Publish Date:Dec 26, 2020
ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య పరస్పర అవినీతి ఆరోపణలు.. ఆ తర్వాత ప్రముఖ ఆలయాలలో నేతల ప్రమాణాలతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. కొద్ది రోజుల క్రితం అనపర్తి వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే.. టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుని తర్వాత బిక్కవోలు వినాయకుడి గుడిలో ప్రమాణాలు చేయాలంటూ సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. అంతేకాకుండా ఏకంగా గుడిలో ప్రమాణం చేసే సమయంలో కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెల్సిందే.
తాజాగా ఏపీలో వైసీపీ, టీడీపీలు నేతల మధ్య మరోసారి ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. విశాఖపట్నం నగరంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో భూ కబ్జాలు జరిగాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. దీంతో గత మూడు రోజులుగా టీడీపీ, వైసీపీ నేతల మధ్య ప్రమాణాల సవాళ్లు నడుస్తున్నాయి. భూ అక్రమాలకు పాల్పడ్డారని తనపై వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణల పై విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తీవ్రంగా స్పందిస్తూ.. దమ్ముంటే సాయిబాబా గుడిలో ప్రమాణం చేయాలని విజయసాయిరెడ్డికి సవాలు విసిరారు. అయితే విజయసాయి తరుఫున తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ విజయనిర్మల సిద్ధమయ్యారు.
రెండు పార్టీల నాయకుల తాజా ప్రమాణాల సవాళ్లతో విశాఖ పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరోపక్క నాయకులు ప్రమాణాలు చేయడానికి సిద్దమైన ఈస్ట్ పాయింట్ కాలనీ లో ఉన్న సాయిబాబా గుడి వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఆఫీసు వద్ద వైసీపీ నేతలు చేసిన ధర్నాలో పోలీసులపై కూడా దాడి జరిగిన నేపథ్యంలో.. ఈ సవాళ్ల వ్యవహారంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/challenge-between-tdp-and-ycp-39-108151.html
ఇంగ్లాండ్తో బర్మింగ్హామ్లో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ 587 పరుగులకు ఆలౌటైంది.
అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలో తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉండడంతో అరెస్టు చేసిన ఇరువురి ఇళ్లను సోదాలు చేశామని, భారీ మొత్తంలో విస్పోటక పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని కర్నూలు రేంజ్ డి.ఐ.జి డాక్టర్ కోయ ప్రవీణ్ తెలిపారు.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను పోలీసులు నిర్వీర్యం చేశారు.
ఐదు మంది సెంచురీలు చేసినా ఫస్ట్ టెస్ట్ లో ఓటమి భారత్ కి అత్యంత చెత్త రికార్డును తీసుకొచ్చి పెట్టింది. గిల్ కెప్టెన్సీలోని టీమిండియా. ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సీరీస్ లో రెండో టెస్ట్ లో ఎలాగైనా సరే విజయం సాధించాలన్న గట్టి పట్టుదలతో ఆడుతున్నాడు యంగ్ కెప్టెన్ శుభ్ మన్ గిల్.
ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ఫోర్టులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు.
వరంగల్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ, రెండుగా చీలిపోయిందా? అంటే, విశ్లేషకులు అవుననే అంటున్నారు. మంత్రి కొండా సురేఖ అండ్ ఫ్యామిలీ ఒక జట్టుగా, మిగిలిన ఎమ్మెల్యేలు మరో జట్టు హస్తం పార్టీ రెండుగా చీలి పోయిందని, మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రియుడి మోజులో పడి ప్రియుడితో కలిసి తన సంవత్సన్నర వయస్సు గల కూతురిని చంపిన కేసులో ఇద్దరు ముద్దయిలకు జీవిత కాలం ఖైదు మరియు 5 వేల రూపాయల జరిమానా విధించారు.
బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు అస్వస్థతకు గురియ్యారు. ఆయన సీజనల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరారు.
కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరుని తోమాల సేవ, అభిషేక సేవలలో కూర్చుని తనివి తీరా చూడాలని భావించిన వారి కోరిక ఫలించలేదు
హైదరాబాద్, ఏస్ఆర్నగర్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. క్రిష్ హొటల్ భవనంలో ఉన్న కాఫీడేలో మంటలు చేలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళకు గురయ్యారు.
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ పతంజలి ఆయుర్వేద్ కంపెనీకి ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. డాబర్ చ్యవన్ప్రాష్ లక్ష్యంగా చేసుకుని తప్పుదోవ పట్టించే ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.
అంగన్వాడీ హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి పొందేందుకు ఉన్న గరిష్ఠ వయోపరిమితిని 45 నుంచి 50 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రఖ్యాత ఫుట్బాల్ క్లబ్ లివర్పూల్ స్టార్ ఆటగాడు డియోగో జోటా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు.