Publish Date:Nov 23, 2021
భరించలేని బాధలో ఉన్నారు చంద్రబాబు. ఆ కన్నీటి చారలు ఇంకా ఆరనే లేదు. గుండె గాయం మాననే లేదు. ఆ మనసిక వేధ ఇంకా మదిని తొలిచేస్తూనే ఉంది. సభలో కౌరవ మూక చేసిన దారుణ పరాభవం నుంచి ఇంకా కోలుకోనే లేదు. అయినా, ఆ బాధను గొంతులోనే దిగమింగుకున్నారు. కన్నీటిని అతికష్టం మీద తుడిచేసుకున్నారు. ప్రజల బాధ ముందు తన బాధ ఎంతనుకున్నారు. వరదలతో విలవిల్లాడుతున్న జనం కష్టాలను కళ్లారా చూసేందుకు కదలివచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. నాయకుడంటే ఇలా ఉండాలి. పర్సనల్ ప్రాబ్లమ్స్ను పక్కనపెట్టేసి.. ప్రజల కోసం ఇలా తరలిరావాలి. అందుకే చంద్రబాబు నిజమైన లీడర్. ప్రజలు మెచ్చే నాయకుడు.
భారీ వర్షాలు, వరదలతో రాయలసీమలో కనీవినీ ఎరుగని విపత్తు. జలఖడ్గం అనేక గ్రామాలకు లోతైన గాయం చేసింది. పదుల సంఖ్యలో ప్రజలు జల సమాధి అయ్యారు. లక్షల ఎకరాలు నీట మునిగాయి. ఊర్లకు ఊర్లే ధ్వంస మయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కన్నీటి సంద్రమయ్యారు. ప్రజల కష్టాలను చూసి చంద్రబాబు చలించిపోయారు. సీఎం జగన్రెడ్డి తనకేమీ పట్టనట్టు ప్యాలెస్కే పరిమితమైనా.. విమానంలో విహరించిపోయినా.. సొంతజిల్లాను కనీసం కన్నెత్తి చూడకపోయినా.. ప్రతిపక్ష నేత మాత్రం జగన్లా తనకేమీ పట్టనట్టు ఉండలేకపోయారు. వరద ప్రాంతాల్లో పర్యటించేందుకు కదలివచ్చారు. పుట్టెడు దుఃఖంలోనూ.. ప్రజల దుఃఖాన్ని తీర్చేందుకు, బాధితులను ఓదార్చేందుకు ముందుకొచ్చారు చంద్రబాబు.
వరద బాధిత ప్రాంతాల పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు కడప వచ్చారు. కడప విమానాశ్రయంలో టీడీపీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. సీఎం జగన్రెడ్డి సొంత ఇలాఖాలో చంద్రబాబుకు అనూహ్య ప్రజాధరణ లభించింది. బాబుకు వెల్కమ్ చెప్పేందుకు.. పెద్ద సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. జై చంద్రబాబు నినాదాలతో కడప మారుమోగింది.
చంద్రబాబు రాజంపేట, నందలూరు మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. పులపత్తూరు, మందపల్లి, తోగూరుపేట, గుండ్లూరు గ్రామాల్లో బాధితులను పరామర్శించి వారితో మాట్లాడనున్నారు. రోజంతా కడప జిల్లాలోనే చంద్రబాబు పర్యటిస్తారు. బుధవారం చిత్తూరు.. గురువారం నెల్లూరు జిల్లా వరద ప్రభావ ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chandrababu-tour-in-kadapa-flood-areas-39-126941.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.