నామినేటెడ్ పోస్టులు ఇవ్వకపోతే కాంగ్రెస్కు కష్టకాలమే
Publish Date:Oct 18, 2012
Advertisement
వచ్చే నెల్లో నామినేటెడ్ పదవులు ఇచ్చేస్తామని పది నెలల నుంచి నెట్టుకొస్తున్న రాష్ట్రముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ప్రధాని సాయంతో ఈ విషయాన్ని ఓ కొలిక్కి తెచ్చేందుకు కసరత్తులు చేస్తున్నారు. అధిష్టానం దృష్టిలో నామినేటెడ్ పదవుల భర్తీ ఉందన్న విషయాన్ని జీవవైవిధ్య సదస్సు కోసం హైదరాబాద్ వచ్చిన ప్రధాని మన్మోహన్సింగ్ స్వయంగా సిఎంకు చెప్పారు. దీంతో వేడి మీద ఉండగానే పనులు చక్కబెట్టుకోవాలన్న సామెత చందంగా సిఎం హుటాహుటిన ఢల్లీ బయలుదేరి వెళ్లారు. అక్కడ ఎఐసిసి ప్రధానకార్యదర్శి రాహుల్గాంధీతోనూ, ఇతర నాయకులతోనూ ఈ నామినేటెడ్ పదవులపై చర్చిస్తారు. ప్రత్యేకించి ఎన్నికల్లో నామినేటెడ్ పదవుల అవసరం తెలియజేసేందుకు సిఎం స్వయంగా రూపొందించుకున్న ఒక డిజైన్ను కూడా కాంగ్రెస్ అధిష్టానంకు చూపనున్నారు. ఈ డిజైన్ ఆధారంగా వివరణ ఇస్తే అధిష్టానం ఖచ్చితంగా తన అభిప్రాయంతో ఏకీభవిస్తుందని సిఎం భావిస్తున్నారు. అందుకే ఆయన ఇంకా తెలివిగా ఓ కొత్త ఎత్తుగడ కూడా వేశారు. కేంద్ర మంత్రుల గురించి తనతో చర్చించేటప్పుడు రాష్ట్రం నుంచి ఎవరైనా వస్తే వారి ద్వారా కూడా నామినేటెడ్ పదవుల అవసరాన్ని చెప్పించేందుకు కృషి చేస్తున్నారు. ఇకనైనా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయకపోతే నాయకలను, కార్యకర్తలను కట్టడి చేయడం కష్టమని ఆయన అధిష్టానానికి గట్టిగా చెప్పినట్లు తెలిసింది. ఇప్పటిదాకా కాంగ్రెస్ అధిష్టానం నామినేటెడ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని సిఎం ఆశిస్తున్నారు. ఏమైనా ఢల్లీలో ఈ నామినేటెడ్ పోస్టులపై ఒక ఖచ్చితమైన హామీ పొందాలని సిఎం పట్టుదలగా ప్రయత్నిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/chief-minister-24-18277.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





