కిరణ్ కొత్త పార్టీ పెట్టకపోతే...

Publish Date:Feb 16, 2014

Advertisement

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం సాయంత్రం సీమాంధ్ర మంత్రులు, శాసనసభ్యులతో జరిపిన సమావేశంలో తన రాజీనామా, కొత్తపార్టీ స్థాపనపై ఏదో ఒక ఖచ్చితమయిన నిర్ణయం తీసుకోవచ్చునని అందరూ భావించారు. కానీ బీజేపీ నేతలు లోక్ సభలో రాష్ట్ర విభజన బిల్లు ప్రవేశపెట్టలేదని వాదిస్తునందున, ఇప్పుడు రాజీనామా చేయడం ద్వారా బిల్లుని సభలో ప్రవేశపెట్టినట్లు అంగీకరించినట్లవుతుందని, అందువల్ల కేంద్ర ప్రభుత్వం బిల్లుని అధికారికంగా ప్రవేశపెట్టినప్పుడే రాజీనామా చేస్తారని మంత్రులు టీజీ వెంకటేష్ మీడియాకు తెలిపారు. అయితే ఆయన రాజినామా చేసేందుకే నిశ్చయించుకొన్నపుడు ఇంకా బీజేపీ వాదనను సాకుగా చూపి మరొకట్రోండు రోజులు ఆగినంతమాత్రన్న కేంద్రం బిల్లుని ఆమోదించకుండా ఆగిపోదు. బీజేపీ మద్దతు ఈయకపోయినా మూజువాణి ఓటుతో బిల్లుని ఆమోదింపజేస్తుందని కాంగ్రెస్ అధిష్టానంతో మంచి టచ్చులో ఉన్న తెరాస అధ్యక్షుడు కేసీఆర్ స్పష్టం చేసారు. మరి అటువంటప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి బిల్లుని సభలో ప్రవేశపెట్టిన తరువాతనే రాజీనామా చేయడం ద్వారా ఏమి సాధించాలనుకొంటున్నారో ఆయనకీ, ఆయన సహచరులకే తెలియాలి.

 

ఇక ఆయన కొత్త పార్టీ పెడతారని మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి తెలియజేసారు. అయితే ఎప్పుడు స్థాపిస్తారో, ఎవరెవరు ఆ పార్టీలో చేరుతారో తెలియదని చెప్పారు. అయితే కొత్తపార్టీలో చేరేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపలేదని సమాచారం. అదే నిజమయితే, కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్ధకం మారుతుంది. ఎందుకంటే, ఇంతగా పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు చేసిన తరువాత ఆయన ఇంకా కాంగ్రెస్ లోనే కొనసాగడం చాలా కష్టం, అవమానకరం కూడా. అయితే, ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన ఆయన వేరే ఏ ఇతర పార్టీలోకి వెళ్లి వేరొకరి క్రింద పంచిచేయడం కూడా ఊహించలేము.

 

అయితే రెండు నెలల క్రితం బీజేపీకి చెందిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారేకర్ ఆయనను రహస్యంగా కలిసి వెళ్ళారు. ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరే మాటయితే పార్లమెంటులో బిల్లుకి మద్దతు ఈయబోదనే హామీ ఏమయినా ఆయన ఇచ్చిఉంటే, కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరడమే మేలు. ఆయన ఒకవేళ కొత్తపార్టీ పెట్టలేని పరిస్థితి ఉంటే, అవమానకర పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగడమో లేదా రాజకీయ సన్యాసం చేయడం కంటే సీమాంధ్రలో బలమయిన నాయకుడులేని బీజేపీ పగ్గాలు చెప్పట్టి తన చేతి మీదుగానే పార్టీని నడిపించుకోవచ్చును. ఒకవేళ ఆయన బీజేపీ లో చేరినట్లయితే ఆయన సహచరులు కూడా చేరే అవకాశం ఉంటుంది. పైగా అది ఆయనకీ, బీజేపీకి కూడా చాలా లభాదాయకం. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ కంటే బీజేపీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అన్ని సర్వే నివేదికలు స్పష్టం చేస్తునందున, ఆయన బీజేపీలో చేరినట్లయితే ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. రాష్ట్రంలో బీజేపీ తెలుగుదేశం పార్టీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవాలని భావిస్తోంది గనుక ఆయనకు ఏ కేంద్ర మంత్రి పదవో ఇవ్వవచ్చును కూడా.

 

అందువల్ల కిరణ్ కుమార్ రెడ్డి కొత్తపార్టీ పెట్టలేకపోయినా లేదా పెట్టి చేతులు కాల్చుకోకూడదనుకొన్నా, కాంగ్రెస్ పార్టీకి ఏకైక ప్రత్యామ్నాయ పార్టీ అయిన బీజేపీలో చేరడమే మంచిది. ఇది రాష్ట్ర విభజనను అడ్డుకొనేందుకు ఆయన ముందున్న ఆఖరి అస్త్రంగా కూడా మారుతుంది.

 

 కానీ, అయన నేడు కాకపోతే రేపయినా రాజీనామా చేసి కొత్తపార్టీ స్థాపించావచ్చని ఆయన సహచరులు చెపుతున్నారు గనుక ఆయనకు బీజేపీలో చేరే ఆలోచన లేదని అర్ధమవుతోంది. కానీ, ఆయన కాంగ్రెస్ పార్టీని వీడదలిస్తే, ఇంతకంటే మంచి మార్గం మరొకటి ఉండకపోవచ్చును.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.