ్ డివైన్ రోల్‌లో మెరవనుండగా, విలక్షణ నటి రెజీనా కాసాండ్రా నెగెటివ్ షేడ్స్ ఉన్న ముఖ్య పాత్రలో నటించనుంది. వీరితో పాటు దునియా విజయ్, యోగిబాబు, ఊర్వశి, అభినయ తదితర సీనియర్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండటంతో ప్రాజెక్ట్ గ్లామర్ అండ్ కామెడీ డోస్ మరింత పెరిగింది. ప్రస్తుతం గ్రాండ్ సెట్లలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ సౌత్ లాంగ్వేజెస్ సహా హిందీలో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. థియేట్రికల్ రిలీజ్‌కు ముందే భారీ ఓటీటీ డీల్ క్లోజ్ కావడం సినీ ప్రియుల్లో, నయనతార ఫ్యాన్స్‌లో ఈ సినిమాపై ఉన్న విపరీతమైన క్రేజ్‌ను స్పష్టం చేస్తోంది.
భారతీయ చిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన నటనతో ఏడు దశాబ్దాల పాటు అలరించిన లెజెండరీ నటి, పద్మశ్రీ షావుకారు జానకి కన్నుమూశారు. ఆమె మరణవార్త పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిరంజీవి సోషల్ మీడియా వేదికగా భావోద్వేగమైన సందేశాన్ని పోస్ట్ చేస్తూ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. "ప్రముఖ నటి, పద్మశ్రీ షావుకారు జానకి గారు ఇకలేరనే వార్త ఎంతో బాధ కలిగించింది. ‘షావుకారు’ చిత్రంతో మొదలైన ఆమె సుదీర్ఘ సినీ ప్రస్థానం తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో దాదాపు ఏడు దశాబ్దాల పాటు కొనసాగింది" అంటూ ఆమె ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. "వైవిధ్యమైన పాత్రలకు తన సహజమైన నటనతో ప్రాణం పోసి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నటి ఆమె. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన సేవలు చిరస్మరణీయం. షావుకారు జానకి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి." అంటూ చిరంజీవి నివాళులర్పించారు. https://x.com/KChiruTweets/status/2090746829365530722       Sowcar Janaki, Chiranjeevi, Shavukaru Janaki  
భార్యాభర్తల బంధం జీవితాంతం కలిసి నడవాల్సిన అనుబంధం. ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవం ఉంటే ఈ బంధం ఎంతో ఆనందంగా ఉంటుంది. అయితే చిన్న చిన్న విషయాలకే తరచుగా గొడవలు రావడం, ఒకరి మాటను మరొకరు అర్థం చేసుకోకపోవడం, ఇంటి పనుల విషయంలో అసంతృప్తి పెరగడం వల్ల దాంపత్య జీవితంలో దూరం ఏర్పడవచ్చు. గొడవలు రావడం ఒక్కటే సమస్య కాదు. వాటిని ఎలా పరిష్కరించుకుంటున్నారన్నదే భార్యాభర్తల బంధానికి అసలు పరీక్ష. భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలకు కారణాలు.. ఒకరి మాట మరొకరు వినకపోవడం.. చాలా సందర్భాల్లో సమస్య పెద్దది కాకపోయినా, తమ మాటను భాగస్వామి పట్టించుకోవడం లేదనే భావన గొడవకు దారితీస్తుంది. ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు మధ్యలోనే అడ్డుకోవడం, వెంటనే సమాధానం చెప్పడానికి ప్రయత్నించడం సమస్యను మరింత పెంచుతుంది. ఇంటి పనుల విషయంలో.. ఇంటిని చూసుకోవడం, వంట చేయడం, పిల్లలను చూసుకోవడం, సరుకులు తీసుకురావడం, బిల్లులు చెల్లించడం వంటి పనులు ఒకరి మీదే ఎక్కువగా పడితే అసంతృప్తి పెరుగుతుంది. ప్రత్యేకంగా ఒకరు బయట ఉద్యోగం చేస్తున్నారనే కారణంతో ఇంటి బాధ్యతలన్నీ మరొకరి బాధ్యతగా భావించడం కూడా గొడవలకు కారణం కావచ్చు. ఆర్థిక విషయాల్లో స్పష్టత లేకపోవడం.. ఆదాయం, ఖర్చులు, పొదుపు, అప్పులు, కుటుంబ అవసరాలు వంటి విషయాల్లో భార్యాభర్తల మధ్య స్పష్టమైన అవగాహన లేకపోతే తరచుగా విభేదాలు రావచ్చు. చిన్న విషయాలను పెద్దవిగా మార్చుకోవడం.. ఇంట్లో ఎవరు ఏ పని చేయాలి, ఎవరు ఆలస్యంగా వచ్చారు, ఫోన్ ఎందుకు ఎత్తలేదు వంటి చిన్న విషయాలు వెంటనే పెద్ద గొడవలుగా మారితే దాంపత్య జీవితంలో ప్రశాంతత తగ్గుతుంది. గత తప్పులను పదేపదే గుర్తు చేయడం.. గతంలో జరిగిన విషయాలను ప్రతి గొడవలోనూ బయటకు తీసుకురావడం వల్ల సమస్య పరిష్కారం కాకుండా కోపం మాత్రమే పెరుగుతుంది. ఒక సమస్యను పరిష్కరించిన తర్వాత దాన్ని మళ్లీ మళ్లీ లేవనెత్తడం మంచిది కాదు. పనుల విషయంలో భార్యాభర్తలు ఎలా ఉండాలి? ఇంటి పని ఎవరిది అనే ప్రశ్న కంటే, మన ఇంటి పని అనే భావన ఉండాలి..  ఇంటి పని భార్యది మాత్రమే, బయట పని భర్తది మాత్రమే అనే ఆలోచన ప్రతి కుటుంబానికీ సరిపోదు. ఎవరి పని, సమయం, ఆరోగ్యం, బాధ్యతలు ఎలా ఉన్నాయో.. దాన్ని బట్టి పనులను పంచుకోవడం మంచిది. భార్య వంట చేస్తే భర్త పాత్రలు శుభ్రం చేయవచ్చు. ఒకరు పిల్లలను చూసుకుంటే మరొకరు ఇంటి ఇతర పనులను చూసుకోవచ్చు. వారాంతాల్లో ఇద్దరూ కలిసి ఇంటి పనులు చేసుకోవచ్చు. పని పంచుకోవడం అంటే సరిగ్గా సగం సగం కావాల్సిన అవసరం లేదు.. భార్యాభర్తలు ప్రతి పనిని 50-50గా పంచుకోవాల్సిన అవసరం లేదు. ఒకరి పరిస్థితిని మరొకరు అర్థం చేసుకుని అవసరమైనప్పుడు ఎక్కువ బాధ్యత తీసుకోవడం కూడా దాంపత్య జీవితంలో పరస్పర సహకారమే. ఒక రోజు భార్యకు ఎక్కువ పని ఉంటే భర్త సహాయం చేయవచ్చు. మరోరోజు భర్తకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటే భార్య అతనికి సహకరించవచ్చు. "నువ్వు ఏం చేస్తావు?" అనే