బందరెళితే.. బందరే!

Publish Date:May 23, 2023

Advertisement

బందరు పోర్టు శంకుస్థాపన చివరికి ఒక ప్రహసనంగా తయారైంది. ఇప్పటికే రెండు సార్లు పునాదిరాయి పడిన బందరు పోర్టుకు మళ్లీ పునాదిరాయి పడింది. ఎన్నిసార్లు శంకుస్థాపనలు చేసినా నిర్మాణానికి నోచుకోకపోవడం బందరు పోర్టు ప్రత్యేకత. బందరు పోర్టు శంకుస్థాపన కథ కొంత విచిత్రంగానే ఉంటుంది. బందరులో పోర్టు నిర్మాణానికి తీర ప్రాంతం అనువైనదని వందల సంవత్సాల ముందే నిర్ణయించారు.  

అయితే తూర్పు తీర ప్రాంతంలో అనేక మేజర్ పోర్టులు ఉండటంతో  బందరు పోర్టు ఆలస్యమవుతూ వచ్చింది. 2009 ఎన్నికలకు ఏడాది ముందు అంటే 2008 ఏప్రియల్ 23వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బందరు పోర్టుకు శంకుస్థాపన చేశారు. 2009 ఎన్నికలలో గెలిచిన వైఎస్ఆర్ అదే సంవత్సరం సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. అనంతరం జరిగిన పరిణామాల్లో మరో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బందరు పోర్టుకు సంబంధించిన కార్యక్రమాల్లో  పాల్గొన్నారు. 2014 ఎన్నికల ముందు జరిగిన హడావుడి పోర్టు నిర్మాణం వైపు సాగలేదు. పోర్టుకు సంబంధించిన స్థల సేకరణకు చర్యలు తీసుకోలేదు.

ఆ సమయంలో కృష్ణపట్నం పోర్టు కార్యకలాపాలు, అక్కడ నుంచి ముడి ఇనుప ఖనిజం ఎగుమతులు భారీగా జరుగుతూ ఉండడంతో మిగిలిన పోర్టుల జోలికి కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్లలేకపోయింది. రాష్ట్ర విభజన తరువాత  తెలుగుదేశం హయాంలో తిరిగి పోర్టుల నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించారు. ఈ క్రమంలో 2019 ఫిబ్రవరి 7వ తేదీన అప్పటి ముఖ్యమం్రతి చంద్రబాబునాయుడు బందర్ పోర్టుకు శంకుస్థాపన చేశారు. అదే సంవత్సరం జరిగిన ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్ల పాటు పోర్టు పనులను అటకెక్కించింది. సంక్షేమం పేరుతో డబ్బులు పంచడమే పాలన అంటూ ఖజానా ఖాళీ చేసిన జగన్ ప్రభుత్వం బందరు పోర్టు, భోగాపురం ఎయిర్ పోర్టు వంటి భారీ ప్రాజెక్ట్ ల గురించి ఆలోచించలేకపోయింది. వేల కోట్ల ఖర్చు అయ్యే ఇలాంటి ప్రాజెక్ట్ లు ప్రారంభించడం  జగన్ సర్కార్ కు అసాధ్యమే అయింది.

అయితే మే 22వ తేదీన బందరు పోర్టుకు శంకుస్థాపన చేసిన జగన్ గత ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.  అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అయినా పోర్టు పేరెత్తని జగన్ ఎన్నికల ముందు పోర్టు పనులు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచారు.  గతంలో జరిగిన శంకుస్థాపనలకు ప్రత్యక్ష సాక్షి అయిన పేర్ని నాని ఈ సారి కూడా జగన్ త బందర్ పోర్టు పనులను మరోసారి ప్రారంభించారు.

