ముగ్గురు యాత్రికులు మూడు గమ్యాలు

Publish Date:Sep 1, 2013

Advertisement

 

చంద్రబాబు, హరికృష్ణ, షర్మిల ముగ్గురు మూడు వేర్వేరు ప్రాంతాల నుండి వేర్వేరు ఆలోచనలతో, వ్యూహాలతో బస్సుయాత్రలు మొదలుపెట్టబోతున్నారు.

 

ఈరోజు చంద్రబాబు అత్యంత ప్రతికూల పరిస్థితుల మధ్య ‘ఆత్మగౌరవ యాత్ర’ పేరిట గుంటూరు నుండి బస్సు యాత్రను ప్రారంభిస్తున్నారు. తెదేపా ఇచ్చిన లేఖ వలననే నేడు రాష్ట్ర విభజన జరుగుతోందనే కాంగ్రెస్ వైకాపాలు చేస్తున్నప్రచారం అడ్డుకొని, ఆ రెండు పార్టీలు మరియు తెరాసయే తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్నిఈ దుస్థితికి తెచ్చాయని ప్రజలకు వివరించేందుకు ఆయన ఈ యాత్ర చేపడుతున్నారు. కానీ, సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న లగడపాటి వంటి వారికే ప్రజల మధ్య భంగపాటు ఎదురవుతున్న ఈ తరుణంలో, విభజనకు అంగీకరిస్తూ లేఖ ఇచ్చిన చంద్రబాబు సమైక్య రాష్ట్రం కోరుతున్న ప్రజలతో ఏవిధంగా నెగ్గుకొస్తారో చూడాల్సిందే. ఆయన రాష్ట్ర విభజనపై తన పార్టీ స్పందన, ఆశిస్తున్న పరిష్కారం గురించి ప్రజలకు వివరించి పార్టీని రక్షించుకోవాలని బయలుదేరుతున్నారు.

 

రేపటి నుండి షర్మిల చేపడుతున్న‘సమైక్య శంకారవం’ యాత్ర చంద్రబాబు స్వంత జిల్లా చిత్తూరులో తిరుపతి ప్రారంభించడం వ్యూహాత్మకమే. ఆమె సమన్యాయం లేదా సమైక్య రాష్ట్రం అనే నినాదంతో యాత్ర చేపడుతున్నారు. ఆమె ఈ విభజనకు కాంగ్రెస్ మరియు తెదేపాలే ప్రధాన కారణమని గట్టిగా ప్రజల మనస్సులో నాటి, తద్వారా కేవలం తమ పార్టీ మాత్రమే సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న ఖ్యాతిని పొందేందుకు ప్రయత్నిస్తారు. కాంగ్రెస్, తెదేపాలు ఓట్లు, సీట్లు రాజకీయాల కోసమే రాష్ట్రాన్ని విభజించాయని ఆరోపిస్తున్న వైకాపా, ఆ ఓట్లు సీట్ల కోసమే ఈ యాత్ర చేపడుతోంది.

 

సీమంధ్రలో పట్టు సాధించేందుకు రాజీనామాలు, నిరాహార దీక్షలు, బహిరంగ సభలు, డిల్లీ పర్యటనలు, బహిరంగ లేఖాస్త్రాలు ప్రయోగించిన తరువాత వైకాపా ఇప్పుడు తాజాగా బస్సు యాత్రలనే మరో సరికొత్త ఐడియాతో ప్రజల ముందుకు వస్తోంది. నిన్న మొన్నటివరకు తాము తెలంగాణకు వ్యతిరేఖం కాదని చెపుతూ వచ్చిన వైకాపా, ఇప్పుడు సీమంధ్రలో బలంగా ఉన్న తెదేపాను దెబ్బ తీయడానికి తెదేపా తెలంగాణకు అనుకూల పార్టీ, రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చిన పార్టీ అని ప్రచారం చేస్తూ సీమంద్రలో పైచేయి సాధించేదుకు ప్రయత్నిస్తోంది. అక్కడ తెలంగాణా ప్రజలను, తన పార్టీ నేతలను కూడా వంచించిన వైకాపా, నీతినిజాయితీలకు తానే మారుపేరన్నట్లు నిస్సిగ్గుగా చెప్పుకొంటూ, ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తోంది.

 

ఇక హరికృష్ణ తన రాజ్యసభ సభ్యత్వం పూర్తయ్యేందుకు కేవలం మరో నాలుగయిదు నెలల కాలం మాత్రమే మిగిలి ఉన్నందున, రానున్న ఎన్నికలను, సీమంధ్రలో జోరుగా సాగుతున్న ఉద్యమాలను, చంద్రబాబుతో తన కున్నబేదాభిప్రాయలను అన్నిటిని దృష్టిలో పెట్టుకొని, ఒకే దెబ్బకు మూడు పిట్టలు కొట్టాలనే దురాశతో సమైక్యాంధ్ర కోసం అంటూ తన పదవికి రాజీనామా చేసి రేపటి నుండి చైతన్యయాత్ర చేపడుతున్నారు.