మాటకు బదులు "నేను ఏం చేయగలను?" అని ఆలోచించాలి.. దాంపత్య జీవితంలో మాటలకంటే మనస్తత్వం ముఖ్యం. "ఇది నీ పని కదా?" అని అడగడం కన్నా "నీకు పని ఎక్కువగా ఉంది, నేను ఏం చేయగలను?" అని అడిగితే బంధంలో ప్రేమ, గౌరవం పెరుగుతాయి. అలాగే సహాయం చేసిన తర్వాత దాన్ని గొప్పగా చెప్పుకోవడం కూడా అవసరం లేదు. భార్యాభర్తలు ఒకరికొకరు సహాయం చేసుకోవడం ఉపకారం కాదు,  అది కుటుంబ బాధ్యతలో భాగం. గొడవ వచ్చినప్పుడు ఏం చేయాలి? గొడవ సమయంలో వెంటనే సమస్యను గెలవాలని ప్రయత్నించకుండా, సంబంధాన్ని కాపాడుకోవాలని ఆలోచించాలి. కోపంలో అవమానకరమైన మాటలు మాట్లాడకూడదు. తల్లిదండ్రులు, బంధువులు, పిల్లలను గొడవలోకి లాగకూడదు. పాత విషయాలను తవ్వి తీసుకురాకూడదు.  "నువ్వు ఎప్పుడూ ఇలాగే చేస్తావు" వంటి మాటలు తగ్గించాలి. ఇద్దరూ ప్రశాంతంగా ఉన్న సమయంలో సమస్య గురించి మాట్లాడాలి.  తప్పు ఉంటే "నా వల్ల తప్పు జరిగింది" అని చెప్పడానికి సంకోచించకూడదు. ఎదుటివారు చేసిన మంచి పనులను కూడా గుర్తించి ప్రశంసించాలి.  పిల్లల ముందు గొడవపడటం మంచిది కాదు చివరగా... భార్యాభర్తల మధ్య గొడవలు పూర్తిగా లేకపోవడం కంటే, గొడవ వచ్చిన తర్వాత ఇద్దరూ దాన్ని ఎలా పరిష్కరించుకుంటారన్నదే ముఖ్యం.                                                                                                                                                   *రూపశ్రీ.
ప్రతి వ్యక్తి జీవితంలో భార్యాభర్తల బంధం ఎంతో అపురూపమైనది.  ఒక వయసుకు వచ్చాక ముడిపడే ఈ బంధం మరణం వరకు తోడు ఉంటుంది. అయితే.. నేటికాలంలో చాలామంది బార్యాభర్తల మధ్య ప్రేమ, ఆప్యాయత కంటే గొడవలే ఎక్కువ ఉంటున్నాయి.  ఈ గొడవలే చాలామంది విడిపోవడానికి కూడా దారితీస్తాయి.  భార్యాభర్తల మధ్య అసలు గొడవలు లేకపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది.  కానీ.. ఒకే కుటుంబంలో పుట్టి పెరిగిన వాళ్ల మధ్య కూడా గొడవలు అనేవి సహజంగానే ఉంటాయి. అసలు గొడవలే లేకుండా ఉండే బంధం ఏదీ ఉండదు. కానీ వీలైనంత వరకు గొడవలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం తప్పకుండా భార్యాభర్తలు ఇద్దరి మీదా ఉంటుంది. భార్యాభర్తలు కొన్ని అలవాట్లు వదిలేస్తే.. వారి బంధంలో చాలా వరకు గొడవలు తగ్గుతాయి.  ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే.. పరస్పర అగౌరవం, బాధపెట్టేలా మాట్లాడటం..  