చెవిరెడ్డి అరెస్టు?

Publish Date:Jun 17, 2025

Advertisement

వైసీపీ సీనియర్ నేత, మాజీ  ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. లుక్ ఔట్ నోటీసు ఉండగా ఆయన దేశం విడిచి శ్రీలకంకు వెళ్లేందకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకోవడంతో పోలీసులు చెవిరెడ్డి భాసక్కరరెడ్డిని అదుపులోనికి తీసుకున్నారు. 

వైసీపీ సీనియర్ నేత, మాజీ  ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. లుక్ ఔట్ నోటీసు ఉండగా ఆయన దేశం విడిచి శ్రీలకంకు వెళ్లేందకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకోవడంతో పోలీసులు చెవిరెడ్డి భాసక్కరరెడ్డిని అదుపులోనికి తీసుకున్నారు. మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి సిట్ చెవిరెడ్డిపై లుక్ ఔట్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే.  చెవిరెడ్డి బెంగళూరు విమానాశ్రయానికి వస్తున్నారన్న అత్యంత విశ్వసనీయ సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఎయిర్ పోర్టు వద్ద ఆయనను అదుపులోనికి తీసుకుని విచారణ నిమిత్తం విజయవాడ తరలిస్తున్నారని తెలుస్తున్నది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  

చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన  2024 ఎన్నికలలో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి పరాజయం పాలయ్యారు.  వైసీపీ హయాంలో   చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రభుత్వ విఫ్ గా కూడా పని చేశారు. అంతే కాకుండా తుడా చైర్మన్ గా కూడా ఉన్న ఆయన ఆ పదవిని అడ్డుపెట్టుకుని పలు అవకతవకలు, అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. కేసులు కూడా నమోదయ్యాయి. అలాగే జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో కూడా ఆయన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే  ఏ వన్ గా   రాజ్ కసిరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, వైఎస్. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఓఎస్డీగా పనిచేసిన కృష్ణ మోహన్ రెడ్డి, ఈ ఆర్థిక వ్యవహారాలు చూసిన  బాలాజీ గోవిందప్పను  స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం  అరెస్టు చేసిన విషయం తెలిసిందే.  ఈ కేసుతో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఉన్న సంబంధాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు దృష్టి సారించారు.

అందులో భాగంగా చెవిరెడ్డి గన్మెన్ మదన్ రెడ్డిని విచారణ చేసిన విషయం తెలిసిందే. ఆయనపై సిట్ లుకౌట్ నోటీసు కూడా జారీ చేసింది. దీనిపై ఇటీవల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతిలో  మీడియాతో మాట్లాడుతూ తాను దేనికీ భయపడనని అన్నారు.  అటువంటి ఆయన అడ్డుకుంటారని తెలిసీ శ్రీలంకకు అంటూ బెంగళూరు విమానాశ్రయానికి వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. పరారీ కావడానికి ప్రయత్నించారా అన్న సందేహాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.  

By
en-us Political News

  
తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నను అరెస్టు చేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ చేశారు. తనపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేయడంపై స్పందించిన ఆమె.. మల్లన్న దారుణంగా మాట్లాడారని ఆక్షేపించారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి జోరుగా పావులు కదుపుతున్న బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో మాత్రం అయోమయంలో పడింది. తెలంగాణ ఆవిర్భావం తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ సీపీఐ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి పోటీచేసి ఓడిపోయారు.
ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు పార్థివదేహానికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. హైదరాబాద్‌లో ఫిల్మ్‌నగర్‌లోని నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు చాలా బాధాకరమన్నారు.
లష్కర్ బోనాల సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు సీఎంకు తీర్థప్రసాదాలు వేదాశీర్వచనాలిచ్చారు.
జ‌గ‌న్ చుట్టూ ఇంత మంది జ‌నం.. రియ‌లా ఫేకా? అస‌లేంటీ పొలిటిక‌ల్ ప‌బ్లిక్ స్టోరీ? అన్న‌దిప్పుడు చ‌ర్చ‌నీయాంశం. బేసిగ్గా జ‌గ‌న్ కి బీసీ-ఎస్సీ-ఎస్టీ- ముస్లిం- క్రిష్టియ‌న్- మైనార్టీల్లో ఓటు బ్యాంకు ఉన్న మాట నిజం. ఆ సాలీడ్ ఓటు బ్యాంకే మొన్న‌టి ఎన్నిక‌ల్లో 39 శాతం ఓట్లు ప‌డేలా చేసింది.
మేడ్చల్‌ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్‌ పరిధిలోని పీర్జాదిగూడలో ఉన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు సంబంధించిన క్యూ న్యూస్ కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. ఇవాళ ఉదయాన్నే కొందరు జాగృతి కార్యకర్తలు కార్యాలయంలోకి ప్రవేశించి ఫర్నీచర్‌, కంప్యూటర్లను ధ్వంసం చేశారు.
గ‌ణేశ్ సినిమాలో.. ఫేమ‌స్ డైలాగ్. నేను బ‌త‌కాలి త‌మ్మీ అంటూ ఆయ‌న చెప్పిన డైలాగుల‌కు అప్పట్లో య‌మ క్రేజుండేది. ఆపై గాయంలో ఆయ‌న ఖండిస్తున్న అనే డైలాగ్ కూడా చాలా చాలా ఫేమ‌స్ అయ్యింది.
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల భారత మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి కోట భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో మరో ప్రమాదం జరిగింది. ఎన్విరోవేస్ట్‌ మేనేజ్‌మెంట్ పరిశ్రమలో భారీగా మంటలు చెలరేగాయి.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. ఆదివారం (జులై 13) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం కాంప్లెక్స్ లోని కంపార్తట్ మెంట్లన్నీ నిండియోయాయి.
ఫ్ల‌యిట్ యాక్సిడెంట్ జ‌రిగిన రెండు మూడు రోజుల త‌ర్వాత వెలుగు చూసిన కోణాల్లో ఇదీ ఒక‌టి. అదేంటంటే.. ఇంధ‌న స్విచ్ ని ఆన్ చేయ‌కుండానే అహ్మ‌దాబాద్ టు లండ‌న్ ప్లయిట్ టేకాఫ్ అయ్యింది.
తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం (జులై 13) తెల్లవారు జామున కన్నుమూశారు.
ఒడిశా బాలాసోర్‌లోని ఒక కళాశాలలో ఘోర విషాదకర ఘటన జరిగింది. గురువు లైంగిక వేధింపులకు భరించలేక ఓ విద్యార్థిని కాలేజిలోనే నిప్పంటించుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.