పళ్లు తినక జనం చనిపోతున్నారు..

Publish Date:Jan 24, 2019

Advertisement

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ వార్త నిజమేనంటున్నారు ఆక్స్‌ఫర్డుకి చెందిన పరిశోధకులు. Chinese Academy of Medical Sciences అనే సంస్థతో కలిసి వీరు సాగించిన ఓ దీర్ఘకాలిక పరిశోధన ఇప్పుడు చైనాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.


పళ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే! ఆ విషయాన్ని ఎవరూ కాదనలేరు. కానీ పళ్లు తినడానికీ, దీర్ఘకాలం బతకడానికీ మధ్య ఉన్న సంబంధాన్ని శాస్త్రీయంగా నిరూపించే ప్రయత్నం చేశారు కొందరు పరిశోధకులు. ఇందుకోసం అయిదు లక్షలమంది చైనీయుల జీవితాలను పరిశీలించారు. వీరందరూ కూడా చైనాలోని పది వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు. 30 నుంచి 79 ఏళ్ల లోపు వయసు కలిగినవారు. వీరి ఆరోగ్యాన్ని ఒకటి రెండేళ్లు కాదు... ఏకంగా ఏడేళ్లపాటు నిశితంగా గమనించారు. పరిశోధన మొదలుపెట్టిన సమయంలో ఈ అయిదు లక్షలమందిలోనూ రక్తపోటు, గుండెజబ్బులు లేనేలేవు. మరి ఈ సుదీర్ఘ పరిశోధనలో తేలిందేమిటంటే...

 

- అయిదు లక్షలమందిలో 18.8 శాతం మందికి తరచూ పళ్లు తినే అలవాటు ఉంది. 6.4 శాతం మందేమో పళ్లని చాలా తక్కువగా తీసుకోవడమో లేకపోతే వాటి జోలికే పోకపోవడమో చేస్తుంటారు.


- డయాబెటిస్ ఉన్నవారు, లేనిపోని సమస్యలు వస్తాయేమో అన్న భయంతో అసలు పళ్ల జోలికి పోవడమే మానేస్తున్నారట.


- పరిశోధన మొదలవకముందు డయాబెటిస్‌ లేనివారిలో పళ్లు తినే అలవాటు ఉంటేకనుక... అలాంటివారిలో డయాబెటిస్ వచ్చే ప్రమాదం 12 శాతం తక్కువగా ఉండటాన్ని గమనించారు. ఇక పరిశోధన మొదలయ్యే సమయానికే డయాబెటిస్‌ ఉన్నవారిలో పళ్లు తినే అలవాటు ఉంటే... వారిలో డయాబెటిస్‌కి సంబంధించిన సమస్యలు దాదాపు 28 శాతం వరకూ తలెత్తకపోవడాన్ని గమనించారు. అంటే కళ్లు దెబ్బతినడం, కిడ్నీలు పాడవడం, శరీర భాగాలకి రక్తప్రసారం సరిగా జరగకపోవడం... వంటి తీవ్రమైన సమస్యలు వీరి దరిచేరడం లేదన్నమాట.


- తరచూ పళ్లు తినే అలవాటు ఉన్నవారు గుండెజబ్బులతో చనిపోవడం దాదాపు మూడోవంతు తక్కువగా కనిపించింది.


- పళ్లని తీసుకుంటే, ఒక్క చైనాలోనే దాదాపు అయిదు లక్షల మందిని గుండెపోటు నుంచి కాపాడవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

 

పళ్లలో మన శరీరానికి కావల్సిన పోషకాలు ఉంటాయి. ఒంట్లో చెత్తాచెదారాన్ని బయటకు పంపే పీచుపదార్థం ఉంటుంది. రోగనిరోధకశక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. గుండెకు మేలుచేసేలా తక్కువ సోడియం, ఎక్కువ పొటాషియం నిష్పత్తి కనిపిస్తుంది. చక్కెర పదార్థాలు ఉన్నా అవి రక్తంలో నిదానంగా, సహజంగా కరిగేలా ఉంటాయి. పళ్లతో ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి కాబట్టే అవి మందులు పనిచేసినంత ప్రభావవంతంగా పనిచేస్తాయి. కానీ చిరుతిళ్లలా రుచిగా ఉండవనో, క్రమం తప్పకుండా కొనేందుకూ తినేందుకూ బద్ధకించో.... చాలామంది వాటి జోలికే పోరు. ఇక షుగర్ వ్యాధి ఉన్నవారైతే ఏఏ పండ్లను తీసుకోవాలో, ఎంత మోతాదులో తీసుకోవాలో తెలియని అయోమయంలో అసలు వాటిని ముట్టుకోరు. ఫలితం! మన ఆరోగ్యాన్ని మనమే చేజేతులారా పాడుచేసుకుంటున్నాం. క్రమంగా మృత్యుముఖంలోకి అడుగులు వేస్తున్నాం.