భార్యాభర్తల సంబంధానికి పునాది పరస్పర గౌరవం. , భార్యాభర్తలు చిన్న విషయాలకే ఒకరినొకరు అవమానించుకున్నా లేదా కఠినమైన మాటలు మాట్లాడినా, ఆ ఇంటిలోని పాజిటివ్ ఎనర్జీ  నశిస్తుంది. రోజూ దూషణలు లేదా అవమానకరమైన మాటలు వాడే ఇంట్లో శాంతి ఎప్పటికీ ఉండదు, పైగా పేదరికం  మొదలవుతుంది. దుబారా ఖర్చు..  ఒక కుటుంబం  ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేసుకోవడానికి సరైన ఆర్థిక నిర్వహణే కీలకం. భార్యాభర్తలలో ఎవరికైనా తమ ఆదాయానికి మించి ఖర్చు చేసే అలవాటు ఉన్నా లేదా డబ్బును విచక్షణారహితంగా దుబారా చేసినా, ఆ కుటుంబం త్వరగా పేదరికంలోకి జారిపోతుంది. వైవాహిక జీవితంలో ఒత్తిడికి, ఆర్థిక ఇబ్బందులకు అనవసరమైన ఆర్భాటం, దుబారా ఖర్చులే అతి పెద్ద కారణాలు. రహస్యాలు,  అపనమ్మకం.. ఏ బంధం అయినా బలంగా ఉండాలంటే..  నమ్మకమే ప్రాథమిక విషయం. భార్యాభర్తలలో ఎవరైనా ఒకరికొకరు ముఖ్యమైన విషయాలను దాచడం మొదలుపెట్టినప్పుడు లేదా మోసానికి పాల్పడినప్పుడు, ఆ సంబంధంలో అనుమానం, విద్వేషం చోటుచేసుకుంటాయి. పారదర్శకత లేనిచోట  గొడవలు ఎక్కువ ఉంటాయి.  అటువంటి అల్లకల్లోల వాతావరణం మనిషి  సామర్థ్యం మీద ప్రభావం చూపిస్తుంది, ఆర్థిక వృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. సోమరితనం..  సోమరులకు , అపరిశుభ్రంగా జీవించేవారికి లక్ష్మీదేవి ఆశీస్సులు లభించవు. భార్యాభర్తలు ఉదయాన్నే ఆలస్యంగా నిద్రలేచినా, ఇంటిని శుభ్రంగా ఉంచుకోకపోయినా, లేదా వారే అపరిశుభ్రంగా ఉన్నా, ఇంట్లో ప్రతికూల శక్తి ప్రభావం పెరుగుతుంది. సోమరితనం సమయం , డబ్బు రెండింటి నష్టానికి దారితీసి, పేదరికానికి కారణం అవుతుంది. తద్వారా వారి మధ్య గొడవలు కూడా పెరుగుతాయి. ఇంటి విషయాలు బయటపెట్టడం..  ఇంటి విషయాలు ఎల్లప్పుడూ కుటుంబంలోనే ఉండాలి. తమ పరస్పర వివాదాలు, వ్యక్తిగత బలహీనతలు లేదా కుటుంబ రహస్యాలను ఇతరులకు వెల్లడించే భార్యాభర్తలు తమ వినాశనాన్ని తామే కొనితెచ్చుకుంటారు. బయటి వ్యక్తులు దీనిని అవకాశంగా తీసుకుని, విభేదాలను మరింత పెంచుతారు. చాణక్య నీతి ప్రకారం సంతోషకరమైన వైవాహిక జీవితానికి ఇతరుల సలహాలు తీసుకోవాలంటే, ముందుగా సమస్యలను అందరికీ చెప్పకుండా గోప్యత  పాటించడం ముఖ్యం.  ఒకరికొకరు రక్షణ కవచంగా ఉండటం, కోపాన్ని అదుపులో ఉంచుకోవడం, సంక్షోభసమయాల్లో ఓర్పు వహించడం, , కుటుంబంలోని పూజలు, వ్రతాలు వంటివి కలిసి ఆచరించడం, మర్యాదను కాపాడుకోవడం ముఖ్యం.                                                                                                                                                   *రూపశ్రీ.
