ఆంధ్రా మేదావి... ఆటలో అరటిపండు అవుతారా?

Publish Date:Sep 8, 2016

Advertisement

ఆయన దేవదాసులా వుంటాడు! కాని, పాపం ఆయనది లవ్ ఫెయిల్యూర్ కాదు! భుజాన శాలువా వేసుకుని భోరున తన్నుకొస్తున్న ఏడుపును అణిచిపెట్టుకుని ఆయన టీవీ స్టూడియోల్లో తిరుగుతుంటాడు! అయినా ఆయన బాధ మీరనుకున్నట్టు తాళలేని విరహం కాదు! ఆయన ఉద్వేగమంతా, ఉక్రోషమంతా, నిర్వేదమంతా, నిర్లిప్తతంతా ఆంద్రప్రదేశే! అవును... ఆంధ్రుల అలుపెరగని, అందరికీ తెలిసిన, ఎవ్వరికీ అర్థం కాని, ఏకైక మేధావి... చలసాని శ్రీనివాస్! ఎవరీయన? ఏంటి ఆయన తహతహ? ఇవేనా మీ ప్రశ్నలు... నిజానికి మా కొశన్స్ కూడా అవే!

ఆంద్ర మేధావుల సంఘం తరుఫున కాలికి బలపం కట్టుకుని తిరిగే చలసాని వారి మహోన్నత ఉద్దేశ్యాల్ని ఎవ్వరం తప్పు పట్టలేం. తమ సంఘంలో మరో మేధావి ఎవరైనా వున్నారా లేదా అన్నది ఆయనకే తెలియాలి. కాని, ఆ విషయం పక్కన పెడితే... ఈ ఒంటరి ఆంధ్రా మేధావి అతనే ఒక సైన్యం అన్నట్టు పోరాటం చేస్తుంటాడు. తనను ఆస్థాన ప్యానలిస్టుగా పిలిచే టీవీ స్టూడియోలకి ఓపికగా వెళుతుంటాడు. ఒకప్పుడు రాష్ట్ర విభజనకి వ్యతిరేకంగా గళం విప్పేవాడు. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం పరితపించిపోతున్నాడు. ఇది సంతోషకర విషయమే! కాని, ఇక్కడే చలసాని వారి మార్కు మేధావి ట్విస్ట్ వుంది!

చలసాని శ్రీనివాస్ డ్రెస్సింగ్, ఆయన వేసుకునే శాలువా ఎప్పుడూ ఒకేలా వుంటాయి! ఆయన ముఖంలోని బాధాతప్త ఎక్స్ ప్రెషన్ కూడా ఏ మాత్రం మారదు! కాని, ఆయన అభిప్రాయాలే పదే పదే మారిపోవటంతో ఆంద్ర ప్రజలు అవాక్కైపోతున్నారు! తెలంగాణ ఏర్పాటు సందర్భంగా మన మీడియా ఛానళ్లు చర్చల పేరుతో వీరంగం వేస్తుంటే ఈయన జై అంధ్రా అంటూ వెళ్లేవాడు. దాంతో చలసాని తమకు పనికొస్తాడని కొంత కాలం తెలంగాణ వాదులు కూడా భ్రమపడ్డారు. కాని, ఆంధ్రప్రదేశ్ ఇవ్వాల్సిందే కాని హైద్రాబాద్, నది జలాలు, ఉద్యోగాలు, నిధులు వగైరా వగైరా అంటూ ఉపన్యాసాలు ఇచ్చాడు. చివరకు, జై అంధ్రా అంటూ మొదలు పెట్టిన మన మేధావి సార్ సమైక్యాంధ్ర ఉద్యమకారులతో అన్ని మీటింగుల్లో పాల్గొన్నాడు. తెలంగాణ వ్యతిరేకిగా తెలంగాణ వాదుల ముందు బుక్కయ్యాడు. పోనీ ఇటు ఆంధ్ర ప్రజలు ఏమైనా ఈ శాలువా సార్ ని శాలువా కప్పి సత్కరించారా అంటే... ఆయన వాదనేంటో అర్థం కాక అలా వదిలేశారు!

