సిగరెట్లకోసం సిగపట్లు
Publish Date:Mar 22, 2012
Advertisement
రాష్ట్రంలో మరో మినీ మాఫియా తయారైంది. సిగరెట్ కంపెనీల డీలర్ లు హఠాత్తుగా సిగరెట్ల సరఫరాను రాష్ట్రవ్యాప్తంగా తగ్గించారు. దీంతో సిగరెట్లకు కొరత ఏర్పడింది. ఫలితంగా వాటి రెట్లు అమాంతం ఆకాశానికి చేరుకున్నాయి. బడ్జెట్లో సిగరెట్లపై పన్నులు పెంచబోతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ ప్రకటనల వెలువడిన వెంటనే రాష్ట్రంలో సిగరెట్ల సరఫరా బాగా తగ్గిపోయింది. సిగరెట్ కంపెనీల డీలర్లు నిలువలను దాచివేసి కృత్రిమ కొరతను సృష్టించారు. హోల్ సేల్ వ్యాపారులకు అధిక ధరలకు నామమాత్రంగా సరఫరా చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో సిగరెట్ల కొరత ఏర్పడింది. ధూమపాన ప్రియులు సిగరెట్లు లేక, ఒకవేళ లభ్యమైనా ధరలు మండుతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల కిళ్ళీ షాపు యజమానులకు, ధూమపాన ప్రియులకు మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. విజయవాడలో గోల్డ్ ఫ్లేక్ కింగ్ సైజు ప్యాకెట్ ఎమ్మార్పి ధర రూ. 55 కాగా, హోల్ సేల్ వ్యాపారులే రూ. 70 వసూలు చేస్తున్నారు. రిటైల్ మార్కెట్లో రూ. 85కు విక్రయిస్తున్నారు. అంటే పెట్టేకు సుమారు రూ.30 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఇదే పరిస్థితి మిగిలిన బ్రాండ్లకు కూడా ఏర్పడింది. గోల్డ్ ఫ్లేక్ చిన్నసైజు ప్యాకెట్ ఎమ్మార్పి ధర రూ. 40కాగా, హోల్ సేల్ లో రూ, 5కు, రిటైల్ లో రూ. 60కు విక్రయిస్తున్నారు. బర్కిలీ ప్యాకెట్ ధర హోల్ సేల్ లో రూ. 25కాగా, రిటైల్ లో రూ. 35 వరకు అమ్ముతున్నారు. ఈ బ్లాక్ మార్కెటింగ్ గాని అధిక ధరలను గాని నియంత్రించే వ్యవస్థ ఏదీ లేకపోవడంతో ధూమపాన ప్రియులు ధుమ ధుమలాడుతూ దమ్ము పీల్చే శక్తిలేక విలవిలాడుతున్నారు.
http://www.teluguone.com/news/content/cigarette-mafia-24-12859.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





