దంతాల్లో చిప్‌...ఖమేనీ హత్యకు ఏడాదిగా పక్కా ప్లాన్‌..!

Publish Date:Mar 6, 2026

Advertisement

 

ఒక దేశ అత్యున్నత నేత ఎక్కడ ఉన్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఆయన వెంట ఎవరున్నారు? వంటి వివరాలు తెలుసుకోవడం సాధారణంగా చాలా కష్టమైన పని. ముఖ్యంగా యుద్ధ పరిస్థితుల్లో, ప్రాణాలకు ముప్పు ఉందన్న హెచ్చరికలు ఉన్నప్పుడు ఇది మరింత క్లిష్టంగా మారుతుంది. అయితే ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా ఖమేనీని లక్ష్యంగా చేసుకున్న ఆపరేషన్‌లో అమెరికా, ఇజ్రాయెల్‌ నిఘా సంస్థలు సీఐఏ, మొస్సాద్‌లు అత్యంత పద్ధతిగా పని చేశాయన్న ప్రచారం జరుగుతోంది.

ఖమేనీని హతమార్చడం వెనుక ఒక్కరోజు లేదా ఒక్కసారిగా చేసిన ప్రయత్నం కాదని తెలుస్తోంది. ఈ ఆపరేషన్‌ కోసం నిఘా వర్గాలు ఏళ్ల తరబడి సేకరించిన సమాచారమే కీలకమైందని విశ్లేషకులు అంటున్నారు. 86 ఏళ్ల ఖమేనీ కదలికలను నిశితంగా గమనిస్తూ, సరైన సమయం కోసం చాలా కాలం పాటు వేచి చూసిన తర్వాతే దాడి జరిగిందని వివిధ నివేదికలు పేర్కొంటున్నాయి.ఖమేనీ హత్యకు సంబంధించి పలు సిద్ధాంతాలు ప్రస్తుతం ప్రచారంలో ఉన్నాయి. వాటిలో డెంటల్‌ చిప్‌ ట్రాకింగ్‌ విధానం ఒకటిగా చెప్పబడుతోంది. ఈ విధానం ప్రకారం దంత చికిత్స సమయంలో రహస్యంగా ట్రాకింగ్‌ పరికరాలను అమర్చడం జరిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ ప్రచారం ప్రకారం, ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ మొస్సాద్‌ తమ అనుబంధ వైద్యులు, దంత వైద్యులను ఏళ్ల కిందటే ఇరాన్‌లో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిందని చెబుతున్నారు. ముఖ్యంగా సైనికులు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో క్లినిక్‌లు ఏర్పాటు చేసి, చికిత్స సమయంలో దంత ఇంప్లాంట్‌లలో సూక్ష్మ ట్రాకింగ్‌ చిప్‌లు అమర్చినట్టు సమాచారం. అలాగే వైద్య శిబిరాల పేరుతో కూడా దంత చికిత్సలు నిర్వహిస్తూ పరికరాలు అమర్చారనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇదే విధంగా కొంతమంది వైద్యుల ద్వారా కీలక అధికారుల శస్త్రచికిత్సల సమయంలో కడుపులోనూ ట్రాకింగ్‌ పరికరాలు అమర్చినట్టు కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే ఈ ఆరోపణలను ఎవరూ అధికారికంగా ధృవీకరించలేదు.ఇంకొక వాదన ప్రకారం, ఇరాన్‌లో కోటి మందికి పైగా వినియోగించే ప్రార్థనా సమయాల యాప్‌ను కూడా ఇజ్రాయెల్‌ నిఘా సంస్థలు హ్యాక్‌ చేశాయనే ప్రచారం ఉంది. అదేవిధంగా పలు వెబ్‌సైట్లు, యాప్‌లను కూడా హ్యాక్‌ చేసి సమాచారాన్ని సేకరించారన్న వార్తలు వెలువడుతున్నాయి.

ట్రాఫిక్‌ కెమెరాల హ్యాకింగ్‌

ఇరాన్‌లో పరిస్థితులను గమనించేందుకు అమెరికా, ఇజ్రాయెల్‌ నిఘా సంస్థలు చాలా కాలం క్రితమే ట్రాఫిక్‌ కెమెరాలను హ్యాక్‌ చేశాయన్న కథనాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా రాజధాని టెహ్రాన్‌లోని ట్రాఫిక్‌ కెమెరాల ద్వారా కీలక నేతల కదలికలను పర్యవేక్షించారన్న ప్రచారం ఉంది.ఈ వ్యవస్థ ద్వారా ఖమేనీ ఎక్కడికి వెళ్తున్నారు, ఎంతసేపు అక్కడ ఉంటున్నారు, ఆయన వెంట ఎవరున్నారు వంటి వివరాలను నిఘా వర్గాలు రియల్‌ టైమ్‌లో గమనించగలిగాయని కొన్ని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