రాష్ట్రం రెండు ముక్కలై ఇప్పుడు ప్రత్యేక హోదా రాద్ధాంతం నడుస్తోంటే... చలసాని , ది మేధావి, అలుపెరుగక మరోసారి ఉద్యమం మొదలుపెట్టాడు! ఈ సారి కూడా ఆయనతో అదే ప్రాబ్లం. ఆయన ఏం చెబుతున్నాడో, ఎవరికి చెబుతున్నాడో, ఎందుకు చెబుతున్నాడో ఏమీ అర్థం కాదు. ఆయన్ని పిలిచి కూర్చోబెట్టే టీవీ చర్చాసురులకైనా తెలుసో... లేదో!
ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే. ఈ ముక్క చెప్పటానికి చలసాని అంతటి మేధావి ఎందుకు? ఎవరైనా చెబుతారు! బీజేపి ఇవ్వటం లేదు. ఆ పార్టీ ఈయన మాట వినేలా ఆంద్ర మేధావుల సంఘం తరుఫున ఏం చేస్తున్నాడు? అది ఆ సెగని ఎదుర్కొంటోన్న మోదీకి తెలియాలి! సాయంత్రం టీవీ చర్చలు సరే... పొద్దున్నంతా చలసాని వారి ఉద్యమ కార్యాచరణ ఏంటి? ఇది ఎవ్వరికీ తెలియదు! ఆయన ప్రత్యేక హోదా తెచ్చే బాద్యత భుజాన వేసుకున్నానంటాడు కాని... భుజం పై శాలువా తప్ప క్లారిటీ అస్సలు కనిపించదు!

చలసాని శ్రీనివాస్ ను ఒక మహా మేధావిగా... ఆయన గతంలో ఏం సాధించాడో పెద్దగా తెలియకున్నా... ఆంధ్ర ప్రజలు చక్కగా గౌరవిస్తారు. మీడియా సాక్షిగా ఇది అనుమానం అక్కర్లేని సత్యం! కాకపోతే, ఇప్పుడు ప్రత్యేక హోదా రాలేదని కుంగిపోతోన్న తెలుగు ప్రజల బాధంతా ఒక్కటే... ఢిల్లీలోని కేంద్రంతో సాగోతోన్న ఈ మహా కురుక్షేత్రంలో చలసాని ఇంకెంత కాలం యుద్ధం చేస్తాడు? అదీ... గాల్లో కత్తి తిప్పుతూ... తనకు తానే సృష్టించుకున్న పద్మవ్యూహంలో చిక్కుకుని...  రాజకీయ పెద్దలెవ్వరూ పట్టించుకోకుండా... ఎంత కాలం పోరాడతాడు? చివరకు, కొంపదీసి... ఈ నిఖార్సైన నిజాయితీగల టీవీ స్టూడియోల తాలూకూ మేదావి... ఆటలో అరటిపండు అయిపోడు కదా? శ్రీనివాసా... గోవింద!    
 

By
en-us Political News

  
గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది.
ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ ఈ సరికొత్త రాజధాని నమూనాను ఆయన తొలిసారి ప్రస్తావించినప్పుడు.. అన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడమే కాకుండా, నెటిజనులు జనగ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయినా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా జగన్ మావిగన్ ను వదల లేదు.
పెద్దిరెడ్డి కి వ్యతిరేకంగా చెవిరెడ్డి పావులు కదుపుతున్నట్లు వైసీపీలోనే ప్రచారం నడుస్తోంది. కుప్పంలో చంద్రబాబుని, హిందూపురంలో బాలకృష్ణని ఓడించడానికి అప్పట్లో పెద్దిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. జగన్ ఫుల్ సపోర్ట్ ఆయనకి ఉండటంతో అప్పట్లో జిల్లా నేతల్లో ఎవరూ అయన్నివ్యతిరేకించే సాహసం చేయలేకపోయారు.
తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మోడీ కేబినెట్ ప్రక్షాళనలో డీకే అరుణకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం వైసీపీ తరపున గవర్నర్ కోటాలో నామినేట్ అయిన జకియా ఖానం, పందుల రవీంద్రబాబుల పదవీ కాలం నెల రోజుల్లో ముగియనుంది. దీనితో ఖాళీ అవుతున్న ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం కూటమి దక్కించుకోనుంది.
ఆంధ్రప్రదేశ్‌లోనే ఎన్నో ఆలయాలు నిధులు లేక, ధూపదీప నైవేద్యాలు కరవై శిథిలావస్థకు చేరుకుంటుంటే.. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఆలయాలకు శ్రీవాణి నిధులు కేటాయించడమేంటన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో కొండగట్టు వంటి తెలంగాణ ఆలయాలకు టిటిడి నిధులు ఇవ్వడంపై అక్కడి కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ఆలయాల అభివృద్ధికి ఏపీ నిధులు ఎందుకు కేటాయించాలంటూ సోషల్ మీడియాలో విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన రాష్ట్రంలో మరింత బలోపేతం కావడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రణాళికా బద్ధంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే గత ఎన్నికలలో ఘోర పరాజయంతో కుదేలై ఉన్న వైసీపీని మరింత బలహీన పరిచే దిశగా వ్యూహాలు రచిస్తోంది.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు పార్టీ శ్రేణులతో పాటు.. ఆయన పార్టీకే చెందిన సొంత సామాజిక వర్గ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాలు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.