చంద్రబాబు నా అన్నయ్య.. విజయసాయి!

Publish Date:Jul 16, 2022

Advertisement

రాజకీయాల్లో బంధాలు, బంధుత్వాలకు అంతగా ప్రాధాన్యం కనిపించదు. ఒకే కుటుంబంలోని వ్యక్తులు వేర్వేరు పార్టీల్లో ఉండొచ్చు. వేర్వేరు పార్టీల్లోని వేర్వేరు వ్యక్తులు అన్నదమ్ముల్లా మసలుకోనూ వచ్చు. వాస్తవానికి రాజకీయ నేతలందరిదీ ఒకే కుటుంబం.. అదే రాజకీయ కుటుంబం. ఈ ఉపోద్ఘాతం అంతా దేనికంటే.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి వైసీపీ రాజ్యసభ సభ్యుడు  విజయసాయిరెడ్డి తమ్ముడు.  అవును.. మీరు సరిగ్గానే విన్నారు. చంద్రబాబు నాయుడికి విజయసాయిరెడ్డి వరసకు తమ్ముడు అవుతారు. రాజకీయంగా అనుక్షణం ఉప్పు నిప్పులా విమర్శలు, ఆరోపణలు చేసుకునే చంద్రబాబు- విజయసాయిరెడ్డి మధ్య బంధుత్వం ఉందా అన్న ఆశ్చర్యం అనవసరం. ఎందుకంటే  ఇది నిజంగా నిజం. ఇలాంటి ఆసక్తికరమైన విషయాన్ని విజయసాయిరెడ్డే స్వయంగా బయటపెట్టారు.

 అది కూడా చంద్రబాబును, టీడీపీ నేతలను విమర్శించే క్రమంలోనే తమ బంధుత్వాన్ని విజయసాయి వెల్లడించడం గమనార్హం. చంద్రబాబు- విజయసాయిరెడ్డి మధ్య బంధుత్వం ఎలా ఏర్పడిందంటే.. విజయసాయి భార్య సోదరి కుమార్తెని దివంగత సీఎం, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు తారకరత్న పెళ్లి చేసుకున్నారు. దాంతో చంద్రబాబు నాయుడు తనకు వరసకు అన్నయ్య అవుతారని విజయసాయిరెడ్డి వెల్లడించారు. అరబిందో సంస్థకు, అదాన్ కంపెనీకి విజయసాయిరెడ్డి బంధువు ఒకరు కామన్ డైరెక్టర్. దీంతో అడాన్ కంపెనీతో తనకు సంబంధాలు ఉన్నాయని చంద్రబాబు, ఎల్లో మీడియా అసత్య ఆరోపణలు చేస్తున్నట్లు విజయసాయి ఫైరవుతున్నారు.

ఒక డైరెక్టర్ ఎన్నో సంస్థలకు డైరెక్టర్ గా ఉన్నంత మాత్రాన ఆయా కంపెనీలన్నీ ఆయనవి అయిపోతాయా? అనేది విజయసాయి ప్రశ్న. చంద్రబాబు తనకు వరసకు అన్న అవుతారని.. అలా అయితే.. చంద్రబాబు ఆస్తులన్నీ నావే అవుతాయా? అనేది విజయసాయి ప్రశ్న. రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబు, లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ అఫీషియల్ ట్విటర్ వేదికగా విజయసాయి రాసుకొచ్చారు.

ఉదయం లేచింది మొదలు టీడీపీపైన, చంద్రబాబు, లోకేష్ పైన విమర్శలు, ఆరోపణలు చేసే విజయసాయిరెడ్డికి చంద్రబాబు అన్నయ్య అవుతారన్న వాస్తవాన్ని విమర్శిస్తూనే బయటపెట్టారు. ఇంతకీ విజయసాయి ఇప్పుడీ విషయాన్ని ఎందుకు బయటపెట్టినట్టు. ఒక వైపు విమర్శలు గుప్పిస్తూనే, మరో వైపు అన్న అంటూ బంధుత్వాన్ని ఎందుకు కలుపుకున్నట్లు అన్న ప్రశ్నలకు ముందు ముందు తెలుగుదేశంతో ఏ రాజకీయ అవసరాలు ఉంటాయో అన్న సందేహమే కారణమని సామాజిక మాధ్యమంలో విజయసాయిపై సెటైర్లు పేలుతున్నాయి.

By
en-us Political News

  
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  
 ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.