మోకాలి నొప్పి అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. ఇది గాయం వల్ల లేదా ఆర్థరైటిస్, గౌట్ , ఇన్ఫెక్షన్ వంటి కొన్ని సమస్యల వల్ల కూడా  సంభవించవచ్చు. సాధారణ సమస్యలు అయితే  కొన్ని ట్రీట్మెంట్ తో  నయమవుతాయి. కానీ ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలు చాలా కాలం పాటు నొప్పికి కారణమవుతాయి. మోకాళ్ల నొప్పి మొత్తం ఆరోగ్యానికి హానికరంగా పరిగణించబడుతుంది. చాలా ఏళ్ల పాటు మోకాళ్ల నొప్పులు ఉంటే, అది జీవన నాణ్యతపై కూడా ప్రభావం చూపుతుంది. అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారు  కీళ్లపై అధిక ఒత్తిడిని కలిగించాల్సి వస్తుంది, దీనివల్ల నడవడం లేదా మెట్లు ఎక్కడం వంటి సాధారణ పనులు కూడా కష్టమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం కూడా మోకాళ్ల నొప్పికి దోహదపడుతుంది. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. శరీరం పై మోకాళ్ల నొప్పి ప్రభావం..  మోకాలి నొప్పులన్నీ తీవ్రమైనవి కావు, కానీ గాయం, ఆస్టియో ఆర్థరైటిస్, కీళ్లపై ఒత్తిడి వంటి కొన్ని సమస్యలకు చికిత్స చేయకుండా వదిలేస్తే అవి తీవ్రమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.  అయితే మోకాలి నొప్పి శరీరంలోని ఇతర భాగాలలో సమస్యలను కలిగించగలదా? అని గమనిస్తే..   ఎక్కువ కాలం మోకాలి నొప్పి ఉంటే తుంటి, తొడ లేదా కాలి కింది భాగంలోని కండరాల సమస్యలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలా మందికి నడవడం, లేచి నిలబడటం కూడా కష్టంగా మారుతుంది. మోకాలి సమస్యలను నివారించడానికి వ్యాయామం.. క్రమం తప్పకుండా చేసే  వ్యాయామ అలవాట్లు మోకాలి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.   క్వాడ్రిసెప్స్ , హామ్‌స్ట్రింగ్ కండరాలపై దృష్టి సారించే బలవర్ధక వ్యాయామాలు నొప్పిని తగ్గించడంలో సహాయపడే అవకాశం ఉంటుంది. చురుకుగా ఉండటం బరువును అదుపులో ఉంచుకోవడానికి , కండరాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది, దీనివల్ల మోకాళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. కీళ్లవాతం వంటి సమస్యలను నివారించడంలో వ్యాయామం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బరువు..  శరీర బరువు ఎక్కువగా ఉంటే..  మోకాళ్ల నొప్పిని పెంచుతుంది. ఇది కీళ్లవాతానికి కూడా ఒక కారణం అవుతుంది. అధిక బరువు కీళ్లపై ఒత్తిడిని పెంచుతుంది, ఇది అక్కడి కండరాలను ప్రభావితం చేస్తుంది. క్రమం తప్పని వ్యాయామం బరువును అదుపులో ఉంచుకోవడానికి , కీళ్లవాతం ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. సరైన ఫుట్ వేర్.. చాలా మంది ఫుట్ వేర్ విషయంలో తగినంత జాగ్రత్త తీసుకోరు.  నాణ్యత లేని బూట్లు , హై-హీల్ చెప్పులు కూడా కీళ్ల , మోకాళ్ల సమస్యలకు కారణమవుతాయి. అందువల్ల, మంచి, సౌకర్యవంతమైన బూట్లు ధరించాలి. ముఖ్యంగా కీళ్లవాతం ఉన్నవారు దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సరైన బూట్లు ధరిస్తే.. ఎన్నో మడమ , మోకాళ్ల సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.                                                                                                                                                   *రూపశ్రీ.  
మునగాకు (Moringa Leaves) మనకు ప్రకృతి అందించిన పోషక విలువలు ఉన్న ఆహారాల్లో ఒకటి. మునగాకులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే దీనిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతుంటారు. మునగాకు పొడిని ఎలా తీసుకోవాలి? ఎంత మోతాదులో తీసుకోవాలి? దీన్ని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? షుగర్, కీళ్ల నొప్పులు, రోగనిరోధక శక్తి వంటి విషయాల్లో మునగాకు ఎలా ఉపయోగపడుతుంది? అనే అంశాలను ఈ వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ వివరించారు. మునగాకు పొడిని సరైన విధంగా తీసుకోవడం, ఆహారంలో ఎలా చేర్చుకోవాలి అనే విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. గమనిక: మునగాకు లేదా మునగాకు పొడి ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా ఉపయోగపడవచ్చు. అయితే డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచనల మేరకు ఆహారంలో మార్పులు చేసుకోవడం మంచిది. మందులకు బదులుగా మునగాకు పొడిని ఉపయోగించకండి. TeluguOne Health లో ఆరోగ్యానికి సంబంధించిన తాజా సమాచారం, నిపుణుల సూచనలు, ఉపయోగకరమైన ఆరోగ్య చిట్కాలను తెలుసుకోండి.