- నిర్జర.

By
en-us Political News

  
ఉదయాన్నే నిద్రలేచి మంచం దిగగానే కాలి మడమలో సూదితో గుచ్చినట్లుగా తీవ్రమైన నొప్పి వస్తుంది కొందరికి.  ఇలా లేవగానే ఆ నొప్పితో కొన్ని అడుగులు వేయడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. చాలామంది ఈ నొప్పిని సీరియస్ గా తీసుకోరు.  కొద్దిసేపు అలా నడవగానే అదే తగ్గిపోతుందిలే అని కాంప్రమైజ్ అయిపోతారు....
మన శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన అవయవాలు. అవి రక్తాన్ని శుద్ధి చేస్తూ, విషతుల్యాలను బయటకు పంపుతాయి. కానీ, దురదృష్టవశాత్తూ కిడ్నీ సమస్యలు వస్తే అది ఒక పీడకలలా మారుతుంది. డయాలసిస్ బెడ్ మీద గంటల తరబడి గడపడం..
నోటి ఆరోగ్యం అనేది మన సంపూర్ణ ఆరోగ్యానికి ముఖద్వారం లాంటిది. చాలా మంది పళ్ళను తెల్లగా, శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుందని అనుకుంటారు, కానీ పళ్ళ కంటే వాటిని పట్టి ఉంచే చిగుళ్ల ఆరోగ్యం చాలా ముఖ్యం. చిగుళ్ల వ్యాధులు..
ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘ఐబీఎస్’ (Irritable Bowel Syndrome - IBS) ఒకటి. దీనినే తెలుగులో ‘పేగుల్లో గడబిడ’ లేదా జీర్ణకోశ సమస్య అని అంటారు. కొంతమందికి ఆహారం తీసుకోగానే మోషన్స్‌కు వెళ్లాల్సి.....
వేసవిలో ఎండలో తిరిగి అలసటతో  ఇంటికి తిరిగి రాగానే చాలా మందికి ఫ్రిజ్‌లోంచి చల్లటి నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. తీవ్రమైన ఎండ, చెమటల తర్వాత చల్లటి నీరు తాగితే చాలా రిలాక్స్ గా ఉపశమనంగా అనిపిస్తుంది....
మారుతున్న కాలం, పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘సైనస్’ (Sinusitis) ఒకటి. సాధారణ జలుబులా ప్రారంభమై...
వేసవి కాలంలో దాదాపు ప్రతి ఇంట్లో కూలర్‌ను ఉపయోగిస్తారు, ఏసీ పెట్టించుకోలేని మధ్యతరగతి,  దిగువ తరగతి వారికి కూలర్ వాడకం ఎంతో ఉపయోగకరంగా..
నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో చాలా మంది చేసే అతిపెద్ద తప్పు – ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ (టిఫిన్) మానేయడం. ఆఫీసులకో, కాలేజీలకో వెళ్లే తొందరలోనో.. లేదా బరువు తగ్గిపోతామనే అపోహతోనో చాలా మంది ఉదయపు ఆహారాన్ని పూర్తిగా స్కిప్ చేస్తుంటారు...
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పదం నౌతప.. నౌతప అంటే తొమ్మిది రోజుల పాటు ఉండే ప్రమాదకరమైన వేడి వాతావరణం.  గత ఒకటి రెండు నెలలుగా వేసవి కాలం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. వడగాలులు ..
ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయపెడుతున్న ఆరోగ్య సమస్యలలో ‘క్యాన్సర్’ ముందు వరుసలో ఉంది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఈ మహమ్మారి, నేడు మారుతున్న జీవనశైలి..
ఒకప్పుడు వృద్దులలో కనిపించే ఆరోగ్య సమస్యలు అన్నీ నేటికాలంలో యువతలో కూడా కనిపిస్తున్నాయి. ఎంతో మంది వెన్ను నొప్పి,  డయాబెటిస్,  బిపి, మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఇవి మాత్రమే కాకుండా చాలామంది యువతను కూడా ఇబ్బంది పెడుతున్న ఇంకొక సమస్య కీళ్ల వాతం. దీన్నే ఆర్థరైటిస్ అని కూడా పిలుస్తారు. ..
దంతాల నొప్పితో బాధపడుతున్నారా? ఆస్ట్రేలియన్ హెర్బల్ క్లినిక్ కన్సల్టెంట్ హెర్బలిస్ట్ డాక్టర్ జి. లక్ష్మణరావు గారు జామ ఆకుల ద్వారా పంటి నొప్పిని మరియు నోటి సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో ఈ వీడియోలో వివరించారు. ఆ సింపుల్ హోమ్ రెమెడీస్ ఇక్కడ తెలుసుకోండి...
ఎండల ప్రభావం వల్ల లేదా మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో శరీర ఉష్ణోగ్రత (Body Heat) అకస్మాత్తుగా పెరిగిపోతూ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.