సివిల్స్‌ గురువుగా సత్తా చాటిన భగవత్‌... టాప్‌–100లో 37 మంది!

Publish Date:Mar 13, 2026

Advertisement

 

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి మహేశ్‌ భగవత్‌ మరోసారి సివిల్స్‌ గురువుగా తన ప్రతిభను నిరూపించుకున్నారు. యూపీఎస్సీ అభ్యర్థులకు ఇంటర్వ్యూ దశలో మార్గదర్శనం చేస్తూ వారి విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా విడుదలైన సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష–2025 ఫలితాల్లో దేశవ్యాప్తంగా మొత్తం 958 మంది అభ్యర్థులు తుది జాబితాలో స్థానం సంపాదించారు. వీరిలో మహేశ్‌ భగవత్‌ మార్గదర్శకత్వంలో ఇంటర్వ్యూకు సిద్ధమైన 300 మంది అభ్యర్థులు తుది జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం.

ఈ 300 మందిలో 37 మంది అభ్యర్థులు టాప్‌–100 ర్యాంకుల్లో నిలిచారు. మహేశ్‌ భగవత్‌ శిష్యురాలు తేజస్వినీ సింగ్‌ 62వ ర్యాంకు సాధించడమే కాకుండా, ఇంటర్వ్యూలో అత్యధికంగా 225 మార్కులు సాధించి ప్రత్యేక గుర్తింపు పొందారు. తెలంగాణ టాపర్‌గా గూడెల్లి సృజన 55వ ర్యాంకు సాధించారు. ఆమె ప్రస్తుతం తెలంగాణ పోలీస్‌ అకాడమీలో ట్రైనీ డీఎస్పీగా శిక్షణ పొందుతున్నారు.

అలాగే దైనెంపల్లి ప్రవీణ్‌ 793వ ర్యాంకు సాధించి ట్రైనీ డీఎస్పీగా కొనసాగుతున్నారు. ఏపీ టాపర్‌గా జస్వంత్‌ జెన్ను  23వ ర్యాంకు సాధించగా, రాష్ట్రం నుంచి మరో 20 మంది అభ్యర్థులు కూడా ఎంపికయ్యారు. ఆల్‌ ఇండియా టాప్‌–10లో 3, 4, 6, 7 ర్యాంకులు సాధించిన అభ్యర్థులు కూడా మహేశ్‌ భగవత్‌ బృందం నుంచి ఇంటర్వ్యూ మార్గదర్శకత్వం పొందినవారే కావడం గమనార్హం. అభ్యర్థులు కష్టపడి సాధించిన ఈ విజయానికి మెంటర్ల సహకారం కూడా ఎంతో తోడ్పడిందని మహేశ్‌ భగవత్‌ తెలిపారు. ఆయన మార్గదర్శకత్వం వల్ల మరెంతో మంది అభ్యర్థులు సివిల్‌ సర్వీసెస్‌లో విజయం సాధిస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

