గౌతమ్‌రెడ్డి మృతికి దిగ్భ్రాంతి.. జగన్, చంద్రబాబు సంతాపం..

Publish Date:Feb 21, 2022

Advertisement

ఏపీ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాత్తుగా మరణించడం పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొలినాళ్ల నుంచీ సుపరిచితుడైన యువనాయకుడు గౌతమ్రెడ్డి అని, మంత్రివర్గ సహచరుడిని కోల్పోవడం మాటల్లో చెప్పలేనంత బాధగా ఉందని సీఎం జగన్ సంతాపం వెలిబుచ్చారు. గౌతమ్ రెడ్డి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని జగన్ తెలిపారు. గౌతమ్ రెడ్డి మృతదేహాన్ని సందర్శించేందుకు జగన్ కాసేపట్లో హైదరాబాద్ బయల్దేరి వెళ్తున్నారు.

మంత్రి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతి తనను కలచివేసిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత చదువులు చదివిన, ఎంతో భవిష్యత్ ఉన్న గౌతమ్ రెడ్డి మృతి బాధాకరం అని ఆయన దిగ్భ్రాంతి వ్యవక్తం చేశారు. గౌతమ్ రెడ్డి మృతి బాధాకరమని అన్నారు. మంత్రివర్గం లో మృదు స్వభావిగా, హుందాగా వ్యవహరిస్తూ గౌతమ్ రెడ్డి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మంత్రి గౌతంరెడ్డి హఠాన్మరణం తనను తీవ్రంగా కలచి వేస్తోందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆవేదన వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి వంటి యువనేత ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. తమ సహచరుల్లో సీఎం జగన్ కు ఎంతో ఇష్టమైన, సన్నిహితుడైన గౌతమ్ రెడ్డి రాష్ట్ర పారిశ్రామిక, నైపుణ్యాభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి విశేషంగా పెట్టుబడులు, మంచి పేరు ప్రఖ్యాతులు, అవార్డులు తీసుకురావడం వెనక గౌతమ్ రెడ్డి విశేష కృషి ఉందని ధర్మాన గుర్తు చేసుకున్నారు. గౌతమ్ రెడ్డి లేని లోటు ఎవరూ తీర్చలేనిదని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గౌతమ్ రెడ్డి వ్యాయామాలు కఠినంగా చేసేవారని గుర్తుచేసుకున్నారు. గౌతమ్ రెడ్డి వివాద రహితుడని, ఆయన ఇక లేరన్న వార్త చాల బాధ కలిగించిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి తనకు బంధువు అని సోమిరెడ్డి చెప్పారు. గౌతమ్ రెడ్డి వివాద రహితుడని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు.

మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఆయన అభిమానులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. నెల్లూరు జిల్లా అత్మకూరులోని గౌతమ్ రెడ్డి కార్యాలయం వద్ద విషాదఛాయలు అలముకున్నాయి. తమ అభిమాన నేత ఇకలేరని ఆత్మకూరులో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వైఎస్సార్‌టీపీ అధినేత్ర ష‌ర్మిల‌, ఆమె త‌ల్లి విజ‌య‌మ్మ‌లు.. హైద‌రాబాద్‌లో మేక‌పాటి కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించి ఓదార్చారు. 

By
en-us Political News

  
తెలంగాణ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి ఘన విజయం సాధించారు.
తాజాగా కోటి సంత‌కాల సేక‌ర‌ణ చేసింది వైసీపీ.
ఇంతకీ రేవంత్ ఢిల్లీ ఎందుకు వెళ్లారంటే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ జన్మదినం గురువారం. తన 85వ జన్మదినాన్ని పురస్కరించుకుని రాజకీయ ప్రముఖులను బుధవారం రాత్రి విందు ఇచ్చారు. ఆ విందుకు తెలంగాణ సీఎం రేవంత్ హాజర్యారు.
బోరుగడ్డ అనిల్ కు కష్టాలు మొదలయ్యాయి. కేసులు చుట్టుముట్టాయి. అరెస్టై జైలుకు వెళ్లి వచ్చాడు కూడా. జైలుకు వెళ్లిన సమయంలోనూ, ఆ తరువాత బయటకు వచ్చి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలోనూ కూడా బోరుగడ్డ అనిల్ పదేపదే తనకు జగన్ అండ ఉందని చెప్పుకొచ్చారు.
అమరావతికి నాబార్డు నుంచి రూ.7,380.70 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమెదం ఇవ్వనుంది. అదే విధంగా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్రవేసే అవకాశం ఉంది.
ల్గొండ జిల్లా కొర్లపహాడ్‌ గ్రామంలో పోలింగ్ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు.
ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతుంది. ఇందు కోసం 37 వేల 552 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి విడతలో 56 లక్షల 19 వేల 430 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
తన ఎన్నికల చిహ్నమైన కత్తెర గుర్తు జెండాను పట్టుకుని అల్లు అర్జున్ చేత ప్రచారం చేయిస్తున్నారు. ఆగండాగండి వాస్త
త్రిపురకుండ్రం ఆరు షణ్ముఖ క్షేత్రాల్లో తొలి క్షేత్రంగా భాసిల్లుతోంది. అయితే ఈ కొండ‌కు ద‌గ్గ‌ర్లో ఒక ద‌ర్గా ఉంటే.. ఆ ద‌ర్గాకి సమీపంలో ఒక రాతి స్తంభం ఉంటుంది. ఆ రాతి స్థంభంపై త‌మిళ కార్తీక దీపం పెట్ట‌డం అనాదిగా వ‌స్తోన్న ఆచారం.
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నార‌న్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.