ప్రత్యేకంగా ఖమేనీ తరచూ సంచరించే పాశ్చర్‌ వీధి పరిసరాల్లో నిఘా మరింత పెంచినట్టు చెబుతున్నారు. ట్రాఫిక్‌ డేటాను విశ్లేషించడం ద్వారా ఆయన కార్యాలయానికి ఎప్పుడు వస్తారు, ఆయనతో పాటు ఎవరుంటారు వంటి వివరాలను ముందుగానే గుర్తించారని నివేదికలు పేర్కొంటున్నాయి.అలాగే ఖమేనీ భద్రతా సిబ్బంది వాహనాల కదలికలు, వారు ఎక్కడ ఆగుతున్నారు. 

ఎక్కడ భోజనం చేస్తున్నారు వంటి వివరాలు కూడా నిఘా వ్యవస్థల ద్వారా తెలుసుకునే ప్రయత్నం జరిగినట్టు సమాచారం. పాశ్చర్‌ వీధి సమీపంలోని కొన్ని మొబైల్‌ టవర్లపై కూడా దాడులు జరిగి కమ్యూనికేషన్‌ వ్యవస్థను దెబ్బతీశారని కొన్ని నివేదికలు వెల్లడించాయి. దీంతో హెచ్చరికలు సమయానికి చేరకుండా చేసే ప్రయత్నం జరిగిందని చెబుతున్నారు.అయితే ఈ అంశాలన్నింటిపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ వెలువడలేదు. ప్రస్తుతం ఇవన్నీ అంతర్జాతీయ మీడియా కథనాలు, విశ్లేషణల్లో వినిపిస్తున్న వాదనలుగానే ఉన్నాయి.

By
en-us Political News

  
రాష్ట్రంలోని నదీపరివాహక ప్రాంతాల్లో అవేర్ సంస్థ ద్వారా జల వనరుల వివరాలు రియల్ టైమ్‌లో నమోదు చేస్తున్నట్టు తెలిపారు. వరద జలాలను సద్వినియోగం చేసుకుంటున్న తీరును, నదుల అనుసంధానంపై రూపొందించిన ప్రణాళికల గురించి వెల్లడించారు. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్టు సమస్యపై చర్చించారు.
ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసి ముంబై ఇండియన్స్‌కు 241 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో విద్యర్థుల బలవన్మరణానికి పాల్పడిన సంఘటనలు విషాదాన్ని నింపాయి. ఫలితాలు వెలువడిన గంటల వ్యవధిలోనే ఆరుగురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడటం వారి కుటుంబాలలో తీరని శోకాన్ని మిగిల్చింది. ఇలా ఆత్మహత్యకు పాల్పడిన వారిలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు ఉన్నారు.
ఈ కేంద్రాల ద్వారా క్వాంటం కంప్యూటర్ హార్డ్‌వేర్‌ను క్షుణ్ణంగా పరీక్షించి, ధృవీకరిస్తారు. ఇది అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో క్వాంటం వ్యాలీ గా మారుస్తుంది.
న్యాయ వివాదాల పరిష్కార ప్రక్రియలో, ముఖ్యంగా మధ్యవర్తిత్వ రంగంలో ఏఐ వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది
దేశ రాజకీయాల్లో ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.
హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రముఖ గాయని సత్యవతి ముడావత్ (మంగ్లీ) ఇచ్చిన ఫిర్యాదు సంచలనంగా మారింది.
విదేశాల్లో ఉన్నత చదువులు, మంచి భవిష్యత్తు కోసం వెళ్లిన ఓ యువకుడు దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోవడం కుటుంబాన్ని విషాదంలో ముంచింది.
ఆశా భోంస్లే మృతి పట్ల సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు నివాళులర్పిస్తున్నారు
నాసిక్ ఐటీ కంపెనీలో లైంగిక వేధింపుల ఉదంతం దేశవ్యాప్తంగా ఐటీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
భారతీయ సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ నేపథ్య గాయని ఆశా భోస్లే
పెళ్లి పీటలపై కట్నం డబ్బుల కోసం డిమాండ్ చేయడం గానీ, ఇతర వివాదాస్పద కోర్కెలతో పెళ్లి ఆగిపోవడం గానీ మనం విన్న విషయాలే.
భారతీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో కీలక అడుగు వేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.