By
en-us Political News

  
మహిళా భద్రతకు మరింత బలం చేకూర్చేలా షీ నేత్ర పేరిట ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. నగర కమిషనరేట్ పరిధిలోని ఏడు జోన్లకు ఒక్కో బృందం చొప్పున మొత్తం ఏడు ప్రత్యేక టీమ్స్‌ను రంగంలోకి దించారు.
మదీనా కాలనీలో ఉన్న సలామి కోల్డ్ స్టోరేజ్‌ లో కుళ్ళిన మాంసాన్ని విక్రయిస్తున్నట్లుగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు బాలాపూర్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కనీస పారిశుద్ధ్యం లేకుండా, మాంస వ్యర్థాలను నిల్వ ఉంచినట్లుగా అధికారులు గుర్తించారు.
గతంలో బడ్జెట్ లీక్ అయితే 30 మంది మంత్రులు రాజీనామా చేశారని, ఎన్టీఆర్ ఎవరూ లేకుండా 15 రోజులు ప్రభుత్వాన్ని నడిపారని చంద్రబాబు గుర్తు చేశారు. అలాగే. పేపర్ లీక్ కేసులో గతంలో ఓ మంత్రి రాజీనామా చేసిన విషయాన్నీ ప్రస్తావించారు.
పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నడుమ ప్రపంచ వ్యవస్థ గణనీయమైన పరివర్తనకు లోనవుతున్న తరుణంలో, భారతదేశం ఆర్థిక వృద్ధికి కీలక చోదకంగా తనను తాను నిలబెట్టుకుంటోంది.
లొంగిపోయిన వారిలో ప్రధానంగా పీఎల్జీఏ బెటాలియన్ ఇన్-చార్జ్ కమాండర్ సోది కేశాలు, , తెలంగాణ స్టేట్ కమిటీ మిలిటరీ చీఫ్ చప నారాయణ అలియాస్ మధు, డివిజనల్ కమిటీ సభ్యుడు కడ్తి సన్ను అలియాస్ మంతు వంటి అగ్రశ్రేణి నాయకులు ఉన్నారు. వీరితో పాటు మొత్తం 42 మంది క్యాడర్ బయటకు రావడంతో తెలంగాణలో మావోయిస్టు సంస్థాగత నిర్మాణం దాదాపుగా కుప్పకూలిందని పోలీసు వర్గాలు ప్రకటించాయి.
ప్రపంచ అణు విధానాలు, సాంకేతిక పురోగతులు, మరియు భౌగోళిక రాజకీయ ప్రమాదాలను అంచనా వేయడానికి, యురేనియం సుసంపన్నం మరియు ప్లూటోనియం ఉత్పత్తి మధ్య ఉన్న వ్యత్యాసాలను అర్థం చేసుకోవడం అత్యవసరం.
ఒక ప్రైవేట్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఓ బాలుడు, బాలికల మధ్య పరిచయం ఇన్‌స్టాగ్రామ్‌ చాటింగ్ వరకూ వెళ్లింది. ఇదే అవకాశంగా తీసుకున్న ఆ బాలుడు బాలికను ఇన్ స్టాగ్రామ్ లో వేధించడం మొదలు పెట్టాడు. ఆ వేధింపులు భరించలేక ఆ బాలిక పలు మార్లు ఆ బాలుడిని మందలించింది.
గుంటూరు స్వర్ణ భారతి నగర్ కు చెందిన 20 ఏళ్ల రసిక మణికంఠ రాజు, అంకమ్మనగర్ కి చెందిన యువతి గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించక పోవడంతో పాటు ఆ యువతికి ఇటీవల వేరే వ్యక్తితో వివాహం జరిగింది. వివాహం అనంతరం మనస్తాపానికి గురైన యువతి తన భర్తతో ఉండలేనంటూ గుంటూరుకు వచ్చింది.
ఖాజీపేట అగ్రహారానికి చెందిన కీర్తన అనే విద్యార్థినితో తనకు ఉన్న పరిచయాన్ని అడ్డుపెట్టుకుని ప్రేమించానంటూ ఆమెను వేధించసాగాడు. అయితే ఆమె నిరాకరిచడంతో వెంకటేష్ ఉన్నాదిగా మారిపోయాడు. శనివారం కీర్తనపై కత్తితో దాడి చేశాడు.
మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ ల పెళ్లి గత నెల 11న కేరళ అరుణ్మనూర్‌లోని శ్రీ నారాయణ గురు ఆలయంలో జరిగిన సంగతి తెలిసిందే. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేైసుకున్నారు. పెద్దలకు ఇష్టం లేకుండా వీరిద్దరూ వివాహం ద్వారా ఒక్కటయ్యారు. అయితే మోనాలిసా వయస్సుపై మొదటి నుంచీ అనుమానాలు వ్యక్తమయ్యాయి.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ ప్రభుత్వానికి డీజీపీ పదవికి ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను సూచించింది. వీరిలో వినాయక్ ప్రభాకర్ ఆట్టే, సౌమ్య మిశ్రా తో పాటు సీవీ ఆనంద్ పేరు కూడా ఉంది.
జనగాం జిల్లాకు చెందిన మనోహర్ కుటుంబం 13 ఏళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చి పోచారం పరిధిలో నివాసం ఉంటున్నారు. మనోహర్ మరదలు రమణి హైదరా బాద్ నగరంలోని పోచారం ఐటి కారిడార్ అన్నోజిగూడ రాజీవ్ గృహకల్ప లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరికీ కొద్ది కాలం కిందటే వివాహం నిశ్చయమైంది.
తమ కుమారుడి నామకరణ మహోత్సవాన్ని ఆ జంట వినూత్నంగా నిర్వహించింది. ఈ వేడుకను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు థీమ్ తో నిర్వహించిన ఆ జంట.. ఒక చిన్న ఆర్సీబీ జెర్సీని ప్రదర్శించారు. ఆ జెర్సీ వెనుక నంబర్ 18, విరాట్ అని పేరు ముద్రించారు. తద్వారా వారు తమ కుమారుడికి విరాట్ అన్న పేరు పెట్టినట్లు చాటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.