కాంగ్రెస్ లో కలవరం..... తెలుగుదేశంలో అంతర్మధనం

Publish Date:Mar 22, 2012

Advertisement

ఏడు నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలకు ఖంగు తినిపించాయి. ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి కవరాన్ని కలిగించగా, తెలుగుదేశంపార్టీలో అంతర్మధానానికి కారణమయ్యాయి. ఈ రెండు పార్టీలు ఏ నియోజకవర్గంలోనూ పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయాయి. ప్రస్తుతం ఫలితాలు త్వరలో జరగనున్న 18 నియోజకవర్గాల ఉప ఎన్నికలపైన ప్రభావం చూపిస్తాయనిరాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2014లో జరిగే ఎన్నికలకు ఈ 18 నియోజకవర్గాల ఉప ఎన్నికలు సెమీ ఫైనల్స్ లాంటివని, ఇక్కడ కూడా కాంగ్రెస్, టిడిపిలు విఫలమైతే రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించడం ఖాయమని భావిస్తున్నారు.

 

తెలంగాణా ప్రాంతంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశంపార్టీల నాయకులు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం అయితే చేయగలిగారు కాని ఓటర్లను ఆకట్టుకోలేకపోయారు. ఇక్కడ ఆరు స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో మూడుచోట్ల టిడిపి డిపాజిట్ లు కోల్పోయింది. ఒక్క స్టేషన్ ఘన్ పూర్ లో మాత్రమే రెండవస్థానంలో నిలిచింది. మహబూబ్ నగర్ లో ఘోరంగా నాలుగవ స్థానానికి దిగజారింది. తక్కిన చోట్ల మూడవస్థానంలో నిలిచింది.... మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ మూడు, టిడిపి నాలుగస్థానంలో నిలువగా, నాగర్ కర్నూల్, కొల్లాపూర్, అదిలాబాద్, కామారెడ్డి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ రెండవస్థానంలో నిలిచాయి. స్టేషన్ ఘన్ పూర్ లో మాత్రం కడియం శ్రీహరి రెండవస్థానాన్ని దక్కించుకోగలిగారు. నెల్లూరుజిల్లా కోవూరులో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఓటమికి కాంగ్రెస్, టిడిపిలు విశ్వా ప్రయత్నాలు చేశాయి. అయినా ఆయనను ఓడించలేకపోయాయి. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి పి. శ్రీనివాసరెడ్డి మూడవస్థానంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. ఈ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి వై. శ్రీనివాసరెడ్డి మహబూబ్ నగర్ నియోజకవర్గంలో గెలుపొందడం గమనించదగ్గ విషయం. తెలంగాణా వాదం ఒక్క టి.ఆర్.ఎస్. గుత్త సొత్తు కాదని బిజెపి నిరూపించింది. ఈ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి శ్రీనివాసరెడ్డికి 39,272 ఓట్లు రాగా, టిఆర్ఎస్ అభ్యర్ధి ఇబ్రహీంకు 37,377 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధి ఎం. ప్రకాష్ కు 27,308 ఓట్లు, టిడిపి అభ్యర్ధి చంద్రశేఖర్ కు 17,506 ఓట్లు వచ్చాయి.

 

 

By
en-us Political News

  

సుబ్రతో రాయ్ అరెస్ట్ ...

ఖరారైన రాష్ట్రపతి పాలన ...

రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...

విఫలమైన 'టి' కాంగ్రెస్

చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.

తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.

జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.

వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.

చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.

రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను

నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.

తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.

 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.