ఇక డ్రామా ఆపేయ్.. తాడేపల్లి ప్యాలస్ నుంచి ఆదేశం?

Publish Date:May 23, 2023

Advertisement

పరువు నిలువునా గంగలో కలిసిపోయింది. వివేకా హత్య కేసు లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి తీరు పార్టీ పరువునే కాకుండా వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి జగన్ పరువును కూడా మంటగలుపుతోందన్న భావన తాడేపల్లి ప్యాలెస్ వర్గాల్లో గట్టిగా వ్యక్తమౌతోంది. అయ్యిందేదో అయ్యింది. ఇక ఎలాంటి ఓవర్ యాక్షన్ చేయొద్దు.. తిన్నగా సీబీఐ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని అవినాష్ రెడ్డికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్పష్టమైన సందేశం అవినాష్ కు చేరిందని అంటున్నారు.

ఆ సందేశాన్ని కూడా వాళ్లూ వీళ్లూ కాదు స్వయంగా ఏపీ సీఎం జగన్ తల్లి విజయమ్మ ద్వారా పంపారని అంటున్నారు. సోమవారం (మే22) కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రికి వెళ్లిన విజయమ్మ అవినాష్ తల్లిని పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా అవినాష్ తో ఆమె కొద్ది సేపు ముచ్చటించారు. ఆ సమయంలోనే అవినాష్ ను  ఇక ఈ హై డ్రామాకు ఫుల్ స్టాప్ పెట్టి సీబీఐ విచారణకు హాజరవ్వాలని సూచించినట్లు చెబుతున్నారు. సూచన కాదు దాదాపుగా ఆదేశించారనే అంటుంటున్నారు. ఒక వేళ సీబీఐ అరెస్టు చేసినా కంగారు పడాల్సిన అవసరం లేదనీ, అక్రమాస్తుల కేసులో తన బిడ్డ జగన్ 16 నెలలు జైలులో ఉండి రాలేదా అని కూడా విజయమ్మ అవినాష్ కు చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ఇప్పటికే వివేకా హత్య కేసు విషయంలో సీబీఐ దర్యాప్తునకు హాజరు కాకుండా వాయిదాల మీద వాయిదాలు కోరుతూ అవినాష్ వ్యవహరిస్తున్న తీరుతో పార్టీ ప్రతిష్ట దిగజారిందనీ, అలాగే  జగన్ కూ చెడ్డపేరు వచ్చిందనీ, ఇక ఫుల్ స్టాప్ పెట్టకుంటే నివారించలేనంత నష్టం జరుగుతుందని విజయమ్మ అవినాష్ కు నచ్చ చెప్పిట్లు వైసీపీ శ్రేణులే అంటున్నాయి. అయితే చివరి ఆశగా సుప్రీంలో అవినాష్ దాఖలు చేసిన నిర్ణయంపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువడిన అనంతరం నిర్ణయం తీసుకుంటానని అవినాష్ విజయమ్మతో అన్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు సుప్రీంలో కూడా అవినాష్ కు ఎలాంటి ఊరటా లభించలేదు. ఇక అవినాష్ ఏం నిర్ణయం తీసుకుంటారని అంతటా ఉత్కంఠ నెలకొంది. 

కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డి విషయంలో రోజుల తరబడి సాగుతున్న దాగుడు మూతలు, ‘హైడ్రామా’తో జనంలో చెడ్డపేరు వస్తోందని సీఎం జగన్‌ శిబిరం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ‘రచ్చ’కు ఇక ఫుల్‌స్టాప్‌ పెట్టే ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం. మంగళవారం సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా నిర్ణయం వెలువడకపోతే... ఆయనే సీబీఐ విచారణకు హాజరయ్యేలా అవినాశ్‌ను ఒప్పించే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ‘‘అరెస్టు చేస్తే చేసుకోని! తర్వాత చూసుకుందాం. జగన్‌ కూడా 16 నెలలు జైలులో ఉన్నారు కదా! ఇప్పుడు జరుగుతున్న తంతుతో నీకూ చెడ్డపేరు. మాకూ ఇబ్బంది’’ అని అవినాశ్‌కు సమాచారం పంపినట్లు తెలుస్తోంది.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నెల్లూరులోని బారా షాహీద్ దర్గాను సందర్శించి ప్ర్తత్యేక ప్రార్ధనలో పాల్గొన్నారు. అదే విధంగా రొట్టెల పండుగ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుుటుంబానికి చెందిన నలుగురు హైదరాబాదీయులు మృతి చెందారు.
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు పార్టీ తలుపులు శాశ్వతంగా మూసుకు పోతున్నాయా? పార్టీకి రాజీనామా చేసి.. మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ శ్యామాప్రసాద్ ముఖర్జీ భవన్ (బీజేపీ స్టేట్ ఆఫీస్) మెట్లు దిగివచ్చిన రాజాసింగ్ మళ్ళీ ఆ మెట్లు ఎక్కను అంటూ చేసిన ప్రతిజ్ఞను పార్టీ సీరియస్ గా తీసుకుందా?
మంత్రి నారా లోకేష్ సోమవారం (జులై 7) నెల్లూరులో వీఆర్‌ హై స్కూల్‌ను ప్రారంభించారు. ఆ తరువాత స్కూలులోని అన్ని క్లాస్ రూమ్ లను సందర్శించి ప్రతి క్లాసులోనూ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు.
తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. అలిపిరి సమీపంలోని కపిలతీర్ధం రోడ్డులో ఒక సైకో వీరంగం కలకలం సృష్టించింది. చేతిలో కత్తి, కర్రతో ఆ సైకో దారిన వచ్చీపోయేవారిపై ఇష్టారీతిగా దాడులకు పాల్పడింది.
డోనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాలు విధిస్తామంటూ హెచ్చరిక జారీ చేశారు. ఈ సారి ఆయన బిక్స్ దేశాలకు ఈ హెచ్చరిక చేశారు. అమెరికా విధానాలను వ్యతిరేకించే, లేదా అమెరికా వ్యతిరేక విధానాలు అవలంబించే దేశాలపై పది శాతనం సుంకాలు పెంచుతాని ట్రంప్ హెచ్చరించారు.
మామిడిరైతుల విషయంలో రాజకీయం చేద్దామనుకున్న వైసీసీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహర్ రెడ్డికి చంద్రబాబు చెక్ పెట్టారు. ప్రభుత్వ పరంగా మామిడి రైతుల సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం లీగల్ సెల్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్, సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు లక్ష్యంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అలాగే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంతి లోకేష్ కు అంతర్గత నోట్ రూపంలో పంపిన ఫిర్యాదు సంచలనం సృష్టిస్తోంది.
ఎట్ట‌కేల‌కు భార‌త్ యువ‌సేన ఇంగ్లండ్ గ‌డ్డ మీద అదీ విజయమన్నదే ఎరుగని ఎడ్జ్ బాస్టెన్ వేదికలో టెస్టు గెలుపు బావుటా ఎగుర‌వేయ‌గ‌లిగింది. కార‌ణం.. ఒక‌టి శుభ్ మ‌న్ గిల్ బ్యాటింగ్, రెండు సిరాజ్- ఆకాష్ దీప్ జోడీ అద్భుత బౌలింగ్.
మ‌స్క్ పెట్టిన పార్టీపై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చ‌ర్చ న‌డుస్తోంది. ఎందుకంటే అమెరికాలో ఒక‌రు అధ్య‌క్షులు కావాలంటే.. అందుకు ఫ‌స్ట్ వారు జ‌న్మ‌తహ అమెరికా పౌరులై ఉండాలి. 35 ఏళ్ల‌ పైబ‌డి వ‌య‌సుగ‌ల వారై ఉండాలి. ఆపై 14 ఏళ్ల పాటు అమెరికాలోనే నివాసం ఉండి తీరాలి. వీటిలో ఏవీ మ‌స్క్ కి లేవు. ఆయ‌న ద‌క్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో పుట్టారు.
తెలంగాణలో మరో రెండున్నర మూడు నెలల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్దమవుతున్నాయి. ముఖ్యంగా, తెలంగాణను రోల్ మోడల్ గా చూపించి జాతీయ స్థాయిలో పునర్జీవనం పొందేందుకు ప్రయత్నిస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీ.. స్థానిక సంస్థల ఎన్నికలను, జాతీయ ధృక్కోణంతో చూస్తోంది. అందుకే.. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్వయంగా రంగంలోకి దిగారు.
అధికారంలో ఉండగా ఇష్టారీతిగా చెలరేగిపోయినా చెల్లినట్లు, అధికారం కోల్పోయిన తరువాత కూడా చెలరేగిపోతామంటే కుదరదన్న విషయం ఇప్పుడు వైసీపీ నాయకులు, క్యాడర్ కు బాగా ఇప్పుడు తెలిసివస్తోంది.
దేశంలో ఏ మూల ఏ స్కాం జరిగినా అందులో వైసీపీ నేతలు కచ్చితంగా ఉంటారు. గంజాయి స్మగ్లింగ్, డ్రగ్స్ అక్రమ రవాణా ఇలా ఏ నేరం జరిగినా.. అందులో వైసీపీ నేతల ప్రమేయం ఉందని దర్యాప్తు సంస్థలు తేలుస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.