తమ్ముడికే చిరు మద్దతు

Publish Date:Oct 4, 2022

Advertisement

చిరంజీవి.. రాజకీయంగా తన మద్దతు ఎవరికన్నది కుండ బద్దలు కొట్టేశారు. బీజేపీకి దగ్గరౌతున్నారనీ, కాదు కాదు ఆయన ఇప్పటికీ కాంగ్రెస్ లోనే ఉన్నారనీ, అసలు రాజకీయాలకు సంబంధించి ఎలాంటి అభిప్రాయం లేదనీ, సినిమాలే ఆయన ప్రపంచమనీ ఇలా ఇప్పటి దాకా ఎవరికి తోచిన బాష్యాలు వారు చెప్పుకుంటూ వచ్చారు.

ఇప్పుడు చిరంజీవి తన మనసులో మాట ఏమిటో కొంచం తడబడుతూ అయినా స్పష్టంగా చెప్పేశారు. అదీ రాజకీయంగా తెలుగు రాష్ట్రాలలో సెన్సేషన్ క్రియోట్ చేస్తుందన్న అంచనాలున్న గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మీడియా సమావేశంలో ఆయన ఈ రాజకీయ ప్రకటన చేసేశారు. చిరంజీవి తాను ఏ గట్టునున్నాడో చెప్పేశారు.

రాజకీయాలకు దూరం అంటూనే తన మద్దతు ఎవరికో ప్రకటించేశారు. తమ్ముడి కోసమే తాను క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నానన్నారు. ఇంతకీ ప్రజారాజ్యం స్థాపించిన ఆయన ఆ తరువాత పరిణామాలలో పూర్తిగా సినిమాలకే పరిమితమైపోయినా.. ఇప్పటికింకా ఆయన సాంకేతికంగా కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఆయన ఒప్పుకున్నా.. ఒప్పుకోకున్నా.. అది నిజం. అయినా సరే ఆయన తన మద్దతు తమ్ముడికే ఉందని నిర్ద్వంద్వంగా ప్రకటిచేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్  నిబద్ధత ఏమిటో తనకు చిన్నప్పటి నుంచీ తెలుసునని అంటూ, పవన్ కల్యాణ్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేందుకు, రాష్ట్రాన్ని పాలించేందుకు అన్ని అర్హతలూ ఉన్నాయని చెప్పారు.

అలాంటి అధికారాన్ని ప్రజలు ఆయనకు ఇవ్వాలని కోరుకుంటున్నానంటూనే తనదైన స్టైల్ లో పిలుపు నిచ్చేశారు. ప్రస్తుతానికి అయితే తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని పునరుద్ఘాటిస్తూనే ఏమో భవిష్యత్ లో జనసేనకు జై కొడతానేమో, ఆ పార్టీకి మద్దతు ఇస్తానేమో అంటూ తన రాజకీయ మార్గమేమిటన్నది వెల్లడించేశారు.  

రాజకీయాలలో తానో గట్టున, తమ్ముడో గట్టునా ఉండటం కంటే అంటే తమ్ముడూ నేనూ రాజకీయంగా చెరోగట్టునా ఉండటం కంటే తాను రాజకీయాల నుంచి తప్పుకోవడమే పవన్ కు హెల్ప్ అవుతుందని చిరంజీవి అన్నారు.  అందుకే రాజకీయాలకు దూరంగా ఉన్నానని, ఇప్పుడిక తాను తన తమ్ముడి వైపే నిలబడతాననీ చెప్పకనే చెప్పేశారు.

ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్ కు మద్దతుగా మెగా బ్రదర్ నాగబాబు మాత్రమే యాక్టివ్ గా ఉన్నారు. చిరంజీవి జనసేన పార్టీపై ఇప్పటి వరకూ పన్నెత్తి మాట్లాడలేదు. దీంతో ఆయన జనసేన పట్ల అయిష్టతతో ఉన్నారన్న ఊహాగానాలు వ్యాప్తిలో ఉన్నాయి. వైసీపీ వైపు ఆయన మొగ్గు చూపుతున్నారన్న వార్తలూ వెల్లువెత్తాయి. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ చిరంజీవి తన మనసులో మాట బయట పెట్టేశారు.

By
en-us Political News

  
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు.
ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు.
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు.
తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.
ఆ సందర్భంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు.. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గాన్ని మంగళగిరికి దీటుగా అభివృద్ధి చేస్తానన్నారు.
పార్టీ అధినేత కేసీఆర్ త‌ర్వాత అంత‌టి వాడిగా.. ఆయన పొలిటిక్ వారసుడిగా కేటీఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన ఏ ఎన్నికలోనూ పార్టీ విజయాన్ని నమోదు చేసింది లేదు.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో నంబర్ 1, 2, 3 అంటూ హైరాక్కీని బట్టి చూస్తే లోకేష్ మూడో స్థానంలో ఉన్నారు. జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తరువాత రెండో స్థానంలో ఉన్నారని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ హైరాక్కీని దాటి త్వ‌ర‌లో లోకేష్ కి ముఖ్య‌మంత్రి ప‌ద‌విని అప్ప‌గించేందుకు గ్రౌండ్ వర్క్ జరుగుతోందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి.
లోక్ సభలో కాంగ్రెస్ సంఖ్యా బలం 400కు మించి ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పుడెవ‌రూ కాంగెస్ ని ఓట్ చోరీ అంటూ ఎగ‌తాళి చేయ‌లేదు. ఎవ‌రి క‌ష్టం వారు ప‌డుతూ.. ప్ర‌జ‌ల్ని మెప్పించే ప‌ని మాత్ర‌మే చేస్తూ వ‌చ్చేవార‌మ‌ని తాజాగా మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌ వ్యాఖ్యానించారు.
అసలింతకీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఒక్క చంద్రబాబు కాదు, కేంద్ర ప్రభుత్వం సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ అనుసరిస్తున్నాయి. ఈ పీపీపీ విధానం వల్ల ఎటువంటి నష్టం లేదని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఎవరెంతగా చెప్పినా జగన్ మాత్రం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లు వ్యవహరిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.