రాహుల్ లిస్టులో చిరంజీవి పేరు?
Publish Date:Oct 18, 2012
Advertisement
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్సింగ్తో చర్చలు జరపటం వల్ల కేంద్ర మంత్రివర్గ విస్తరణ రోజుల్లో ఉంటుందని అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు సన్నాహాలు పూర్తి అయ్యాయని కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పటి వరకూ కేంద్ర మంత్రి పదవుల రేసులో ఉన్న వారు తిరిగి ఢల్లీలో లాబియింగ్ కోసం ఫోనులు చేస్తున్నారు. అయితే యువనేతలకే ఎక్కువ మంత్రి పదవులు దక్కే అవకాశముందని తెలుస్తోంది. వృద్దులు రేసులో ఉన్నా ఎఐసిసి ప్రధానకార్యదర్శి రాహుల్గాంధీ దృష్టిలోనూ ఉండాలి. లేకపోతే వారికి పదవి దక్కే అవకాశముండదు. ప్రత్యేకించి రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఈసారి తనకు పదవి దక్కవచ్చని భావిస్తున్నారు. అయితే సిఎం కిరణ్కుమార్రెడ్డితో ఈయనకు విభేదాలు ఉండటం వల్ల విహెచ్ లాబీయింగ్ ఎంత బలమైనదైనా ఆయన్ని మినహాయించే అవకాశాలు ఎక్కువ అంటున్నారు. అందరిలోకి ఇటీవల మౌనం వహించిన రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి పదవి దక్కే అవకాశముంది. ఆయనపై సిఎం కూడా పెద్దగా దృష్టి కేంద్రీకరించలేదు కాబట్టి ఈయనకు మంత్రి పదవి లభిస్తుందని భావిస్తున్నారు. చిత్రమేమిటంటే రాహుల్గాంధీ తయారు చేసిన లిస్టులో కూడా చిరంజీవి పేరుందని సమాచారం. అలానే రాష్ట్రం నుంచి ఎంపి కావూరి సాంబశివరావు, కోట్ల విజయభాస్కరరెడ్డి, సర్వే సత్యన్నారాయణ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరికైనా మంత్రి పదవి దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది. ఒక్క కులం పరంగా మంత్రి పదవులు కనుక ఇస్తే విహెచ్ బిసి కాబట్టి ఆయనకు అవకాశం లభించవచ్చు. లేకపోతే మిగిలిన వారికి ఇచ్చే ప్రాధాన్యత ఆయనకు దక్కకపోవచ్చని, సిఎం లాబీయింగ్ ముందు విహెచ్ వెనుకబడే ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఏమైనా ఢల్లీ వెళ్లిన సిఎం కిరణ్ కేంద్ర మంత్రిపదవులపై రాహుల్తో చర్చించే అవకాశముందని సమాచారం. రాహుల్గాంధీ ఇష్టప్రకారమే మంత్రిపదవులు ఇస్తున్నందున పూర్తిస్థాయిలో ఫలానావారికి వస్తుందని చెప్పటం కష్టంగా ఉందని రాజకీయపరిశీలకులు సైతం భావిస్తున్నారు. ప్రత్యేకించి ఈ నెల 20వతేదీలోపు మంత్రిపదవుల పంపకం పూర్తికావొచ్చని భావిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/chiranjeevi-name-in-rahul-list-24-18276.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