దాహంగా అనిపించినప్పుడు, గొంతు పొడిగా మారినప్పుడు నీరు తాగడం సహజం.  అయితే ఇలా నీరు తాగగానే.. మళ్లీ కాసేపటికే వెంటనే దాహం వేస్తుంది కొందరికి.  దీని గురించి చాలామంది పట్టించుకోరు.  ఇదేమైనా ఆరోగ్య సమస్య ఏమో అని కొందరు సందేహ పడుతూ ఉంటారు. కానీ నిజానికి ఇదిశరీరంలో ఏదో అనారోగ్యానికి సంకేతం కాదని,  కానీ.. శరీరంలో ఏదో ఒక సమస్యను మాత్రం ఖచ్చితంగా సూచిస్తుందని అంటున్నారు.  చాలా వరకు ఎన్ని సార్లు నీరు తాగినా మళ్లీ దాహం వేయడానికి అసలు కారణం శరీరం డీహైడ్రేషన్ అవ్వడమే.. ఎక్కువ శారీరక కష్టం చేయడం.. అధికంగా చెమట పట్టడం, ఎండకు గురికావడం లేదా అధికంగా ఉప్పు తీసుకోవడం వంటివన్నీ శరీరాన్ని డీహైట్ర్ అయ్యేలా చేసి ఎక్కువ దాహం వేయడానికి కారణం అవుతాయి.  కానీ ఎక్కువ దాహం కావడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. మధుమేహం.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, తరచుగా చాలా దాహం వేయడం అనేది మధుమేహానికి ఒక తొలి లక్షణం కావచ్చని అంటున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు, శరీరం అదనపు గ్లూకోజ్‌ను మూత్రం ద్వారా బయటకు పంపడానికి ప్రయత్నిస్తుంది, ఈ ప్రక్రియలో నీరు కూడా విసర్జించబడుతుంది, దీనివల్ల తరచుగా దాహం వేస్తుంది. మూత్రపిండాల ఆరోగ్యం.. మూత్రపిండాలు శరీరంలో నీరు , ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడుతాయి. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే, ఈ సమతుల్యతకు భంగం వాటిల్లి, తరచుగా దాహం వేయడానికి దారితీస్తుంది. ఈ లక్షణం మూత్రపిండాలకు సంబంధించిన సమస్యను కూడా సూచించవచ్చు. డయాబెటిస్ ఇన్సిపిడస్.. డయాబెటిస్ ఇన్సిపిడస్ అనేది శరీరంలో ఒక నిర్దిష్ట హార్మోన్ లోపించడం వల్ల కలిగే సమస్య. దీనివల్ల అధిక దాహం , తరచుగా మూత్రవిసర్జన కలుగుతాయి. ఇది డయాబెటిస్ మెల్లిటస్ కు భిన్నంగా ఉంటుంది, కానీ దీని లక్షణాలు చాలా వరకు ఒకేలా ఉంటాయి. నోరు పొడిబారడం.. కొన్నిసార్లు, తగినంత లాలాజలం ఉత్పత్తి కాకపోవడం వల్ల ఎప్పుడూ దాహం కలుగుతుంది, ఈ పరిస్థితిని నోరు పొడిబారడం అంటారు. దీనివల్ల నోరు, గొంతు, నాలుక పొడిబారవచ్చు, కొన్నిసార్లు పెదవులు కూడా పగలవచ్చు. ఈ సమస్య కొన్ని మందుల దుష్ప్రభావంగా కూడా ఎదురవుతుంది. వైద్యుడిని ఎప్పుడుసంప్రదించాలి? పై లక్షణాలు కొనసాగితే, ముఖ్యంగా మధుమేహం, మూత్రపిండాల వ్యాధి లేదా హార్మోన్ల సమస్యలు వంటి ముందు నుంచే ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో, వాటిని తేలికగా తీసుకోకూడదు. ఈ లక్షణాలు పిల్లలు , వృద్ధులలో మరింత తీవ్రంగా ఉంటాయి. కాబట్టి సకాలంలో రోగ నిర్ధారణ , సరైన చికిత్స చాలా అవసరం.                                                                                                                                                 *రూపశ్రీ.  