 

ఆయన తన యాత్ర సమైక్యాంధ్ర కోసమని చెప్పుతున్నపటికీ, తనను, తన కుమారుడు జూ.యన్టీఆర్ ని పార్టీలో పక్కన బెట్టి, చంద్రబాబు తన కుమారుడు లోకేష్ ని తన వారసుడిగా ముందుకు తీసుకు వస్తున్నారనే అక్కసుతో, వారిని ఇబ్బందిపెట్టాలనే ఆలోచనతోనే ఈ యాత్ర చేపడుతున్నారు. హరికృష్ణ ఇన్నేళ్ళుగా ఎటువంటి పార్టీ కార్యక్రమాలలో పాల్గొనకపోయినప్పటికీ, కేవలం నందమూరి వంశానికి చెందిఉండటమే తన ఏకైక అర్హతగా భావిస్తూ పార్టీలో పదవులు ఆశించి భంగపడ్డారు. అందుకే ఇప్పుడు పార్టీని ఇబ్బంది పెట్టేందుకు బస్సు యాత్ర చేపడుతున్నారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ లో ఒక విచిత్ర పరిస్థితి నెలకొని ఉంది. రాష్ట్రంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్నారు. అంటే రాష్ట్రంలో అల్లర్లు శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత వాటిని అరికట్టి సాధారణ స్థితి పునరుద్ధరించేలా అధికారులకు దిశానిర్దేశం చేయడం. అయితే ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించేశారు.
న్నికలలో విజయం సాధించడం కోసం అనుసరిస్తున్న విధానాలు, మాట్లాడుతున్న మాటలే కొంత కాదు.. చాలా బాధను కలిగిస్తున్నాయి. 
పల్నాడు జిల్లాలో పోలింగ్ సందర్భంగా, ఆ తర్వాత అల్లర్లు జరిగిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ను, తిరుపతి ఎస్పీని ఎన్నికల సంఘం బదిలీ చేసింది.
సర్వేలు, ఫలితాలు కాదు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పేశారు. ఏపీలో రాబోయే ప్రభుత్వం ఏదో. ఆయన అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయం సాధిస్తుంది.
పాపం ఈయనేమో జగన్ పేరు చెబితే ఆనందంతో గుడ్డలు చించుకుంటూ వుంటాడు. వాళ్ళేమో ఈయన్ని కూరలో కరేపాకుని తీసేసినట్టుగా తీసి అవతల పారేస్తూ వుంటారు. కేసీఆర్‌కి ఇలాగే అవ్వాలిలే!!
పల్నాడులో ఎన్నికల హింస పోలింగ్ ముగిసిపోయినా కొనసాగుతోంది. గత ఐదు రోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. 2019 ఎన్నికలలో పల్నాడులో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. నరసరావు పార్లమెంటు స్థానంతో పాటు మాచర్ల, వినుకొండ, పెదకూరపాడు, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, చిలకలూరి పేట అసెంబ్లీ స్థానాలలో విజయం కేతనం ఎగురవేసింది.
 బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోందని, విశాఖపట్టణానికి ఆగ్నేయంగా 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.
సిట్ చీఫ్‌గా నియమితులైన వినీత్ బ్రిజ్‌లాల్‌ని అర్జెంటుగా తప్పించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఎందుకయ్యా అంటే, ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం ఎవరిదో పెళ్ళి జరిగితే, దానికి వినీత్ బ్రిజ్‌లాల్, చంద్రబాబు హాజరయ్యారట.
రెండు మూడు రోజుల కిందట జనసేనాని పవన్ కల్యాణ్ సోదరుడు, ఆ పార్టీ సీనియర్ నాయకుడు నాగబాబు చేసిన ఓ ట్వీట్ సంచలనం సృష్టించింది. అక్కడితో ఆగకుండా ఆ ట్వీట్ నాగబాబు, అల్లు అర్జున్ అభిమానుల మధ్య అగాధాన్ని సృష్టించింది. ఆ ట్వీట్ చూసిన వెంటనే అంతా అల్లు అర్జున్ టార్గెట్ గానే నాగబాబు ఆ ట్వీట్ చేశారని భావించారు.
ఎందుకైనా మంచిదనే ధోరణితో తాడేపల్లి ప్యాలెస్‌ని మెల్లగా వదిలించుకుంటే మంచిదనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ జగనన్నకి పనేమీ లేదు.. అలాంటప్పుడు ఇక్కడ ఈ ఆస్తి ఎందుకనే ఆలోచనలో కూడా వున్నట్టు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ లో హై ఓల్టేజ్ ప్రచారం ముగిసి పోలింగ్ పూర్తయిన తరువాత కూడా హింసాకాండ కొనసాగుతోంది. అయితే ప్రధాన పార్టీల నేతలు మాత్రం పొలింగ్ పూర్తయిన తరువాత ఒక విధమైన విశ్రాంతి మూడ్ లోకి వెళ్లిపోయారు. పోలింగ్ ముగిసిన రోజు, ఆ తరువాత ఒకటి రెండు ప్రెస్ మీట్లు మినహా పెద్దగా మీడియా ముందుకు కానీ, ప్రజల ముందుకు కానీ రాలేదు.
టీఎస్ ఎప్‌సెట్ -2024 ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. విద్యాశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి బుర్రా వెంక‌టేశం, ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ఆర్ లింబాద్రి క‌లిసి ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. అగ్రికల్చ‌ర్, ఫార్మ‌సీ స్ట్రీమ్‌లో 89.66 శాతం ఉత్తీర్ణ‌త న‌మోద‌యింది. ఇందులో అమ్మాయిలు 90.18 శాతం, అబ్బాయిలు 88.25 శాతం ఉత్తీర్ణ‌త సాధించడం జ‌రిగింది.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. ఓటరు తీర్పు ఈవీఎమ్ లలో నిక్షిప్తమై స్ట్రాంగ్ రూంలలో భద్రంగా ఉంది. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జూన్ 4. ఈ లోగా జాన్ 1న ఎగ్జిట్ పోల్స్ వెలువడతాయి. అంత వరకూ రాష్ట్రంలో ప్రజల తీర్పు ఏమిటన్నది ఎవరు చెప్పినా అది ఊహాగానమే కానీ వాస్తవం అని చెప్పజాలం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.