హత్యతో ఉనికి చాటుకుంటున్న ‘వార్’?
Publish Date:Oct 18, 2012
Advertisement
రాజకీయనాయకుల హత్యల ద్వారా తమ ఉనికిని చాటుకోవటం పీపుల్స్వార్ గ్రూపు నక్సలైట్లకు అలవాటైపోయింది. తమ ప్రభావిత ప్రాంతాల్లోనూ వార్ ఇటువంటి తెగింపు హత్యలకు సిద్ధమవుతుంది. రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా, ఖమ్మం, విశాఖ, వరంగల్, కృష్ణా, ప్రకాశం, మహబూబ్నగర్ జిల్లాలు వార్ ప్రభావిత ఏజెన్సీలుగా గుర్తింపునందుకున్నాయి. ఒకవైపు ఛత్తీస్ఘడ్, మరోవైపు ఒరిస్సా సరిహద్దులు కూడా వార్కు అనుకూలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వార్ తన బలాన్ని పెంచుకోవాల్సి వచ్చినప్పుడు గిరిజనులను ఆకర్షిస్తోంది. అభివృద్థి, ఉద్యోగం ద్వారా గిరిజనులను వార్కు దూరం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ఎస్టి సబ్ప్లాన్ ఏరియా డిక్లరేషను ప్రకటించటం వెనుక గిరిజనయువతను మావోయిజం వైపు మళ్లకుండా చూడాలనే ఉద్దేశ్యం కనిపిస్తోంది. అయితే గిరిజనులు మాత్రం ఒకవైపు వార్ను, మరోవైపు పోలీసులను భరిస్తున్నారు. వీరిద్దరి మధ్యలో అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా నలిగిపోతున్నారు. ఈ అమాయక గిరిజనుల్లో 14 నుంచి 18ఏళ్లలోపు గిరిజనులను వార్ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. వారికి ఆయుధాలు ఉపయోగించటంలో శిక్షణ ఇస్తోంది. ఈ శిక్షణ తరువాత కొంతకాలం అన్నలుగా చెలామణి అయి యువకులు పోలీసుల ముందు లంగిపోయినా వారి జీవనోపాధికి లక్షల్లో పారితోషికం లభిస్తోంది. ఇలా వార్ నుంచి బయటకు వచ్చిన వారు స్థిరపడిపోతున్నారు. దీనికి గిరిజనకుటుంబాలు ఆకర్షితులవుతున్నారు. అందుకే కొంచెం సాహసించి వార్బాట పడుతున్నారు. అయితే వార్ తన ఉనికి చాటుకోవాల్సి వచ్చినప్పుడు గిరిజన ప్రతినిధులను కూడా హత్య చేయటానికి వెనుకాడటం లేదు. దీంతో గిరిజన సంఘాలు ఒక్కోసారి వార్ను తప్పుపడుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలను వార్ విరోధులుగా భావిస్తున్నది. దీనికి కారణం ఒకటి ఆ పార్టీ అధికారంలో ఉండటం. రెండోది కాంగ్రెస్ నేతలు భూఆక్రమణలకు పాల్పడటం. ఈ రెండు అంశాల ఆధారంగానే వార్ కాంగ్రెస్నేతలను హత్య చేస్తోంది. ప్రత్యేకించి రెండో అంశం ఆధారంగా ఖమ్మం జిల్లాలో వార్ తన ఉనికిని చాటుకుంది. పాల్వంచ మండల పరిధిలోని రెడ్డిగూడెం గ్రామ కాంగ్రెస్ నేత కల్లెం వెంకటరెడ్డి(45)ని ఆరుగురు సాయుధ మావోయిస్టులు తుపాకీలతో కాల్చి హత్య చేశారు. ఆనవాయితీ ప్రకారం మావోయిస్టు కొత్తగూడెం ఏరియా కార్యదర్శి భద్రు పేరిట మావోయిస్టులు లేఖ వదిలివెళ్లారు. అర్ధరాత్రి జరిగిన ఈ హత్యతో రెడ్డిగూడెం గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. అలానే ఖమ్మం జిల్లాలో ఈ హత్య గురించి తీవ్రస్థాయి చర్చలకు తావిచ్చింది.
http://www.teluguone.com/news/content/political-leaders-assasination-24-18274.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





