ముగ్గురు యాత్రికులు మూడు గమ్యాలు

Publish Date:Sep 1, 2013

Advertisement

 

చంద్రబాబు, హరికృష్ణ, షర్మిల ముగ్గురు మూడు వేర్వేరు ప్రాంతాల నుండి వేర్వేరు ఆలోచనలతో, వ్యూహాలతో బస్సుయాత్రలు మొదలుపెట్టబోతున్నారు.

 

ఈరోజు చంద్రబాబు అత్యంత ప్రతికూల పరిస్థితుల మధ్య ‘ఆత్మగౌరవ యాత్ర’ పేరిట గుంటూరు నుండి బస్సు యాత్రను ప్రారంభిస్తున్నారు. తెదేపా ఇచ్చిన లేఖ వలననే నేడు రాష్ట్ర విభజన జరుగుతోందనే కాంగ్రెస్ వైకాపాలు చేస్తున్నప్రచారం అడ్డుకొని, ఆ రెండు పార్టీలు మరియు తెరాసయే తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్నిఈ దుస్థితికి తెచ్చాయని ప్రజలకు వివరించేందుకు ఆయన ఈ యాత్ర చేపడుతున్నారు. కానీ, సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న లగడపాటి వంటి వారికే ప్రజల మధ్య భంగపాటు ఎదురవుతున్న ఈ తరుణంలో, విభజనకు అంగీకరిస్తూ లేఖ ఇచ్చిన చంద్రబాబు సమైక్య రాష్ట్రం కోరుతున్న ప్రజలతో ఏవిధంగా నెగ్గుకొస్తారో చూడాల్సిందే. ఆయన రాష్ట్ర విభజనపై తన పార్టీ స్పందన, ఆశిస్తున్న పరిష్కారం గురించి ప్రజలకు వివరించి పార్టీని రక్షించుకోవాలని బయలుదేరుతున్నారు.

 

రేపటి నుండి షర్మిల చేపడుతున్న‘సమైక్య శంకారవం’ యాత్ర చంద్రబాబు స్వంత జిల్లా చిత్తూరులో తిరుపతి ప్రారంభించడం వ్యూహాత్మకమే. ఆమె సమన్యాయం లేదా సమైక్య రాష్ట్రం అనే నినాదంతో యాత్ర చేపడుతున్నారు. ఆమె ఈ విభజనకు కాంగ్రెస్ మరియు తెదేపాలే ప్రధాన కారణమని గట్టిగా ప్రజల మనస్సులో నాటి, తద్వారా కేవలం తమ పార్టీ మాత్రమే సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న ఖ్యాతిని పొందేందుకు ప్రయత్నిస్తారు. కాంగ్రెస్, తెదేపాలు ఓట్లు, సీట్లు రాజకీయాల కోసమే రాష్ట్రాన్ని విభజించాయని ఆరోపిస్తున్న వైకాపా, ఆ ఓట్లు సీట్ల కోసమే ఈ యాత్ర చేపడుతోంది.

 

సీమంధ్రలో పట్టు సాధించేందుకు రాజీనామాలు, నిరాహార దీక్షలు, బహిరంగ సభలు, డిల్లీ పర్యటనలు, బహిరంగ లేఖాస్త్రాలు ప్రయోగించిన తరువాత వైకాపా ఇప్పుడు తాజాగా బస్సు యాత్రలనే మరో సరికొత్త ఐడియాతో ప్రజల ముందుకు వస్తోంది. నిన్న మొన్నటివరకు తాము తెలంగాణకు వ్యతిరేఖం కాదని చెపుతూ వచ్చిన వైకాపా, ఇప్పుడు సీమంధ్రలో బలంగా ఉన్న తెదేపాను దెబ్బ తీయడానికి తెదేపా తెలంగాణకు అనుకూల పార్టీ, రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చిన పార్టీ అని ప్రచారం చేస్తూ సీమంద్రలో పైచేయి సాధించేదుకు ప్రయత్నిస్తోంది. అక్కడ తెలంగాణా ప్రజలను, తన పార్టీ నేతలను కూడా వంచించిన వైకాపా, నీతినిజాయితీలకు తానే మారుపేరన్నట్లు నిస్సిగ్గుగా చెప్పుకొంటూ, ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తోంది.

 

ఇక హరికృష్ణ తన రాజ్యసభ సభ్యత్వం పూర్తయ్యేందుకు కేవలం మరో నాలుగయిదు నెలల కాలం మాత్రమే మిగిలి ఉన్నందున, రానున్న ఎన్నికలను, సీమంధ్రలో జోరుగా సాగుతున్న ఉద్యమాలను, చంద్రబాబుతో తన కున్నబేదాభిప్రాయలను అన్నిటిని దృష్టిలో పెట్టుకొని, ఒకే దెబ్బకు మూడు పిట్టలు కొట్టాలనే దురాశతో సమైక్యాంధ్ర కోసం అంటూ తన పదవికి రాజీనామా చేసి రేపటి నుండి చైతన్యయాత్ర చేపడుతున్నారు.

 

ఆయన తన యాత్ర సమైక్యాంధ్ర కోసమని చెప్పుతున్నపటికీ, తనను, తన కుమారుడు జూ.యన్టీఆర్ ని పార్టీలో పక్కన బెట్టి, చంద్రబాబు తన కుమారుడు లోకేష్ ని తన వారసుడిగా ముందుకు తీసుకు వస్తున్నారనే అక్కసుతో, వారిని ఇబ్బందిపెట్టాలనే ఆలోచనతోనే ఈ యాత్ర చేపడుతున్నారు. హరికృష్ణ ఇన్నేళ్ళుగా ఎటువంటి పార్టీ కార్యక్రమాలలో పాల్గొనకపోయినప్పటికీ, కేవలం నందమూరి వంశానికి చెందిఉండటమే తన ఏకైక అర్హతగా భావిస్తూ పార్టీలో పదవులు ఆశించి భంగపడ్డారు. అందుకే ఇప్పుడు పార్టీని ఇబ్బంది పెట్టేందుకు బస్సు యాత్ర చేపడుతున్నారు.

By
en-us Political News

  
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణ‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భార‌త్ పర్యటనకు వ‌చ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.