ఎవరూ ఊహించని విధంగా చంద్రబాబు బీసీ మంత్రం జపించి తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసుకోవడమే కాకుండా, కాంగ్రెస్, తెరాసల విజయవకాశాలకు గండికొట్టే స్థాయికి పార్టీని చేర్చారు. అయితే సీమాంద్రాలో తానే స్వయంగా ముఖ్యమంత్రి కావాలనుకొంటున్నందున, ఆ మంత్రాన్ని యధాతధంగా జపించడం సెల్ఫ్ గోల్ చేసుకోవడమే అవుతుంది గనుక దానిని కొద్దిగా మార్పు చేసి, సీమాంద్రాలో తమ పార్టీ అధికారంలోకి వస్తే రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు సృష్టించి ఒకటి బీసీలకు, మరొకటి కాపులకు ఇస్తామని చంద్రబాబు ఈరోజు ప్రకటించారు. కాపులను బీసీల్లో చేర్చడానికి ఒక కమిషన్ కూడా నియమిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇది ఆ వర్గాల ప్రజలను ఆకట్టుకోవడానికేనని స్పష్టంగా అర్ధమవుతూనే ఉంది.
సీమాంద్రాలో తెదేపా-బీజేపీ తరపున చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రచారానికి ప్రజల నుండి మంచి స్పందన వస్తోంది. కానీ సీమంద్రాలో జగన్ ప్రభావం కూడా చాలా బలంగా ఉంది. జగన్, షర్మిల చేస్తున్న ప్రచారానికి ప్రజలలో విశేష స్పందన కనబడుతోంది. వైకాపా నుండి తెదేపా చాలా గట్టి పోటీ ఎదుర్కోవలసి వస్తోంది. అందువల్ల రెండు పార్టీలు నువ్వానేనా అన్నట్లు ప్రచారంలో, హామీలు గుప్పించడంలో కూడా పోటీ పడుతున్నాయి. మిగిలిన ఈ మూడు రోజుల్లో ప్రజలను ఎలాగయినా తమవైపు తిప్పుకోవాలని రెండు పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబు ఈరోజు ఈ సరికొత్త తాయిలం ప్రకటించి ఉండవచ్చును.
అయితే ఈ సరి కొత్త తాయిలం ప్రకటించడానికి మరో కారణం కూడా ఉండి ఉండవచ్చును. బీజేపీతో తెదేపా అంటుకట్టిన కారణంగా కాంగ్రెస్ పార్టీ తెదేపాకు కూడా మతతత్వ రంగు పులిమెందుకు చాలా గట్టిగా ప్రయత్నిస్తోంది. దానివలన తెదేపాకు ముస్లిం మరియు క్రీస్టియన్ ప్రజల ఓట్లు కొంతమేర నష్టపోయే అవకాశం కూడా ఉంది. బహుశః ఆ లోటుని భర్తీ చేసుకోనేందుకే చంద్రబాబు మళ్ళీ బీసీ మంత్రం పటిస్తున్నట్లున్నారు. అయితే అన్నిసమస్యలకు ‘సర్వరోగ నివారిణి’లా ఒకటే మంత్రం పనిచేస్తుందా? లేదా అనేది ఎన్నికల ఫలితాలు వస్తే కానీ తెలియదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chandrababu-39-33204.html
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్స్టార్ రజనీకాంత్తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ఈ వివాదం కాస్తా ముదరడంతో తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిగానైనా బరిలోకి దిగుతుందని, అవసరమైతే ఏ పోరాటానికైనా తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. తెలంగాణ సెంటిమెంట్ను టచ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో.. పవన్ కళ్యాణ్ ఈ సవాల్ను స్వీకరించడం సంచలనం సృష్టించింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కేవలం 80 స్థానాలకే పరిమితమైన టీఎంసీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అసమ్మతి గళాలు రోడ్డెక్కాయి. పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మెజారిటీ టీఎంసీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. గడిచిన 15 ఏళ్లుగా బెంగాల్ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన దీదీ, ఇప్పుడు సొంత పార్టీపై పట్టు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు.
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది.
రాష్ట్రంలో ఎన్నికల అనంతర పరిణామాలు, జాతీయ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి.
ఆయనను బీజేపీ హైకమాండ్ ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. అప్పటి నుంచీ పార్టీ హైకమాండ్ పై అసంతృప్తితో ఉన్న అన్నామలై సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఉద్దేశంలో ఉన్నారంటూ, గత కొంత కాలంగా వార్తలు వినవస్తున్నాయి.
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బెంగళూరు నగరాభివృద్ధి శాఖ తనకు కేటాయించకపోవడమే ఆయన అసంతృప్తికి కారణమని తెలుస్తోంది. మీడియా ఎదుటే ఆయన తన రాజీనామా లేఖపై సంతకం చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.