రెస్టారెంట్లలో భోజనం తర్వాత స్వీట్ సొంపు ఇస్తుంటారు.  చాలామందికి ఈ సొంపు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది.  కొందరు ఇంట్లో కూడా భోజనం తర్వాత స్వీట్ సొంపు తినడం లేదా సొంపు కండ చెక్కర కలిపి తినడం చేస్తుంటారు.  చాలా మంది స్వీట్ సొంపును కేవలం మౌత్ ప్రెషనర్ అనుకుంటారు.  అందుకే భోజనం తర్వాత నోరు తాజాగా అనిపించడం కోసం దీన్ని ఇస్తారని అనుకుంటారు.  కానీ భారతీయ వంటకాల్లో భోజనం తర్వాత సోంపును తినడం ఎప్పటినుండో ఉందట.  ఇది కేవలం మౌత్ ప్రెషనర్ గా కాకుండా..  చాలా రకాల  సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందట.  దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. సొంపు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. జీర్ణక్రియకు.. భోజనం తర్వాత కొద్దిగా సోంపు నమలడం భారతీయ సంప్రదాయంలో ఒక భాగం. జీర్ణ సంబంధిత అసౌకర్యాలు తగ్గించడంలో సోంపు సహాయపడుతుందని చెబుతారు. అయితే దీని ప్రభావం అందరికీ ఒకే విధంగా ఉండదు. నోటిని తాజాగా ఉంచడానికి.. సోంపు లో ఉండే సహజ సువాసన , రుచి భోజనం తర్వాత వచ్చే దుర్వాసనను తాత్కాలికంగా తగ్గించడంలో సహాయపడతాయి. అందుకే దీనిని  రెస్టారెంట్లలో తరచుగా మౌత్ ఫ్రెషనర్‌గా అందిస్తారు.  ఫైబర్ మూలం.. సోంపు గింజలలో పీచుపదార్థం ఉంటుంది.  కొంచెం సొంపు తిన్నా సరే.. అందులో  లభించే పీచుపదార్థం చాలా ఎక్కువగా ఉండకపోయినప్పటికీ ప్రభావవంతగా పనిచేస్తుంది.  ఆహారం తినగానే సొంపు తింటాం కాబట్టి ఆహారం బాగా జీర్ణం కావడంలో సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు.. సోంపులో యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానకి చాలా సహాయపడతాయి. కండ చక్కెర తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. చాలా రెస్టారెంట్లలో స్వీట్ సొంపు ఇస్తుంటారు. అయితే  కొన్ని చోట్ల మాత్రం ప్లెయిన్ సొంపును కండచెక్కర తో కలిపి ఇస్తుంటారు.  ఈ కండ చక్కెరను మిశ్రీ అని కూడా అంటారు.  ఇందులో ప్రధాన పదార్థం చక్కెర. అందువల్ల ఇది తియ్యగా ఉంటుంది.  కొంతమంది భోజనం తర్వాత సోంపు గింజలతో మిశ్రీని కలిపి తినడానికి ఇష్టపడతారు.  ఇధి రుచిని మెరుగుపరుస్తుంది. అయితే.. మిశ్రీని ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు.. మిశ్రీ లో తీపిదనం ఆరోగ్యానికి మంచిది కాదు. దీన్ని మితంగా తీసుకుంటే బాగనే ఉంటుంది. కానీ అధికంగా తీసుకోకూడదు. డయాబెటిస్ పేషంట్లు దీని విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.                                                                                                                                                 *రూపశ్రీ.