అయితే 2008లో ప్రారంభించిన వైఎస్ఆర్ ప్రమాదంలో మరణించగా, 2014లో పనులు పర్యవేక్షించిన కిరణ్ కుమార్ రెడ్డి పదవికి దూరమయ్యారు.  2019లో శంకుస్థాపన చేసిన చంద్రబాబు అనంతర ఎన్నికలలో  ఓటమి పాలయ్యారు. తాజాగా అదే పోర్టును శంకుస్థాపన చేసిన జగన్ కు రానున్న ఎన్నికలలో ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో అని రాజకీయ విశ్లేషకులు ఆలోచనలో పడ్డారు.  ఏది ఏమైనా బందరు సెంటిమెంట్ ఈ సారి కూడా పని చేస్తుందని తెలుగుదేశం నేతలు గుసగుసలాడుకుంటున్నారు. 

By
en-us Political News

  
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి కేసులో ఎన్ఐఏ పురోగతి సాధించింది. టెర్రరిస్టులకు ఆశ్రయమిచ్చిన ఇద్దరిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.
మాజీ సీఎం జగన్ ఇటీవల గుంటూరు జిల్లా సత్తెనపల్లి పర్యటనలో రోడ్డు సింగయ్య అనే వ్యక్తి మృతి షాకింగ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.
కాంగ్రెస్ ని బేసిగ్గా ఖాన్.. గ్రెస్ అని అంటారు. ఎందుకంటే ఈ పార్టీ తొలి  నుంచి ముస్లిం ప్రీతి  పాత్ర‌మైన పార్టీగానే పేరు సాధిస్తూ వ‌చ్చింద‌ని చెబుతారు.
ఈ ప్ర‌పంచానికి ఏదో అయ్యింది. త‌న చేతుల‌కు ఇన్నేసి ర‌క్త‌పు మ‌ర‌క‌ల‌ను అంటించుకుంటోన్న ట్రంప్ ని ఏకంగా నోబుల్ శాంతి బ‌హుమ‌తికి అది కూడా పాకిస్థాన్న లాంటి ఉగ్ర పిశాచ దేశం ప్ర‌తిపాదించ‌డం అంటే. ఈ
ట్యాపింగ్ వ్య‌వ‌హారం కేసీఆర్ అండ్ కోని మ‌రింతగా వెంటాడేలా తెలుస్తోంది. రీసెంట్ గా ప్ర‌ణీత్ రావును విచారించింది సిట్. ఆరు వంద‌ల మంది ప్రొఫైల్స్ ఎలా త‌యారు చేశారు.
కడప ఎంపీ అవినాష్ రెడ్డి మనుషులు తనను వెంబడించారని వివేకా హత్య కేసులోని ఎం -2 నిందితుడు సునీల్ యాదవ్ పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నెల్లూరు రూరల్ పరిధి పరిధిలోని కనుపర్తిపాడు గ్రామం 295 సర్వే నెంబర్ 1.80 ఎకరాల స్థలానికి సంబంధించి తమకు 1869 నుంచి హక్కులు ఉన్నాయని అహోబిలం మఠం కార్యదర్శి కేసి వరదరాజన్ పేర్కొన్నారు.
ఇదిగో..అదిగో అంటూ వాయిదా పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు.. ఇక ఇప్పట్లో లేనట్లేనా ? అంటే, అంతే అంటున్నారు, విశ్లేషకులు.
తీగ లాగితే డొంకంతా కదిలింది అన్నట్లు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త కథలు, కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. కొత్త కోణాలు తొంగి చూస్తున్నాయి.
ఇంగ్లండ్‌తో లీడ్స్ వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా 471 పరుగులకు ఆలౌటైంది.
బనకచర్ల ప్రాజెక్ట్‌ వివాదంపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలని సీపీఐ నేత నారాయణ కొరారు.
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకోనుంది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ప్రత్యేక సమావేశం ఈ నెల 27వ తేదీన ప్రత్యేకంగా సమావేశం కానుంది.
పాడి పంట. ఈ జంట వ్యవస్థల్లో పశువులు సుభిక్షంగా ఉంటే చాలు.. పంటలు, పల్లెలు, రైతు కుటుంబాలు యథాతథంగా బాగుంటాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.