తెదేపా మెతక వైఖరే ప్రతిపక్షాలకు ఆయుధంగా మారిందా?

Publish Date:Aug 18, 2015

Advertisement

 

రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఇతర హామీలను సాధించే విషయంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం శ్రద్ధ చూపించడం లేదని, ప్రతిపక్షాలు మాత్రమే వాటి గురించి కేంద్రంతో పోరాడుతున్నట్లుగా ప్రజలను నమ్మించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిన కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపాడుకొని మళ్ళీ బలపడేందుకే ఈ ప్రత్యేక హోదా అంశాన్ని భుజానికెత్తుకొందని ప్రజలకి కూడా తెలుసు. అదేవిధంగా ఈ ప్రత్యేక హోదా అంశం పట్టుకొని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంటే, తాము చేతులు ముడుచుకొని కూర్చొని చూస్తుంటే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళుతున్నాయనే భయంతోనే ఇంతకాలం దాని గురించి మాట్లాడని జగన్మోహన్ రెడ్డి ఏకంగా డిల్లీలో దీక్ష చేసి వచ్చి తను కూడా ఈనెల 29న రాష్ట్ర బంద్ కి పిలుపు నిచ్చారు. వీటికి తోడూ సీపిఐ, నటుడు శివాజీ, ప్రజాసంఘాలు కూడా ప్రత్యేక హోదా కోసం తమ ఉద్యమాలని తీవ్రతరం చేస్తున్నారు. వీటన్నిటినీ గమనిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఊరుకొంటే ప్రజలు కూడా అపార్ధం చేసుకొనే అవకాశం ఉంటుంది. కనుకనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమస్యలు, వాటికి కారణాలు, కారకులు, వాటి పరిష్కారం కోసం తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రజలకు వివరిస్తున్నారు.

 

నిన్న రాత్రి విజయవాడలో తన క్యాంప్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడుతూ, “ కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాలను మాత్రమే చూసుకొని తన ఇష్టం వచ్చినట్లుగా రాష్ట్ర విభజన చేసింది. రాష్ట్ర విభజన తరువాత తలెత్తుతున్న సమస్యలన్నిటికీ మూలకారణం కాంగ్రెస్ పార్టీ అనాలోచిత నిర్ణయాలే. ఆస్తులన్నీ తెలంగాణాకి, అప్పులన్నీ ఆంధ్రాకి పంచిపెట్టి చేతులు దులుపుకొంది. కానీ ఇప్పుడు అదేపార్టీ మొసలి కన్నీళ్లు కార్చుతూ ప్రత్యేక హోదా కోసం పోరాడుతోంది. అది ఎందుకో అందరికీ తెలుసు. సోనియాగాంధీ తన ఇటలీ దేశ రిపబ్లిక్ డే రోజునే (జూన్ రెండు) రెండు రాష్ట్రాల ఆవిర్భావ దినంగా ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ చేసిన తప్పులని మనం కూర్చొని సరిడదిద్దుకొందామని చెపుతున్నా తెలంగాణా ప్రభుత్వం అంగీకరించకుండా పదేపదే విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తోంది. విద్యుత్ సంస్థలలో నుండి ఒకేసారి 1250 మంది ఉద్యోగులను బయటకి గెంటేసింది. ఇంటర్ మీడియేట్ బోర్డు నిధులను స్తంభింపజేసింది. ఇరు రాష్ట్రాలకి చెందిన అనేక ఉమ్మడి సంస్థలని స్వాధీనం చేసుకొంటోంది. హైదరాబాద్ లో పనిచేస్తున్న ఆంధ్రా అధికారులతో చాలా అవమానకరంగా వ్యవహరిస్తోంది. ఇంత జరుగుతున్నా గవర్నర్ సెక్షన్ : 8 అమలుకి ఇంకా వెనకాడుతున్నారు. త్వరలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు ఈ సమస్యలన్నీ ఆయనకీ వివరించి రాష్ట్రానికి న్యాయం చేయమని గట్టిగా అడుగుతాను,” అని అన్నారు.

 

తెరాస ప్రభుత్వం ఇన్ని సమస్యలు సృష్టిస్తున్నా ప్రధాన ప్రతిపక్షమయిన వైకాపా దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వారికే మద్దతు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెపుతున్న ఈ సమస్యల గురించి, తెరాస ప్రభుత్వం ఆంధ్రాకి విసురుతున్న ఈ సవాళ్ళ గురించి ఆయన ఎన్నడూ పల్లెత్తు మాట పలకరు. ఏపీలో రోడ్డు ప్రమాదాలలో చనిపోయిన వారిళ్ళకు వెళ్లి మరీ ఓదార్చివచ్చే జగన్మోహన్ రెడ్డి, తెరాస ప్రభుత్వం ఏకంగా 1250 మంది ఉద్యోగులను ఉద్యోగాలలో నుంచి పీకేస్తే పల్లెత్తు మాటనరు. అసలు ఆసంగతి తనకు తెలియనట్లే వ్యవహరిస్తుంటారు. పోనీ ఆ సమస్య తెలంగాణాదనుకొంటే అక్కడ కూడా వైకాపా ఉంది. అక్కడ వైకాప నేతలయినా ఉద్యోగుల కోసం తెరాస ప్రభుత్వంతో పోరాడవచ్చును. కానీ పోరాడరు.

 

ఓటుకి నోటు కేసుపై వైకాపా చూపిస్తున్న ఆసక్తి రోడ్డునపడ్డ ఉద్యోగుల విషయంలో ఎందుకు చూపించడం లేదు? రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం పోరాడుతున్నామని చెప్పుకొంటున్న వైకాపా, తెరాస ప్రభుత్వం విసురుతున్న ఈ సవాళ్ళ గురించి, సృష్టిస్తున్న ఈ సమస్యల గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకంటే తెరాస-వైకాపాల మధ్య ఉన్న రహస్య అనుబంధం దెబ్బ తింటుందనే భయంతోనే కావచ్చును. రాష్ట్ర ప్రయోజనాల కంటే తన రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనుకొనే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు డిల్లీ వెళ్లి మరీ పోరాడుతున్నామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది.

 

జగన్మోహన్ రెడ్డి తనకు, తన పార్టీకి అనుకూలమయినవి, రాజకీయ లబ్ది కలిగించేవి, అధికార తెదేపాను ఇరుకునపెట్టగలిగే ప్రత్యేక హోదా వంటి అంశాలను మాత్రమే అందిపుచ్చుకొని పోరాడుతున్నారు. కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఏవిధంగా ఒత్తిడి తెస్తోందో, ఎన్ని ప్రయత్నాలు చేస్తోందో ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. కానీ అధికార పార్టీ నేతలు కాంగ్రెస్, వైకాపాలు ఆడుతున్న ఈ కపట నాటకాలను ఎండగట్టడంలో విఫలం అవుతున్నందునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈవిధంగా ప్రజలకు సంజాయిషీలు చెప్పుకోవలసివస్తోందని భావించవచ్చును.

By
en-us Political News

  
లోకేష్‌తో పాటు ఇటీవల ప్రకటించిన 252 మందితో కూడిన జాతీయ, రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గం కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసింది. కీలక నేతలందరూ పార్టీ పట్ల తమ విధేయతను ప్రకటిస్తూ బాధ్యతలు స్వీకరించారు.
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.